1 ENS Live Breaking News

ప్రభుత్వ యంత్రాంగమంతా సోషల్ మీడియాలోనే..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ యంత్రాంగమంతా సోషల్ మీడియా బాట పట్టింది...ఇదేదో ప్రచారానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే..ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నేరుగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో అన్నిశాఖల అధికారులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్సస్టాగ్రామ్, టెలీగ్రామ్, వాట్సప్ గ్రూపుల్లోకి చేరారు. అన్ని రకాల ప్రభుత్వశాఖలు అన్ని సోషల్ మీడియాల్లోనూ ప్రత్యేక పేజీలు, గ్రూపులు ఏర్పాటు చేసి, రోజు వారీ కార్యక్రమాలన్నీ అప్ లోడ్ చేస్తున్నారు. తద్వారా చాలా మంది శాఖల అధికారులకు, ప్రజలకు ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలేంటో నేరుగా తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం కోసం సాధారణ ప్రజలు తెలుసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కాని ఇపుడు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల ద్వారా ఏం చేస్తున్నారో అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వుంది. విశేషం ఏంటంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అఖిల భారత స్థాయి అధికారులు సైతం ఫేస్ బుక్ పేజీల ద్వారా తమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నారంటే...పరిస్థితి ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఏ ప్రభుత్వ శాఖ ద్వారానో చెప్పాలంటే జరిగే పనికాదు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఒక్క పోస్టు పెడితే అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలకు క్షణాల్లో తెలిసిపోతుంది. కొన్ని ప్రభుత్వ శాఖలైతే వారు చేసే కార్యక్రమాలు మీడియాకోసం ప్రత్యేకంగా ప్రెస్ నోట్లు కూడా న్యూస్ ఫార్మాట్ లో పెడుతున్నారు. తద్వరా ఇకేసారి ప్రజలకు, మీడియాకి ప్రభుత్వ అధికారులు సమాచారం తెలియజేసినట్టు అవుతుంది. అందులోనూ కరోనా సమయంలో అధికారులను కలవడానికి మీడియాకి వీలుపడని సమయంలో సోషల్ మీడియా ద్వరా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వశాఖల అధికారులు ఏంచేస్తున్నారో తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ప్రజలంతా ఆశ్రయించడం, అదే సమయంలో ముఖ్యమైన యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం అధికమైంది. ఇదే క్రమంలో కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఫోటోలు మాత్రమే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. సదరు కార్యక్రమం ఎందుకు చేశారు..ఎవరు పాల్గొన్నారు..అధికారులు పేర్లు కూడా పెట్టకపోవడంతో కాస్త గందరగోళం కూడా ఏర్పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అంటే పత్రికలు, టివిల్లో వస్తేనే ప్రజలకు తెలిసేది..ఇపుడు ఆ రెండింటికంటే ముందు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, అనినీతి, సేవాకార్యక్రమాలు ఏదైనా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయి..ఇది శుభపరిణామంగానే చెప్పాలి. 

Tadepalle

2020-12-30 14:25:09

ఏపీ చరిత్రలోనే భారీగా తగ్గిన ప్రెస్ అక్రిడిటేషన్లు..

