తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 22న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.45 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
పర్యాటకరంగంలో భారీ పెట్టుబడులను ఆహ్వనించేలా , అందుకు తగిన సంస్థలను ప్రోత్సాహించేలా నూతన పర్యాటక పాలసీని రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నాడు స్థానిక సర్య్కూట్ హౌస్ లో ఆయన “ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీ 2020 – 2025 “ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహజవనరులు ఉన్నరాష్ట్రమని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం,రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం,రిక్రియేషన్ టూరిజం లను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వసతి, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 స్టార్, 7 స్టార్ హోటల్ లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ హోటల్ లు నెలకొల్పడానికి అవసరమైన భూమి, ఇతర సదుపాయాలను ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మెగా టూరిజం ప్రాజెక్టులకు లీజు కాలాన్ని 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచామని తెలిపారు. లీజు తీసుకోవడానికి ఆస్తి విలువపై 2 శాతం ఉన్న స్టాంప్ డ్యూటీని 1 శాతానికి తగ్గించామని తెలిపారు.
స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి) ద్వారా పెట్టుబడులకు పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా అనుమతులిస్తామని తెలిపారు. అనుమతులు కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 90రోజులలో ఇస్తామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనలను సరళీకరిస్తున్నామని తెలిపారు. ఇతరరాష్ట్రాల పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు చెన్నై, ముంబాయి లాంటి నగరాలలో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు , నిపుణులతో చర్చించి పాలసీని మెరుగు పరచామని తెలిపారు.
కోవిడ్ పరిస్థితుల అనంతరం పర్యాటకరంగాన్ని పునరుద్దరించేందుకు రూ. 200 కోట్లతో ‘”రీస్టార్ట్ ప్యాకేజీ” ని ఇస్తున్నామని తెలిపారు. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తీసుకునే బ్యాంకు రుణాలపై 4.5 శాతం వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. టూర్ ఆపరేటర్లు, హోటళ్లు,రెస్టారెంట్లు నిర్వాహకులు ఈ ప్యాకేజీ ద్వారా లబ్దిపొందుతారని తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ , కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, , గోదావరి సర్య్కూట్ లను ప్రత్యేకంగా అభివృద్ది పరుస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తామని తెలిపారు. రాబోయే 2 నెలలలో ఈ నాలుగు ప్రాంతాలలో ఇన్ వెస్టర్స్ మీట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకరంగంలో లక్షమందికి జీననోపాధి లభిస్తుందని తెలిపారు.
బోట్ లను పర్యవేక్షించేందుకు 9 కమాండ్ కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరిగేషన్, టూరిజం, పోలీసు,రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు వీటిలో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం అసంఘటితంగా ఉన్న టూర్ ఆపరేటర్లు, గైడ్ లకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చి ప్రొఫెషనలిజం ఉండేలా తీర్చి దిద్దుతామని తెలిపారు. “అతిధి దేవోభవ” సాంప్రదాయాన్ని పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, శాసన సభ్యులు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, పర్యాటక శాఖ ఆర్ డి రాంప్రసాద్, టి ఐ ఓ పూర్ణిమాదేవి పాల్గొన్నారు.
తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేస్తునట్టు టిటిడి ప్రకటించింది. డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తామని తెలియజేసిన టిటిడి భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా కోరింది. కోవిడ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ,గతంలో జరిగిన శాంతిభద్రతలు, ఇతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యాయం వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు స్థానికులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది. దయచేసి స్థానికేతరులెవ్వరూ టోకెన్ల కొరకు రావద్దని మనవి చేయడమైనది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని కోరింది.
