1 ENS Live Breaking News

కర్నూలుకి దామోదరం సంజీవయ్య పేరుపెట్టాలి..

దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా జవహార్ వీధిలోనికాకినాడ పౌరసంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నివాళి ఘటించారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ  రాష్ట్రానికి 2 వ ముఖ్యమంత్రి గా దళిత వర్గాల నుండి మొదటి ముఖ్యమంత్రి గా నెహ్రూ లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానులుగా పనిచేసిన హయాంలో దేశ కార్మిక మంత్రిగా వున్న దామోదరం సంజీవ య్య నిజాయితీగా ప్రజోపయోగ పనులు చేసిన మహనీయులని శ్లాఘించారు. కార్మికులకు బోనస్ ప్రవేశపెట్టడం 6లక్షల బంజరు భూములు పంపిణీ చేయించడం ఎస్ సి ఎస్ టి బి సి లకు ఉద్యోగపదోన్నతులు కల్పించడం మద్య నిషేధానికి చర్యలు వహించడం అవినీతి నిరోధక శాఖ ను ఏర్పాటు చేయడం తెలుగును మొదటి అధికార భాషగా ఉర్దూను రెండవ అధికార భాషగా చేయడం  వంటి పనులు సంజీవయ్య హయాంలో అమలుచేసిన మహోన్నత కార్యాలని పేర్కొన్నారు. సంజీవయ్య పుట్టిన  జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా నామకరణం చేయడం అభినందనీయం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయాలకు ఆయన ఆదర్శప్రాయమని పూల మాలలు వేసి అంజలి ఘటించారు. తెదేపా ఎస్ సి సెల్ నాయకుడు పోలిపల్లి జగన్ బాబు వివేకా అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పెంకే నూకరాజు సీనియర్ సిటిజన్ పట్టా రామదాసు పాల్గొన్నా రు.

Kakinada

2022-02-14 09:39:31

ఖాకీ అంటే కర్కసమే కాదు.. అంతకు మించిన కారుణ్యం కూడా..

ఖాకీలు అంటే కర్కసంగా వ్యవహరిస్తారని మిత్రామే అందరికీ తెలుసు..అది వారు కావాలని చేస్తున్నది కాదు విధినిర్వహణలో ఆమాత్రం చేయకపోతే  ప్రజాక్షేత్రంలో పోలీసులంటే నింధితులకు భయం వుండదు..అలాంటి పోలీసులు ఎప్పుడూ కర్కసంగానే ఉంటారా..కాదు కాదు.. అంతకు మించిన మానవత్వాన్ని, మరింత కారుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ప్రజలను కాపాడతారు. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడి పోలీసులు చూపిన చొరవ, మానవసేవ నిజంగా పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచుతాయనడంలో సందేహం లేదు. వివరాలు తెలుసుకుంటే.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ స్కూల్ 7th వార్డ్ కు చెందిన కొడమంచిలి రత్నకుమారి  తన భర్త  తరచూ మద్యం సేవించి గొడవచేస్తుండగా..దానిని వారించిన భార్యను అతడు కత్తపీట చెక్కతో తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలికి..ఏఎస్ఐ జి.చిన్నారావు, మహిళా కినిస్టేబుల్ మంగాదేవిలు ప్రధమ చికత్స చేసే క్రమంలో ఏఎస్ఐ తన జేబు రుమాలుతో బాధితురాలి గాయానికి కట్టు కట్టి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.  ప్రజల రక్షణలో అంతికత భావంతో పనిచేయడంలోనూ పోలీసులు ముందుంటారనే విషయాన్ని జిల్లాలో మండపేట పోలీసులు మరోసారి రుజువుచేసి చూపారు.  మానవత్వాన్ని ప్రదర్శించి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవలు సహచర ఉద్యోగులకు మార్గదర్శకమంటూ అభినందించారు.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతు పోలీసులు చేసిన సహాయానికి ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు..

Mandapeta

2022-02-10 10:45:45

17 నుంచి సత్యదేవుని ఆలయంలో కోటితులసి పత్రి పూజలు..

