1 ENS Live Breaking News

సేవా టిక్కెట్ల పెంపుదల నిర్ణయాన్ని ఉపహరించుకోవాలి.. పాలూరి

శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తూ ఆర్జిత సేవల ఛార్జీల పెంపు- సామాన్య, పేద హింధువులను శ్రీవారికి దూరం చేయడమేనని పాలూరి సత్యానందం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. శనివారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రభుత్వనికి సినిమా టిక్కెట్లు మీధ ఉన్న ప్రేమ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల  చార్జీలు మీద లేదు ఎందుకని, రాష్ట్ర ప్రభుత్వం హింధువులను వారి దేవుడులకు దూరంచేసే విధంగా తీసుకున్న నిర్ణయంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల చార్జీలను భారీగా పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి సభ్యుల ప్రవర్తన నిర్ణయాలు భక్తులను స్వామికి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.  గతంలో శ్రీవారి ఆర్జిత సేవల్లో సుప్రభాతం రూ.120లు తోమాల, అర్చన సేవలకు రూ.220లు, నిజపాద దర్శనం రూ.250లు, కల్యాణోత్సవం రూ.1000లు వేద ఆశీర్వచనం రూ.3000లుగా ఉండేవని, నేడు ఆ ఛార్జీలను టిటిడి పాలకమండలి సుప్రభాతం రూ.2000లు తోమాల,అర్చన రూ.5000లు వేద ఆశీర్వచనం రూ.10000లు కళ్యాణోత్సవం రూ.2500లకు పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. సామాన్య ప్రజలు సేవలు ఎలా పొందగలరని  ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి పాలకమండలి సభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య పేధ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారి సేవల్లో పాల్గొనడం హిందువులు అదృష్టంగా భావిస్తారని, అలాంటి సేవలకు ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు దూరం చేయవద్దని, దీనిపై ప్రభుత్వం, టిటిడి పాలకమండలి సభ్యులు పునరాలోచన చేసి,  పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలను నిర్ణయించాలని పాలూరి కోరారు.

Prathipadu

2022-02-26 11:16:39

విద్యార్ధులు సైబర్ నేరాలపట్ల అవగాహన పెంచుకోవాలి.. మహిళా పోలీస్ శిరీష..

విద్యార్ధులు పాఠశాల దశ నుంచే సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష చైతన్యం కల్పించారు. ఈ మేరకు శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూలులో  జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు అవగాహన కలిగించారు.  ఈ సందర్భంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష  మాట్లాడుతూ, ఫోన్ లో మాట్లాడేటపుడు, సోషల్ మీడియాలోనూ  తెలియని  వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫోన్ చేసి ఇంటి అడ్రసు, బ్యాంకు పాస్ బుక్ నెంబరు చెప్పమన్నప్పుడు అలాంటివి మీకెందుకు చెప్పాలంటూ దైర్యంగా తిరస్కరించాలన్నారు. ఎవరైనా ఫోన్ లోనే వివరాలు చెప్పాలని బెదిరిస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ఫోన్ కాల్ వచ్చిన మీ నెంబరుపై ఫిర్యాదు చేస్తామని దైర్యంగా చెప్పాలన్నారు. అలాంటి వారు సైబర్ నేరగాళ్లు అనే విషయాన్ని విద్యార్ధులు గుర్తించుకోవాలన్నారు. సెల్ ఫోన్ లో ఎవరికీ మన వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచించారు. అంతేకాకుండా విద్యార్ధులు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటుకి దూరంగా ఉండాలన్నారు. అనంతరం రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై  చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీషతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పార్ధసారధి, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-02-25 11:34:28

మత్తుపదార్ధాలతో జీవితాలు చిత్తుగా మారిపోతాయి..

పాఠశాల విద్యార్ధులు మత్తుపదార్ధాల సేవనం, అనర్ధాల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఆస్కారం వుంటుందని వేలంగి గ్రామసచివాలయ మహిళా పోలీస్ జర్తా నాగమణి సూచించారు. శంఖవరం మండలం వేలంగి ఎంపీపీ స్కూలులో విద్యార్ధులకు శుక్రవారం మత్తుపదార్ధా వినియోగం, నష్టాలు అనే అంశంపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి  మాట్లాడుతూ, మత్తు పదార్ధాలు సేవించడం ద్వారా జీవితాలు చిత్తుగా మారిపోతాయన్నారు. విద్యార్ధులు వాటికోసం తెలుసుకోవడం ద్వారా వాటికి దూరంగా ఉండవచ్చునన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ తదితర ఐదు అంశాలపై కూడా విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గుండునూకరాజు, సర్పంచ్ మేకల సత్యన్నారాయణ, పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.