బీసీ గుండెఘోష విని, వారికి సమున్నత స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్న నేత ఈ దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సభలో 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం.. వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వెనుక బడిన జాతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వంటి నాయకులను గతంలో చూశామని అన్నారు. బీసీ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ తన క్యాబినెట్లో బీసీకు ఏడుగురురికి.. మంత్రులుగా వెనుక బడిన వారికి అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారన్నారు. 139 బీసీ కులాకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదని పేర్కొన్నారు. ఇద్దరు బీసీ నాయకులను రాజ్యసభకు పంపారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేస్తున్న కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు సింహాల్లా తిప్పి కొట్టాన్నారు. జగన్ విద్యా, వైద్యంలో బడుగులకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. మరో 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్రెడ్డి కొనసాగుతారని పేర్కొన్నారు. బీసీ గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, బీసీ అధ్యాయన కమిటీతో వెనుక బడిన కులాలు గుర్తించారన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్దే దేశ అభివృద్ధి అని అంబేద్కర్ తెలిపారని, ఆయన ఆశయాలతో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ‘3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పేద కష్టాలు తొసుకున్నారని అన్నారు. బడుగు బహీన వర్గాకు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలోనే సక్రమంగా అందుతున్నాయని అన్నారు. గత పాలకలు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు సీఎం జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధానప్రసంగం చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎరు, కృష్ణ దాస్,అంజాద్ బాష, మంత్రు, బొత్ససత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్,వేణుగోపా కృష్ణ, శంకర్ నారాయణ, జయరాం, సీదిరి అప్పల్ రాజు,అవంతి శ్రీనివాస్,కొడాలి నాని,పేర్ని నాని,కన్నబాబు, అదిమూపు సురేష్, ఎంపీు,బా శౌరి, మోపిదేవి వెంకట రమణ, సుభాష్ చంద్రబోస్,భరత్, నదిగాం సురేష్, తదితయి పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా.బి.ఆర్. అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యుల్డ్ కులముల శాసనసభా కమిటీ అధ్యక్షులు గొల్ల బాబూరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం అనంతపురం నగరంలోని క్రీసెంట్ స్కూల్ సమీపంలో డా.బి.ఆర్. అంబేద్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు డా. బి.ఆర్.అంబేద్కర్ అత్యున్నత మైన రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా భారత రాజ్యాంగం నేడు దేశానికి శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు తొలగాయన్నారు. అంతేగాక అందరికీ సమాన అవకాశాలు కల్పించబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు . డా.బి.ఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అంటరానితనం అనే సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు, దేశ ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో పేర్కొన్న హక్కుల ద్వారా భారతదేశ ప్రజలందరూ లబ్ది పొందుతున్నారన్నారు.
అంబేద్కర్ ఆలోచనలు , ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందన్నారు. ఒకవైపు ప్రజల సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి కట్టుబడి ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు .వారి ఆదేశాల మేరకే జిల్లా పర్యటనకు రావడం జరిగిందన్నారు .జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటున్నామని, అలాగే అణగారిన వర్గాల సమస్యలు,వాటి పరిష్కార మార్గాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు తమ కమిటీకి ఎంతో సంతృప్తిని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతపురం ప్రధాన కేంద్రంలో నేడు ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డిి, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు తన చేతుల మీదుగా డా. బి.ఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ ఆర్చ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం శాశ్వతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమమని, ఒక గొప్ప సంకల్పం ఉంటే గానీ ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం కావని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను ఇతర జిల్లాలకు తెలియజేస్తామన్నారు. భవిష్యత్తులో కూడా జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి ,ఆత్మగౌరవం ప్రజాస్వామ్యాన్ని అందించడమే రాజ్యాంగం లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. నేడు డా. బి.ఆర్ .అంబేద్కర్ ఆర్చ్ నిర్మాణం చేపట్టడం ఎంతో శుభదినంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. అంతేగాక సంస్కృతి, సాంప్రదాయాలు, రాయలసీమ మరియు అనంతపురం జిల్లా విశిష్టతను తెలిపే విధంగా అనంతనగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. గతనెల 26న అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి , ఎంపీ తలారి రంగయ్య ల ప్రతిపాదనల మేరకే రాంనగర్ బ్రిడ్జికి డా .బి.ఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయడం జరిగిందన్నారు.
అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ,అణగారిన వర్గాలకు గుర్తింపు, గౌరవం కోసం రాజ్యాంగాన్ని అందజేసిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గత నెల 26న రాంనగర్ ఓవర్ బ్రిడ్జిని డా. బి ఆర్. అంబేద్కర్ పేరు తో నామకరణం చేసి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నామని గుర్తు చేశారు . అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం చలువ వల్లనే ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు స్వేచ్ఛ అనుభవిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నేడు సుమారు రూ .50 లక్షల వ్యయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ ఆర్చ్ నిర్మాణం చేపట్టడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని , అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రంలో మన అనంత- సుందర అనంత కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో రోడ్ల నిర్మాణం ,సుందరీకరణ తదితర పనులు జరుగుతున్నాయని, కరోనా కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేస్తామన్నారు.
