1 ENS Live Breaking News

25 కోడి కత్తులు సీజ్ బైండోవర్ కేసులు నమోదు..

అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని  కోడి కత్తిదారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి 25 కోడి కత్తులను సీజ్ చేసినట్టు ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పి  రవీంద్రనాథ్ బాబు  ఉత్తర్వులు మేరకు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాటలు మరియు పేకాటలు  వంటి జూద క్రీడలు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. కోడిపందాలుకు ఉపయోగించే కోడి కత్తులు తయారు చేసే వారిని, కోడిపందాలు కేసుల్లో పాత ముద్దాయిల్ని 23 మందిని శంఖవరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు చెప్పారు.  అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలల్లో ఏవిధమైన జూద క్రీడలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Annavaram

2021-12-20 12:47:38

రైతుబజార్లలో పార్కింగ్, బోర్డులు, కేంటీన్లకు టెండర్లు..

తూర్పుగోదావరి జిల్లాలోని  అమలాపురం రైతుబజార్ లలో పార్కింగ్ కోసం ప్రదేశం లీజుకి ఇచ్చేనిమిత్తం ఈనెల 16వ తేదీ నుంచి ఈ-టెండర్లు పిలుస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యప్రకశారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ రూరల్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ-టెండర్లు  16వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆశక్తివున్న టెండరు దారులు మార్కెటింగ్ శాఖ ఆన్ లైన్ పోర్టల్ ను సందర్శించాల్సి వుంటుందని ఆయన చెప్పారు. వీటితోపాటు, కేంటీన్లు, డిస్ప్లే బోర్డులకు కూడా ఈ- టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని టెండరు దారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలిని మార్కెటింగ్ శాఖ ఏడీ ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరారు.

2021-12-20 12:25:20

అన్నవరం దేవస్థానంలోనూ ఇక డయల్ యువర్ ఈఓ..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన  శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్ధం ప్రతీనెలా మొదటి సోమవారం మరియు ఆఖరి సోమవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. స్వామివారి దర్శనాల దగ్గర నుంచి అన్ని రకాల సేవలు, వసతుల తదితర అంశాలపై  భక్తులు ఫోన్ నెం:08868-238127 నెంబరుకు  ఉదయం 10.30 నుంచి11.30 వరకు ఫోన్ చేసి మాట్లాడవచ్చునని చెప్పారు. అదే సమయంలో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే విషయంలో భక్తులు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, దేవస్థానానికి సంబంధించిన ఏ విషయంపై అయినా నేరుగా ఈఓతో మాట్లాడవచ్చునని ఈఓ మీడియాకి జారీచేసిన ప్రకటనలో తెలియజేశారు.

Annavaram

2021-12-20 12:18:34

దేశభక్తికి ప్రతీక సర్ధార్ వల్లభాయ్ పటేల్..

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకుంటిత దేశభక్తికి ,సమైక్య భారత నిర్మాణ దక్షతకు ప్రతీక అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు అన్ని జాతీయ ఉద్యమాల్లో పటేల్ ముందు నిలిచారని కొనియాడారు. స్వతంత్ర భారతానికి తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా ఆయన చేసిన సేవలు, తీసుకున్న చర్యలు సుస్థిర భారత రూపకల్పనకు తోడ్పడ్డాటు అయ్యాయని పట్నాయక్  గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవ రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-15 07:33:58

మచ్చలేని ప్రజా సేవకులు పొట్టి శ్రీరాములు..

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మచ్చలేని ప్రజా సేవా తత్పరుడు అని వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి గాంధీ ఆదర్శాలకు, ఆశయాలకు ప్రభావితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న శ్రీ రాములు 58 రోజులపాటు ఆహార నిరాహారదీక్ష చేసి అసువులు బాసారన్నారు. ఆయన ఆత్మ త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని తదనంతరం  తెలంగాణ ఉద్యమంతో  తెలుగు రాష్ట్రం రెండుగా విభజింపబడినట్టు అడబాల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్ ,రాఘవరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-15 07:31:40

సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్..

భారత రాజ్యాంగ నిర్మాత గానే కాకుండా సామాజిక విప్లవ సారథిగా పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం  ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ 65 వ వర్ధంతి ఘనంగా నిర్వహఇంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడబాల  మాట్లాడుతూ, దేశ లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంటే అందుకు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. ఆధ్యాత్మికవేత్త రవి శంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, సామాజిక పరివర్తనుడు, గొప్ప స్ఫూర్తి ప్రదాత, గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, న్యాయ శాస్త్ర కోవిదుడు అయిన అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారని తెలిపారు. 1956 డిసెంబర్ 6 న కాలం చేశారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, ఆర్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-06 17:03:45

భగవంతునికి అత్యంత ఇష్టమైనది పరోపకారమే..

పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రమణయ్యపేట ఎన్టీఆర్ నగర్లో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం. వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయడానికి భగవంతుడు  ఈ శరీరాన్ని  ఇచ్చాడని అన్నారు. ఆ దిశగా ప్రతి ఏటా శీతాకాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న వరలక్ష్మి సేవాతత్పరత అభినందనీయమన్నారు. ఎదుటివారికి సేవచేసేవారిని ఆదేవదేవుడు ఎప్పుడూ ఇష్టమైన భక్తులకుగా స్వీకరిస్తాడనే విషయాన్ని దాతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, అడబాల రత్న ప్రసాద్, ఆర్.రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-06 17:02:39

భగవద్గీత మానవులలో సత్పరివర్తనను పురిగొల్పుతుంది..

ప్రతీ విద్యార్ధికీ భగవద్గీతలోని శ్లోకాలను చేరువ చేసి భగవద్గీతను పెద్ద ఎత్తున ప్రాచుర్యం లోకి తీసుకు రావడానికి విశ్వహిందూపరిషద్ విశేషంగా క్రుషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని భానుగుడి బ్రిడ్జి క్రింద గల ఆండాలమ్మ జూనియర్ కళాశాలలో విశ్వహిందుపరిషద్ కాకినాడ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సుమారు 10 ప్రఖండలనుండి విజేతలు 150మంది వరకు ఈ పోటీలలో పాల్గొన్నారని అన్నారు. పిల్లలకు బాల్యంనుండే భారత సంప్రదాయాలు అలవరచ వలసిన బాధ్యత తల్లితండ్రులపై ఉందన్నారు. జిల్లా భగవద్గీత పోటీల నిర్వాహకులు రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, భగవద్గీత మానవులలో సత్పరివర్తన కు మార్గదర్శనం చూపుతుందని, ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకోవాలన్నారు. జిల్లా కన్వీనర్ అన్నపూర్ణయ్య శర్మ మాట్లాడుతూ, భగ్వద్గీతతో పాటు దేశ భక్తి కూడా పిల్లలలో పెరగాలన్నారు. విజేతలకు బహుమతిప్రధానం చేశారు. డిసెంబర్ 25 వ తేదీన ప్రాంత స్థాయి పోటీలకు ఎంపిక చేసినవారందరు విజయవాడలో సత్యనారాయణ పురం లో గల ప్రాంత కార్యాలయం లో జరుగు ప్రాంతస్థాయి పోటీలలో పాల్గొనాలని అన్నారు. ఈ పోటీల  న్యాయనిర్ణేతలుగా బి.శ్యామసుందర రావు, వి.బి.టి.సుందరి, దుర్గాప్రసాద్, శ్రీహరి మన్నారు,రవివర్మ,డా.రమాదేవి వ్యవహరించారు. ఈ కార్యక్రమము లో ఈమని పరమేశ్వర రావు, ముమ్మిడి బాబూరావు, రామానుజాచార్యులు,ఉదయబానోజి రావ్, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-05 13:43:54

పాపం చేసిన ఫలితం ప్రతీ ఒక్కరినీ వెంబడిస్తుందని..

ఏదో ఆశించి పాపపు పనులు చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా వెంబడిస్తుందనే విజ్ఞత ఉంటే దాని జోలికి  వెళ్ళమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ధర్మ విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించడం ,పాపపుణ్యాలు పరిగణించక పోవడం, అమాయకులను బాధ పెట్టడం, సజ్జనులు, పెద్దలను నిందించడం, హింస, హత్యలు, దొంగతనం చేయడం వలన కష్టాలు తప్పవన్నారు. మంచి ఆలోచన, సద్బుద్ధి, పేదల పట్ల ప్రేమానురాగాలు ఉన్నవారికి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అన్నారు. ఈ కర్మ ఫలం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని అన్నారు. పాపపుణ్యాల కర్మ ఫలం ఈ జన్మలోనే అనుభవిస్తారని ఇంకా మిగిలి ఉంటే మరో జన్మలో కి బదిలీ అవుతాయని అన్నారు. అందుచేత ప్రతి వ్యక్తి సచ్చిలతతో, పరోపకారంతో మెలిగితే సుఖసంతోషాలతో జీవించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-05 12:16:53

మంచి ఆహారంతోనే పరిపూర్ణ ఆరోగ్యం సొంతం..

