ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 196 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ, రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. రాముడు ఆచరించిన ధర్మం లోకానికి రక్ష అని, వేదోక్తమైన ధర్మాన్ని ఆచరించడం వలన ప్రపంచంలోని మానవులు సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో ఉంటారని వివరించారు.
ఇప్పటివరకు ఏడు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8 నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాలు, అక్టోబరు 4న ఐదవ విడత 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడత 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు, డిసెంబరు 6న ఏడవ విడత 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను అఖండ పారాయణం జరిగింది.
కాగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుష్మ బృందం " ఎదురా రఘుపతికి ...... " , అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, రఘునాథ్ బృందం " శ్రీ హనుమ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ......" అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ దంపతులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీఎంకి పూల బొకె ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ సీఎంతో కేక్ కట్ చేయించారు. అదేసమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి చైర్మన్ వైవిసుబ్బారెడ్డి తిరుమల అర్చకులతో వచ్చి సీఎంకి శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు శ్రీవారి ఫోటో, డైరీ, ప్రసాదం అందజేయడంతోపాటు ఆశీర్వచనం అందజేశారు. అదే విధంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేద పండితులు, అధికారులు కూడా విచ్చేసి అమ్మవారి ప్రసాదాలు సీఎంకి అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. సిఎంఓలోని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శిలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీఎంకి నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పత్రికలు, టెలివిజన్ న్యూస్ ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలు, న్యూస్ వెబ్ సైట్లకు జిల్లా ఏతర, రాష్ట్రేతర, జాతీయ వార్తలను సరఫరా చేసే న్యూస్ ఏజెన్సీలు పనిచేయాలంటే చాలా ఖర్చు, సిబ్బందితో కూడుకున్న వ్యవహారమే. చాలా మందికి వార్తలు అందించండంలో కష్టమేముంటుంది అనుకుంటారు చాలామంది. పైగా ఖర్చుకూడా పెద్దగా ఉండదని అంతే తేలికగా మాట్లాడతారు. వాస్తవానికి న్యూస్ ఏజెన్సీలు ఎలా పనిచేస్తాయో...ఒక వార్తను సేకరించి దానిని న్యూస్ ఫార్మాట్ లో మీడియా సంస్థలకు పంపడానికి ఒక న్యూస్ ఏజెన్సీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మంది సిబ్బంది పనిచేస్తారనే విషయం తెలిస్తే నిజంగా ముక్కున వేలేసుకుంటారు. ఇంత కష్టపడి, డబ్బు ఖర్చుచేసి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుబంధ పత్రాలు పొందడానికి చాలా ఖర్చు, శ్రమ తప్పదంటే అతిశయోక్తి కాదు.. ఇంతా కష్టపడి ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచారచారశాఖ మాత్రం అక్రిడిటేషన్ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు ఇవ్వడంలో అనేక కొర్రీలు వేస్తుంది. ఒక న్యూస్ ఏజెన్సీలో ఒక చీఫ్ ఎడిటర్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక మేనేజర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్ లేదా వీడియో ఎడిటర్, ముగ్గురు జర్నలిస్టులు, ఒక మెసెంజర్ ఉంటే తప్పా రోజుకి 5 నుంచి పది వార్తలు సేకరించడం కష్టమంటే అది మాటల్లో చెప్పలేం.
రిపోర్టర్లు తెచ్చిన వార్తలు ముందుగా సబ్ ఎడిటర్ డెస్క్ దగ్గరకు వస్తాయ్, ఆతర్వాత వాటిని చీఫ్ ఎడిటర్ డెస్క్లో ద్రువీకరిస్తారు, ఆపై వార్తలకు అనుగుణంగా ఫోటోలు, వీడియోలు జతచేసి మెసెంజర్ డెస్క్ కు చేరవేస్తారు. అక్కడి నుంచి మెసెంజర్ న్యూస్ ఏజెన్సీకి ఖాతాదారులుగా వున్న పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలు, న్యూస్ వెబ్ సైట్లు, యూట్యూబు ఛానళ్లకు కంటెంట్ ను ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. అలా పంపిన వార్తలను మీడియా సంస్థలు క్రెడిట్ డేట్ లైన్ తో కొన్నివార్తలను అచ్చువేస్తాయి. అందులో ఫోటోలకి గానీ, వార్తలకు గానీ క్రెడిట్ లైన్ లేకపోతే న్యూస్ ఏజెన్సీలు పంపిన వార్తలకు ఫలితం వుండదు. ఇలా అన్నీ అధికారికంగా పనిచేయాంటే నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ కింద ప్రభుత్వం నుంచి అనుబంధ పత్రాలతోపాటు సంస్థ పేరు, లోగో, న్యూస్ ఏజెన్సీ ట్రేడ్ మార్క్, న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్,గ్రీన్ మేట్ స్టూడియో, అవసరం అనుకుంటే ప్రత్యేక ఎలక్ట్రానిక్ మెసెంజర్ లైన్, లేదా గ్రూప్ మీడియాలైన్ లీజుకి తీసుకోవాల్సి వుంటుంది.
