1 ENS Live Breaking News

ఆక్రమణల స్థలాన్ని ఖాళీచేయించే దమ్ముందా సర్పంచ్ కి..

గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యనారాయణకు గ్రామంలో ఆక్రమ ణలకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించే దమ్ముందా అని కృష్ణా దేవిపేట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు  పి.గిరిబాబు, దంతులూరి సూర్యనారాయణరాజు, ఎం.వరహాలబాబు, ఎం.నానాజీ, వి.నాగేశ్వరరావు, గాజ్జలపు అర్జునరావు,తోపాటు మరికొందరు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం వారంతా మీడియాతో మాట్లాడారు. కాలనిస్థలం కబ్జాకు గురవు తుంటే కళ్లుకనబడటం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతస్థలం కబ్జాలో వుందో తెలుసా అని ఎద్దేవా చేశారు. స్థలం ఆక్రమణలు తొలగించ లేక చేతకాని దద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చొనే నువ్వా మమ్మల్ని విమర్శించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలో మెయిన్ రోడ్డులో కాలువ కూడా తవ్వించలేని దుస్థితిలో ఉన్నవని విమర్శించారు. నువ్వుగెలిచి దాదాపు ఎడాది కావస్తున్నా..గ్రామంలో వేసిన కుళాయిల ద్వారా  సరిగా మంచినీరు ఇవ్వలేకపోతే సర్పంచ్ గా ఎందుకన్నారు. సర్పంచగా గెలిచి ఏమిచేయాలో తెలియక కుడితిలోపడ్డ ఎలుకలా గింజుకొంటున్నావని ఎద్దేవా చేశారు. అసలు గ్రామంలో సర్పంచ్ పందిరి సత్యనారాయణ దళితులకు చెందిన సంఘం భూమిని ఖబ్జా చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని,పశువుల షేడ్ వేసుకొని దర్జాగా అనుభవించటం లేదా ప్రశ్నించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. గ్రామంలో సర్పంచ్ సుమారు 8సెంట్ల గ్రామ కంఠం భూమి ఖాబ్జా చేసి ఇపుడు నీతులు వల్లించటం సిగ్గుచేటన్నారు.  దమ్మువుంటే  కబ్జాచేసిన భూమిని తిరిగి దళితులకు ఇవ్వగలవా అని సవాల్ విసిరారు. నిన్నగాక మొన్న వచ్చి ..ఏరోజూ పార్టీ అభివ్రుద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేయని నువ్వు..నేను సర్పంచ్ అయ్యాక ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలన్నారు. గ్రామంలో సంక్షేమ పదకాలు అందరికీ అందుతున్నాయా లేదా..అనే కనీస అవగాహన కూడా లేకపోవడం శోచనీయమన్నారు. నిజంగా సర్పంచ్ గా ఏడాది పూర్తిచేసుకున్న నువ్వు ఎన్నికల కేంపైన్ లో ఏమి హామిలిచ్చావో అవి గుర్తు చేసుకొని ముందు వాటిని అమలు చేయాలన్నారు. సర్పంచ్ గా నువ్వు అట్టర్ ఫ్లాప్ అవడంతోనే ఏమిచేయాలో తోచక.. మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే  నిరాధార ఆరోపణలు చేస్తున్నావుంటూ క్రిష్ణదేవిపేట వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. గ్రామంలో జరిగిన, జరుగుతున్న అభివ్రుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని..ప్రజలే తీర్పుచెబుతారన్నారు.

Krishnadevipeta

2022-01-24 14:29:34

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో పెద్దల స్మార్ట్ దోపిడీ..