Velangi

2022-02-25 11:32:21

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు చైతన్యం పెంచుకోవాలి..

తెలియని వ్యక్తులు మాట్లాడే సమయంలో చనువు తీసుకొని నిర్జన ప్రదేశాల్లో తాక కుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష విద్యార్ధినిలకు సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని కస్తూరీబాగాంధీ స్కూలులో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ శిరీష మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని.. అది ఏవిధంగా ఉంటుందో ఇద్దరు విద్యార్ధినిలతో చేతులతో తాకి చూపించి విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  ఈకార్యక్రమంలో నెలిపూడి సచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి, స్కూలు ప్రిన్సిపాల్ రత్నం, ఉపాధ్యాయులు లలిత,  అధిక సంఖ్యలో విద్యార్ధినిలు పాల్గొన్నారు.

Sankhavaram

2022-02-24 11:43:18

విద్యార్ధులు సైబర్ క్రైమ్ పై చైతన్యం పెంచుకోవాలి..

విద్యార్ధులు పాఠశాల దశ నుంచే సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి చైతన్యం కల్పించారు. ఈ మేరకు శంఖవరం మండలంలోని కొంతంగి ఎంపీపీ స్కూలులో విద్యార్ధులకు  జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు చైతన్యం కలిగించారు.  ఈ సందర్భంగా మహిళా పోలీసులు పిఎస్ఎస్.కళాంజలి మాట్లాడుతూ,ఎవరైనా తెలియని ఫోన్ చేసి ఇంటి అడ్రసు, బ్యాంకు పాస్ బుక్ నెంబరు చెప్పమన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి వారు సైబర్ నేరగాళ్లని గుర్తించుకోవాలన్నారు. సెల్ ఫోన్ లో ఎవరికీ మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఏటిఎం నెంబరు, బ్యాంకు పాస్ బుక్ నెంబర్లు కూడా ఇవ్వకూడదని సూచించారు. అంతేకాకుండా విద్యార్ధులు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాట నుంచి బయటపడాలన్నారు. అనంతరం రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్వి సత్యన్నారాయణ, వైపీ శ్యామ్ కుమార్, సిహెచ్వీమధుబాబు, ఏ.సత్యన్నారాయణ, సర్పంచ్ శివ, గ్రామవలంటీర్లు తదితరలు పాల్గొన్నారు.

Nellipudi Village

2022-02-24 10:51:05

వార్డు అభివ్రుద్ధికే పెద్దపీట..పీతల మూర్తి

మహివిశాఖ నగరపాలక సంస్థలోని తమవార్డు సమస్యలు పరిష్కారం తో పాటు, అభివృద్ధి పథంలో నడిపించడమే  ధ్యేయంగా పని చేస్తానని జీవీఎంసీ 22వ వార్డు పీతల మూర్తి యాదవ్ చెప్పారు. వార్డులోని న్యూరేసపువానిపాలెంలో గురువారం రూ.16.45 లక్షలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ న్యూ రేసపువానిపాలెం, సిద్దార్ధ నగర్ రోడ్ లో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ఈ పనులు ప్రారంభించమన్నారు. ఇక్కడ భూగర్భ డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అండర్ డ్రైనేజి పనులు చేపట్టామన్నారు. అలాగే వార్డులో ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించామన్నారు. రోడ్డు మరమ్మతులు, నూతన విద్యుత్ పోల్స్ , విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వార్డులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ వర్క్స్ ఏఈ జాన్సన్ విల్సన్, జీవీఎంసీ అధికారులు రామకృష్ణ, ప్రసాద్, మాధవ్, జగన్, సతీష్, బంగార్రాజు, సూరిబాబు, జనసేన నాయకులు ధనలక్ష్మి, శేఖర్, శ్రీను, గుణ, లక్ష్మీ, దుర్గారావు, పెసల శ్రీను, రవి పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-24 06:31:47

చేతన ద్వారా వినూత్న రీతిలో విద్యార్ధులకు 5 అంశాలపై అవగాహన..