అన్నవరం శ్రీశ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోకకళ్యాణార్థం రాష్ట్రంలో గల ప్రజలందరూ కరోనా , ఓమిక్రాన్ వంటి వ్యాధి నుండి విముక్తి పొంది సస్యశ్యామలంగా ఉండేందుకు ఈనెల 17 నుండి 26  వరకు శ్రీ స్వామి వారికి "కోటితులసి పత్రి పూజ" శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మందిరంలో  50 మంది ఋత్విక్ లతో  అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలయజేశారు. ఈ మేరుకు మంగళవారం స్థానిక మీడియాకి ప్రకటన విడుద లచేశారు.  భక్తులు సదరు పూజను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తులు  ఈ పూజకోసం రుసము రూ.1,500/-లు టిక్కెట్ తీసుకొని పూజ చేయించుకోవచ్చునన్నారు. సదరు పూజను పరోక్షంగా నిర్వహించుకున్న భక్తులకు వారు కోరిన రోజున పూజ నిర్వహించి,  పోస్టల్  ద్వారా కండువా, జాకెట్టు, కుంకుమ అక్షింతలు పంపిస్తామని తెలియజేశారు. భక్తులు aptemples.ap.gov.in ద్వారా రుసము చెల్లించి టిక్కెట్ పొందాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Annavaram

2022-02-08 10:19:24

గ్రామాల్లో శ్రీరామ నగర సంకీర్తన అభినందనీయం..

కొత్తపేట మండలం వానపల్లికి చెందిన ధరణాల శేఖర్ తన సొంత ఖర్చులతో ఆటోలో ధనుర్మాస ప్రారంభం నుంచి కొత్తపేట మండలంలోని అన్ని గ్రామాల్లో తన ఆటోపై  శ్రీరామ నామ నగరసంకీర్తన చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక చింతన కలిగించడం అభినందనీయమని ఆర్ఎస్ఎస్ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్తపేట జూనియర్ కాలేజీ సభా ప్రాంగణంలో కూరగాయలమార్కెట్ మహాగణపతి వర్తక సంఘం, ఆర్ఎస్ ఎస్ నాయకులు హిందూ బంధువుల ఆధ్వర్యంలో శ్రీరామ నామ నగరసంకీర్తన చేస్తున్న ధరణాల శేఖర్ ను ఘనంగా సత్కరించారు. శ్రీరామ నామ నగరసంకీర్తన వింటూ, రామ నామాన్ని జపిస్తూ  ప్రజలంతా మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నారని పలువురు పెద్దలు ప్రశంసించారు. మరుగున పడిపోతున్న ఆచారాలను, సంస్కృతిని  కాపాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పండితులు పెద్దింటి రామం, బాపట్ల శ్రీను, ఆర్ఎస్ఎస్ నాయకులు శేషగిరి , శర్మ, బిజెపి నాయకులు పాలూరి సత్యానందం , మార్కెట్ కమిటీ సభ్యులు నిమ్మకాయల చిన్నయ్య నాయుడు , పాలాటి మాధవస్వామి, గొలకోటి వెంకటేశ్వరరావు , కోటిపల్లి దామోదర్, శ్రీనివాస్,  మార్కెట్ కమిటీ సభ్యులు హిందూ బంధువులు పాల్గొన్నారు. 

Prathipadu

2022-02-08 09:13:12

అన్నవరంలో వైభవంగా సూర్య ఆరాధన..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని  శ్రీశ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం  శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం మండపము నందు  వైదిక సిబ్బంది సూర్య ఆరాధన, సూర్య నమస్కారములు అత్యంత వైభవంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రథసప్తమికి సంబంధించిన ప్రవచనాలను కూడా వైదిక సిబ్బంది వినిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Annavaram

2022-02-08 09:05:46

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణీమోహన్..

