1 ENS Live Breaking News

గిరిపుత్రుల నాడి, వాడి, వేడి.. జనసేన గంగులయ్య..!

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76ఏళ్లు గడుస్తున్నా మన్యంలోని గిరిజనుల బతుకులు మాత్రం మారలేదు. ఆ ప్రాంతాలు అసలే అభివృద్ధి చెందలేదు.. పాలకు లు  పట్టించుకోలేదు..ఐటిడిఏలు ముందుకి రాలేదు. అనాదిగా గిరిజనుల వేదన అరణ్య రోధనే అవుతున్నది. జనసేన పార్టీ ఆవిర్భవించిన తరువాత ఏజెన్సీలో ని గిరిపు త్రుల సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..ప్రభుత్వం దృష్టికి వెళుతున్నాయి..దానికి అంతటికీ కారణం ఒకే ఒక్కటే వంపూరు గంగులయ్య అరకు పార్లమెం టు నియోజవర్గం ఇన్చార్జిగా గిరిజనుల సమస్యలపైనే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఏకైన ప్రజానాయకుడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కష్టాలను చూస్తూ తనవంతుగా సహాయం అందిస్తూ..ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని కదిలిస్తున్న నాయకుడు. ఇపుడు అతనే గిరిపుత్రుల 
నాడి, వాడి, వేడి అయ్యాడు. అరకు పార్లమెంటు రథసారధిగా గిరిపుత్రుల మద్దతుతో ముందుకి సాగుతున్నాడు.

ARAKU VALLEY

2023-01-30 14:36:20

ఉక్కు ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు..అమర్నాధ్

విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాల ను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని.. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటగా చెబుతున్నానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సోమవారం ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభలో మంత్రి అమర్నాథ్ ప్రసంగించారు. విశాఖ హుక్కు.. ఆంధ్రుల హక్కు.. అన్న నినాదంతో ప్రారంభించిన ఆయన ప్రసంగం ఆద్యంతం కార్మికులకు భరోసాను కల్పిస్తూ.. ఉద్యమానికి మరింత ఊతమిస్తూ సాగింది.
 

విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్షలాదిమంది ఆధారపడి పని చేస్తున్నారని, లాభాలలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ను దొంగ చాటుగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు 700 రోజులకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 60వ దశకంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి, అప్పటి ప్రధానుల మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా దేశంలో పలు రాష్ట్రాల్లో సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ, విశాఖపట్నంలో ప్లాంటును ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్టీల్ ప్రపంచంలోని వివిధ దేశాలకు సులభంగా రవాణా చేయొచ్చన్న ఉద్దేశంతోనే దేశంలోనే మొట్టమొదటి సముద్ర తీర ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

 
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయటానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్రం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవడానికి కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు పోరాడుతున్న సమయంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కార్మిక సంఘాల నాయకులు కలిసి సుదీర్ఘంగా చర్చించారని అమర్నాథ్ చెప్పారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలియజేశారని, ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో తమకు ప్రజాప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనాలు లేవని స్పష్టం చేయడంతోపాటు, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రధానికి పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారని అమర్నాథ్ తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూమిని ఇక్కడ ప్రజలు వదులుకున్నారని, అనేకమంది నిర్వాసితులయ్యారని ఇప్పటికి వారికి ప్లాంట్ లో ఉద్యోగాలు లభించలేదని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ని సరఫరా చేసి, 'ఉక్కు కాదు.. ఊపిరి' అని కూడా నిరూపించుకుందని అమర్నాథ్ చెప్పారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా ఏ సభలోనైనా ముఖ్యమంత్రి ప్రతినిధిగా గళమెత్తి మాట్లాడుతానని అమర్నాథ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇంతకాలంగా చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు ఉందన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు.