విశాఖజిల్లా ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో స్మార్ట్ దోపిడీకి అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పథక రచనలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఈ మేరకు విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పెద్దల బినామీలమంటూ అసైన్డ్, డీ పట్టా రైతులకు భయపెట్టి, మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆనందపురం మండలం లో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం  రెవిన్యూ డివిజన్ అధికారి, విఎంఆర్డీఏ వైస్ చైర్మన్ లకు ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జగనన్న టౌన్ షిప్ లకు  భూ సమీకరణలో జనసేన  అభిప్రాయాలు, అభ్యంతరాలను ఆనందపురం తహసీల్దార్ కు తెలిపారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరిట మధ్యతరగతి వర్గాల గృహాలకు స్థలాలు మంజూరు చేసేందుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం, రామవరం, పాలవలస రెవిన్యూ గ్రామాలలో 363 ఎకరాల భూములను భూ సమీకరణ పథకం కింద తీసుకునేందుకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇందులో మూడు వందల ఎకరాలు ఎసైన్డ్ ,డీ పట్టా భూములు  కాగా మిగిలినవి జిరాయితీ అని,  విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ భూముల్లో లేఅవుట్లు చేసి విక్రయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గతంలో విశాఖ  పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా భూ సమీకరణ ప్రక్రియలో చేపట్టిన మధురవాడ  కొమ్మాది ఓజోన్ వాలీ, పెందుర్తి మండలంలోని  ముదపాక భూముల వ్యవహారాలు వందల కోట్ల అక్రమాలకు చిరునామాగా మారాయని గుర్తు చేశారు.  ఆరోపణల నేపథ్యంలో ఓజోన్  వ్యాలీ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిటీని  వేయగా, ముదపాక భూ సమీకరణను రద్దు చేసిందన్నారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి  ఆనందపురం మండలం లో మూడు వందల అరవై ఎకరాల సమీకరించడం కూడా మరో  కుంభకోణానికి అవకాశం కల్పించడమేనన్నారు. అధికార పార్టీ నేతలు కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ముందుగానే భూసమీకరణ సమాచారాన్ని తెలుసుకొని అసైన్డ్, డీ పట్టా రైతులకు మభ్యపెట్టి  మోసపూరితమైన లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నిజమైన రైతులకు వారికి దక్కకుండా చట్టవ్యతిరేకమైన అగ్రిమెంట్లు చేసుకున్నారన్నారు. దీనివల్ల తరతరాలుగా ఆ భూములను నమ్ముకొని సాగు చేస్తూ బ్రతుకుతున్న బడుగు బలహీన వర్గాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో భూ సమీకరణ పేరిట జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో  వార్తలు వచ్చిన సంబంధిత అధికారులు స్పందించినదాఖలాలు  కనిపించలేదన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలు , అక్రమాలకు నెలవైన విశాఖలో ఇది మరో కుంభకోణం గా మారనుందన్నారు. విశాఖ అక్రమాలపై ఇప్పటికేరెండు  ప్రత్యేక దర్యాప్తు బృందం లతో( సిట్ ) విచారణ జరిపించి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు వాటిని పక్కనపెట్టి భూ సమీకరణ పేరిట మరో  కుంభకోణాన్ని  ప్రోత్సహించడం అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనన్నారు. విశాఖ పట్టణ అభివృద్ధి సంస్థ పెద్ద సంఖ్యలో లే అవుట్ లు  వేసి  స్ధలాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలో ప్రభుత్వం భూ సమీకరణ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ  పట్టణాభివృద్ధి  సంస్థ చేతుల్లో ఉన్న వేల ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లు నిర్మించుకోకుండా ఆ భూముల వదిలేసి కొత్త గా సమీకరించడం అన్యాయమన్నారు.  ఆనందపురం మండలం లోని మూడు గ్రామాల్లో చేపట్టిన భూ సమీకరణ ను రద్దు చేసి పేద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూ సమీకరణ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి గత సంవత్సర కాలంలో చేతులు మారినా , ఒప్పందాలు జరిగిన భూ లావాదేవీలను గుర్తించి అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలన్నారు. అనివార్యమై భవిష్యత్తులో ఎప్పుడైనా భూ సమీకరణ చేయాల్సి వస్తే కచ్చితంగా భూములు కోల్పోయే రైతులకే ప్రతిఫలం అందే విధంగా ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని కోరారు. ఎస్సైన్డ్   భూములు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

2022-01-24 07:50:00

జనవరి 29 వరకూ బడిబయట పిల్లల గుర్తింపు కార్యక్రమం..

కరప మండలంలో బడి బయట పిల్లలును గుర్తించేందుకు  19 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్టు మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆమె కరపలోని విద్యావనరుల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమం ఈనెల 29 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దానికోసం ఎన్యూమరేటర్లు హేబీటేషన్స్ వారిగా వివరాల సేకరణ చేపడతారని వివరించారు. ఆ వివరాలను మన బడికిపోదాయం యాప్ లో నమోదు చేయాల్సి వుంటుందన్నారు. అలా మండలంలో ఎంత మంది బయడి బయట పిల్లలు వున్నారనే సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఏవిధంగా చేపట్టాలనే విషయమై ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్టు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి క్రిష్ణవేణి మీడియాకి తెలియజేశారు.

karapa

2022-01-19 16:36:53

బడిఈడు పిల్లల నమోదు పక్కాగా నిర్వహించాలి..

కరప మండలంలోని బడిఈడు పిల్లలను గుర్తించి మన బడికి పోదాం యాప్ లో పక్కాగా నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారణి క్రిష్ణవేణి స్కూలు హెచ్ఎంలకు సూచించారు. మంగళవారం కరప విద్యావనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఉపాద్యాయులకు ఆమె దిశా నిర్ధేశం చేశారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో బడిఈడు పిల్లలను బడిలోకి చేర్పించే కార్యాక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే పాఠశాలల ఉపాధ్యాయులు శ్రమించాల్సి వుంటుందన్నారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను చక్కగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో యాప్ లో వివరాలు నమోదు జరిగే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా తక్షణమే తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని పాఠశాలల హెచ్ఎంలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Karapa

2022-01-18 16:26:44

దిశయాప్ వినియోగంపై విద్యార్ధులకు మరింత అవగాహన..