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గింది.. సమాచారశాఖ 2021-22 సంవత్సరానికి ఇచ్చే అక్రిడిటేషన్లు ఏపీలోని 13 జిల్లాల్లో తొలివిడతలో భారిగా పడిపోయాయి. అంటే ఇక్కడ మీడియాకి, పత్రికలకు అక్రడిటేషన్లు తగ్గించినట్టు కాదు. ఖచ్చితంగా ఆర్ఎన్ఐ నిబంధనలు పాటించిన మీడియా సంస్థలకు మాత్రమే ప్రభుత్వం ఆన్ లైన్ లో అన్నిరకాల అనుబంధ పత్రాలను జతచేసిన వారికి  తొలివిడతలో ఈ విధంగా అక్రిడిటేషన్లు జారీ చేసింది. గతంలో కార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ఆన్ లైన్ నుంచే కార్డులు డౌన్ లోడ్ చేసుకోమని చెబుతోంది. ఇప్పటి వరకూ కొన్ని జర్నలిస్టు సంఘాల ప్రాభవాలతో సమాచారశాఖలలోని అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ సంపాదించే అక్రిడిటేషన్లు ఇకపై ఆవిధంగా వచ్చే పరిస్థితిలు లేకుండా పోయాయి. ఖచ్చితంగా ప్రతినిత్యం పత్రిక ముద్రించి సరఫరా చేసే మీడియా సంస్థలకు మాత్రమే అక్రిడిటేషన్లు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను కఠిన తరం చేసింది. ఇక జిల్లాస్థాయి అక్రిడిటేషన్ పొందాలంటే మినిమమ్ విద్యార్హత డిగ్రీ చేయడం కూడా విశేషం. అయితే ఇందులో వరుసగా మూడేళ్లు అక్రిడిటేషన్ ఉంటే డిగ్రీ విద్యార్హతలో మినహాయింపు ఇచ్చారు. అదే విధంగా మండల స్థాయిలో అక్రిడిటేషన్ కు కూడా మినిమమ్ ఇంటర్మీడియట్ విద్యార్హతగా పెట్టి మూడేళ్లు అక్రిడిటేషన్ ఉంటే విద్యార్హతగా చాలన్నట్టుగా జీఓను జారీ చేసింది ప్రభుత్వం. దీనితో అన్ని రకాల అనుబంధ పత్రాలు వున్నవారందరికీ తొలివిడతలో అక్రిడిటేషన్లు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచారు. అంటే వారు ఏ తరహా అనుబంధ పత్రాలు ఆన్ లైన్ లో సమర్పించలేదో చూసి వారికి మరో అవకాశం ఇచ్చి మిగిలిన అన్నిరకాల పత్రాలు అందించేందుకు అవకశాలు కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈలోగానే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టుల్లో ఆందోళన మొదలైంది. దానికితోడు పత్రిక ముద్రణా కేంద్రంలో 300 ప్రతులు, మండల కేంద్రంలో 100 ప్రతులు, నియోజవర్గ కేంద్రాల్లో 300 ప్రతులు అమ్ముతున్నట్టు తహశీల్దారు వద్ద ద్రువీకరణ పత్రాలు సమర్పించాలనే నిబంధనలు పెట్టడం కూడా జర్నలిస్టులు, చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలకు ఇబ్బందిగా మారింది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాలుగా అమలు చేస్తున్నవారందరూ తొలివిడతలోనే అక్రిడిటేషన్లు పొందటం విశేషం. ఒక రకంగా ప్రభుత్వం కూడా ఆర్ఎన్ఐ నిబంధనలకు అనుగుణంగా పత్రికలు నిర్వహిస్తేనే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పకనే చెప్పింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్దస్థాయిలో ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయంది. విశేషం ఏంటంటే దేశ రాజధాని పీఐబీల న్యూఢిల్లీలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే నిబంధనల కంటే ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు చాలా గట్టిగా అమలు చేయడం విశేషం. అదే సమయంలో ఎవరైనా జర్నలిస్టు ఒక మీడియా సంస్థలో మానేసిన సమయంలో ఆ స్థానంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి ప్రెస్ అక్రిడిటేషన్ ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. నిబంధనలు అమలు చేసినపుడు, మానేసిన జర్నలిస్టు స్థానంలో మరొక జర్నలిస్టు చేరినపుడు ఆయనకు నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు ఇవ్వాల్సి వుంది. మరీ ముఖ్యంగా రూ.40 లక్షలు టర్నోవర్ దాటని సంస్థలను కూడా జీఎస్టీ నెంబరు తీసుకోమనడం, వాటికి రిటర్న్స్ దాఖలు చేయమనడం కూడా విస్మయాన్ని కలిగిస్తుంది. కేంద్రప్రభుత్వమే రూ.40లక్షలు లోపుగా ఉంటే జీఎస్టీ అవసరం లేదని చెబుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీకి జీఎస్టీ లింకు పెట్టడం వలన మీడియా సంస్థలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చిన్న, మధ్య తరహా పత్రికల యాజమాన్యాలు. మొత్తంగా చూసుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీడియా సంస్థలు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో...ఆంధ్రప్రదేశ్ ప్రెస్ చరిత్రలో ఒక్కసారిగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్లు సంఖ్యలో భారీగా కోత పడే పరిస్థితి కనిపిస్తోంది.  ఈ విషయంలో కొన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలతో చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోవడం కొసమెరుపు..!

Tadepalli

2020-12-30 10:31:47

2020-12-30 10:10:23

స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–2020 పోస్టర్ ఆవిష్కరణ..

