1 ENS Live Breaking News

సర్పవరం సిఐగా ఆకుల మురళీ క్రుష్ణ..

ప్రజా పోలీస్ గా సేవలందించడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని సర్పవరం సిఐ ఆకుల మురళీ క్రిష్ణ పేర్కొన్నారు. గురువారం సర్పవరం సర్కిల్ స్టేషన్ లో ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు, జర్నలిస్టులు కలసి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఏ విషయంలోనైనా ప్రజల సేవలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదే సమయంలో కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలని సిఐ ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రజలను కోరారు.

Sarpavaram

2021-12-02 15:46:46

కరప పెట్రోలు బంక్ వద్ద గుర్తుతెలియని శవం..

తూర్పుగోదావరి జిల్లాలోని కరప మండల కేంద్రంలోని పెట్రోలు బంక్ ఎదురుగా వున్న లేవుట్ లో పాడైపోయిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మ్రుత దేహాన్ని గుర్తించినట్టు కరప ఎస్ఐ డి.రమేష్ బాబు తెలియజేశారు. గురువారం ఈ మేరక బంక్ ఎందురుగా వున్న లేవుట్ లో ఆ మ్రుతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అసలు శవం ఇక్కడిదేనా..లేదంటే ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా అనేకోణంలో విచారణ చేపడుతున్నామని ఎస్ఐ మీడియాకి వివరించారు. కాగా ఆ మ్రుత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కాకినాడ జిజిహెచ్క్ కి తరలించినట్టు ఎస్ఐ రమేష్ బాబు ఈ సందర్భంగా వివరించారు.

Karapa

2021-12-02 15:43:32

ప్రజలకు పీహెచ్సీ ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందాలి..

థర్డ్ వేవ్ కరోనా, ఇతర సీజనల్ జ్వరాలు వ్యాధులను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అందించాలని  రాష్ట్ర వ్యవసాయ,శాఖ మంత్రి కురసాల కన్నబాబు పీహెచ్సీ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కరప మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన మండల అధికారులతో కలిసి సందర్శించి  వైద్యసేవలును పరశీలించారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.శ్రీనివాసనాయక్ ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలు చేయడంతోపాటు, ఇతర రోగాలకు కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించి ప్రజలకు ప్రాధమిక వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ ద్రుష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎంపీడీఓ కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-12-02 14:54:51

మహిళా పోలీసుల సేవలు ప్రజలకు తెలియజేయాలి..

గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుల సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతాయో ప్రజలకు తెలిసే అవగాహన కల్పించాలని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు మహిళా పోలీసులకు సూచించారు. బుధవారం ప్రత్తిపాడులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐను శంఖవరం మండల గ్రామసచివాలయ మహిళా పోలీసులు భోజన విరామసమయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామసచివాలయాల్లోని మహిళా పోలీసులు గ్రామ రక్షకులిగా పనిచేయాలన్నారు. జిల్లా కార్యాలయం నుంచి వచ్చే ప్రతీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. సిఐని కలిసిన వారిలో కళాంజలి, నాగసత్యశిరీష, రజియాసుల్తానా, రమ్యశ్రీ, ఉమాంజలి దేవి తదితరులు పాల్గొన్నారు.

Prathipadu

2021-12-01 16:36:34

హెచ్ఐవీపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి..

హెచ్ఐవీ, ఎయిడ్స్ పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శంఖవరం మండల కేంద్రంలో పారామెడికల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. మందులేని హెచ్ఐవీ వచ్చినా ఏఆర్టీ మందులు తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని 20ఏళ్లు వరకూ జీవించవచ్చునన్నారు. అదే సమయంలో ఎయిడ్స్, హెచ్ఐవీ కోసం అవగాహన పెంచుకోవడం ద్వారా వాటి బారిన పడకుండా ఉండేందుకు అవకాశం వుంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్, మూడు గ్రామసచివాలయాల ఆరోగ్య సహాయకులు, వెంకటలక్ష్మి, దేవమణి, లక్ష్మి, సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

Sankhavaram

2021-12-01 16:35:03

శ్రీ సత్యదేవ నిత్య అన్నధాన ట్రస్టుకి ఒక లక్షా 116 విరాళం..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రుముఖ పుణ్య క్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నధాన ట్రస్టుకి గుంటూరు జిల్లా మాచెర్లకు చెందిన బండారు సత్యన్నారాయణ దంపతులు ఒక లక్ష 116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానంలోని ఏఈఓకి చెక్కురూపంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, జనవరి 3వ తేదిన చరణ సత్యసాయి పేరుతో అన్నదానం చేయాలని దేవస్థాన అధికారులను కోరారు. అనంతరం దాతలు స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-11-30 16:39:14

అన్నవరంలో స్మశాన వాటిక స్థలం మంజూరుకు జిల్లా కలెక్టర్ అంగీకారం..

