1 ENS Live Breaking News

మధుమేహంతో జాగ్రత్తలు వహించాలి..

గర్భిణీ స్త్రీలలో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉందని అయితే డెలివరీ అనంతరం రక్తంలో షుగర్ స్థాయి తగ్గి నార్మల్ గా వస్తుందని అయితే  కొందరిలో మాత్రం కొనసాగే అవకాశం ఉందని ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు  యం. వరలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట అంగన్వాడి కేంద్రంలో  బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో గర్భిణీ లలో మధుమేహం నివారణ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు జరిగింది. వరలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలలో మధుమేహాన్ని నివారించడానికి, నియంత్రించడానికి ప్రతి ఏటా మార్చి 10న గర్భిణీలలో షుగర్ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక బరువు, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యంగా గర్భిణీలలో షుగర్ వ్యాధి ఆరో నెల లో  బయటపడుతుందని  అన్నారు. గర్భిణీ సమయంలో వచ్చే షుగర్ వ్యాధి వలన పుట్టినప్పుడు  శిశువు బరువుగా ఉండటం, నెలలు నెలలు నిండకముందే  ప్రసవించడం, ఒకో సారి గర్భంలోనే శిశువు చనిపోయే అవకాశం ఉందన్నారు. గర్భిణీ సమయంలో షుగర్ వ్యాధి వస్తే పోషకాహార నిపుణులను సంప్రదించి ,ఆహార నియమాలు పాటించాలని వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, పద్మావతి పాల్గొన్నారు.

Kakinada

2022-03-10 11:04:40

మహిళలు స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడాలి..

స్వేచ్ఛ, సమానత్వం కోసం  పోరాడాలి ఒకప్పుడు వంటింటికి పరిమితమైన  మహిళ  నేడు అంతరిక్షంలోకి దూసుకుపోయేలా  ఎదుగుతున్నా.. వివక్షత ,వేధింపులు తప్పడం లేదని ప్రముఖ  న్యాయవాది కె. నాగజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తరతరాలుగా మహిళలు చేస్తున్న పోరాట ఫలితంగా ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు అని అన్నారు. మహిళలు  ఆర్థికంగా,  సామాజికంగా ఎదిగేందుకు   అదేవిధంగా  అన్యాయం జరిగితే ఎదిరించేందుకు చట్టాలు అండగా ఉన్నాయన్నారు. మహిళను కించపరిచినా , అవమానించినా , గౌరవ భంగం కలిగించినా  చట్టపరంగా శిక్ష తప్పదని నాగజ్యోతి తెలిపారు.   వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ  వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను ఎంపిక చేసి ఉత్తమ సేవ  పురస్కారాలను అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా  న్యాయవాది నాగజ్యోతి, విలేఖరి నందిని, ఎన్ సి సిఅధికారి, ఉపాధ్యాయురాలు కె. అనిత, లెక్చరర్ జి .పావని, మండల మహిళ సమైక్య కాకినాడ రూరల్ అకౌంటెంట్ ప్రగడ దేవిలను  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ అడ్డాల సత్యనారాయణ,  సాహిత్యవేత్త డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, జానకి రామ, రవిశంకర్ పట్నాయక్ ,రేలంగి బాపిరాజు, పీవీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



Kakinada

2022-03-08 09:05:20

మత్తు పదార్ధాల వలన వచ్చే అనర్ధాలు తెలుసుకోవాలి..

పాఠశాల దశ నుంచే విద్యార్ధినిలు మత్తుపదార్ధాల వలన జరిగే అనర్ధాలపై అవగాహన పెంచుకోవాలని, ఆపై వాటికి దూరంగా ఉండాలని గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపు నిచ్చారు. శంఖవరం మండల కేంద్రంలో లిటిల్ రోజెస్ ఇంగ్లీషు మీడియం స్కూలులో విద్యార్థులకు మత్తు పదార్ధాలు, వాటి వలన కలిగే అనర్ధాలపై  తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా "చేతన" కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, పాఠశాల దశ నుంచే విద్యార్ధులకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం గుడ్ టచ్ బ్యాడ్ టచ్, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, చైల్డ్ సేఫ్టీ తదితర అంశాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ సయ్యద్ నూర్జహాన్,  ఉపాధ్యాయిని సత్యకుమారి, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-03-05 17:58:58

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలకు చైతన్యం..