తిరుపతి నగరంలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను 2021 జనవరి 04 నుంచి 07 వరకు  నిర్వహిస్తున్నట్లు అనంతపురము రేంజ్ డి.ఐ.జి  క్రాంతి రాణా టాటా చెప్పారు. మంగళవారం తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి.  ఏ.రమేష్ రెడ్డితో కలిసి పోలీస్ మీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రధమంగా  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇతర జిల్లాల సీనియర్ ఐ.పి.యస్ అధికారులతో పాటు కొత్తగా రాష్ట్రానికి వచ్చిన యువ ఐ.పి.యస్ అధికారుల సహకారంతో కార్యక్రమం మొత్తం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ డ్యూటీ మీట్లో జిల్లాల నుంచి వివిధ విభాగాలలో రేంజ్ డ్యూటీ మీట్ లో ప్రతిభ ఆధారంగా ఎన్నికైన పోలీస్ సిబ్బందిని జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపిస్తామన్నారు. అన్ని జిల్లాలలో పోలీస్ అధికారులు సాధించిన విజయాలపై స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, కళాశాల విద్యార్థులకు కూడా విజ్ఞాన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఈ ప్రప్రధమ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ఆనందకరమని, ఇది పూర్తిగా పోలీస్ విశిష్టతను తెలియజేస్తుందని, సమాజంలో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి పోలీస్ విభాగం సర్వసన్నద్ధంగా ఉన్నదని తెలపడానికి ఇది ఒక ప్రధాన సూచికగా బావించవచ్చునన్నారు. రాష్ట్ర డి.జి.పి  గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ,  PTC కల్యాణి డ్యాం వద్ద నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని, ఇందులో కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం డ్యూటీ మీట్ కోర్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2020-12-29 20:35:00

తండ్రీ కొడుకులకి బోర్ కొడితే రైతులు గుర్తొచ్చేస్తారు..

హైదరాబాద్ లో బోర్ కొట్టి నపుడు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ వెంటనే అమరావతిలో రైతులు గుర్తొచ్చి రెచ్చగొట్టే విధంగా ఏదో టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ లోని మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళ, పట్టాల పంపిణీ  మహాయజ్ఞంలా చేస్తుంటే  ప్రతిపక్షం లో ఉన్న చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం సంస్కారం ఉన్నా తన తీరు మార్చుకోవాలన్నారు.  శత కోటి నానీల్లో ఈయన ఇంకో నాని అని ఒక బాధ్యతకలిగిన మంత్రి గురించి అలా మాట్లాడటం చాలా తప్పని అన్నారు. నాని తండ్రి పేరున్న నాయకుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా రావడం,రోడ్ షోలు చేయటం, నాలుగు డైలాగులు చెప్పడం సరికాదన్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనో మరొకరితోనే చెప్పించుకోవలసిన అవసరం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేదన్నారు.  ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కలెక్టర్ లతో మోనటరింగ్ చేసి రైతులు విషయం లో అడగకుండానే ఎం కావాలో ముందే అందిస్తున్నారన్నారు. విశాఖలో ఇళ్ళ 2,96,272మంది లబ్ధిదారులకి అందించామన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.పేదలందరికీ ఇళ్ళుస్థలాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో నిజమైన పండుగ వాతావరణం సంక్రాంతి పండుగకు ముందే నెలకొందని అన్నారు.  పట్టాల పంపిణీలో వివక్షత లేకుండా పాలన జరుగుతోందన్నారు. భీమిలిలో టిడిపి గ్రామాలు అధికంగా ఉన్నా అర్హత ఉన్న అందరికీ ఇళ్లు ఇవ్వడడానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పంట నష్టం జరిగినా గత ప్రభుత్వ హయాంలో  కాలయాపన చేసారే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని..గతం తెలుసుకొని  ఎవరైనా మాట్లాడాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  నాయకత్వంలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు చెప్పిన దానికంటే ముందే పరిహారం అందిస్తున్నామన్నారు. సచివాలయాల వద్ద పంటకి ఇన్సూరెన్స్, అధిక దిగుబడులు వచ్చేలా విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు,రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడం అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలుస్తున్న విషయం దేశమే కీర్తిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Visakhapatnam

2020-12-29 18:22:21

2020-12-29 17:05:03

2020-12-29 17:03:38

2020-12-29 16:19:56

జనవరి నెలలో శ్రీవారికి జరిపే విశేష కార్యక్రమాలు..