Gajuwaka

2023-01-30 14:05:53

కుష్టువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి జిల్లా 
కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన పక్షోత్సవ కార్యక్రమాన్ని  కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ 
డాక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలన పై ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి  13వ తేదీ వరకు  జిల్లాలో వైద్యాధికారులు వారి సిబ్బంది ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి  కుష్టు వ్యాధి నిర్మూలన పై  ప్రజలకు అవగాహన కల్పించిన ఉన్నారని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న ఈ తరుణం లో జిల్లా ప్రజలు, జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అందరు కుష్టు  వ్యాధి నుంచి వ్యాధి గ్రస్తులను విముక్తి చేయడానికి వున్న ఏ అవకాశాన్ని వదులుకోమని ఈ సందర్భంగా ప్రకటించారు.  కుష్టు వ్యాధి విముక్తి కొరకు పోరాడి , కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దామని పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా పలువురు కుష్టు  వ్యాధిగ్రస్తులకు జిల్లా కలెక్టర్ మాధవీలత స్టీలు బిందెలు, దుప్పట్లు , పండ్లు పంపిణీ చేశారు. జిల్లా లెప్రసీ , ఎయిడ్స్ టీవీ కంట్రోల్ అధికారిణి డా.ఎన్. వసుంధర మాట్లాడుతూ  జిల్లాలో ఇప్పటివరకు  70 కేసులు గుర్తించామని, చికిత్స పొందుతున్న  740 డిఫార్మటీ కేసెస్ ( కాళ్లు చేతులు లేని ) వారు ఉన్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా ప్రతినెలా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించ వచ్చునని, దీనిని చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు.  జిల్లాలో వున్న అన్ని కుష్ఠు వ్యాధి కేసులను ప్రారంభ దశలోనే కనుగొనుటకు పూర్తిగా కృషి చేస్తామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లాలో వున్న అన్ని వనరులను వినియోగించుకుంటా మన్నారు. 

సమాజములో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వున్న వివక్షను, చిన్న చూపును తొలగించి వారిని ప్రధాన జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి 
చేస్తామన్నారు.కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. అంత 
సులభంగా అంటుకునే అంటువ్యాధి కాదన్నారు. దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఉచితంగా మందులు  ఇవ్వడం జరుగుతుందని డి ఎల్. ఓ  డా .వసుంధర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి. నరసింహులు,  జిల్లా వైద్య అధికారులు, కుష్ఠు వ్యాధి పీడితులు, పలువురు అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-01-30 10:33:35

విజయనగరం జిల్లా డి.ఆర్.సి. వాయిదా

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనవరి 31న జరగాల్సిన జిల్లా సమీక్ష సమావేశం వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా సమీక్ష సమావేశం వాయిదా వేస్తూ జిల్లా ఇన్ చార్జి మంత్రి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం జరిగే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా జిల్లా అధికారులు సమస్త సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు.

Vizianagaram

2023-01-30 10:12:40

సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈఓ

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో  సోమవారం డయల్ యువర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈఓ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈఓ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 11. 30 నిమిషాల వరకు కార్యక్రమం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో భక్తులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఆలయంలో అందుతున్న సేవలు తదితర విషయాలపై నేరుగా ఈఓతో మాట్లాడవచ్చునని పేర్కొన్నారు. దానికోసం భక్తులు ఈ ఫోన్ నంబర్ : 08868-238127 లో సంప్రదించాల్సి వుంటుందని ఆ ప్రకటనలో ఈఓ తెలియజేశారు.

Annavaram

2023-01-29 16:07:22

తిరుపతిలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాల ప్రారంభంలో భాగంగా ఈ  కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి  రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు సంకీర్తనాలాపన జరిగింది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధార్మిక సందేశం అందించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. కలియుగంలో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శోభాయాత్రగా రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా వారు చేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
 సాయంత్రం 6 గంటల నుండి సంగీత విభావరి,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 31న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

Tirupati

2023-01-29 14:19:26

గ్రామ సచివాలయం ఉద్యోగం మీ లక్ష్యమైతే కేరాఫ్ కీర్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తీయబోయే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే..మీరు కాకినాడ కీర్తి కాంపిటేటివ్ ఇనిస్టిట్యూట్ లో చేరడం ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. 2019లో సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ లో సుమారు 140 మందిని సచివాలయ ఉద్యోగులుగా మార్చింది కీర్తి కాంపిటేటివ్ ఇనిస్టిట్యూట్. ఉద్యోగాలు పొందిన వారే మళ్లీ గ్రూప్-2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మళ్లీ కీర్తి ఇనిస్టిట్యూట్ లోనే చేరుతున్నారు. అత్యుత్తమ శిక్షణ, సుదీర్ఘ అనుభవం కలిగిని ఫ్యాకల్టీతో విద్యాభోధన. డైలీ, వీక్లీ, మంత్లీ మోడల్ టెస్టులు, క్లాస్ లోనే లైవ్ క్వశ్చన్ సెషన్లు. వివరాలకు పవన్ సర్-9032228708