దిశయాప్ వినియోగం డౌన్లోడ్ పై పాఠశాల, కళాశాల స్థాయిలో మరింత అవగాహన కల్పిస్తున్నట్టు శంఖవరం మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష తెలియజేశారు. మంగళవారం శంఖవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు అన్ని సమయాల్లో రక్షణగా దిశయాప్ నిలుస్తుందన్నారు. దిశయాప్ వినియోగం వలన మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే దిశయాప్ ని వినియోగించి పోలీసుల సహాయం కూడా పొందవచ్చునన్నారు. ఈ యాప్ వలన ఒక్క మహిళలే కాకుండా పురుషులు కూడా ఎదుట వారికి సహాయం చేయడానికి వీలుపడుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అత్యవసర సమయంలో రక్షణగా నిలవడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన దిశయాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని మీడియా ద్వారా ప్రజలకు మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు.

Sankhavaram

2022-01-18 07:16:34

2022-01-16 10:53:36

23.5వేల మందికి కోవిడ్ బూస్టర్ డోసు టీకా ..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 23వేల 534 మందికి బూస్టర్ కోవిడ్ టీకా వేసినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.భరతలక్ష్మి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బూస్టర్ డోసు వేస్తున్నామన్నారు. కోవిడ్ కేసులు రోజు రోజు కి పెరుగుతున్నందున జిల్లా వాసులు వైరస్ భారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. భౌతిక ధూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలన్నరు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలు పాటిస్తూ, కోవిడ్ టీకా వేయించుకునేందుకు స్వచ్ఛందంగా రావాలని సూచించారు. జిల్లాలో పీహెచ్సీలు, అర్భన్ పీహెచ్సీ, సిహెచ్సీలు ఇలా సుమారు 198 చోట్ల కోవిడ్ వేక్సిన్ అందుబాటులో ఉంచినిట్టు ఆమె మీడియాకి వివరించారు.



Kakinada

2022-01-16 09:33:09

క్రీడలు, ముగ్గుల పోటీలతోనే సంక్రాంతి పండుగకు అసలైన కళ..

నిజమైన సంక్రాంతి పండుగ అంటే సరదా సరదా క్రీడలు, గ్రామాలకు అందాన్ని ఇచ్చే ముగ్గుల పోటీలేనని కరప తహశీల్దార్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కరప మండలంలో కోడి పందాలు వద్దు సాంప్రదాయ సంక్రాంతి ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా వేములవాడ జిల్లా పరిషత్ హైస్కూలు కరప ఎస్ఐ డి.రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఎంపీడీఓ కె.స్వప్నతోపాటు పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్నారు. పండు సమయాల్లో యువత క్రీడల్లో పాల్గొని వారు గెలుపొందిన బహుమతులను మంచి తీపి గుర్తులుగా దాచుకోలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు అన్నిశాఖల సిబ్బందితోపాటు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Karapa

2022-01-06 17:57:37

గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలకు పెద్దపీటవేయాలి..

గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలకు పెద్దపీటవేసి పండుగలు ఆనందంగా జరుపుకోవాలి తప్పితే జూద క్రీడలు ఆడి ఆర్ధికంగా నష్టపోకూడదని కరప ఎంపీడీఓ కె.స్వప్న సూచించారు. గురువారం కరప మండలంలోని గురజనాపల్లి గ్రామంలో కరప స్టేషన్ ఎస్ఐ డి.రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీలో తహశీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా, సంతోషంగా చేసుకోవాలనే లక్ష్యంతో జూదాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాంటి మంచి కార్యక్రమంలో స్థానికులు, అధికారులతో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. జూద సంక్రాంతి కాకుండా సరదాల సంక్రాంతికే ప్రజలు మొగ్గు చూపాలని ఎంపీడీఓ ఈ సందర్భంగా పిలుపుచినిచ్చారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ అధికారి శివప్రసాద్, ఎంఆర్ఐ పూర్ణచంద్రరావు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

Karapa

2022-01-06 17:56:40

రేపు సూర్యాపేటలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలపై అవగాహనా ర్యాలీ..

కాకినాడ రూరల్ పరధిలోని తిమ్మాపురం పోలీస్ ఆధ్వర్యంలో రేపు సూర్యాపేటలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలపై అవగాహన ర్యాలీ చేపడుతున్నట్టు ఎస్ఐ రామక్రిష్ణ తెలియజేశారు. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయం నుంచి లైట్ హౌస్ సెంటర్ వరకూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు.  ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఐ రామక్రిష్ణ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Timmapuram

2022-01-06 14:53:01