అంతకుముందు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కార్యాలయం ,కోర్టు రోడ్డు వైపు ఉన్న సెల్ఫీ పాయింట్ గోడలపై "మన రాజ్యాంగ ఘట్టాలు " పేరుతో చిత్రించిన దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల శాసన కమిటీ అధ్యక్షులు గొల్ల బాబూరావు, సభ్యులు ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు , ఉన్నమట్ల ఎలిజా, ఎమ్మెల్సీ శమంతకమణి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి , పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్యలు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ ,డా.ఏ. సిరి,గంగాధర్ గౌడ్ ,అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, మున్సిపల్ కమిషనర్ పి. వి .ఎన్. ఎన్. మూర్తి , టూరిజం రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య , ఆర్డిఓ గుణ భూషణ్ రెడ్డి ,జిల్లా టూరిజం అధికారి దీపక్, పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖను పారిశ్రామిక ప్రగతికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, క్రిడా , యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం నాడు విజయవాడ లోని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని పర్యాటక, సాంస్కృతిక, క్రిడా , యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలసి పలు అంశాలపై “భూమి వరల్డ్ సంస్థ” విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం, పద్మనాభం మండలాలలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే పద్థతిలో ఎం.ఎస్.ఎం.ఇ. సంస్థలకు ఉపయోగ పడేలా ఏర్పాటు చేయబోయే ఈ పార్కుల ద్వారా రూ.2500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా తేనున్నారని ఆయన తెలిపారు. ఈ సంస్థ ఇప్పటికే మహారాష్ట్రలో 50 లక్షల చదరపు అడుగులు సామర్థ్యం గల 2 పార్కులను నిర్వహిస్తుందని, వాటిలో 1400 ఎం.ఎస్.ఎం.ఇ. యూనిట్లు పని చేస్తున్నాయని, 26 వేల మందికి ప్రత్యక్ష ఉపాథి లభించిందని రూ.3500 కోట్లు టర్నోవర్ సాధించారని తెలిపారు. విశాఖ వేగంగా అభివృద్థి చెందుతున్నదని, రాబోయే రోజుల్లో మరింత ప్రణాళికా బద్దంగా పారిశ్రామకాభివృద్థి జరగనున్నదని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, భూమి వరల్డ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన బి.సి. సంక్రాంతి (బి.సి. ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం) కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. రాష్ట్రముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతీరావుపూలె, మాజీముఖ్యమంత్రి, దివంగతనేత వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 56 బిసి కార్పోరేషన్ల ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించారు.ఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి సిహెచ్. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బి.సి.లను కల్చర్ ఇండియాగా గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి దేశంలోనే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించుకుంటున్న బి.సి. సంక్రాంతి చారిత్రాత్మక సంక్రాంతిగా నిలుస్తుందన్నారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రిగా ఈఅద్భుతమైన అవకాశం రావడం మరిచిపోలేని ఘట్టమని ఇందుకు ముఖ్యమంత్రికి మనస్పూర్తిగా బిసిల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. 18 నెలలక్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదిక సాక్ష్యంగా బిసిల ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయడం బిసిల పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయని అన్నారు. బిసిలు అంటే భారత దేశ సాంస్కృతిక అన్న నాయకుడు సియం జగన్మోహనరెడ్డి అని అన్నారు. 56 బిసి కార్పోరేషన్లు, 672 డైరెక్టర్ల పోష్టుల్లో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. బి.సి.ల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్మోహనరెడ్డి అని, బిసి అధ్యాయన కమిటితో వెనుకబడిన కులాలు గుర్తించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టలు తెలుసుకున్న నేత సియం జగన్ అని పేర్కొన్నారు.
శాసనమండలి సభ్యులు, బిసి కులాల అధ్యయన కమిటి ఛైర్మన్ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాలు అభివృద్ధే దేశ అభివృద్ధి అని డా. అంబేద్కర్ తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆశయాలతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. బిసి అధ్యయన కమిటి ఛైర్మన్గా బిసి కులాలను గుర్తించి నివేదకను ఇవ్వడం జరిగిందని, తన సుదీర్ఝ పాదయాత్ర సందర్భంగా వారి కష్టనష్టాలు తెలుసుకుని వారికి సముచిత స్ధానం, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖామంత్రి ధర్మానకృష్ణదాస్ మాట్లాడుతూ బిసి గుండె%్ఘోష విని, వారిని సమున్నతస్ధాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్న నేత ఈదేశంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి మాత్రమే అన్నారు. గతంలో ప్రభుత్వాలు బిసిలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుని అనంతరం విస్మరించేవారన్నారు.