Kakinada

2023-01-29 14:01:30

ఐఐఎంలో ప్ర‌సంగించిన కలెక్టర్ సూర్యకుమారి

విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌తిష్టాత్మక  విద్యాసంస్థ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో  జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్యకుమారి ప్ర‌సంగించారు. మ‌హాత్మాగాంధీ నేష‌న‌ల్ ఫెలోస్ నుద్దేశించి, ఆమె స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశారు. ఈ సందర్భంగా సిటిజెన్ చార్టర్ అమలుకు సంబంధించిన అంశాలను వివ‌రించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల పాత్ర, పరిశోధనా విద్యార్థుల పాత్ర, వారు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలను, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  ఐఐఎం ఎంజిఎన్ఎఫ్ ఛైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ మొహ్మ‌ద్ ష‌మీమ్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంజీఎన్ఎఫ్ ఫెలో సుశాంత్ తో పాటు సుమారు 60 మంది సహచర  విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-29 13:46:41

శారదా పీఠాధి పతిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన

ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రాఫీ, శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆధివారం సాయంత్రం చినముషిడి వాడ, శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భముగా మంత్రి స్వామికి పండ్లు అందజేశారు.  శారదా పీఠం వార్షికోత్సవాలలో భాగంగా మంత్రి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు మంత్రి పీఠంలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో  సమాచార శాఖ జాయింట్ డైరక్టర్  వి.మణిరామ్, బి.సి సంక్షేమ  అధికారిణి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Pendurthi

2023-01-29 13:17:36

మాద‌క ద్య‌వ్యాల నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు

కాకినాడ‌ జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాలని.. వాటి వాడ‌కం దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ప్రజల్లో క‌ల్పించాల‌ని కలెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, చిన్నారులు వాటి బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, కార్యాచ‌ర‌ణ‌పై వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మాద‌క ద్ర‌వ్యాలు వ్య‌క్తితో పాటు వారి కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తాయ‌ని.. వాటి నివార‌ణ‌తో పాటు వినియోగం జ‌ర‌క్కుండా చూసేందుకు గ‌ట్టి నిఘా ఏర్పాటు చేయాల‌న్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో మాద‌క ద్ర‌వ్యాల దుష్ప‌రిణామాల‌పై ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎవ‌రివ‌ద్ద‌నైనా డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు తేలితే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల‌న్నారు.

 ఆ డ్ర‌గ్స్  ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయో తెలుసుకొని చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. దుష్ప‌రిణామాలు, కౌన్సెలింగ్, చ‌ట్ట‌ప‌ర శిక్ష‌లు త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించాలని, ఫోన్ నంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌; క‌మిటీ క‌న్వీన‌ర్‌, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌; విద్యాశాఖ‌, సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ‌, శిశు సంక్షేమం, ఎక్సైజ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు ఛైల్డ్ లైన్ 1098, ఛైల్డ్ ఫండ్ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-01-28 13:18:18

దరఖాస్తులను నెలలోగా గ్రౌన్డింగ్ చేయించాలి

పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను నెల రోజుల్లోగా గ్రౌన్డింగ్ జేరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు.  సంబంధిత శాఖల అధికారులు  దరఖాస్తులను గడువు లోగానే పరిష్కరించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో  జిల్లా స్థాయి  పరిశ్రమల ప్రోత్సాహక  కమిటీ సమావేశం  కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ  ఫుడ్  ఉద్యాన శాఖ, మత్స్య శాఖల ద్వారా  పి.ఎం.జి.ఎస్.వై క్రింద యువత కు  అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అక్టోబర్ నుండి జనవరి వరకు 104 దరఖాస్తులు  అందగా 82  దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 19 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని,  3 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పాపా రావు  వివరించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నేరుగా తిరష్కరించవద్దని,దరఖాస్తు లోని లోపాలను సవరించి తిరిగి సమర్పించమని చెప్పి, అందుకు తగు సలహాలను  అందించాలని సూచించారు.  ఎస్.సి., ఎస్.టి, మహిళల కు సబ్సిడీ 35 నుండి 45 శాతం వరకు ఉందని, అవగాహన కలిగించి ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని తెలిపారు. మాల్స్ , దుకాణాల్లో భద్రతా తనిఖీలు:  వినియోగదారులకు కనీస భద్రత ఉండేలా  దుకాణాల్లో మాల్స్ లో భద్రతా అంశాలను తనిఖీ చేసి ఆడిట్ నివేదిక నందించాలని ఆదేశించారు. అగ్నిమాపక, లేబర్, మున్సిపల్ శాఖల వారు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాలు వేర్వేరుగా ఉండాలని, ఫైర్ సామాగ్రి, అత్త్యవసర ద్వారాలు  ఉండాలని, నిబంధనలను పాటించని వాటి లైసెన్స్ రద్దు చేయాలనీ అన్నారు. సమావేశం లో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, ఎపిఐఐసి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-28 12:28:46