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జి.వాణీమోహన్ పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా దేవాదాయ ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ, రథసప్తమి జిల్లా కలెక్టర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ తదితర శాఖల సమన్వయంతో రథసప్తమి వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారన్నారు. జిల్లాలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు రాష్ట్రంలో పలు జిల్లాల నుండే కాకుండా, పక్క రాష్ట్రం ఒరిస్సా నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారనీ. స్వామి వారి నిజరూప దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా  ఉచిత, 100/- , 500/- దర్శనాలుకు సంబంధించి బారికేడ్ల ఏర్పాటు, భక్తులకు మంచి నీరు, మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ అన్నదానం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని.  ప్లాన్ ఆమోదం పొందిన వెంటనే దేవాదాయ, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పాటు దాతలు ఇచ్చిన విరాళాలతో దేవాలయ అభివృద్ధి చేపడతామన్నారు. ధర్మపథం కార్యక్రమాన్ని జిల్లాలో రెండు సార్లు నిర్వహించడం జరిగిందని, ప్రతి 15 రోజులలో 2 రోజులు ధర్మపథం నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. తొలుత జిల్లా సహాయ కమీషనర్ శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామి వారి ప్రసాదాన్ని  చిత్రపటాన్ని అందజేశారు.

Arasavilli

2022-02-08 08:33:59

రేపు సత్యదేవుని ఆలయంలో రథసప్తమి పూజలు..

అన్నవరంలోని శ్రీశ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని రథసప్తమి సందర్భంగా  మంగళవారం ఉదయం 7.45 ని.ల నుండి  శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం మండపములో వైదిక సిబ్బంది చే సూర్యరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావువు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం అన్నవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రథసప్తమి సందర్భంగా పూజలతోపాటు సూర్య నమస్కారములు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈఓ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Annavaram

2022-02-07 14:39:04

సత్యదేవుని హుండీల లెక్కింపు 14వ తేదీకి వాయిదా..

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో 7వ తేదిన జరగాల్సిన హుండీల లెక్కింపు భక్తుల రద్దీ కారణంగా 14వ తేదీకి మార్పుచేసినట్టు దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మార్పుచేసిన తేదీలను ఆ రోజు విధుల్లోకి వచ్చే వారికి సమాచారం అందించినట్టు పేర్కొన్నారు.కాగా ప్రభుత్వం సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


Annavaram

2022-02-05 09:10:17

అన్నవరం శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన ట్రస్టుకి హైదరాబాదుకి చెందిన పితాని భానుప్రకాష్ దంపతులు శనివారం లక్షరూపాయలను విరాళం అందజేశారు. ఈ మేరకు ఈ మొత్తాన్ని ఈఓ కార్యాలయంలోని ఏఈఓకి అందజేశారు.  డిసెంబరు 5వ తేదిన రిష్వంత్ హన్యక్ పేరుపై అన్నదానం చేయాలని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, సిబ్బంది స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2022-02-05 09:07:27

1095 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకం పూర్తి..

కరప మండలంలో ఒక వెయ్యి 95 మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటి వరకూ అమ్మకాలు పూర్తిచేసినట్టు కరప మండల వ్యసాయాధికారిణి ఏ.గాయత్రీ దేవి తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలో దాల్వా పంటలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 680 మెట్రిక్ టన్నుల యూరియా, 415 మెట్రిక్ టన్నుల డిఏపీ లను రైతులకు సరఫరా చేశామన్నారు. ఇటీవలే మండలానికి కావాల్సిన అదనపు ఎరువులను అందుబాటులోకి తేవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారని తెలియజేశారు. మరో రెండు రోజుల్లో అదనపు ఎరువులు మండలానికి చేరుకుంటాయన్నారు. ఎరువులు లేవనే మాట రాకుండా అన్ని రైతు భరోసా కేంద్రాలు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆమె ఈ సందర్బంగా మీడియా ద్వారా మండలంలోని రైతులకు తెలియజేశారు.

Karapa

2022-02-04 17:03:48

2610 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..