అన్నవరం గ్రామపంచాయతీలో స్మశాన వాటిక ఏర్పాటుకి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అంగీకారం తెలియజేశారని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా తెలియజేశారు. మంగళవారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. అన్నవరం సత్యదేవుని దర్శించుకునేందుకు రత్నగిరి క్షేత్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ద్రుష్టికి గ్రామంలో స్మశాన వాటిక లేక ప్రజలు పడుతున్న ఇబ్బదులను తెలియజేసినట్టు పేర్కొన్నారు. దీనితో కలెక్టర్ స్మశాన వాటికకు స్థలం కేటాయించేందుకు అంగీకరించారని సర్పంచ్ తెలియజేశారు. కలెక్టర్ పిలుపుమేరకు ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టరేట్ అందిస్తామని సర్పంచ్ కుమార్ రాజా ఈ సందర్భంగా మీడియాకి వివరించారు. స్మశాన వాటికకు స్థలం మంజూరైతే అన్నవరం గ్రామప్రజలు ఇబ్బందులు తొలిగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Annavaram

2021-11-30 16:38:02

పశువులను సకాలంలో యదకు వచ్చేలా చూడాలి..ఏడీ డా.సురేష్ బాబు

పాడి రైతులు పశువులను సకాలంలో యదకు వచ్చేలా చూసుకోవాలని కరప పశువుల ఏరియా ఆసుపత్రి ఏడీ డా.సురేష్ బాబు సూచించారు. వాతావరణ మార్పులు, చూడి నిలబడకపోవంటి సమస్యలు ఎదురైతే తక్షణమే పశువుల ఆసుపత్రికి తీసుకు వస్తే క్రుత్రిమ గర్భోత్పత్తి చేపడతామని చెప్పారు. రైతుకి పాడి ఆవులు, గేదెలు తరచు దూడలు కనడం ద్వారా ఆర్ధికంగా లాబసాటిగా వుంటుందన్నారు. లేదంటే పాడి పశువులు ఉన్నా నష్టాలే చవిచూడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ పశు వైద్యాలయం సేవలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సేవల కోసం గ్రామసచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో గ్రామీణ పశుసంవర్ధక సహాయకులను సంప్రదించవచ్చునని ఆయన ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.

Karapa

2021-11-30 16:35:09

శంఖవరం పీహెచ్సీలో 28 మందికి కంటి పరీక్షలు..

వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ఏర్పాటు చేసిన వైద్యశిబిరం ద్వారా 28 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన శంఖవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పీహెచ్సీలో ప్రతీ మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రత్యేకంగా కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు  తెలియజేశారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి కాకినాడలో ప్రత్యేకంగా వాటిని ఉచితంగానే చేపడతారని వివరించారు. కాగా శంఖవరం పీహెచ్సీ పరిధిలోని సుమారు 52 వేలమంది ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మీడియా ద్వారా ప్రజలకు సూచించారు. 

Sankhavaram

2021-11-30 16:23:36

వేక్సినేషన్ కు స్వచ్ఛందంగా ముందుకి రావాలి..

థర్డ్ వేవ్ కోవిడ్ హెచ్చరికలను ద్రుష్టిలో ఉంచుకొని వేక్సినేషన్ చేయించుకోని వారు స్వచ్ఛందంగా ముందుకి రావాలని శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ కోరారు. మంగళవారం శంఖవరం పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ వేక్సినేషన్ చేయించుకొని ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చునన్నారు. కోవిడ్ కేసులు తగ్గాయని అజాగ్రత్త ఊండకూడదని హెచ్చరించారు. ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రస్తుతం శంఖవరం పీహెచ్సీలో పరిధిలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలో డోర్ టు డోర్ కోవిడ్ సర్వే జరుగుతోందన్నారు. ఇంటికి వచ్చే తమ ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వడం ద్వారా కోవిడ్ టీకా వేయించుకోని వారికి వెంటనే వేక్సిన్ అందించడానికి ఆస్కారం వుంటుందన్నారు.

Sankhavaram

2021-11-30 15:45:55

ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ చాలా కీలకం..

ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ  సర్పవరం జంక్షన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిని దాటి నప్పుడు న్యాయవ్యవస్థ  నియంత్రిస్తుందని అన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని,  సత్వర న్యాయం కోసం కృషి చేయడం న్యాయ దినోత్సవ లక్ష్యం అన్నారు. 1976 లో  రాజ్యాంగంలో39ఎ జతచేసి  ఉచిత న్యాయ సహాయం న్యాయసేవాధికార సంస్థ ద్వారా లభిస్తుందన్నారు. పత్రికా కథనాలను కూడా సుమోటోగా స్వీకరిస్తూ న్యాయస్థానాలు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయన్నారు. మూకుమ్మడిగా ప్రజాప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు, సంస్థలు వారి తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యాల లో  పోరాడుతున్నాయి అన్నారు. న్యాయం గురించి ప్రతి పౌరుడు తెలుసుకుంటే జాతీయ న్యాయ దినోత్సవానికి సార్థకత చేకూరుతుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్ ,ఎం.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-26 15:46:38

స్థూలకాయమే దీర్ఘకాలిక రోగాలకు మూలం..

మానవాళిని పట్టిపీడిస్తున్న ఆధునిక విపత్తే ఊబకాయమని దీంతో పలు దీర్ఘకాలిక రోగాలతో జీవితకాలం తగ్గుతుందని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో స్థూలకాయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఫాస్ట్ ఫుడ్, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, నొప్పి నివారణ మందులు వాడకం వంటివాటితో బరువు పెరుగుతున్నారని అన్నారు. ముఖ్యంగా పొత్తి కడుపు, కంటి భాగం, పిరుదులు, బుగ్గలు, మెడ,  వీపు కింద భాగంలో కొవ్వు బాగా పేరుకు పోతుందన్నారు. దీని నివారణకు గాను క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.    

Kakinada

2021-11-26 15:45:32

ముందస్తు జాగ్రత్తలతోనే తెల్లదోమను నియంత్రణ..

రైతులు పామాయిల్ తోటల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తెల్లదోమను నియంత్రించడానికి వీలుపడుతుందని ఉద్యవన శాఖ అధికారిణి సైలజ పేర్కొన్నారు. శుక్రవారం పిఠాపురం మండల దొంతమూరు గ్రామంలోని పామాయిల్ తోటల్లో తోటబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పామాయిల్ తోటల్లో తెల్లదోమను ఆదిలోనే నియంత్రించకపోతే అది తోట మొత్తం పాకే అవకాశం వుంటుందన్నారు. ముఖ్యంగా పాయిల్ చెట్లకు పసుపురంగు అట్టలను చుట్టి పెట్టుకోవాలన్నారు. ఐసేరియా ఫ్యూమోసోరోస్ ఫంగస్ ద్రవాణాన్ని ఉద్యాన రైతుల సౌకర్యార్ధం రైతు భరోసా కేంద్రాలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఐదు మిల్లీ లీటర్లకు లీటరు నీరుని కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. రైతులు ఏవిధంగా దీనిని తయారు చేసుకోవాలో ఆర్బీకేల్లోని ఉద్యాన సహాయకుల ద్వారా అడిగి తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉద్యాన సహాయకులు, వ్యవసాయ సహాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Pithapuram

2021-11-26 15:42:43

పౌష్టికాహార లోపంతో రక్తహీనత భారినపడతాం..

సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వలన యుక్తవయసు మహిళలు, గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురవుతున్నారని ప్రాణిక్ హీలింగ్ నిపుణులు ఎం.వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు అంగన్వాడి కేంద్రం లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో  ప్రపంచ రక్త హీనత నివారణ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రక్తహీనత మహిళల్లో ఎక్కువగా ఉంటుందని అన్నారు.  ఋతుస్రావం సమయంలో రక్తం నష్టం ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా పురుడు సమయంలో అధిక రక్త స్రావం వలన రక్తహీనత ఏర్పడుతుందన్నారు. కళ్ళు తిరగడం, ఆయాసం, శ్వాసలో ఇబ్బందులు, బడలిక, ఒళ్ళు నొప్పులు, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే రక్తహీనత సమస్యగా  గుర్తించాలన్నారు. దీని నివారణ కోసం  మెంతుకూర, తోటకూర ,గోంగూర, బెల్లం ఉండలు, కొర్రలు, రాగులు, యాపిల్, బత్తాయి, దానిమ్మ  అధికంగా తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారంతో పాటు ఐరన్ టాబ్లెట్లను వైద్యుల సూచనల పై వినియోగించాలని ఎం. వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-26 15:40:27