ఫిష్ ఆంధ్రా షాపులు నెలాఖరుకి ప్రారంభంకావాలి


విజ‌య‌న‌గ‌రంజిల్లాలో ఈ నెలాఖ‌రుకి జిల్లాలో ఫిష్ ఆంధ్రా యూనిట్ల‌ను ప్రారంభించాల‌ని, మ‌త్స్య‌శాఖ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. మ‌త్స్య‌శాఖ ద్వారా జ‌రుగుతున్న వివిధ‌ అభివృద్ది ప‌నుల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు.  డివిజ‌న్ల వారీగా సంబంధిత మ‌త్స్య‌శాఖ‌ అధికారులు, సిబ్బందితో స‌మీక్షించారు. ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లను ప్రారంభించ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై  ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తీవ్ర నిర్ల‌క్ష్యం చూపిస్తున్న అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌ప‌రిచి, యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభించేందుకు కృషి చేయాల‌న్నారు. ఇప్ప‌టికే ఎంపికైన ల‌బ్దిదారుల‌చేత‌, ఈ నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభింప‌జేయాల‌ని ఆదేశించారు. సొంత స్థ‌లాల్లో యూనిట్ల‌ను స్థాపించ‌డానికి ముందుకువ‌చ్చే వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు.

 మున్సిప‌ల్, పంచాయితీ స్థలాల్లో షాపుల‌ను పెట్టుకొనేవారి ద‌గ్గ‌ర‌నుంచి, నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయా స్థానిక సంస్థ‌ల తీర్మాణంతోపాటుగా, స‌మ‌గ్ర వివ‌రాల‌తో ఒప్పందాన్ని కూడా తీసుకోవాల‌ని చెప్పారు. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను అందించ‌డానికి, ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని, ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఇస్తున్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌న్నారు. జిల్లాలో మ‌త్స్య‌సంప‌ద అభివృద్దికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. మండ‌ల‌, జిల్లా స్థాయిలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ స‌మావేశంలో మ‌త్స్య‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ నిర్మ‌లాకుమారి, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, మెప్మా పిడి సుధాక‌రరావు, ఎల్‌డిఎం శ్రీ‌నివాస‌రావు, డిసిసిబి సిఈఓ జ‌నార్ధ‌న‌రావు, మ‌త్స్య అభివృద్ది అధికారులు, స‌హాయాధికారులు, గ్రామ మ‌త్స్య స‌హాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-28 12:22:25