శంఖవరం మండలం ఇప్పటి వరకూ 2620 మెట్రిక్ టన్నుల ధాన్యం1264 మంది రైతుల నుంచి కొనుగోలు పూర్తి చేసినట్టు  మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. 16 రైతుభరోసా కేంద్రాల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. ప్రస్తుతం దాల్వాకి సంబంధించిన కార్యాచరణ జరుగుతుందని చెప్పారు. ఇంకా ఎవరి వద్దనైనా మిగిలిన ధాన్యం అమ్ముకోదలిస్తే తక్షణమే రైతు భరోసా కేంద్రాలకు తరలించి అమ్మకాలు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. అదేవిధంగా ఎవరికైనా పేమెంట్లలో ఇబ్బందులు, దాల్వా సాగులో సలహాలు, సూచనల కోసం రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని ఈ సందర్భంగా రైతులకు మీడియా ద్వారా సూచించారు.

Sankhavaram

2022-02-04 07:52:52

కరపలో 1336 ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు పూర్తి..

కరప మండలంలో ఇప్పటి వరకూ 1336 మందికి చెందిన ఓటిఎస్ రిజిస్ట్రేషన్లు పూర్తి అయినట్టుు కరప ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కరపలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా సుమారు 8వేల 689 మందికి చెందిన లబ్దిదారుల డేటాను కూడా ఆన్ చేసినట్టు చెప్పారు. మిగిలిన ఓటిఎస్ లబ్దిదారులకు ప్రభుత్వం కల్పించిన వాయిదాల పద్దతిని సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నట్టు ఆమె వివరించారు. ఓటిఎస్ వలన కలిగే లాభాలాను, ఉపయోగాలకు కూడా లబ్దిదారులకు తెలియజేస్తూ చైతన్యం కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్న లబ్దిదారులు స్వచ్చందంగా ముందుకువచ్చి ఓటిఎస్ ద్వారా తమ ఇంటి భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కరప ఎంపీడీఓ కె.స్వప్న మీడియా ద్వారా మండల వాసులకు సూచించారు.

Karapa

2022-02-04 07:16:59

సంపూర్ణ పశుదాణాను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం అందించే సంపూర్ణ పశు దాణా(టోటల్ మిక్సర్ రేషన్)ను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని వేలంగి సర్పంచి మేకల సత్యన్నారాయణ అన్నారు. మంగళవారం వేలంగి రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన సంపూర్ణ దాణాను గ్రామీణ పశుసంవర్ధక సహాయకులు నాగేంద్రతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సంపూర్ణ పశు దాణా(టోటల్ మిక్సిడ్ రేషన్)ను ఒక కేజి రూ.6.50కే అందిస్తుందన్నారు. ఈ దాణాను పశువులకు పెట్టడం ద్వారా పశులు సకాలంలో ఎదకు రావడం, పాలు అధికంగా ఇవ్వడం, పుష్టిగా తయారవుతాయని తెలియజేశారు. పాడి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు రైతు భరోసా కేంద్రాల్లోనే  అందిస్తుందన్నారు. టీకాల దగ్గర నుంచి దాణాల వరకూ అన్ని సేవలు ఇక్కడే పొందవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.

Velangi

2022-02-01 13:21:39

జర్నలిస్టుల కుటుంబ సభ్యులకూ కోవిడ్ బూస్టర్ డోస్..