పాఠశాల విద్యార్ధులు ప్రాధాన్యత కలిగిన రహదారి భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాల సేవనం అనర్ధాలు, సైబర్ క్రైం, ట్రాఫిక్ నిబంధనలు అనే అంశాలపై పాఠశాల స్థాయినుంచే పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలి పేర్కొన్నారు. శంఖవరం మండలంలోని నలుగురు మహిళా పోలీసులు వినూత్నంగా వ్యవహరించి బుధవారం టి.అగ్రహారం ఎంపీపీ స్కూలులో జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా విద్యార్ధులకు చైతన్యం కలిగించారు. మహిళా పోలీసులు పిఎస్ఎస్.కళాంజలి, జిఎన్ఎస్ శిరీష, గంగ గౌతమి, నాగమణిలు విద్యార్ధులు ఐదు అంశాలపై విద్యార్ధులతోనే స్కిట్లు వేయించి మరీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నత లక్ష్యంతో విద్యార్ధులకు పాఠశాల స్థాయి నుంచే చైతన్యం కల్పించడానికి చేతన కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.  పాఠశాలశాల స్థాయి విద్యార్ధులు ఈ విషయాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడం ద్వారా ప్రాధమిక విద్య పూర్తి అయ్యేలోపు అన్నీ అవగతం అవుతాయని సూచించారు. చెప్పిన విషయాలన్నీ విద్యార్ధులు నిత్యం గుర్తు పెట్టుకుంటూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ చైతన్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లిపూడి సర్పంచ్ నరాల శ్రీనివాస్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం ఆశాజ్యోతి, పివీఆర్ మూర్తి, సత్యన్నారాయణ, సచివాలయ గ్రామ వాలంటీర్లు అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

Nellipudi Village

2022-02-23 17:40:52

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన కలిగి ఉండాలి..

మనకి తెలియని వ్యక్తులు విద్యార్ధినిలను నిర్జన ప్రదేశాల్లో తాక కుండా జాగ్రత్తలు పాటించాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలి విద్యార్ధినిలకు సూచించారు. మంగళవారం శంఖవరం మండలంలోని నెల్లిపూడి గ్రామంలోని ఎంపీపీ స్కూలులో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ కళాంజలి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని.. అది ఏవిధంగా ఉంటుందో ఇద్దరు విద్యార్ధినిలతో చేతులతో తాకి చూపించి విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. ఎవరైనా స్కూలుకి వెళ్లే సమయంలోగానీ, వచ్చే సమయంలో ఏడిపించినా, హేలన చేసినా దైర్యంగా వారికి సమాధానం చెప్పాలన్నారు. అప్పటికీ శ్రుతిమించితే ఇంటిదగ్గర తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని దైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలకు దగ్గర్లో వున్న గ్రామ సచివాలయాల్లో ఉండే తమకు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు.  ఈకార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు డి.బుల్లి అప్పారావు, మూర్తి, దేవిశ్రీ, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

Nellipudi Village

2022-02-22 10:01:12

రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్ధులు అవగాహన పెంచుకోవాలి..

రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు,  రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధులు పాఠశాల దశ నుంచే  అవగాహన పెంచుకోవాలని నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజలిసూచించారు. సోమవారం శంఖవరం మండలం నెల్లిపూడి ఎంపీపీ స్కూలులో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి ప్రమాదాలపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ కళాంజలి  మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధులు రోడ్డుపై నడిచేటప్పుడు రోడ్డుకి ఎడమవైపు నుంచి క్యూలైన్  పాటిస్తూ నడవటం అలవాటు చేసుకోవాలన్నారు.. అంతేకాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైన్  పడినపుడు వాటిని చూసుకుంటూ గ్రీన్ లైట్ పడేంత వరకూ వేచి చూసి ఆ తరువాత  జీబ్రా లైన్ గుండా మాత్రమే నడవాలన్నారు. అంతేకాకుండా ద్విచక్రవాహనాల్లో వెళ్లే సమయంలో హెల్మెట్ లేకుండా, అత్యంత వేగంగా ప్రయాణాలు చేయడం వలన  అనర్ధాలను వివరించారు. కారు ప్రయాణంలో సీటు బెల్టు పెట్టుకొని ప్రయాణం చేయడం ద్వారా కలిగే లాభాలు, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి  వాహనాలు నడపడం వలన వచ్చే అనర్ధాలపై విద్యార్ధులకు ప్రత్యేకంగా తయారు చేసిన చార్టులను ప్రదర్శిస్తూ  చైతన్యం కల్పించారు.  తల్లిదండ్రులకు  ఎవరికైనా ఇంట్లో ద్విచక్రవాహనాలు ఉంటే, వారు బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలని సూచించారు. అదేవిధంగా కార్లు ఉన్నవారు ప్రయాణ సమయంలో ఖచ్చితంగా సీటు బెల్టు పెట్టుకొని మాత్రమే ప్రయాణాలు చేయాలని..ఆ విషయాన్ని విద్యార్ధులు తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. ఈ అవగాహనా కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యతో విద్యార్ధులు పాల్గొన్నారు.

Nellipudi

2022-02-21 16:54:54

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన కలిగి ఉండాలి..