రోజురోజుకూ విలువ‌లు ప‌తన‌మైపోతున్నాయి

డ‌బ్బు, పాశ్చాత్య పోక‌డ‌ల ప్ర‌భావంతో ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అయిపోయింద‌ని, దాని ప్ర‌భావంతో సమాజంలో విలువ‌లు రోజురోజుకూ ప‌త‌న‌మైపోతున్నా య‌ని జిల్లా ప్రధాన న్యాయ‌మూర్తి బి.సాయిక‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్ల‌ల్లో నైతిక విలువ‌లు కొర‌వ‌డుతున్నాయ‌ని దీనిపై త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు.  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం న్యాయ సేవా స‌ద‌న్ భ‌వ‌నంలో న‌ల్సా మాడ్యుల్ మెగా న్యాయ అవ‌గాహ‌న శిబిరం జ‌రిగింది. సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి బి.హెచ్‌.వి. ల‌క్ష్మీ కుమారి స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌గా.. జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి. సాయి క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, వాణిజ్య లైంగిక దోప‌డీ, వ‌యోవృద్ధుల ర‌క్ష‌ణ వారికి అందుతున్న న్యాయ సేవ‌ల‌పై ప్ర‌సంగించారు. డ‌బ్బు సంపాద‌న‌, ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ప్ర‌ధానంగా చాలా మంది జీవిస్తున్నార‌ని ఇది స‌మాజానికి మంచిది కాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 పిల్ల‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ లోపం ఉంటుంద‌ని దీని వ‌ల్ల వారిలో నైతిక విలువ‌లు కొర‌వ‌డుతున్నాయ‌ని.. దాని దుష్ప‌రిణామాలు స‌మాజంపై ప్ర‌భావం చూపుతున్నాయ‌ని అన్నారు. పిల్ల‌ల్ని పెంచే విధానంలో, చ‌దువు చెప్పే విధానంలో మార్పు రావాల‌ని హిత‌వు ప‌లికారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స‌మాజ హిత‌మే ల‌క్ష్యాంగా పిల్ల‌ల్ని తీర్చిదిద్దాల‌ని పేర్కొన్నారు. స‌మాజంలో చోటు చేసుకుంటున్న‌ దుష్ప‌రిణామాలు త‌గ్గాలంటే ప‌టిష్ఠ‌మైన కుటుంబ వ్య‌వ‌స్థ ఏర్ప‌డాల‌న్నారు. అన్నీ డ‌బ్బుతోనే జ‌ర‌గ‌వ‌ని, మ‌న చుట్టూ ఉన్న‌వారితో స‌ఖ్య‌త‌గా మెలగాల‌ని, ఇత‌రుల‌కు తోడ్ప‌డాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌నం ఎంత డ‌బ్బు సంపాదించినా మ‌న‌కంటూ కొంత‌మంది ఆప్తుల‌ను సంపాదించుకోలేక‌పోతే ఆ జీవితం వ్య‌ర్థ‌మ‌వుతుంద‌ని ఉప‌దేశించారు. క‌ర్మ సిద్ధాంతానికి లోబ‌డి అంద‌రూ ఉండాల్సిందేన‌ని, దానిని కాద‌ని త‌ప్పులు చేస్తే జీవితం చ‌ర‌మాంకంలో దాని ఫ‌లితాలు అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

 వ‌య‌సుతో పాటు చోటు చేసుకొనే హార్మోన్ల ప్ర‌భావం గురించి యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన యువ‌తీ, యువ‌కుల‌కు విడ‌మ‌రిచి చెప్పి, వారు దారిత‌ప్ప‌కుండా చూడాల్సిన‌ బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని సూచించారు. మాన‌వుడికి కోరిక‌లు అనంత‌మ‌ని వాటిని అదుపు చేసుకొని ముందుకు సాగిన‌ప్పుడే బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని.. లేదంటే అథఃపాతాళానికి పోతార‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హెచ్చ‌రించారు. బెంగుళూరులో ఒక విద్యా సంస్థ‌లో చ‌దివే విద్యార్థుల బ్యాగుల్లో సిగ‌రెట్లు, కండోమ్‌లు, ఇత‌ర హానిక‌ర వ‌స్తువులు ల‌భించటం, యుక్త వ‌య‌సుకు వ‌చ్చిన యువ‌తుల‌ను పరాయి దేశాల‌కు త‌ర‌లిస్తున్న ఘ‌ట‌న‌లు త‌న‌ని క‌లిచివేశాయ‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి విచారం వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు చ‌ట్టాలు ఎప్పుడూ అండగా నిలుస్తాయ‌ని భ‌రోసా ఇచ్చారు.

