1 ENS Live Breaking News

ఐఐఎంలో ప్ర‌సంగించిన కలెక్టర్ సూర్యకుమారి

విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌తిష్టాత్మక  విద్యాసంస్థ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో  జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్యకుమారి ప్ర‌సంగించారు. మ‌హాత్మాగాంధీ నేష‌న‌ల్ ఫెలోస్ నుద్దేశించి, ఆమె స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశారు. ఈ సందర్భంగా సిటిజెన్ చార్టర్ అమలుకు సంబంధించిన అంశాలను వివ‌రించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల పాత్ర, పరిశోధనా విద్యార్థుల పాత్ర, వారు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలను, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  ఐఐఎం ఎంజిఎన్ఎఫ్ ఛైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ మొహ్మ‌ద్ ష‌మీమ్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంజీఎన్ఎఫ్ ఫెలో సుశాంత్ తో పాటు సుమారు 60 మంది సహచర  విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-29 13:46:41

శారదా పీఠాధి పతిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన

ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రాఫీ, శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆధివారం సాయంత్రం చినముషిడి వాడ, శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భముగా మంత్రి స్వామికి పండ్లు అందజేశారు.  శారదా పీఠం వార్షికోత్సవాలలో భాగంగా మంత్రి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు మంత్రి పీఠంలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో  సమాచార శాఖ జాయింట్ డైరక్టర్  వి.మణిరామ్, బి.సి సంక్షేమ  అధికారిణి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Pendurthi

2023-01-29 13:17:36

మాద‌క ద్య‌వ్యాల నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు

కాకినాడ‌ జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాలని.. వాటి వాడ‌కం దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ప్రజల్లో క‌ల్పించాల‌ని కలెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, చిన్నారులు వాటి బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, కార్యాచ‌ర‌ణ‌పై వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మాద‌క ద్ర‌వ్యాలు వ్య‌క్తితో పాటు వారి కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తాయ‌ని.. వాటి నివార‌ణ‌తో పాటు వినియోగం జ‌ర‌క్కుండా చూసేందుకు గ‌ట్టి నిఘా ఏర్పాటు చేయాల‌న్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో మాద‌క ద్ర‌వ్యాల దుష్ప‌రిణామాల‌పై ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎవ‌రివ‌ద్ద‌నైనా డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు తేలితే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల‌న్నారు.

 ఆ డ్ర‌గ్స్  ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయో తెలుసుకొని చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. దుష్ప‌రిణామాలు, కౌన్సెలింగ్, చ‌ట్ట‌ప‌ర శిక్ష‌లు త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించాలని, ఫోన్ నంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌; క‌మిటీ క‌న్వీన‌ర్‌, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌; విద్యాశాఖ‌, సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ‌, శిశు సంక్షేమం, ఎక్సైజ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు ఛైల్డ్ లైన్ 1098, ఛైల్డ్ ఫండ్ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-01-28 13:18:18

దరఖాస్తులను నెలలోగా గ్రౌన్డింగ్ చేయించాలి

పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను నెల రోజుల్లోగా గ్రౌన్డింగ్ జేరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు.  సంబంధిత శాఖల అధికారులు  దరఖాస్తులను గడువు లోగానే పరిష్కరించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో  జిల్లా స్థాయి  పరిశ్రమల ప్రోత్సాహక  కమిటీ సమావేశం  కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ  ఫుడ్  ఉద్యాన శాఖ, మత్స్య శాఖల ద్వారా  పి.ఎం.జి.ఎస్.వై క్రింద యువత కు  అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అక్టోబర్ నుండి జనవరి వరకు 104 దరఖాస్తులు  అందగా 82  దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 19 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని,  3 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పాపా రావు  వివరించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నేరుగా తిరష్కరించవద్దని,దరఖాస్తు లోని లోపాలను సవరించి తిరిగి సమర్పించమని చెప్పి, అందుకు తగు సలహాలను  అందించాలని సూచించారు.  ఎస్.సి., ఎస్.టి, మహిళల కు సబ్సిడీ 35 నుండి 45 శాతం వరకు ఉందని, అవగాహన కలిగించి ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని తెలిపారు. మాల్స్ , దుకాణాల్లో భద్రతా తనిఖీలు:  వినియోగదారులకు కనీస భద్రత ఉండేలా  దుకాణాల్లో మాల్స్ లో భద్రతా అంశాలను తనిఖీ చేసి ఆడిట్ నివేదిక నందించాలని ఆదేశించారు. అగ్నిమాపక, లేబర్, మున్సిపల్ శాఖల వారు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాలు వేర్వేరుగా ఉండాలని, ఫైర్ సామాగ్రి, అత్త్యవసర ద్వారాలు  ఉండాలని, నిబంధనలను పాటించని వాటి లైసెన్స్ రద్దు చేయాలనీ అన్నారు. సమావేశం లో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, ఎపిఐఐసి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-28 12:28:46