ప్రస్తుత యాంత్రిక జీవనంలో మంచి ఆహారపు అలవాట్లు వలన మాత్రమే ఆరోగ్యంగా జీవించవచ్చునని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాంజీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాంజీ మాట్లాడారు. చెడు అలవాట్ల వలన నిద్రలేమి వస్తుందని దీంతో అనేక శారీరక, మానసిక వ్యాధులు వేధించే అవకాశం ఉందన్నారు. రాత్రి పొద్దు పోయే వరకు మెలకువగా లేకుండా తొందరగా ఆహారం తీసుకొని నిద్రకు ఉపక్రమించాలని సూచించారు.  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉందన్నారు. పరిమితంగా తీసుకోవాలని, రోజూ శారీరక వ్యాయామం చేయాలని ,నిత్యం ఏసీ గదుల్లో కాకుండా సూర్యరశ్మిలో కూడా తిరగాలని డాక్టర్ రాంజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పట్నాయక్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-05 12:14:51

ఫలితం ఆశించకుండా చేసేదే అసలైన సేవ..

నిశ్వార్ధంగా ఫలితం ఆశించకుండా చేసేదే అసలైన స్వచ్ఛంద సేవ అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సువర్ణ రాజు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్  వాకర్స్ సంఘం  ఆధ్వర్యంలో ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు ముందుకు వస్తున్న వారందరినీ గుర్తించేందుకు గాను ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటున్న మన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ ఈ సృష్టి సమస్తం సేవల మయం అన్నారు. మనిషి సుఖంగా జీవించేందుకు ప్రకృతిలోని ప్రతిదీ నిస్వార్ధంగా  సేవలు అందిస్తుందని అన్నారు. ప్రతిఫలం ఆశించి చేసేది సేవ కానే కాని సూచించారు.  కులమతాలకు అతీతంగా చేసేది సేవ అన్నారు. ప్రేమతో చేసిన సేవ అన్నిటికంటే గొప్పది అని యనమల తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో నారాయణ సేవ అధ్యక్షురాలు ఎం వరలక్ష్మిని, మీకోసం స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక  అధ్యక్షులు పిల్లి నాగేశ్వరరావుల ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాఘవరావు, బాపిరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Kakinada RTC Bus Complex and Depot

2021-12-05 12:12:37

కరప మండలంలో ప్రయోగాత్మకంగా వరి పంటల కోతలు..

కరప మండలంలో ప్రయోగాత్మకంగా వరిపంటల కోతలు మొదలు పెట్టినట్టు మండల వ్యవసాయాధికారిణి ఏ.గాయత్రీదేవి తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని పెడగుదురు, పాత్రలగెడ్డ ఏరియాలో కోతలు ప్రారంభించినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారిణి మాట్లాడుతూ, గత నెలలో వర్షాలకు బాగా నానిపోయిన పంటల జాగ్రత్త కోసి నీడలో ఆరబెట్టడం ద్వారా గింజలోని తేమ తగ్గిపోకుండా వుంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మాత్రమే కోతలు కార్యక్రమం చేపట్టామని, వాతావరణం పూర్తిగా అనుకూలించిన తరువాత పూర్తిస్థాయిలో కోతలు, నూర్పులు చేపట్టే విధంగా రైతులకు సూచించినట్టు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంతో రెండు గ్రామాల గ్రామీణ వ్యవసాయ సహాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-12-03 16:01:50

విభిన్నప్రతిభావంతులను మంచి మనసుతో ఆదరించాలి..

స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ సహితంగా బతుకుతూ, అస్తిత్వాన్ని కాపాడుకునే విభిన్న ప్రతిభావంతులను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని కరప మండలాభివ్రుద్ధి అధికారిణి కె.స్వప్న పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని భవిత కార్యాలయంలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ, పుట్టకతోనే వైకల్యం వచ్చిన వారిని వికలాంగులు అనే పదం వాడి పిలవకూడదన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా విభిన్న ప్రతిభావంతులు అనే పదంతో పిలవాలన్నీరు. వారికి ప్రతిభ ఉన్నరంగాల్లో వారిని ప్రోత్సహించడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు చేయూత అందించేందుకు మానవతా ద్రుక్పదంతో ముందుకి రావాలన్నారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఏ.శ్రీనివాసరావు, ఫౌండేషన్ ప్రతినిధి అలీం, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-12-03 15:59:11