తిరుమలలో శ్రీవారికి జనవరి నెలలో నిర్వహించే విశేష కార్యక్రమాలు, ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అవన్నీ ఈ క్రింది విధంగా ఆయా తేదీల్లో జరగనున్నాయి.. - జ‌న‌వ‌రి 7న అధ్య‌య‌నోత్స‌వాలు స‌మాప్తి. - జ‌న‌వ‌రి 8న తిరుమల‌నంబి స‌న్నిధికి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వేంచేపు. - జ‌న‌వ‌రి 9, 24వ తేదీల్లో స‌ర్వ ఏకాద‌శి. - జ‌న‌వ‌రి 10న శ్రీ తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం. - జ‌న‌వ‌రి 13న భోగి పండుగ‌. - జ‌న‌వ‌రి 14న మ‌క‌ర సంక్రాంతి. - జ‌న‌వ‌రి 15న క‌నుమ పండుగ‌, శ్రీ గోదా ప‌రిణ‌యోత్స‌వం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్స‌వం. - జ‌న‌వ‌రి 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి. - జ‌న‌వ‌రి 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం.

Tirumala

2020-12-29 15:56:25

ఏపీ సమాచార శాఖలో భారీగా సిబ్బంది కొరత..

ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖ సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతోంది..ఏపీఆర్వోలు, డిపీఆర్వోలు,డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీస్థాయి అధికారుల ఖాళీలు భారీగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యక్రమాలను మీడియాకి ప్రెస్ నోటు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో సమాచారశాఖలో సినిమా ఆపరేటర్లను ఫోటో గ్రాఫర్లుగానూ, ఏపీఆర్వోలగాను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఏపీఆర్వో చేసే ఉద్యోగాన్ని ఏడీలు, డిడిలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఏపీఆర్వోలను ప్రభుత్వం నియమించినా వారికి ప్రెస్ నోట్లు రాయడం రాకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. దీనితో  సిబ్బంది కొరత ఉన్న విభాగాల్లో వారిని వినియోగించుకుంటున్నారు సమాచారశాఖ అధికారులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంత్రులు ఉండటంతో వారి ప్రెస్ కవరేజీ సమాచారశాఖకు తలనొప్పిగా తయారైంది. కొన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగిన వెంటనే వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారాన్నిపంపుతున్నా...మరికొన్ని జిల్లాల్లో సమాచారశాఖ కనీసం ప్రెస్ కోసం వాట్సప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయలేదు. కాదు కాదు చేస్తే మరింత ఒత్తిడి పెరుతుందని మానేశారు. ఇంకా పాత జీమెయిల్ విధానంలోనే ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు అరకొరగా పంపుతున్నారు. మంత్రులు వద్ద పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు ఆయా జిల్లాలకే కొద్దిమంది మీడియాకే పరిమితం అవుతున్నారు. మంత్రుల కార్యక్రమాలు నేరుగారు సమాచారశాఖ కు కాకుండా వారే మీడియాలకు పంపుతున్నారు. దీనితో మంత్రుల కార్యక్రమాలకు సమాచారశాఖ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే సమయంలో మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కార్యాలయాల్లోని టైపిస్తులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోటో గ్రాఫర్లు ఇలా చాలా పోస్టులే సమాచారశాఖలో ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న తరుణంలో ముఖ్యమైన మూడు జిల్లాల్లోని సమాచారశాఖ శాఖలో ఏపీఆర్వోలు, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుందని అంతా భావించినా సిబ్బంది నియామకంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ పథకాల సమాచారం కూడా పత్రికలు, ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలకు రాకుండా పోతుంది. ప్రతీ జిల్లా నుంచి అరకొరగానే ప్రెస్ నోట్లు వస్తున్నాయి. మంత్రులు కార్యక్రమాలు తప్పా సమాచారశాఖకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్యక్రమాలు కవర్ చేసే అవకాశం లేకుండా పోతుంది. డిడి, ఏడీ, డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వోల మీద భారం మొత్తం పడిపోతుంది. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా సమాచారశాఖలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాతబడినవి కావడం కూడా వేగంగా మీడియాకి సమాచారం అందించే విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి ముగ్గురు ఏపీఆర్వోలను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి కష్టంగా మరుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సమాచారశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే పరిస్థితి కొలిక్కి వచ్చేటట్టు కనిపించడంలేదు..ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..