ఫిష్ ఆంధ్రా షాపులు నెలాఖరుకి ప్రారంభంకావాలి


విజ‌య‌న‌గ‌రంజిల్లాలో ఈ నెలాఖ‌రుకి జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్ల‌ను ప్రారంభించాల‌ని, మ‌త్స్య‌శాఖ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. మ‌త్స్య‌శాఖ ద్వారా జ‌రుగుతున్న వివిధ‌ అభివృద్ది ప‌నుల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు.  డివిజ‌న్ల వారీగా సంబంధిత మ‌త్స్య‌శాఖ‌ అధికారులు, సిబ్బందితో స‌మీక్షించారు. ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లను ప్రారంభించ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై  ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తీవ్ర నిర్ల‌క్ష్యం చూపిస్తున్న అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌ప‌రిచి, యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభించేందుకు కృషి చేయాల‌న్నారు. ఇప్ప‌టికే ఎంపికైన ల‌బ్దిదారుల‌చేత‌, ఈ నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభింప‌జేయాల‌ని ఆదేశించారు. సొంత స్థ‌లాల్లో యూనిట్ల‌ను స్థాపించ‌డానికి ముందుకువ‌చ్చే వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు.

 మున్సిప‌ల్, పంచాయితీ స్థలాల్లో షాపుల‌ను పెట్టుకొనేవారి ద‌గ్గ‌ర‌నుంచి, నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయా స్థానిక సంస్థ‌ల తీర్మాణంతోపాటుగా, స‌మ‌గ్ర వివ‌రాల‌తో ఒప్పందాన్ని కూడా తీసుకోవాల‌ని చెప్పారు. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను అందించ‌డానికి, ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని, ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఇస్తున్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌న్నారు. జిల్లాలో మ‌త్స్య‌సంప‌ద అభివృద్దికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. మండ‌ల‌, జిల్లా స్థాయిలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ స‌మావేశంలో మ‌త్స్య‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ నిర్మ‌లాకుమారి, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, మెప్మా పిడి సుధాక‌రరావు, ఎల్‌డిఎం శ్రీ‌నివాస‌రావు, డిసిసిబి సిఈఓ జ‌నార్ధ‌న‌రావు, మ‌త్స్య అభివృద్ది అధికారులు, స‌హాయాధికారులు, గ్రామ మ‌త్స్య స‌హాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-28 12:22:25