3,648 కిలోమీటర్ల సుదీర్ఝ తన పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్న జగన్మోహనరెడ్డి బిసి అధ్యయన కమిటీతో వెనుకబడిన కులాలును గుర్తించారన్నారు. బిసిల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో ఏడుగురు బిసిలకు మంత్రులుగా నియమించడమేకాకుండా వారికి ఐదు డిప్యూటి సియం పదవులు ఇచ్చారన్నారు. 139 బిసి కులాలకు 56 కార్పోరేషన్లు ఇచ్చిన ఘనత సియం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉపముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ రాష్ట్రంలో నెలరోజులు ముందుగా సంక్రాంతి పండుగ వచ్చిందన్నారు. ఎ న్నికల మానిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాల్లో ఇప్పటికే 90 శాతం నెరవేర్చిన ఘనత సియం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 56 బిసి కార్పోరేషన్లు ఏర్పాటుచేసి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమింపబడిన వారందరూ బాధ్యతతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వెనుకబడినవర్గాలకు చేరవేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎ న్నికలకు ముందు ఏలూరులో బిసి గర్జన జరిగిందని, నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వై.యస్. జగన్మోహనరెడ్డి ఆరోజు సభలో చెప్పిన ప్రతీమాట ఈరోజు అమలు చేస్తున్నారన్నారు. బిసిలు అంటే వెనుకబడినవారు కాదని బ్యాక్ బోన్ కులమని చాటి చెప్పారు. నాడు మహానేత వైయస్. రాజశేఖరరెడ్డి ప్రజలకోసం ఎ న్నో మంచి కార్యక్రమాలు చేసారని ఈవేళ వారి కుమారుడైన వైయస్. జగన్ అదేబాటలో నడుస్తున్నారన్నారు.
ఈవేళ మనకు పదవి వచ్చిందని అది మీపై విశ్వాసం ఉంచి అప్పగించిన ఒక బాధ్యతగా గుర్తెరెగాలేతప్ప అది అధికారికంగానూ, అలంకారంగానూ భావించవద్దని హితవు పలికారు. మీకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసులువచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ బిసి కులాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఎ దుగుదలకు గతంలో ఎ వరూ కృషి చేయలేదని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదిశలో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వం కీలకమైన శాఖలను బిసిలకు కేటాయించడం ద్వారా సముచిత స్ధానం కల్పించారన్నారు.
రాష్ట్ర కార్మికశాఖామంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నెలరోజుల ముందేవచ్చిందని, సంక్రాంతి పండుగలాగే బిసి సంక్రాంతిని జరుపుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమ పాదయాత్రలో బిసిల కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్నారన్నారు. బిసి కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. బిసిలకు బ్రహ్మరాత వ్రాసారో లేదోగానీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ 56 ఛైర్మన్ పదవులతోపాటు 672 మందిని డైరెక్టర్లుగా నియమించారన్నారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాజకీయచరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి బిసిలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. వార్డుమెంబరుగా కూడా పోటీచేయలేని కులాలను గుర్తించి వారికి కార్పోరేషన్ల ఏర్పాటుద్వారా సముచిత న్యాయం చేశారన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎ క్కడా చేయనివిధంగా బిసిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా ఈప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వండేవాడిగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఉండగా వడ్డించేవాళ్లుగా మన కులాల వాళ్లనే గుర్తించి ఛైర్మన్లు ఇవ్వడం ద్వారా వారికి వెనుకబడిన వర్గాల, కులాల పట్ల ఉన్న అభిమానం చిత్తశుద్ధి ద్వారా నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు.
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ దేశం అంతా వైయస్. జగన్మోహనరెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు వెనుకబడిన జాతులకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా అభివర్ణించారు. మాటనిలుపుకునే మనిషి, మడమ తిప్పని సియం వైయస్. జగన్ లాంటి ముఖ్యమంత్రులను తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు కోరుకుంటున్నాయన్నారు. కరోనా సమయంలో సంక్షేమ పధకాలతో పేదలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. 139 బిసి కులాలకు అండగా నిలిచిన వ్యక్తిగా సియం జగన్ను ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన జాతుల వ్యక్తిగా ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. సంక్రాంతి, క్రిష్టమస్ కన్నా వెనుకబడిన జాతులకు ఈరోజు పండుగ వచ్చిందని అన్నారు.
శాసనసభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ 139 కులాలకు కార్పోరేషన్లు ప్రకటించిన గొప్పతనం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిదేనని, ఆపదవుల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సంక్షేమ పధకాల్లో వెనుకబడిన తరగతుల వారే అధికంగా లబ్దిపొందుతున్నారన్నారు. అట్టడుగు వర్గాలవారిని గుర్తించి వారికి సముచితమైన స్ధానం కల్పించడం అభినందనీయంఅన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, అవంతి శ్రీనివాస్, సిదిరి అప్పలరాజు, యంపిలు వల్లభ##నేని బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్రామ్, గోరంట్ల మాధవ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, శాసనసభ్యులు జోగి రమేష్, కొలుసు పార్ధసారథి, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్, అల్లాడి రాజకుమారి, వాసుబాబు, కెసిసిబి ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, బిసి సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి కె. ప్రవీణ్కుమార్ , మేనేజింగ్ డైరెక్టరు బి.రామారావు, కృష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు కె. మాధవిలత, కె. మోహన్కుమార్ , సబ్ కలెక్టరు హెచ్యం. థ్యానచంద్ర, వైయస్ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ , లక్ష్మారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పవిత్రమైన ధనుర్మాసం సందర్బంగా మంగళవారం ఉదయం మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం తిరుమల నాద నీరాజన వేదిక మీద ప్రారంభమైనది. ఈ కార్యక్రమం జనవరి 14వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహిస్తారు. ''మాసానాం మార్గశిర్షోహం'' అన్నవిధంగా మాసాలలోకి అత్యున్నతమైన మార్గశిర మాసంలో శ్రీ మహా విష్ణువు కథలు వినటం వలన ముక్తి లభిస్తుందని ధర్మగిరి వేద పాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు తెలిపారు. ఇందులో భాగవతం, విష్ణు పురాణంలోని కథలు శ్రవణం చేస్తూ, స్వామిని ధ్యానించినట్లయితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో, సమస్త సిరి సంపదలతో, ధన, ధాన్యాదులతో సుఖ మయ జీవితాన్ని పొందుతారన్నారు. టిటిడి మార్గశిర మాసంలో విష్ణు వైభవ ప్రవచనం కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పవిత్ర మైన ధనుర్మాసం సందర్బంగా ప్రతిరోజు మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల నాద నీరాజన వేదిక మీద డిసెంబరు 15వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదిక మీద టీటీడీ నిర్వహించిన కార్తీక పురాణ ప్రవచనానికి భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వేద పండితులు శ్రీ మారుతి నిర్వహించిన ఈ ప్రవచనం సోమవారంతో ముగిసింది. భక్తుల స్పందన వల్ల మార్గశిర మాసంలో కూడా ఇలాంటి ప్రవచనం కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వేద పండితులు శేషాచార్యులు నెల రోజుల పాటు ప్రవచనం చెబుతారు. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి.సి.ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారిని గుర్తించడం జరిగిందని, బి.సి.ల సంక్రాంతి పేరిట 56 బి.సి. కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్లు పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, తదితరులతో కలిసి మంత్రులు ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 వెనుకబడిన కులాలను గుర్తించి ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. డిశంబరు 17 గురువారం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి సమక్షంలో 56 బి.సి. కార్పోరేషన్ల ఛైర్మన్లు, కార్పోరేషన్లలో నియమించబడిన 672 మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఛైర్మన్లు సభావేదికపై నుండి ప్రమాణస్వీకారం చేయడం జరుగుతుందన్నారు. 672 మంది డైరెక్టర్లు సభావేదిక ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్యాలరీ నుండి ప్రమాణస్వీకారం చేస్తారని మహిళలకు, పురుషులకు సంబంధించి విడివిడిగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసందర్శనలో మంత్రులతోపాటు బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, శాసన సభ్యులు మెరుగు నాగార్జున, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, రాష్ట్ర ప్రజాప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి, జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె. మాధవిలత, జాయింట్ కలెక్టరు (ఆసరా) కె. మోహన్కుమార్ , స్ధానిక నాయకులు దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాస కడపటి ఆదివారం ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి సన్నిధి వీధిగుండా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి నివేదన, ఆస్థానం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లను ఒక తిరుచ్చి మీద, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇంకొక తిరుచ్చి మీద వేంచేపు చేసి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామి వారు విమాన ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో మూలవర్లకు పూలంగి సేవ, అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ రాజేంద్రుడు, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2020 ప్రవేశ పరీక్షకు మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో ఆర్ జియుకెటి 2020 ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించామని, వీటికి విద్యార్దులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్.అండ్.బి భవన సముదాయంలో పత్రికా విలేకర్ల సమావేశంలో ఆర్.జియుకెటి 2020 సెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 30 వేల మందికి పైగా విద్యార్దులను 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత చేయడం జరిగిందన్నారు. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా ఆర్ జియుకెటి సెట్ ను నిర్వహించామన్నారు. ఈ పరీక్షలకు అక్టోబర్ 23 తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 28 నుండి నవంబర్ 16 వరకు అప్లికేషన్లు స్వీకరించామన్నారు.
