1 ENS Live Breaking News

జర్నలిస్టుల కుటుంబ సభ్యులకూ కోవిడ్ బూస్టర్ డోస్..

జర్నలిస్టులు వారి కుటుబీకులకు కోవిడ్ బూస్టర్ డోస్ లు వేసే కార్యక్రమం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రకటించారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్  అసోసియేషన్ తరపున తనను కలిసి  కోవిడ్ నేపధ్య విపత్కర పరిస్థితులను అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఈ కోవిడ్/ ఒమిక్రాన్  వేళ  జిల్లా యంత్రాంగంతో పాటూ నిరంతరం సేవలను అందించడంలో తిరిగే జర్నలిస్టులూ అనేక మంది కోవిడ్ కు గురవుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో జర్నలిస్టులూ వారి కుటుంబ సభ్యులకూ (6 నెలలు  పూర్తయిన వారికి) వేక్సిన్ రెండు డోసుల ప్రక్రియ ప్రాతిపదికన బూస్టర్ డోస్ లు వేసే వెసులుబాటు/అవకాశం కల్పించాలని కోరారు.  అసోసియేషన్ తరపున జర్నలిస్టుల వారి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా వివరించారు. దీనికి  కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అభినందనలు తెలిపారు. అధ్యక్షుని అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించారు. తక్షణమే డిఅండహెచ్వో కు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సమర్పించిన లేఖపైనే సిఫార్సు చేస్తూ సంతకం చేశారు. జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారికి అసోసియేషన్ తరపున అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ధన్యవాదాలు  తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలోనే జర్నలిస్టుల కు వారి కుటుంబ సభ్యులకూ కోవిడ్ బూస్టర్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించిన వెంటనే సమాచారం కూడ తెలియజేస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం తో వర్ధిల్లాలని అశోక్ కుమార్ ఆశించారు. కలెక్టర్ ను కలిసి అసోసియేషన్ తరపున వినతి పత్రం అందించిన వారిలో కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్,ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణ్ యాదవ్,సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్రశేఖర్,బాలు పాత్రో,సహ సహాయ కార్యదర్శి కొండ్రి వినోద్,సభ్యులు జే. సూరిబాబు తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2022-01-26 13:21:06

నీ దమ్మేంటో సర్పంచ్ ఎన్నికల్లోనే తేలిపోయింది.. సత్యంనాయుడు ఎద్దేవా..

గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఒక్క వార్డు నెంబర్ ని గెలిపించుకో లేకపోగా సర్పంచ్ అభ్యర్థిగామూడో స్థానానికి దిగజారిన వ్యక్తివి నువ్వా దమ్ము గురించి మాట్లాడటం.. ముందు నీకోసం ప్రజలు ఏవిధంగా చెబుతున్నారు.. ఎంతలా చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలని పాత కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యం నాయుడు), వైకాపా నాయకుడు పుట్టా సూర్య ప్రకాష్ (చిన్నస్వామి) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు వారంతా పాత కృష్ణదేవిపేటలో మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ స్థలం సమస్యను వివాదంగా మార్చి నిరాధారమైన ఆరోపణలు మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే గ్రామంలో 119, 120 సర్వే నెంబర్ గల భూమిని సర్వే చేయమని మండల తహసీల్దార్ కు దరఖాచేశామన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పార్టీలకతీతంగా కలసి పని చేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు విషయంలో అర్హులైన వారి పట్టాలను మామూళ్ళు ఇవ్వలేదని నెపంతో గిరిబాబు బృందం నిలిపివేస్తే,  అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పించిన ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా గుర్తుచేశారు. గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని పై బృందం చెప్పుచేతల్లో కొంతమంది గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో చేతివాటం ప్రదర్శించి డబ్బులు గుంజిన వ్యక్తులు మీరు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ ఉద్యోగం విషయంలో పేద కుటుంబానికి చెందిన ఒక వితంతు మహిళకు ఇవ్వాలని తాము కోరగా, ఆ ఉద్యోగాన్ని తన భార్యకు కావాలని నాయకుల వద్ద మోకరిల్లడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భజన చేస్తున్నవారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు అందలం ఎక్కిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించకపోవడం ఇదెక్కడి రాజకీయమని ప్రశ్నించారు.  ఈ విషయాలన్నీ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ నాయకులకు విన్నవించినా వారినే వెనుకేసుకు వస్తున్నారని చెప్పారు. మండల స్థాయి నాయకులు ఇదే విధమైన తీరును గ్రామంలో ప్రోత్సహిస్తూ పార్టీలో వర్గాలని ఏర్పాటు చేస్తున్నారని ఇలా అయితే రానున్న రోజుల్లో పార్టీ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదముందన్నారు . ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చుక్కల సత్తిబాబు, వార్డు మెంబర్లు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Krishnadevipeta

2022-01-25 03:49:13

ఆక్రమణల స్థలాన్ని ఖాళీచేయించే దమ్ముందా సర్పంచ్ కి..

గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యనారాయణకు గ్రామంలో ఆక్రమ ణలకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించే దమ్ముందా అని కృష్ణా దేవిపేట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు  పి.గిరిబాబు, దంతులూరి సూర్యనారాయణరాజు, ఎం.వరహాలబాబు, ఎం.నానాజీ, వి.నాగేశ్వరరావు, గాజ్జలపు అర్జునరావు,తోపాటు మరికొందరు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం వారంతా మీడియాతో మాట్లాడారు. కాలనిస్థలం కబ్జాకు గురవు తుంటే కళ్లుకనబడటం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతస్థలం కబ్జాలో వుందో తెలుసా అని ఎద్దేవా చేశారు. స్థలం ఆక్రమణలు తొలగించ లేక చేతకాని దద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చొనే నువ్వా మమ్మల్ని విమర్శించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలో మెయిన్ రోడ్డులో కాలువ కూడా తవ్వించలేని దుస్థితిలో ఉన్నవని విమర్శించారు. నువ్వుగెలిచి దాదాపు ఎడాది కావస్తున్నా..గ్రామంలో వేసిన కుళాయిల ద్వారా  సరిగా మంచినీరు ఇవ్వలేకపోతే సర్పంచ్ గా ఎందుకన్నారు. సర్పంచగా గెలిచి ఏమిచేయాలో తెలియక కుడితిలోపడ్డ ఎలుకలా గింజుకొంటున్నావని ఎద్దేవా చేశారు. అసలు గ్రామంలో సర్పంచ్ పందిరి సత్యనారాయణ దళితులకు చెందిన సంఘం భూమిని ఖబ్జా చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని,పశువుల షేడ్ వేసుకొని దర్జాగా అనుభవించటం లేదా ప్రశ్నించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. గ్రామంలో సర్పంచ్ సుమారు 8సెంట్ల గ్రామ కంఠం భూమి ఖాబ్జా చేసి ఇపుడు నీతులు వల్లించటం సిగ్గుచేటన్నారు.  దమ్మువుంటే  కబ్జాచేసిన భూమిని తిరిగి దళితులకు ఇవ్వగలవా అని సవాల్ విసిరారు. నిన్నగాక మొన్న వచ్చి ..ఏరోజూ పార్టీ అభివ్రుద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేయని నువ్వు..నేను సర్పంచ్ అయ్యాక ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలన్నారు. గ్రామంలో సంక్షేమ పదకాలు అందరికీ అందుతున్నాయా లేదా..అనే కనీస అవగాహన కూడా లేకపోవడం శోచనీయమన్నారు. నిజంగా సర్పంచ్ గా ఏడాది పూర్తిచేసుకున్న నువ్వు ఎన్నికల కేంపైన్ లో ఏమి హామిలిచ్చావో అవి గుర్తు చేసుకొని ముందు వాటిని అమలు చేయాలన్నారు. సర్పంచ్ గా నువ్వు అట్టర్ ఫ్లాప్ అవడంతోనే ఏమిచేయాలో తోచక.. మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే  నిరాధార ఆరోపణలు చేస్తున్నావుంటూ క్రిష్ణదేవిపేట వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. గ్రామంలో జరిగిన, జరుగుతున్న అభివ్రుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని..ప్రజలే తీర్పుచెబుతారన్నారు.

Krishnadevipeta

2022-01-24 14:29:34

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో పెద్దల స్మార్ట్ దోపిడీ..