రోజురోజుకూ విలువ‌లు ప‌తన‌మైపోతున్నాయి

డ‌బ్బు, పాశ్చాత్య పోక‌డ‌ల ప్ర‌భావంతో ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అయిపోయింద‌ని, దాని ప్ర‌భావంతో సమాజంలో విలువ‌లు రోజురోజుకూ ప‌త‌న‌మైపోతున్నా య‌ని జిల్లా ప్రధాన న్యాయ‌మూర్తి బి.సాయిక‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్ల‌ల్లో నైతిక విలువ‌లు కొర‌వ‌డుతున్నాయ‌ని దీనిపై త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు.  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం న్యాయ సేవా స‌ద‌న్ భ‌వ‌నంలో న‌ల్సా మాడ్యుల్ మెగా న్యాయ అవ‌గాహ‌న శిబిరం జ‌రిగింది. సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి బి.హెచ్‌.వి. ల‌క్ష్మీ కుమారి స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌గా.. జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి. సాయి క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, వాణిజ్య లైంగిక దోప‌డీ, వ‌యోవృద్ధుల ర‌క్ష‌ణ వారికి అందుతున్న న్యాయ సేవ‌ల‌పై ప్ర‌సంగించారు. డ‌బ్బు సంపాద‌న‌, ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ప్ర‌ధానంగా చాలా మంది జీవిస్తున్నార‌ని ఇది స‌మాజానికి మంచిది కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 పిల్ల‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ లోపం ఉంటుంద‌ని దీని వ‌ల్ల వారిలో నైతిక విలువ‌లు కొర‌వ‌డుతున్నాయ‌ని.. దాని దుష్ప‌రిణామాలు స‌మాజంపై ప్ర‌భావం చూపుతున్నాయ‌ని అన్నారు. పిల్ల‌ల్ని పెంచే విధానంలో, చ‌దువు చెప్పే విధానంలో మార్పు రావాల‌ని హిత‌వు ప‌లికారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స‌మాజ హిత‌మే ల‌క్ష్యాంగా పిల్ల‌ల్ని తీర్చిదిద్దాల‌ని పేర్కొన్నారు. స‌మాజంలో చోటు చేసుకుంటున్న‌ దుష్ప‌రిణామాలు త‌గ్గాలంటే ప‌టిష్ఠ‌మైన కుటుంబ వ్య‌వ‌స్థ ఏర్ప‌డాల‌న్నారు. అన్నీ డ‌బ్బుతోనే జ‌ర‌గ‌వ‌ని, మ‌న చుట్టూ ఉన్న‌వారితో స‌ఖ్య‌త‌గా మెలగాల‌ని, ఇత‌రుల‌కు తోడ్ప‌డాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌నం ఎంత డ‌బ్బు సంపాదించినా మ‌న‌కంటూ కొంత‌మంది ఆప్తుల‌ను సంపాదించుకోలేక‌పోతే ఆ జీవితం వ్య‌ర్థ‌మ‌వుతుంద‌ని ఉప‌దేశించారు. క‌ర్మ సిద్ధాంతానికి లోబ‌డి అంద‌రూ ఉండాల్సిందేన‌ని, దానిని కాద‌ని త‌ప్పులు చేస్తే జీవితం చ‌ర‌మాంకంలో దాని ఫ‌లితాలు అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

 వ‌య‌సుతో పాటు చోటు చేసుకొనే హార్మోన్ల ప్ర‌భావం గురించి యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన యువ‌తీ, యువ‌కుల‌కు విడ‌మ‌రిచి చెప్పి, వారు దారిత‌ప్ప‌కుండా చూడాల్సిన‌ బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని సూచించారు. మాన‌వుడికి కోరిక‌లు అనంత‌మ‌ని వాటిని అదుపు చేసుకొని ముందుకు సాగిన‌ప్పుడే బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని.. లేదంటే అథఃపాతాళానికి పోతార‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హెచ్చ‌రించారు. బెంగుళూరులో ఒక విద్యా సంస్థ‌లో చ‌దివే విద్యార్థుల బ్యాగుల్లో సిగ‌రెట్లు, కండోమ్‌లు, ఇత‌ర హానిక‌ర వ‌స్తువులు ల‌భించటం, యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన యువ‌తుల‌ను పరాయి దేశాల‌కు త‌ర‌లిస్తున్న ఘ‌ట‌న‌లు త‌న‌ని క‌లిచివేశాయ‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విచారం వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు చ‌ట్టాలు ఎప్పుడూ అండగా నిలుస్తాయ‌ని భ‌రోసా ఇచ్చారు.