మొత్తం 88,974 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 85 వేల 755 మంది హాజరైయ్యారన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 630 పరీక్షా కేంద్రాలోను, తెలంగాణ రాష్ట్రంలోని 8 కేంద్రాల్లో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 11గం.ల నుండి మ.1.00 గంట వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్ జియుకెటి ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, హైయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డిల కృషి, మార్గదర్శకం ఎంతో అభినందనీయమన్నారు. జనవరి 4 నుండి విద్యార్దులకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తామన్నారు. జనవరి రెండవ వారం నుండి తరగతులు ప్రారంభించడానికి కార్యాచరణ సిద్దం చేశామన్నారు. అర్హత సాధించిన విద్యార్దులకు, పరీక్షకు హాజరైన విద్యార్దులకు ఆర్.జియుకెటి వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
విద్యార్దులకు కటాఫ్ మార్కులు కాల్ లెటర్లు పంపడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వెబ్సైట్ నుండి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చని, కేవలం హాల్టికెట్ నెంబరు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. గుంటూరుకు చెందిన గుర్రం వంశీకృష్ణ(దాచేపల్లి ఏపి మోడల్ హైస్కూలు)99 మార్కులతో ప్రథమస్దానంలో నిలిచారన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన పోతుంగంట జాకీర్ హుస్సేన్ రెండవ స్దానంలో నిలిచారన్నారు. డోలేపేట జడ్పి హెస్కూల్ రాజాంకు చెందిన ఐ.ఎస్ ఆర్యాయుగంధర్ మూడవస్దానంలో నిలిచారన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలపై అభ్యంతాలు స్వీకరించడం జరిగిందని 1900 అభ్యంతరాలు రాగా ఫిజిక్స్, మ్యాథ్స్కు సంబంధించి రెండు తప్పులను పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎంపికైన విద్యార్దుకు 6 సంవత్సరాల సమీకృత బీటెక్ ప్రోగ్రామ్ మరియు ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ గుంటూరు, శ్రీ వెంకటేశ్వర వెటర్నటీ యూనివర్శిటీ తిరుపతి మరియు డా.వైయస్ ఆర్ హార్టీకల్చర్ వెంకట్రామ గూడెం 2020-21 విద్యా సంవత్సరానికి డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా ఫలితాలను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా విడుదల చేయడం జరిగిందని, కరోనా పరిస్దితుల నేపథ్యంలో ఆన్లైన్ ద్వారాను, యూట్యూబ్ ద్వారా విద్యార్దులకు క్లాసులు నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు నిర్వహణకు ఎంత ప్రయత్నించినా సాధ్యంకానందున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను 2020 నిర్వహించి విద్యార్దుల విద్యాసంవత్సం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఆన్లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాలు..
రాష్ట్రంలో 6 లక్షల 30 వేల మంది విద్యార్దులకు 10వ తరగతి నుండి ఉత్తీర్ణణ చెయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించని మార్గదర్శకాలకు అనుగుణంగా పై#్రవేట్ కాలేజ్లు విద్యార్దులను జాయిన్ చేసుకోవలసి ఉంటుందని, విద్య అనేది వ్యాపారం కాదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు లభించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పసరిగా పాటించాలని ఈ ఏడాది కొత్తగా 300 కాలేజ్లను ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు.