1 ENS Live Breaking News

గొప్ప జ్ఞాని గురు గోవింద్ సింగ్..

గురు గోవింద్ సింగ్ కవి, గొప్ప జ్ఞాని అని ఆధ్యాత్మికవేత్త కె వి శాస్త్రి పేర్కొన్నారు.  మంగళవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గురు గోవింద్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  శాస్త్రి మాట్లాడుతూ సిక్కులకు ఆయన పదవ గురువు  అన్నారు. గురుగోవింద్ సింగ్ పాట్నాలో 1666  జనవరి 5న జన్మించారని అన్నారు. ఆయన మత స్వేచ్ఛ కోసం మొఘల్ పాలకుల కు వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేసిన గొప్ప ధైర్యశాలి అని అన్నారు. ఆయన  ఆధ్యాత్మిక వేత్త మరియు తత్వవేత్త ని కొనియాడారు. దేశవ్యాప్తంగా గురు గోవింద్ సింగ్ జయంతి ని ఘనంగా నిర్వహిస్తారని శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-01-05 14:50:01

అడబాల కు అంతర్జాతీయ వాకర్స్ సంఘ అవార్డు..

సొంత నిధులతో నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్న అడబాల రత్న ప్రసాద్ అభినందనీయులని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. కాకినాడలోని ఎంపీ కార్యాలయంలో అంతర్జాతీయ  వాకర్స్  సంఘం అడబాల కు ప్రకటించిన అవార్డును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడబాల ఏడాదిలో 365 రోజులు ఏదోవిధంగా పేదలకు సహాయం అందిస్తున్నారని అభినందించారు. ఆయన స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వచ్చి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో పి.వి  రాఘవరావు, రాజా, రవిశంకర్ పట్నాయక్  ,రేలంగి బాపిరాజు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-01-05 14:48:57

కరపలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పర్యటన..

తూర్పుగోదావరిజిల్లాలోని కరప మండలంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పర్యటించనున్నారని మండల వ్యవసాయాధికారిణి ఏ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈమేరకు బుధవారం ఆమె స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పూనం మాలకొండయ్య తన పర్యటనలో బాగంగా కరప మండలంలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించడంతోపాటు రైతులతోనూ సమావేశం అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలం కేంద్రంలోని వ్యవసాయ సిబ్బంది మరియు రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పర్యటనకు సమాయత్తం చేసినట్టు మండల వ్యవసాయాధికారిణి ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.

Karapa

2022-01-05 14:48:02

కరాటే తో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది..

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కరాటేలో శిక్షణ  పొందడం వలన ఆత్మ విశ్వాసం   ఇనుమడిస్తుంది అని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై డి రామారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ బోట్ క్లబ్ ఉద్యానవనంలో   గోజూరియా కరాటే శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల వారణాసిలో 6వ ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్   కరాటే పోటీలలో విజేతలైన బాలబాలికలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను   రామారావు  బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  నేటి బాలబాలికలకు శారీరక వ్యాయామం లోపించిందన్నారు. ఇటువంటి కరాటే శిక్షణ వలన శారీరక వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. కరాటే శిక్షకులు ఎల్ సూర్య మాట్లాడుతూ వారణాసిలో  జరిగిన కరాటే పోటీలో   ఎనిమిది స్వర్ణ, ఆరు రజిత, ఒక కాంస్య పతకాలను బాల బాలికలు సాధించారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ వాకర్స్  సంఘ  అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, ఏం సుబ్బారావు ఎన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-01-05 14:46:45

జనవరి 4న అదనపు మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక..

కరప మండలంలో జనవరి 4వ తేదిన మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నామన్నారు. అరోజు జరిగే ఎన్నికకు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులంతా హాజరు కావాల్సి వుంటుందన్నారు. ఒక వేళ ఆరోజు ఎన్నిక ఏ కారణం చేతనైనా నిలిచిపోతే మరుసటి రోజునైనా ఎన్నిక నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పూర్తిస్థాయిలో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాకి వివరించారు.

Karapa

2021-12-30 14:35:42

దివ్య జ్యోతి స్వరూపం భగవాన్ రమణ మహర్షి..

మౌన సందేశం ద్వారా ఆత్మజ్ఞానాన్ని, చిత్త శాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్య జ్యోతి స్వరూపులు భగవాన్ రమణ మహర్షి అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో రమణ మహర్షి జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ,  1879 డిసెంబర్ 30న తమిళనాడు తిరుచ్చిలో రమణ మహర్షి జన్మించారన్నారు. నీ గురించి నీవు తెలుసుకోవడమే జ్ఞానమని చెప్పిన భగవాన్ రమణ మహర్షిని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా ప్రస్తుతస్తుందని పట్నాయక్ తెలిపారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada రూరల్

2021-12-30 14:32:57

కరప మండలంలో 16 మంది వీధి బాలల గుర్తింపు..

కరప మండలంలో ఇప్పటి వరకూ 16 మంది వీధి బాలలను గుర్తించినట్టు కరప ఎంఈఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ఒక్క పెనుగుదురు గ్రామంలో అత్యధికంగా ఈ పదిమంది, చిన కొత్తూరు బట్టీలో ముగ్గురు, ఆర్ కేఆర్ నగర్ లో ముగ్గుని గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.  వీరిలో పెనుగుదురు లో గుర్తించిన పది మంది గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన వారిగా వివరాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మిగిలిన ముగ్గురు బాలలకు ఆధార్ కార్డులు కూడా లేవని ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తించిన బాలల సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేసినట్టు ఆ ప్రకటనలో మండల విద్యాశాఖ కార్యాలయం పేర్కొంది.

Karapa

2021-12-30 14:31:57

కరప మండలంలో పారదర్శకంగా వీధిబాలల సర్వే..

కరప మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో వీధిబాలల సర్వే చేపడుతన్నట్టు మండల విద్యాశాఖ అధికారిణి కె.క్రిష్ణవేణి తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కరపలోని ఆమె తన కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బాలలు ఎవరూ పనిలోకి కాకుండా బడిలోకే వెళ్లాలనే నినాదంలో వీధి బాలల సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఎవరూ బాలలను పనిలోకి పంపకూడదని ఈ సందర్భంగా ఎంఈఓ సూచించారు. బాలలను బడికి పండం ద్వారా అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. ప్రస్తుతం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని సీఆర్టీలు ఈ వీధిబాలల సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహస్తున్నట్టు ఎంఈఓ తెలియజేశారు.

Karapa

2021-12-27 17:10:29

కాకినాడ రూరల్ లో 11వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ..

కాకినాడ రూరల్ మండలంలో ఇప్పటి వరకూ 11 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిపినట్టు మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలోని13 ఆర్బీకేల పరిధిలోని 199 మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ ఈ ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన వివిరంచారు. ఇంకా నూర్పులు, కొన్ని చోట్ల కోతలు జరగాల్సి వుందని వుందని, అవి పూర్తయితే మిగిలిన ధాన్యం మండలానికి అధికారులు ఇచ్చిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టడానికి వీలుపడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యం రంగు, తేమ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా తనిఖీలు చేసి, ఈ-క్రాప్ బుకింగ్ అయిన రైతుల నుంచి ప్రాధాన్యత క్రమంలో ధాన్యం కొనుగోలుచేస్తున్నట్టు వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.

Kakinada రూరల్

2021-12-22 13:20:37

మితాహారం తోనే మనందరికీ మంచి ఆరోగ్యం..

మన  దైనందిన కార్యక్రమాలకు ప్రతి వ్యక్తికి శక్తి అవసరమని ,అవి ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయని అయితే వాటిని మితంగా తీసుకోవాలని ప్రకృతి వైద్యులు డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ  సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన ప్రాంతంలో అధికంగా అన్నం తినడం వలన మధుమేహం రావడానికి ఒక కారణం అన్నారు. మధుమేహ నియంత్రణకు ఆహార నియమాలు అవసరమన్నారు. తృణధాన్యాలలో ప్రోటీన్, పీచు పదార్థం అధికంగా ఉంటాయన్నారు. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలని అన్నారు. దీనివలన శరీరంలోని మలినాలు విసర్జింపబడతాయి అని అన్నారు. సంపూర్ణ జీవనానికి సమగ్రమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ వేదుల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-22 13:18:09

ఓటిఎస్ తో ఇంటి భూమిని సొంతమవుతుంది..

వన్ టైమ్ సెటిల్ మెంట్ తో నిరుపేదల పేరుతోనే ఇంటి భూమిని సొంతం చేసే విధంగా ఒటిఎస్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం కరప మండల కేంద్రంలోని శ్రీ కొణిదెల చిరంజీవి కల్యాణ మండపం జరిగిన సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గృహ హక్కు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓటిఎస్ ద్వారా ఇంటిపై వున్న హౌసింగ్ రుణబాధలు తొలగిపోవడంతో పాటు భూమి రిజిస్ట్రేష్ అయి సొంతం అవుతుందన్నారు. అధికారులు ఈ విషయాన్ని లబ్దిదారులకు తెలియజేసి శతశాతం ఓటిఎస్ పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ కె.స్వప్న, నియోజవర్గస్థాయి వైఎస్సార్సీపీ నాయకులు, అధిక సంఖ్యలో లబ్దిదారులు పాల్గొన్నారు. 

Karapa

2021-12-22 13:17:11