ఇక పోతే వీటి నిర్వహణకు 5 కంప్యూటర్లు లేదా హైఎండ్ ల్యాప్ టాప్ లు, ఒక టెలీఫోన్ కూడిన ఫ్యాక్స్ కనెక్షన్, ఒక హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, నాణ్యమైన విద్యుత్(నెలకు కనీసం కరెంటు బిల్లు రూ.800 నుంచి రూ.1600), అధునాతన ప్రింటర్, ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు, ఒక కార్యాలయం(నెలకు అద్దె కనీసం రూ.8500 నుంచి 10వేలు) కావాల్సి వుంటుంది. వీటితోపాటు ప్రకారం కనీసం ఐదుగురు( ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక ఫోటో గ్రాఫర్, ఒక మెసెంజర్, ఒక వీడియో గ్రాఫర్ లేదా వీడియో ఎడిటర్ కి జీతాలు(ఒక్కొక్కరికీ రూ.8500 వేల నుంచి రూ.12500),ముగ్గురు జర్నలిస్టులు వారికి లైన్ అకౌంట్ బేసిస్ లో కనీసం రూ.5వేల నుంచి 8వేల వరకూ జీతాలు ఇవ్వాల్సి వుంటుంది. ఇక పోతే న్యూస్ వెబ్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్ నిర్వహణకు ప్రత్యేకంగా సొంత ఆన్ లైన్ హోస్టింగ్ సర్వర్ దీనికే నెలకు సుమారు రూ.6500 చెల్లించాల్సి వుంటుంది. వీటితోపాటు ఆదాయపు పన్ను అదేనండీ ఐటీ రిటర్న్స్..(ఏడాదికి ఒకసారి), రూ.40లక్షల టర్నోవర్ దాటితే జిఎస్టీ రిటర్న్స్(ప్రతీ మూడు నెలలకు ఒకసారి అంతే ఈ రెండింటికీ కలిపి ఏడాదికి సుమారుగా రూ.5వేలు), రూ.40 లక్షల లోపు అయితే కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ నిబంధనల మేరకు తీసుకోవాల్సిన పనిలేదు. ఒక ఇతర జిల్లాల్లో అయితే ఒక జర్నలిస్టు, ఒక ఫోటో గ్రాఫర్ పనిచేయాల్సి వుంటుంది.
వారు లైన్ అకౌంట్ బేసిస్ లో లేదా జీతాల రూపంలో పనిచేస్తారు. ఇతర జిల్లాల వార్తలు న్యూస్ ఏజెన్సీ చందాదారులకు అందించాలంటే న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిక జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మాత్రమే న్యూస్ ఏజెన్సీ చందాదారులకు ఇవ్వాల్సి వుంటుంది. ఇన్ని చేస్తే తప్పా న్యూస్ ఏజెన్సీ నిర్వహణ సాధ్యం కాదు. కానీ ఇవేమీ రాష్ట్రప్రభుత్వ సమాచారశాఖకు పట్టవు. ఒక న్యూస్ ఏజెన్సీకి నిబంధనల ప్రకారం అంటే ముఖ్య కార్యాలయం నిర్వహించే చోట కనీసం 5 అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయడం లేదు. ఇంతా కష్టపడి న్యూస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ తొలగించింది ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇలా చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వ పథకాలు కోల్పోయారు.