విశాఖజిల్లా ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో స్మార్ట్ దోపిడీకి అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథక రచనలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఈ మేరకు విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పెద్దల బినామీలమంటూ అసైన్డ్, డీ పట్టా రైతులకు భయపెట్టి, మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం  రెవిన్యూ డివిజన్ అధికారి, విఎంఆర్డీఏ వైస్ చైర్మన్ లకు ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జగనన్న టౌన్ షిప్ లకు  భూ సమీకరణలో జనసేన  అభిప్రాయాలు, అభ్యంతరాలను ఆనందపురం తహసీల్దార్ కు తెలిపారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరిట మధ్యతరగతి వర్గాల గృహాలకు స్థలాలు మంజూరు చేసేందుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం, రామవరం, పాలవలస రెవిన్యూ గ్రామాలలో 363 ఎకరాల భూములను భూ సమీకరణ పథకం కింద తీసుకునేందుకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇందులో మూడు వందల ఎకరాలు ఎసైన్డ్ ,డీ పట్టా భూములు  కాగా మిగిలినవి జిరాయితీ అని,  విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ భూముల్లో లేఅవుట్లు చేసి విక్రయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో విశాఖ  పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా భూ సమీకరణ ప్రక్రియలో చేపట్టిన మధురవాడ  కొమ్మాది ఓజోన్ వాలీ, పెందుర్తి మండలంలోని  ముదపాక భూముల వ్యవహారాలు వందల కోట్ల అక్రమాలకు చిరునామాగా మారాయని గుర్తు చేశారు.  ఆరోపణల నేపథ్యంలో ఓజోన్  వ్యాలీ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిటీని  వేయగా, ముదపాక భూ సమీకరణను రద్దు చేసిందన్నారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి  ఆనందపురం మండలం లో మూడు వందల అరవై ఎకరాల సమీకరించడం కూడా మరో  కుంభకోణానికి అవకాశం కల్పించడమేనన్నారు. అధికార పార్టీ నేతలు కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ముందుగానే భూసమీకరణ సమాచారాన్ని తెలుసుకొని అసైన్డ్, డీ పట్టా రైతులకు మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నిజమైన రైతులకు వారికి దక్కకుండా చట్టవ్యతిరేకమైన అగ్రిమెంట్లు చేసుకున్నారన్నారు. దీనివల్ల తరతరాలుగా ఆ భూములను నమ్ముకొని సాగు చేస్తూ బ్రతుకుతున్న బడుగు బలహీన వర్గాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో భూ సమీకరణ పేరిట జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో  వార్తలు వచ్చిన సంబంధిత అధికారులు స్పందించినదాఖలాలు  కనిపించలేదన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలు , అక్రమాలకు నెలవైన విశాఖలో ఇది మరో కుంభకోణం గా మారనుందన్నారు. విశాఖ అక్రమాలపై ఇప్పటికేరెండు  ప్రత్యేక దర్యాప్తు బృందం లతో( సిట్ ) విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు వాటిని పక్కనపెట్టి భూ సమీకరణ పేరిట మరో  కుంభకోణాన్ని  ప్రోత్సహించడం అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనన్నారు. విశాఖ పట్టణ అభివృద్ధి సంస్థ పెద్ద సంఖ్యలో లే అవుట్ లు  వేసి  స్ధలాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలో ప్రభుత్వం భూ సమీకరణ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ  పట్టణాభివృద్ధి  సంస్థ చేతుల్లో ఉన్న వేల ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లు నిర్మించుకోకుండా ఆ భూముల వదిలేసి కొత్త గా సమీకరించడం అన్యాయమన్నారు.  ఆనందపురం మండలం లోని మూడు గ్రామాల్లో చేపట్టిన భూ సమీకరణ ను రద్దు చేసి పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూ సమీకరణ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి గత సంవత్సర కాలంలో చేతులు మారినా , ఒప్పందాలు జరిగిన భూ లావాదేవీలను గుర్తించి అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలన్నారు. అనివార్యమై భవిష్యత్తులో ఎప్పుడైనా భూ సమీకరణ చేయాల్సి వస్తే కచ్చితంగా భూములు కోల్పోయే రైతులకే ప్రతిఫలం అందే విధంగా ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని కోరారు. ఎస్సైన్డ్   భూములు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

2022-01-24 07:50:00

జనవరి 29 వరకూ బడిబయట పిల్లల గుర్తింపు కార్యక్రమం..