జిల్లా కోర్టు ఒక‌టో అద‌న‌పు న్యాయ‌మూర్తి కె. రాధార‌త్నం మాట్లాడుతూ త‌ల్లిదండ్రులు పిల్ల‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల‌ని సూచించారు. వ‌యోవృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు అనేక మార్గాల్లో అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న చెందారు. మ‌న చుట్టూ ఉండేవాళ్ల‌లోనే మ‌న‌కి శ‌త్రువులు ఉంటున్నార‌ని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రేమ అనే ఉచ్చులో ప‌డి పిల్ల‌లు వారి భ‌విష్య‌త్తును నాశనం చేసుకుంటున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 జిల్లా కోర్డు నాలుగో అద‌న‌పు న్యాయ‌మూర్తి షేక్‌ సికింద‌ర్ భాషా మాట్లాడుతూ స‌మాజ స్థితిగ‌తుల‌ను అర్థం చేసుకుంటూ ప్ర‌తి ఒక్క‌రూ జీవించాల‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. గిఫ్ట్ డీడ్‌లు రాసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ‌హించాల‌ని.. అలా రాసిన‌ప్ప‌టికీ పిల్ల‌ల నుంచి అపాయం ఉంద‌ని భావిస్తే దాన్ని తిరిగి తీసుకోవ‌చ్చ‌ని, దీనికి చ‌ట్టం ఒప్పుకుంటుంద‌ని పేర్కొన్నారు. రివ‌ర్స్ మార్ట్ గేజ్ విధాన సౌల‌భ్యాన్ని వినియోగించుకొని వ‌యో వృద్ధులు ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. చ‌ట్టాలు చాలా బ‌లంగా ప‌ని చేస్తాయ‌ని బాధిత వ‌ర్గాల‌కు ఎప్పుడూ తోడుగా నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. 

వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు జ‌గ‌దీష్ బాబు, సీడ‌బ్ల్యుసీ ఛైర్ ప‌ర్శ‌న్ హిమ‌బిందు మ‌హిళ‌ల‌కు, వృద్ధుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలు, న్యాయ సేవ‌ల‌పై మాట్లాడారు. పిల్ల‌లు ప్రేమ అనే మోజులో ప‌డి జీవితాల‌ను చెడ‌గొట్టుకుంటున్నార‌ని హిమ‌బిందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌యో వృద్ధుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న ప‌థ‌కాలు, సేవ‌ల‌పై వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జ‌గ‌దీష్ వివ‌రించారు. దిశా యాప్ వినియోగాలు, దిశ పోలీస్ స్టేష‌న్ ద్వారా అందుతున్న సేవ‌ల గురించి దిశా పోలీస్ స్టేష‌న్ ఎస్.ఐ. ల‌క్ష్మి వివ‌రించారు. ఫోన్ పోగొట్టుకున్న‌ట్ల‌యితే 89779 45606 ఫోన్ నంబ‌రును సంప్ర‌దించి సాయం పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ఎల్డ‌ర్ లైన్ స్వ‌చ్చంద సేవా సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ వృద్ధుల సౌక‌ర్యార్థం 14567 టోల్ ఫ్రీ నంబ‌ర్ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ఏ స‌హాయం కావాల‌న్నా సంప్ర‌దించాల‌ని చెప్పారు. 

అనంత‌రం సంబంధిత పోస్ట‌ర్ ని జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ఇత‌ర న్యాయ‌మూర్తుల చేతుల మీదుగా ప్రారంభించారు.స్టాళ్లలో వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌.. వైద్య శిబిరం మెగా న్యాయ అవ‌గాహ‌న శిబిరంలో భాగంగా న్యాయ సేవా స‌ద‌న్ భ‌వ‌నంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, మెప్మా, స‌మాఖ్య స‌భ్యులు త‌యారు చేసిన వ‌స్తువులు, చేనేత వ‌స్త్రాల‌ను ప్రద‌ర్శ‌న‌లో ఉంచారు. శిబిరానికి వ‌చ్చిన వారి సౌక‌ర్యార్థం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. స‌ద‌స్సులో సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి బి.హెచ్.వి. ల‌క్ష్మీకుమారి, ఇత‌ర న్యాయ ప్ర‌ముఖులు, న్యాయ‌వాదులు, వ‌యో వృద్ధులు, వివిధ సంస్థ‌ల అధికారులు సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-28 10:31:00

స్వామిని దర్శించుకోవడం ఆనందంగా వుంది

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా ప్రత్యక్ష దైవాన్ని దర్శించు కోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంద్రి డా.సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామివారిని దర్శించు కున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారని,  రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అని వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు,  ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

Arasavilli

2023-01-28 08:03:01

పెన్నహోబిలంలో వైభవంగా రథసప్తమి పూజలు

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారు సూర్యప్రభ, హనుమ, గరుడ వాహనాలపై విహరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాజీ చైర్మన్ అశోక్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వాములు పాల్గొన్నారు.