జిల్లా కోర్టు ఒక‌టో అద‌న‌పు న్యాయ‌మూర్తి కె. రాధార‌త్నం మాట్లాడుతూ త‌ల్లిదండ్రులు పిల్ల‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల‌ని సూచించారు. వ‌యోవృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు అనేక మార్గాల్లో అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న చెందారు. మ‌న చుట్టూ ఉండేవాళ్ల‌లోనే మ‌న‌కి శ‌త్రువులు ఉంటున్నార‌ని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రేమ అనే ఉచ్చులో ప‌డి పిల్ల‌లు వారి భ‌విష్య‌త్తును నాశనం చేసుకుంటున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 జిల్లా కోర్డు నాలుగో అద‌న‌పు న్యాయ‌మూర్తి షేక్‌ సికింద‌ర్ భాషా మాట్లాడుతూ స‌మాజ స్థితిగ‌తుల‌ను అర్థం చేసుకుంటూ ప్ర‌తి ఒక్క‌రూ జీవించాల‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. గిఫ్ట్ డీడ్‌లు రాసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ‌హించాల‌ని.. అలా రాసిన‌ప్ప‌టికీ పిల్ల‌ల నుంచి అపాయం ఉంద‌ని భావిస్తే దాన్ని తిరిగి తీసుకోవ‌చ్చ‌ని, దీనికి చ‌ట్టం ఒప్పుకుంటుంద‌ని పేర్కొన్నారు. రివ‌ర్స్ మార్ట్ గేజ్ విధాన సౌల‌భ్యాన్ని వినియోగించుకొని వ‌యో వృద్ధులు ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. చ‌ట్టాలు చాలా బ‌లంగా ప‌ని చేస్తాయ‌ని బాధిత వ‌ర్గాల‌కు ఎప్పుడూ తోడుగా నిలుస్తాయ‌ని పేర్కొన్నారు. 

వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు జ‌గ‌దీష్ బాబు, సీడ‌బ్ల్యుసీ ఛైర్ ప‌ర్శ‌న్ హిమ‌బిందు మ‌హిళ‌ల‌కు, వృద్ధుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలు, న్యాయ సేవ‌ల‌పై మాట్లాడారు. పిల్ల‌లు ప్రేమ అనే మోజులో ప‌డి జీవితాల‌ను చెడ‌గొట్టుకుంటున్నార‌ని హిమ‌బిందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌యో వృద్ధుల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న ప‌థ‌కాలు, సేవ‌ల‌పై వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ జ‌గ‌దీష్ వివ‌రించారు. దిశా యాప్ వినియోగాలు, దిశ పోలీస్ స్టేష‌న్ ద్వారా అందుతున్న సేవ‌ల గురించి దిశా పోలీస్ స్టేష‌న్ ఎస్.ఐ. ల‌క్ష్మి వివ‌రించారు. ఫోన్ పోగొట్టుకున్న‌ట్ల‌యితే 89779 45606 ఫోన్ నంబ‌రును సంప్ర‌దించి సాయం పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ఎల్డ‌ర్ లైన్ స్వ‌చ్చంద సేవా సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ వృద్ధుల సౌక‌ర్యార్థం 14567 టోల్ ఫ్రీ నంబ‌ర్ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ఏ స‌హాయం కావాల‌న్నా సంప్ర‌దించాల‌ని చెప్పారు. 

అనంత‌రం సంబంధిత పోస్ట‌ర్ ని జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ఇత‌ర న్యాయ‌మూర్తుల చేతుల మీదుగా ప్రారంభించారు.స్టాళ్లలో వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌.. వైద్య శిబిరం మెగా న్యాయ అవ‌గాహ‌న శిబిరంలో భాగంగా న్యాయ సేవా స‌ద‌న్ భ‌వ‌నంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, మెప్మా, స‌మాఖ్య స‌భ్యులు త‌యారు చేసిన వ‌స్తువులు, చేనేత వ‌స్త్రాల‌ను ప్రద‌ర్శ‌న‌లో ఉంచారు. శిబిరానికి వ‌చ్చిన వారి సౌక‌ర్యార్థం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. స‌ద‌స్సులో సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి బి.హెచ్.వి. ల‌క్ష్మీకుమారి, ఇత‌ర న్యాయ ప్ర‌ముఖులు, న్యాయ‌వాదులు, వ‌యో వృద్ధులు, వివిధ సంస్థ‌ల అధికారులు సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-28 10:31:00

స్వామిని దర్శించుకోవడం ఆనందంగా వుంది

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా ప్రత్యక్ష దైవాన్ని దర్శించు కోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంద్రి డా.సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామివారిని దర్శించు కున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారని,  రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అని వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు,  ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

Arasavilli

2023-01-28 08:03:01

పెన్నహోబిలంలో వైభవంగా రథసప్తమి పూజలు

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారు సూర్యప్రభ, హనుమ, గరుడ వాహనాలపై విహరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాజీ చైర్మన్ అశోక్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వాములు పాల్గొన్నారు.

Ahobilam

2023-01-28 07:42:55