కాపీరైట్ కోర్టు కేసులు.. న్యూస్ ఏజెన్సీలు ప్రధాన కార్యాలయంతో పాటు, ఇతర జిల్లాల్లోనూ ఒక రిపోర్టర్, ఒక ఫోటో గ్రాఫర్ ను నియమిస్తుంది. అలా కాకుండా ఎవరో రాసిన వార్తలను కాపీ పేస్టు చేసి ఖాతాదారులకు పంపితే, సదరు వార్త యొక్క సొంతదారు కాపీ రైట్ కంటెంట్ కేసులు పెడతాడు. అంతేకాకుండా పెట్టిన సైబర్ క్రైమ్ కేసులు కూడా న్యూస్ ఏజెన్సీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితో ఖచ్చితంగా న్యూస్ ఏజెన్సీ యొక్క అధికారిక ప్రతినిధి రాసి పంపిన వార్తలను మాత్రమే ప్రధాన కార్యాలయం నుంచి న్యూస్ ఏజెన్సీ తన ఖాతాదారులకు పంపుతుంది. ఇప్పటికే చాలా చిన్న, మధ్య తరహా పత్రికలు తమకు సదరు జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లో ప్రతినిధులు లేకపోయినప్పటికీ నెట్ వచ్చిన వార్తలను కాపీ పేస్టు చేసి వినియోగిస్తూ కాపీ రైట్ కేసులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం ఆర్ఎన్ఐ నిబంధనల మేరకు జర్నలిస్టులు లేని చోట న్యూస్ ఏజెన్సీలు ద్వారొ పొందిన వార్తలనే క్రెడిట్ లైన్ తో వినియోగిస్తున్నాయి.
వాస్తవానికి పత్రికలుగానీ, టివిఛానళ్లు గానీ, న్యూస్ ఏజెన్సీలు గానీ తమ ప్రతినిధులు లేని చోట వార్తలు తెచ్చుకోవాలంటే వీరు కూడా మరో అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీల నుంచి అధికారికంగా చందా తీసుకొని వార్తలను కొనుగోలు చేసుకొని మాత్రమే వినియోగించాలి. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో పనిచేసిన న్యూస్ ఏజెన్సీలకు కూడా సమాచారశాఖ అధికారులు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కొర్రీలు వేస్తోంది. అసలు ఒక వర్త సేకరణ జరిగిన తరువాత ఐదు దశలు దాటితే తప్పా సదరు వార్తకు కార్యరూపం రాదు. రిపోర్టర్ తెచ్చిన వార్తను, ఫోటోను ఎడిటింగ్ చేసేది సబ్ ఎడిటర్ అయితే, దానిని ద్రువీకరించేది చీఫ్ ఎడిటర్, అలా ద్రువీకరించిన తరువాత మెసెంజర్ దానిని మీడియా సంస్థలకు పంపుతాడు. అదే సమయంలో ఫోటోలు కూడా అంతే. ఇంతలా చేసిన వార్తను ఖాతాదారులతో పాటు న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్ లకి అప్లోడ్ చేస్తారు.
ఇపుడు చెప్పండి న్యూస్ ఏజెన్సీ ఒక వార్త కోసం ఎంత నెట్వర్క్ వినియోగిస్తోందో. ఈ వార్తలో పైన పేర్కొన్న అన్ని ప్రభుత్వ ద్రువీకరణ పత్రాలతో విశాఖ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఏకైక వార్తా సంస్థ ఈరోజు న్యూస్ సర్వీస్. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి అధికారిక న్యూస్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాప్, సొంత సర్వర్ కలిగిన కార్యాలయం అన్నీ విశాఖలోనే ఉన్నాయి. ఇదేదో ప్రచారం కోసం వాస్తవం ప్రభుత్వం, సమాచారశాఖలోని అధికారులకు తెలియజేయాలనే చిన్న ప్రయత్నం మాత్రమే..ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపు వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం ప్రకటించారు.
వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం
నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుందన్నారు.. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
తెలంగాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగ సీఎం మీట్లాడుతూ, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సిఎం వెల్లడించారు.
మంత్రులు కెటి రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితా సభర్వాల్, మీ సేవ సిఇవో వెంకటేశ్వర్ రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, కలెక్టర్లు వెంకట్రాం రెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సిఎం ఆదేశించారు.
సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సిఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి.
- ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిష్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్న వారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.
- సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్దీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి.
- కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్ – బి లో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి.
- రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.
- సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి.
- 1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
- సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసు బుక్కులు ఇవ్వాలి.
- కొన్ని చోట్ల ఒకే సర్వే నెంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నెంబరును నిషేధిత జాబితా (22/ఎ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమలో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
- కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్ ను ధరణిలో చేర్చాలి.
- ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.
- నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి.
- అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఏ చేసుకోవడానికి
ధరణి పోర్టల్ ద్వారా అవకాశం ఇవ్వాలి.
- వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్ఛేంజ్ డీడ్ ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి.
- వ్యవసాయ భూముల్లో నెలకొల్పే ఫర్ములు, కంపెనీలు, వివిధ సంస్థలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి.