జర్నలిస్టులు వారి కుటుబీకులకు కోవిడ్ బూస్టర్ డోస్ లు వేసే కార్యక్రమం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ప్రకటించారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్  అసోసియేషన్ తరపున తనను కలిసి  కోవిడ్ నేపధ్య విపత్కర పరిస్థితులను అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఈ కోవిడ్/ ఒమిక్రాన్  వేళ  జిల్లా యంత్రాంగంతో పాటూ నిరంతరం సేవలను అందించడంలో తిరిగే జర్నలిస్టులూ అనేక మంది కోవిడ్ కు గురవుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో జర్నలిస్టులూ వారి కుటుంబ సభ్యులకూ (6 నెలలు  పూర్తయిన వారికి) వేక్సిన్ రెండు డోసుల ప్రక్రియ ప్రాతిపదికన బూస్టర్ డోస్ లు వేసే వెసులుబాటు/అవకాశం కల్పించాలని కోరారు.  అసోసియేషన్ తరపున జర్నలిస్టుల వారి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా వివరించారు. దీనికి  కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అభినందనలు తెలిపారు. అధ్యక్షుని అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించారు. తక్షణమే డిఅండహెచ్వో కు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సమర్పించిన లేఖపైనే సిఫార్సు చేస్తూ సంతకం చేశారు. జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారికి అసోసియేషన్ తరపున అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ధన్యవాదాలు  తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో త్వరలోనే జర్నలిస్టుల కు వారి కుటుంబ సభ్యులకూ కోవిడ్ బూస్టర్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించిన వెంటనే సమాచారం కూడ తెలియజేస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యం తో వర్ధిల్లాలని అశోక్ కుమార్ ఆశించారు. కలెక్టర్ ను కలిసి అసోసియేషన్ తరపున వినతి పత్రం అందించిన వారిలో కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్,ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణ్ యాదవ్,సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్రశేఖర్,బాలు పాత్రో,సహ సహాయ కార్యదర్శి కొండ్రి వినోద్,సభ్యులు జే. సూరిబాబు తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2022-01-26 13:21:06

నీ దమ్మేంటో సర్పంచ్ ఎన్నికల్లోనే తేలిపోయింది.. సత్యంనాయుడు ఎద్దేవా..

గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఒక్క వార్డు నెంబర్ ని గెలిపించుకో లేకపోగా సర్పంచ్ అభ్యర్థిగామూడో స్థానానికి దిగజారిన వ్యక్తివి నువ్వా దమ్ము గురించి మాట్లాడటం.. ముందు నీకోసం ప్రజలు ఏవిధంగా చెబుతున్నారు.. ఎంతలా చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలని పాత కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యం నాయుడు), వైకాపా నాయకుడు పుట్టా సూర్య ప్రకాష్ (చిన్నస్వామి) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు వారంతా పాత కృష్ణదేవిపేటలో మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ స్థలం సమస్యను వివాదంగా మార్చి నిరాధారమైన ఆరోపణలు మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే గ్రామంలో 119, 120 సర్వే నెంబర్ గల భూమిని సర్వే చేయమని మండల తహసీల్దార్ కు దరఖాచేశామన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పార్టీలకతీతంగా కలసి పని చేయడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు విషయంలో అర్హులైన వారి పట్టాలను మామూళ్ళు ఇవ్వలేదని నెపంతో గిరిబాబు బృందం నిలిపివేస్తే,  అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పించిన ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా గుర్తుచేశారు. గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని పై బృందం చెప్పుచేతల్లో కొంతమంది గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో చేతివాటం ప్రదర్శించి డబ్బులు గుంజిన వ్యక్తులు మీరు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ ఉద్యోగం విషయంలో పేద కుటుంబానికి చెందిన ఒక వితంతు మహిళకు ఇవ్వాలని తాము కోరగా, ఆ ఉద్యోగాన్ని తన భార్యకు కావాలని నాయకుల వద్ద మోకరిల్లడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భజన చేస్తున్నవారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు అందలం ఎక్కిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించకపోవడం ఇదెక్కడి రాజకీయమని ప్రశ్నించారు.  ఈ విషయాలన్నీ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ నాయకులకు విన్నవించినా వారినే వెనుకేసుకు వస్తున్నారని చెప్పారు. మండల స్థాయి నాయకులు ఇదే విధమైన తీరును గ్రామంలో ప్రోత్సహిస్తూ పార్టీలో వర్గాలని ఏర్పాటు చేస్తున్నారని ఇలా అయితే రానున్న రోజుల్లో పార్టీ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదముందన్నారు . ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చుక్కల సత్తిబాబు, వార్డు మెంబర్లు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Krishnadevipeta

2022-01-25 03:49:13