Vijayawada

2020-12-29 12:48:34

2020-12-28 21:16:20

అక్కచెల్లమ్మల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..సీఎం

ప్రతి పథకం అక్క చెల్లెమ్మల పేరుమీదనే మంజూరు చేస్తూ మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో పథకాల రూపకల్పన చేస్తూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఉరందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప్పొంగిన అభిమానంతో ప్రజల కరతాళ ద్వానుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 25 న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ సందర్భంగా గొప్ప కార్యక్రమమైన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలా 75 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 15 లక్షలా 65 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2 లక్షలా 50 వేల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి విడతలో 1,78,840 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి లో అక్క చెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్న భూమి  కి మంచి మార్కెట్ విలువ కలదని, అధికారం లోకి వచ్చిన 18 నెలల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతి పథకం మహిళల పేరుమీదనే రూపకల్పన చేస్తున్నామని, మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మహిళలను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లోకి రూ. 6,350 కోట్లు, విద్యా దీవెన పథకం కింద 18 లక్షలా 52 వేల మందికి రూ. 4వేల కోట్లు, వసతి దీవెన పథకం కింద 15 లక్షలా 56 వేల మంది తల్లులకు రూ. 1,221 కోట్లు, వై.ఎస్ ఆర్ ఆసరా కింద ప్రతి పొదుపు సంఘం లో ఉన్న 87 లక్షలా 74 వేల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6792 కోట్లు, వై.ఎస్.ఆర్ చేయూత కింద 24 లక్షలా 55 వేల మందికి రూ.4604 కోట్లు,  పొదుపు సంఘాలలో ఉన్న 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వారి తరఫున వడ్డీ 1400 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, కాపు నేస్తం కింద 3 లక్షల 28 వేల మందికి రూ. 491 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇలా ప్రతి పథకం ద్వారా పొందే లబ్ధి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారిని అభివృద్ధి చేసేందుకు రాజకీయ పదవుల్లో కూడా 50 శాతం వారికి కేటాయించడం జరుగుతోందని తెలిపారు.              ఎన్నికల మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని తెలుపగా ప్రస్తుతం 31 లక్షల పక్కా ఇండ్లు ఇస్తున్నామని సగర్వంగా తెలిపారు. ఇంకనూ అర్హత ఉండి ఇళ్ళు పొందని నిరుపేదలు ఉంటే సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్క రూపాయ కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ వై.ఎస్. జగనన్న కాలనీని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ కాలనీ లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 7 వేల కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుందని తెలిపారు. గతం లో 224 చ. అడుగులతో ఇండ్ల నిర్మాణం మహిళలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం 340 చ. అడుగులతో ఇళ్ళ నిర్మాణం చేపట్టామని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే 68 వేల 361 ఎకరాలు భూమిలో లేఔట్లు వేసి అభివృద్ధి చేసి ఇస్తున్నామని వీటి మార్కెట్ విలువ రూ. 25 వేల 530 కోట్లు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాలలో ఒకటి నుండి 1.5 సెంట్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతి లేఔట్ లోనూ మోడల్ ఇళ్ళు నిర్మించడం జరుగుతున్నదని, ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్, వరండా, టాయ్లెట్ వంటి సౌకర్యాలతో పాటు రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబు లైట్లు, రెండు ఎల్ ఈ డి బల్బులు పచ్చదనం పెంచేందుకు ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇండ్ల పట్టాల పంపిణీ రోజే వారి స్థలాన్ని వారికే కేటాయించి ఆరోజే వారికి స్వాధీనం చేయడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మొదటి దశలో 15 లక్షలా 25 వేల ఇళ్ల నిర్మాణం, రెండవ దశ వచ్చే సంవత్సరం లో మొదలవుతుతుందని, టిడ్కో కింద లబ్ధిదారుల ఆప్షన్ మేరకు కేవలం ఒక్క రూపాయతో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆప్షన్ లలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నా ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందని, లబ్ధిదారుల పేరు పైన ఉన్న ఇళ్ళు 5 సం. ల తరువాత ఇళ్ళు అమ్ముకోవడానికి బ్యాంకు లోను తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం న్యాయ పరమైన ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుతం డి ఫామ్ పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని, అడ్డంకులు తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు 30 రకాల వృత్తిదారులకు ప్రత్యక్ష మరియు పరోక్షంగా పని ఏర్పడుతుందని తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని తెలిపారు.           ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.           ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.           ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్, గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు, ఎంపీ లు రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ‌పి‌ఐఐసి చైర్ పర్సన్ రోజా, శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కరుణాకర రెడ్డి, ఆదిమూలం, నవాజ్ బాషా, ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి, వెంకటే గౌడ్, ఆరణి శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలకులు తలశీల రఘురాం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్లు డి. మార్కండేయులు, వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Srikalahasti