కరప మండలంలో బడి బయట పిల్లలును గుర్తించేందుకు  19 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్టు మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆమె కరపలోని విద్యావనరుల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమం ఈనెల 29 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దానికోసం ఎన్యూమరేటర్లు హేబీటేషన్స్ వారిగా వివరాల సేకరణ చేపడతారని వివరించారు. ఆ వివరాలను మన బడికిపోదాయం యాప్ లో నమోదు చేయాల్సి వుంటుందన్నారు. అలా మండలంలో ఎంత మంది బయడి బయట పిల్లలు వున్నారనే సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఏవిధంగా చేపట్టాలనే విషయమై ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్టు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి మీడియాకి తెలియజేశారు.

karapa

2022-01-19 16:36:53

బడిఈడు పిల్లల నమోదు పక్కాగా నిర్వహించాలి..

కరప మండలంలోని బడిఈడు పిల్లలను గుర్తించి మన బడికి పోదాం యాప్ లో పక్కాగా నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారణి క్రిష్ణవేణి స్కూలు హెచ్ఎంలకు సూచించారు. మంగళవారం కరప విద్యావనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఉపాద్యాయులకు ఆమె దిశా నిర్ధేశం చేశారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో బడిఈడు పిల్లలను బడిలోకి చేర్పించే కార్యాక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే పాఠశాలల ఉపాధ్యాయులు శ్రమించాల్సి వుంటుందన్నారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను చక్కగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో యాప్ లో వివరాలు నమోదు జరిగే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా తక్షణమే తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని పాఠశాలల హెచ్ఎంలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Karapa

2022-01-18 16:26:44

దిశయాప్ వినియోగంపై విద్యార్ధులకు మరింత అవగాహన..

దిశయాప్ వినియోగం డౌన్లోడ్ పై పాఠశాల, కళాశాల స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తున్నట్టు శంఖవరం మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష తెలియజేశారు. మంగళవారం శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు అన్ని సమయాల్లో రక్షణగా దిశయాప్ నిలుస్తుందన్నారు. దిశయాప్ వినియోగం వలన మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే దిశయాప్ ని వినియోగించి పోలీసుల సహాయం కూడా పొందవచ్చునన్నారు. ఈ యాప్ వలన ఒక్క మహిళలే కాకుండా పురుషులు కూడా ఎదుట వారికి సహాయం చేయడానికి వీలుపడుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అత్యవసర సమయంలో రక్షణగా నిలవడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన దిశయాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని మీడియా ద్వారా ప్రజలకు మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు.

Sankhavaram

2022-01-18 07:16:34

2022-01-16 10:53:36

23.5వేల మందికి కోవిడ్ బూస్టర్ డోసు టీకా ..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 23వేల 534 మందికి బూస్టర్ కోవిడ్ టీకా వేసినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.భరతలక్ష్మి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బూస్టర్ డోసు వేస్తున్నామన్నారు. కోవిడ్ కేసులు రోజు రోజు కి పెరుగుతున్నందున జిల్లా వాసులు వైరస్ భారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. భౌతిక ధూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలన్నరు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలు పాటిస్తూ, కోవిడ్ టీకా వేయించుకునేందుకు స్వచ్ఛందంగా రావాలని సూచించారు. జిల్లాలో పీహెచ్సీలు, అర్భన్ పీహెచ్సీ, సిహెచ్సీలు ఇలా సుమారు 198 చోట్ల కోవిడ్ వేక్సిన్ అందుబాటులో ఉంచినిట్టు ఆమె మీడియాకి వివరించారు.



Kakinada

2022-01-16 09:33:09

క్రీడలు, ముగ్గుల పోటీలతోనే సంక్రాంతి పండుగకు అసలైన కళ..

నిజమైన సంక్రాంతి పండుగ అంటే సరదా సరదా క్రీడలు, గ్రామాలకు అందాన్ని ఇచ్చే ముగ్గుల పోటీలేనని కరప తహశీల్దార్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కరప మండలంలో కోడి పందాలు వద్దు సాంప్రదాయ సంక్రాంతి ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా వేములవాడ జిల్లా పరిషత్ హైస్కూలు కరప ఎస్ఐ డి.రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఎంపీడీఓ కె.స్వప్నతోపాటు పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్నారు. పండు సమయాల్లో యువత క్రీడల్లో పాల్గొని వారు గెలుపొందిన బహుమతులను మంచి తీపి గుర్తులుగా దాచుకోలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు అన్నిశాఖల సిబ్బందితోపాటు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Karapa

2022-01-06 17:57:37