Ahobilam

2023-01-28 07:42:55

స్పర్శ, కుష్టు వ్యాధి పై ప్రచారం చేయాలి

జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలను తెలియజేయాలన్నారు. ఏ విధంగా వ్యాపించే అవకాశం ఉన్నదో తెలియజేయాలని వ్యాధి సోకిన తర్వాత ఎలా గుర్తించాలి లక్షణాలు కనిపించడానికి ఎంత సమయం పట్టవచ్చు అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  ఈ విషయమై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎ హేమంత్, అదనపు డిఎం అండ్ హెచ్ ఓ బి శారదాబాయి డి ఎల్ డి వో మంజులవాని బీపీఎమ్ఓ డాక్టర్ సి కిషోర్ కుమార్ బీహెచ్ఈవో ఆఫ్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-01-27 14:31:14

శ్రీ సత్యదేవునికి భక్తుల వెండి వస్తువుల విరాళం

అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అన్నవరానకి చెందిన పెమ్మరాజు, గుజరాత్ కి చెందిన వెంకటేశ్వర్రావులు వెండి పూజపాత్రలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో వాటిని సిబ్బందికి అందజేశారు. ఒక వెండి ప్లేటు, పంచపాత్, మట్టుగిన్నె, ఉద్దరిణిలు కలిపి సుమారు 969 గ్రాముల వెండి వస్తులు స్వామివారికి సమర్పించినట్టు ఆలయ వర్గాలు తెలియజేశాయి. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థాన సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-01-27 14:23:28

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో వీరబ్రహ్మం

తిరుమలలో శనివారం జరగనున్న రథసప్తమి పర్వదినం సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన ఏర్పాట్లను జెఈఓ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.  గ్యాలరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో డిప్యూటేషన్ విధులు కేటాయించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిల వద్దకు భక్తులు సులువుగా వెళ్లేలా దారి ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీలకు అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
 జెఈఓ వెంట టిటిడి ఎఫ్ఏసిఎఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, విజివోలు  బాలిరెడ్డి,  మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి  శాస్త్రి ఇతర అన్ని విభాగాల అధికారులు ఉన్నారు. 

Tirumala

2023-01-27 13:59:11

టిటిడికి విరాళంగా ట్రాక్టర్

కర్ణాటకలోని భాగళ్ కోటకు చెందిన శ్రీ సాయి అగ్రికల్చర్ ట్రేడర్స్ నిర్వాహకులు రూ.6.25 లక్షల విలువైన ట్రాక్టరును శుక్రవారం టిటిడికి విరాళంగా అందించారు. శ్రీవారి ఆల యం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టిటిడి తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్  జానకిరామిరెడ్డికి వాహనతాళాలు  అందజేశా రు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతకు టిటిడి అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 12:28:15

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుండి 6 నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

Tirupati

2023-01-27 12:24:48

మిసెస్ ఇండియా పోటీలకు పైడి రజని

రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరుగునున్న మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు పైడి రజని హాజరుకానున్నారు. గత ఏడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెల్చుకున్న ఈమె రాజస్థాన్లో జరుగుతున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా పోటీలకు ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు. ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో వివిధ కేటగిరీల్లో ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణ పై నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ ఆల్ ఇండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో నాలుగు రోజులు పాటు వివిధ కేటగిరీల్లో ఎంపికైన మేరకు కేటగిరీల వారీగా టైటిల్స్ అందజేస్తారని అమె తెలిపారు.

Visakhapatnam

2023-01-27 09:10:48

విశాఖలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటన ఇలా

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహనరెడ్డి పర్యటన ఖారు అయ్యింది. శ‌నివారం ఉదయం 9. 15 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10. 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1. 30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ ఎం. వి. వి. సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1. 55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈమేర‌కు శుక్ర‌వారం అధికారులు సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

Visakhapatnam

2023-01-27 08:48:43