2020-12-28 19:59:02

రైతులకు ఉపయోగపడేలా ఉపకరణాలుండాలి..

సామాన్యరైతులకు అందుబాటుధరల్లో వ్యవసాయ ఉపకరణాలు తయారుచేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సిపెట్ విద్యార్ధులు, అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కు పిలుపునిచ్చారు. సోమవారం గన్నవరం మండలంలోని సూరంపల్లి గ్రామంలో కోవిడ్ సక్రమణ తర్వాత ద్వితీయ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సిపెట్ సంస్ధ పురోభివృద్ధిని పరిశీలించి, అనంతరం విద్యార్ధులతో ముచ్చటించారు. ఈసందర్భంగా యం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కోవిడ్ సంక్రమణ సందర్భంగా వర్చువల్ సభల కంటే నేరుగా ముఖాముఖి సమావేశం పెట్టుకోవడమే ఎంతో తృప్తినిస్తుందని చెప్పారు. నాణ్యత, ప్రామాణికత, అత్యల్పధరలతో వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యం, ఆటోమొబైల్, మానవుడుకి అనునిత్యం అవసరమయ్యే సెల్ ఫోన్, పెన్ను వాటిల్లో కూడా ప్లాస్టిక్ వినియోగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయరంగంలో కూడా క్రొత్త ఆవిష్కరణలు పెరిగితే అవి రైతుకు ఎ ంతో ఉపయోగపడతాయన్నారు.  ప్రకృతి అందించిన సంపదను భవిష్యత్తు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతితో స్నేహంగా ఉండకపోతే సమాజమంతా నష్టపోవాల్సి వస్తుందని దానికి తార్కాణాలు ఎ న్నో మనముందుకు వచ్చాయన్నారు. ప్లాస్టిక్ వాడకం, దాన్ని వాడిన తర్వాత తిరిగి మళ్లీ ఉపయోగంలోకితేవడం జరగాలన్నారు. నష్టాల్లో ఉన్న సిపెట్ విద్యాసంస్ధ లాభసాటి వ్యవస్ధగా ఎ దగడం చాలా సంతోషాన్నిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణాతో విడిపోయినప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు ఏమీ లేవని తనకు ఆందోళనగా ఉండేదన్నారు. కేంద్రప్రభుత్వం సహకరించడం వల్ల 36 కేంద్రసంస్ధలు రాష్ట్రంలో నెలకొల్పామన్నారు. క్రొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి తనవంతుపాత్రగా సంబంధిత మంత్రిత్వశాఖల మంత్రులతోనూ, అధికారులతోనూ చర్చించి లాభసాటిగా నిలిచేలాగా ఉన్న పధకాలు వివరాలు తెలుసుకుని వాటి అమలుకు కృషి చేశానన్నారు. ఆదిశలో ఆయా మంత్రులు, అధికారుల సహకారం హర్షణీయం అన్నారు.  సిపెట్ ఏర్పాటు సందర్భంలో అప్పటికేంద్ర మంత్రి అనంతకుమార్ , ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చినసహకారం, తోడ్పాటు అభినందనీయం అని ఈసందర్భంగా వారిని శ్లాఘించుకోవడం మన కర్తవ్యం అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశంలో 65 శాతంమంది జనాభా 35 సంవత్సరాల లోపువారు కాగా, 15 శాతం మంది 36 నుండి 50 సంవత్సరాలలోపువారు ఉన్నారన్నారు. యువతరాన్ని నైపుణ్యాభివృద్ధి , సాంకేతికత, పరిశోధనలు, విద్యాసంబంధిత అంశాలలో ప్రోత్సహించడం ద్వారా గణనీయమైన అభివృద్ధిని సాధించగలుగుతామన్నారు. ప్రకృతితో కలిచి నడవాలని, ప్రకృతిని ప్రేమించాలని, పర్యావరణానికి హానికలిగించే వాటిపట్ల జాగురూకత వహించాల్సి ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యంకాదని ప్రజల స్వచ్ఛంధ భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఉత్తమఫలితాలను సాధించగలుగుతామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను మళ్లీ ఉపయోగంలోకి తేవడంపై ప్రత్యేక దృష్టి పెట్టమని సిపెట్ అధికారులను వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.  నాణ్యత, ఎ క్కువకాలం మన్నిక వస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికి సవాళ్లు విసురుతోందని ఆయన చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మరింత నష్టంకలగజేస్తుందన్నారు. దీనికి పరిష్కారం ప్లాస్టిక్‌ను నియంత్రించడం కానేకాదని, వినియోగదారుల్లో బాధ్యత, సక్రమంగా రీసైకిల్ చేసుకోవాలన్నారు. త్వరలో నెల్లూరు జిల్లాలో సిపెట్ సంస్ధ ఏర్పాటుచేస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన అంగీకారాన్ని కూడా తెలిపిందన్నారు. ఈసమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పెట్రోలియం మరియు పెట్రోకెమికల్స్ జాయింట్ సెక్రటరీ కాశీనాధ్‌ఝూ మాట్లాడుతూ 2016 లో కేంద్రమంత్రిగా యం. వెంకయ్యనాయుడు చేతులుమీదుగా సిపెట్‌కు శంఖుస్ధాపన జరిగిందన్నారు. అదేసంస్ధ అభివృద్ధి చెంది దాదాపు 9500 మంది విద్యార్ధులకు కళాశాలల్లో శిక్షణ కూడా ఇచ్చిందన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా పిల్లలఆటవస్తువుల తయారీలో సిపెట్ కృషి చేస్తోందన్నారు. ఫ్లెక్సిబుల్, ఎ లక్ట్రానిక్ ఆటవస్తువుల రూపకల్పనకు విశేషంగా కృషి జరుగుతోందన్నారు. సిపెట్ డైరెక్టర్ జనరల్ డా. యస్.కె. నాయక్ మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడనగరం ఒక గ్లోబల్ సిటీగా మారనుందని, ఆకేంద్రంలో సిపెట్ విద్యాసంస్ధ నెలకొల్పేందుకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక కృషి చేశారన్నారు. దాదాపు 3 లక్షలమంది విద్యార్ధులను తయారుచేస్తున్న దేశంలోని సిపెట్ సంస్ధలు వచ్చే 2024 నాటికి 5 లక్షలకు విద్యార్ధులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్రదేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సిపెట్ ప్రిన్సిపల్ డైరెక్టరు ఆర్. రాజేంద్రన్, సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యానచంద్ర, సిపెట్ కేంద్రం ఇన్‌ఛార్జ్ శేఖర్ , తదితరులు పాల్గొన్నారు.

Gannavaram

2020-12-28 18:41:09

తిరుపతిలో రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్..

 తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటి మీట్ నిర్వహిస్తున్నట్లు అనంతపూర్ రేంజ్ డి.ఐ.జి  క్రాంతి రాణా ఠాటా తెలిపారు. శనివారం ఆయన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి.  ఏ.రమేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.  తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మొదటి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ 2021 జనవరి 4 నుంచి 7 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు  నిర్వహిస్తున్నామన్నారు.  రాష్ట్ర డి.జి.పి  గౌతం సవాంగ్ సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్-2020 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. దీనికి వేదికగా స్థానిక ఏ.ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్, PTC కల్యాణి డ్యాం ఆతిథ్యం  ఇవ్వనున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ యస్.పి స్థాయి అధికారి వరకు పాల్గొంటున్నారని చెప్పారు. కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వార్డ్, ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి, పోట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐ.ఓ ఫోటోగ్రఫీ మొదలగు వాటిపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన వారిని జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక చేస్తామన్నారు.  అదేవిదంగా ప్రతి రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపదేవిధంగా విజ్ఞానాన్ని పెంపొందిచే చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక విద్యార్ధి కూడా వీటిని వీక్షించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.    ఈ కర్యరమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత , రాష్ట్ర డి.జి.పి  గౌతం సవాంగ్  పాల్గొని ప్రారంబిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ట్రైనీ ఐ.పి.యస్ అధికారులు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2020-12-26 21:22:24