- పాస్ పోర్టు నెంబరు నమోదు చేసుకుని ఎన్.ఆర్.ఐ.ల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి.
- ఇ.సి, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి.
- ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాలేకపోయే వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నచో డబ్బులు తిరిగి ఇవ్వాలి.
- స్లాట్ బుక్ చేసుకునే సందర్భంగా వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి.
- చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలి.
- మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు మరియు సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి.
- ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.
- పట్టాదార్ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ట్రూ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలి.
- ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు.
- ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కు దారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.
- ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తు దారుడికి తెలిపే ఆప్షన్ ధరణిలో ఉండాలి.
- పైన పేర్కొన్న మార్పులు, చేర్పులు చేపడితే ధరణి పోర్టల్ ద్వారా మరింత సమర్థవంతంగా భూముల రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమవుతుంది.
యునైటెడ్ కింగ్ డం దేశం నుండి వచ్చిన వారిని వెంటనే గుర్తించి క్వారంటైన్ లో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ కె.భాస్కర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో అమరావతి నుండి మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ కమిషనర్ అన్ని ఆరోగ్య కార్యక్రమాల పై వివిధ జిల్లాలలోని జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, డి.సి.హెచ్.ఎస్.లు, పి.హెచ్.సి వైద్యాధికారులు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో యునైటెడ్ కింగ్ డం నుండి వచ్చిన వారి యొక్క కాంటాక్ట్ లను గుర్తించి కరోనా పరీక్షలను నిర్వహించాలన్నారు. యు.కె నుండి వచ్చిన వారి యొక్క కాంటాక్ట్ లను అత్యంత ప్రాధాన్యతతో గుర్తించి వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాలను త్వరితగతిన అందించేలా జాయింట్ కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. యు.కె నుండి వచ్చిన వారి యొక్క ఏ ఒక్క కాంటాక్ట్ ను వదల కుండా గుర్తించాలని వైధ్యాదికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టిందని విశ్రాంతి తీసుకునే సమయం కాదని ఇది నిరంతర ప్రయాణం లాంటిదని కావున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కాల్ సెంటర్ల నుండి కరోనా పరీక్షల కొరకు సంప్రదిoచ్చిన వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డి.ఏం అండ్ హెచ్ ఓ లను ఆదేశించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే అన్ని రకాల ఫీవర్ కేసులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ల యందలి ఫీవర్ క్లినిక్ ల మీద ఐ.వి.ఆర్.ఎస్ ఫీడ్ బ్యాక్ రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ఫీవర్ కేసును ఎంతో ప్రమాణాలతో గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. కోవిడ్ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారిని గుర్తించి 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిలో ఆరోగ్యం నిలకడగా లేని వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. సెంటినల్ సర్వేలైన్స్ లో భాగంగా ప్రతి మండలంలోని స్కూల్ మరియు విధ్యా సంస్థల యందలి ప్రతి యొక్క విధ్యార్ధి, ఉపాద్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. స్కూల్ మరియు కాలేజీల లోని పిల్లలకు, ఉపాద్యాయులకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న చోటకూ డా పరీక్షలు చేపట్టి ఎప్పటికప్పడు డాటా ఆన్ లైన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీరుడు..అల్లూరి సీతారారామరాజుపై ప్రముఖ నటులు, సినీ దర్శకులు ఆర్.నారాయణమూర్తి అభిమానం ఏ విధంగాతీర్చుకున్నారో తెలిస్తే ఖచ్చితంగా చేయొత్తి నమస్కరిస్తారు. తెలుగోడు సినిమాని ఆర్.నారాయణమూర్తి విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేటలోని అల్లూరి పార్ధీవ శరీరం దహనం చేసిన చోట తీశారు. ఆ సమయంలోనే ఆయనకు క్రిష్ణదేవిపేటతో బంధం ఏర్పడింది. ఈ గ్రామాన్ని మరిచిపోకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆయన తమ్ముడిని అదే గ్రామానికి అల్లుడిని చేస్తే బావుంటుందని భావించి, క్రిష్ణదేవిపేట గ్రామానికి ఒబ్బలరెడ్డివారికి కుటుంబానికి అల్లుడిని చేశారాయన. అల్లూరి సీతారామరాజు గుర్తొచ్చినప్పుడల్లా ఆర్.నారాయణమూర్తి తన తమ్ముడితో కలిసి క్రిష్ణదేవిపేట గ్రామాన్ని సందర్శిస్తారు. పీడిత ప్రజల కోసం తెల్లవాడిపై పోరాటం చేసిన పోరాటల పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని అనుకున్న సమయంలో క్రిష్ణదేవిపేట నుంచి సంబంధం రావడంతో ఆలోచించకుండా తన తమ్ముడికి ఆ గ్రామానికి అల్లుడిని చేశానని తడుముకోకుండా చెబుతారు. అలాంటి మహానుభావుడికి నేటి వరకూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన గుర్తొచ్చినపుడల్లా తలచుకొని బాధపడుతుంటానని అంటారు. స్వాతంత్ర్య సమరయోధులు అత్యధికంగా వున్న భారతదేశంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వారికి ఉన్నతమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా వుందని చెబుతారు ఆర్.నారాయణమూర్తి. వారి ప్రాణాల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని అలాంటి మహానుభావుల అను క్షణం స్మరించుకోవాలని కూడా అంటారాయణ. పేరు ప్రఖ్యాతల కోసం ఆలోచిస్తున్న ఆరోజుల్లో అల్లూరిపై అభిమానం, గౌరవం ఆ గ్రామంలోకి కుటుంబానికి అల్లుడిని చేసిందంటే ఆర్.నారాయణమూర్తికి అల్లూరి సీతారామరాజు అంటే ఎంత భక్తో ఇంతకంటే వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అల్లూరికోసం ఆయన చేసే ప్రచారం, అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసే తీరు ఆయనకు దేశంపై వున్న అమితమైన దేశభక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు..హేట్సాఫ్ ఆర్.నారాయణమూర్తి అండ్ హేపీ బర్త్ డే టూ యూ..!
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు పెరగనున్నాయా..అంటే అవుననే అంటోంది అధికార యంత్రాంగం. రాష్ట్రం ప్రభుత్వం 30లక్షల మంది లబ్ది దారులకు కొత్తగా మంజూరు చేసిన ఇళ్ల ప్రదేశాలన్నీ ప్రత్యేక గ్రామాలుగా మారబోతున్నాయి. ప్రస్తుతం వున్నచాలా కుటుంబాలు ఒకే ఇంటిలో వుంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఇళ్లు, పట్టాల ద్వారా రాష్ట్రంలో కొత్తగా గ్రామాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే గ్రామాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు నుంచి 4వేల జనాభా వున్న గ్రామానికి, లేదా వార్డుకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రభుత్వం ఇపుడు కొత్తగా 30లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేయడంతో కొత్తంగా రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఏర్పాటవుతున్నట్టు అధికారంగా లెక్కలే చెబుతున్నాయి. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతీ మూడు వేల కుటుంబాలకు ఒక సచివాలయం ఏర్పాటు చేసినా మరో 10వేల సచివాలయాలు ఏర్పాటు కావాలి..అదే జరిగితే ప్రస్తుతం వున్న గ్రామ, వార్డు సచివాలయాలు రెండింతలు పెరిగే అవకాశం వుంది. ఆరకంగా చూసుకున్నా..ఈ ప్రభుత్వంలో లబ్దిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తయితే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా సచివాలయాలు ఏర్పాటు కావాల్సివుంటుంది. ఒకేసారి పదివేల సచివాయాలు ఏర్పాటు చేయకపోయినా పెరిగిన కుటుంబాలకు అందులో సగం ఐదువేలు సచివాలయాలైనా ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ఇళ్లు, కుటుంబాలన్నీ రెండింతలు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎలా చూసుకుకున్నా మరో లక్ష ఉద్యోగాలు పెరిగే సచివాలయాలకు నియమించాల్సి వుంటుంది. ఇదంతా జరగాలంటే మరో ఐదేళ్లు సమయం పడుతుంది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లాలి, ఉద్యోగం సంపాదించాలి అనుకునేవారికి ఖచ్చితంగా మరోసారి సచివాలయ ఉద్యోగాలు వస్తాయనే సంకేతం కొత్తగా ఏర్పాటు కాబోతున్న గ్రామాలే తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!
ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోయారు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. దానికి కారణం చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహించే జర్నలిస్టులు ప్రభుత్వానికి నివేదించడానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే చేసే సమయంలో ఆథార్ కార్డులు నమోదు చేస్తున్న సమయంలో 70శాతం జర్నలిస్టు కుటుంబాలందరికీ ఆదాయ పన్ను కడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయపు పన్ను కడితే సంపన్నులుగా లెక్క. దీనితో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బియ్యం కార్డులు రద్దైపోయాయి, గ్రామాల్లో ఇచ్చే ఇళ్లును వదులుకోవాల్సి వచ్చింది..గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వంలో కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించినట్టు ఆథార్ ద్వారా రుజువైతే వారు లక్షాధికారులు, కోటీశ్వరులు కింద ప్రభుత్వం లెక్కలు వేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసింది. నిజంగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయితే పొట్టగూడికోసం చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీల ఎందుకు నిర్వహిస్తారనే చిన్న సాంకేతిక అంశాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దైపోయినా.. పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహణకు నెలకు వేల రూపాయలు(కరెంటు బిల్లు, ఇంటర్నెట్, టెలీఫోన్, , ట్రాన్స్ పోర్టుకి బైకులకు పెట్రోలు, కంప్యూర్ ఆపరేటర్ లేదా డిటిపి ఆపరేటర్ లేదా సబ్ ఎడిటర్ జీతాలు) రూపాయలు నిర్వాహకులు చెల్లించి సంస్థలు నిర్వహించినా ప్రభుత్వంలోని సమాచార శాఖ నిబంధనల ప్రకారం ఎంపానల్ మెంట్ గానీ, అక్రిడిటేషన్లు గానీ సమయానికి ఇవ్వడం లేదు. దీనితో జర్నలిస్టులు అటు ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు కోల్పోవడంతోపాటు ఇటు సమాచారశాఖ గుర్తింపు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా ప్రభుత్వానికి జర్నలిస్టుల సాంకేతిక సమస్యలను కూడా వివరించడం లేదు. ఎంతసేపూ వారి ప్రాభవం కోసం నేతలకు, సమాచారశాఖ అధికారులకు భజన చేయడానికే సమయం అంతా సరిపోతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పత్రికలకు, న్యూస్ ఏజెన్సీలకు జిఎస్టీ రిటర్న్స్ కూడా దఖలు చేయాలని నిబంధన విధించడం మరింత విపరీత పరిణామంగా దాపురించింది. జిఎస్టీ కారణంగా ప్రకటనలపై ఆదాయం వచ్చినా, రాకపోయినా ప్రతీ 3నెలలకు ఒకసారి నిల్ రిటర్న్స్ సైతం ప్రభుత్వానికి చూపించాల్సి వుంది. ఆ సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ కి ఒక సారి రిటర్న్స్ వేస్తే ప్రతీ మూడు నెలలకు రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. ఇలా అంతా అదనపు భారంగానే పత్రికలు, న్యూస్ ఏజెన్సీలకు చెల్లించాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినా ప్రభుత్వం చిన్న పత్రికలను, న్యూస్ ఏజెన్సీలను గుర్తించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన పాపానికి వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోవడం మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. వాస్తవాలు తెలియజేసే క్రమంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది..!
ఆంధ్రప్రదేశ్ కి పెద్దన్నయ్య.. సీఎం వైఎస్ జగనన్న వాత్సల్యం...అభిమానం..ప్రేమ..ఒక కుటుంబ పెద్దగా.. ఆత్మీయుడిగా.. ఒక అన్నగా ఓ చెల్లికి ఆత్మీయ దీవెన అంటే ఇదేనమో అన్నట్టుగా కనుల నిండుగా కనిపించిందా ద్రుశ్యం..ఈ మహత్తర సన్నివేశం విజయనగరం జిల్లాలోని గుంకలాంలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయడానికి వచ్చిన సీఎం వైఎస్ జగనన్న...డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణిని నిండైన మనుసుతో దీవించిన తీరు అశేష జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది..ఒక మంచి కార్యక్రమం తలపెట్టే టపుడు అన్నకు చెల్లెలు వీర తిలకం దిద్దనట్టుగా డిప్యూటీ సీఎం సీఎం వైఎస్ జగనన్నకు కుంకుబొట్టు పెట్టడం..దానికి అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ కూడా పుష్ఫ శ్రీనివాణిని నిండైన హ్రుదయంతో దీవించడం కనుల పండువగా జరిగింది. నిజంగా ఈ అన్నా చెల్లెల్లకు దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా అక్కడి సన్నివేశం అసలైన కుటుంబ నేపథ్యాన్ని తలపించింది. అన్న దీవించగా..చెల్లెలు ఆశీర్వాదం పొందగా అన్నట్టు సాగిన ఘట్టానికి విజయగరం వాసులే సాక్షి...బహుసా ఇదేనేమో సీఎం వైఎస్ జగనన్న వాత్సల్యం అంటే..!