అపరిచితులు విద్యార్ధులను నిర్జన ప్రదేశాల్లో తాక కుండా జాగ్రత్తలు పాటించాలని మండ పం గ్రామసచివాలయ మహిళా పోలీస్ వి.గంగాగౌతమి విద్యార్ధినిలకు సూచించారు. సోమ వారం శంఖవరం మండలంలోని మండపం గ్రామంలోని సత్యభారతి పబ్లిక్ స్కూలులో గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి ప్రమాదాలపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ గంగగౌతమి  మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దౌరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని అవగాహన కల్పించారు. ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు. వాటితోపాటు స్కూలు విద్యార్ధులకు రహదారిభద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డుపై నడిచే టపుడు ఎడమవైపునే ఎందుకు నడవాలి తదితర అంశాల కోసం విపులంగా ప్రత్యేకంగా తయారు చేసిన చార్టుల ద్వారా వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరిగితే కలిగే నష్టాల కోసం కూడా విద్యార్ధులకు తెలియజేశారు. ఈకార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు కోలా చందర్రావు, పన్నీరు సత్యన్నారాయణ, ఇతర స్కూలు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

Mandapam

2022-02-21 16:33:34

ఆపద సమయంలో రక్షణ కవచం దిశయాప్..

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలోనూ, ఆపద సమయంలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ ఒక రక్షణ కవచంగా నిలుస్తుందని  మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ఆమె మాట్లాడారు.   గ్రామ సచివాలయ పరిధిలోని మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కో సచివాలయానికి  ఒక్కొక్క మహిళా పోలీస్ ఉంటారని, ఎవరికైనా సమస్య వస్తే వెంటనే తమను  దిశ  యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా  నిమిషాల్లో మీకు రక్షణ ఉంటుందని అన్నారు. ప్రతి మహిళకు అనునిత్యం వెంట ఉండి అనుక్షణం కంటికి రెప్పలా రక్షించే రక్షక భటుడే  దిశ యాప్అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఆడ, మగ అనే బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా జిఎన్ఎస్ శిరీష మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.

Sankhavaram

2022-02-21 07:38:31

సచివాలయ మహిళా పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి..

శంఖవరం మండలలోని మండపం గ్రామ సచివాలయం పరిధిలోని మహిళా పోలీసుల సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలిన సచివాలయ మహిళా పోలీస్ వి.గౌతమి గ్రామస్తులను కోరారు. ఈ మేరకు ఆమె గ్రామసచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని మహిళలకు, వివాహితులకు ఎలాంటి కష్టం వచ్చినా తక్షణమే సచివాలయాల్లోని మహిళాపోలీసులను సంప్రదించాలన్నారు. అదే సమయంలో విద్యార్ధినులతోపాటు, గ్రుహిణిలు కూడా దిశ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో దిశయాప్ మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సచివాలయ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమకు సమాచారం అందించాలని కోరారు.

Mandapam

2022-02-15 09:07:40

ఓటరు జాబితాలో తప్పులు, అడ్రసులను నవీకరించుకోవాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఓటరు కార్డులోని తప్పులను, శాస్వత అడ్రసులను మార్చుకోదలచిన వారు తక్షణమే గ్రామసచివాలయాలను సంప్రదించి నవీకరణలు చేయించుకోవాలని శంఖవరం మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష కోరారు. ఈ మేరకు ఆమె శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని ఓటరు దారు తన కార్డులోని శాస్వత అడ్రసుతోపాటు ఇతర మార్పులను, చేర్పులను నవీకరించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలను మహిళా పోలీస్ జీఎన్ఎస్ శీరిష కోరారు.

Sankhavaram

2022-02-15 09:06:38

రైతుల ఖాతాలోకి ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసి సీఎం వైఎస్ జగన్..లైవ్

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రూ.123 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాకే జమచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ  ప్రత్యక్ష ప్రసారాలు ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల  కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..గత ప్రభుత్వంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొడితే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులందరికీ ఆర్బీకేల్లో ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశామని, ఎంతో పారదర్శకంగా వీటిని అమలు చేస్తున్నట్టు చెప్పారు.

Tadepalli

2022-02-15 06:17:58

ఈ నెల16న లక్ష్మీపురంలో మెగా వైద్య శిబిరం..

పాడేరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం లో ఈనెల 16వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ  సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గైనిక్ వైద్య నిపుణులు, చర్మ వ్యాధుల వైద్య నిపుణులు, కీళ్ళ వ్యాధుల వైద్య నిపుణులు, కంటి వైద్యులు, చెవి, ముక్కు, గొంతు వైద్యులు, సాధారణ వ్యాధులు వైద్య నిపుణులు కంటి వైద్యులు పాల్గొనిఉచితంగా వైద్యం ,మందులు సరఫరా చేస్తారని పేర్కొన్నారు.  లక్ష్మీపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో వైద్యం పొందాలని సూచించారు. మండలంలోని ప్రజలందరూ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Paderu

2022-02-14 12:50:38