బయటి వ్యక్తులు చనువు తీసుకొని మాట్లాడే సమయంలో నిర్జన ప్రదేశాల్లో తాకకుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని వేలంగి గ్రామసచివాలయ మహిళా పోలీస్  నాగమణి విద్యార్ధినిలకు సూచించారు.  శనివారం శంఖవరం మండలంలోని  వేలంగి   ఎంపీపీ స్కూలులో విద్యార్ధినిలకు గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అనే అంశంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని విద్యార్ధినిలకు సూచించారు. విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో చక్కగా చైతన్యం కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  ఈకార్యక్రమంలో హెచ్ఎం ప్రియాంక, ఏఎన్ఎం బి.సుబ్బలక్ష్మి, ఆశా కార్యకర్త అనురాధ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Velangi

2022-03-05 17:57:05

రహదారి భద్రత కోసం విద్యార్ధులు తెలుసుకోవాలి..

రహదారి భద్రత కోసం పాఠశాల దశ నుంచే అన్నీ విద్యార్ధులు తెలుసుకోవాలని అదేవిధంగా మైనర్లు మోటార్ వాహనాలు నడుపుతూ ఏదైనా ప్రమాదానికి గురైతే నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవని, నష్టపరిహారాన్ని తల్లిదండ్రులే భరించాలని సచివాలయ మహిళా పోలీస్ గంగగౌతమి పేర్కొన్నారు. శంఖవరం మండలంలోని మండపం గ్రామంలోని జెడ్పీ హైస్కూలులో విద్యార్థులకు మత్తు పదార్ధాలు, వాటి వలన కలిగే అనర్ధాలపై  తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా "చేతన" కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. 18ఏళ్లు నిండ కుండా, లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు నడప రాదని అదేవిధంగా ద్విచక్ర  వాహనం పై ముగ్గురు  ప్రయాణించడం నేరమని గుర్తుంచుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా పెనాల్టీలు విధిస్తున్న సంగతి విద్యార్ధులు గమనించాలన్నారు. అదేవిధంగా  ప్రతి మహిళ తప్పనిసరిగా దిశ యాప్ ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ ఉపయోగించడం ద్వారా రక్షణ పొందుతారని అన్నారు. చరవాణిలో దిశ యాప్ ఉంటే మీ చెంత  రక్షకభటులు ఉన్నట్లేనని మహిళా పోలీస్ గంగ గౌతమి తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Mandapam

2022-03-05 17:55:39

నులిపురుగులను నిర్మూలించాలి..

పిల్ల‌ల్లో నులిపురుగుల‌ను నిర్మూలించేందుకు, ఆల్‌బెండ‌జోల్ మాత్ర‌ల‌ను వారిచేత మ్రింగించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ కోరారు. జాతీయ నులిపురుగుల నివార‌ణా దినోత్స‌వం సంద‌ర్భంగా, ప‌ట్ట‌ణంలోని క‌ణ‌పాక మున్సిప‌ల్‌ ప్రాధ‌మిక పాఠ‌శాల‌లో, అంగ‌న్‌వాడీ కేంద్రంలో ఆల్‌బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని గురువారం ఆయ‌న ప్రారంభించారు. నులిపురుగుల వ‌ల్ల పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌త ఏర్ప‌డుతుంద‌ని, వీటిని నిర్మూలించేందుకు 1-19 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు ఉచితంగా ఆల్‌బెండ‌జోల్ మాత్ర‌ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఈ మాత్ర‌ల‌ను మ్రింగేలా చూడాల‌ని సిబ్బందిని ఆయ‌న ఆదేశించారు.  

          ఈ కార్య‌క్ర‌మ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ మాట్లాడుతూ, నులిపురుగుల నివార‌ణా కార్య‌క్ర‌మం ఆరునెల‌ల‌కొక‌సారి చొప్పున‌, ప్ర‌తీఏటా రెండుసార్లు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం క్రింద ఏడాది నుంచి 19 ఏళ్లు వ‌య‌సున్న సుమారు 4.5 ల‌క్ష‌ల మందికి ఈ మాత్ర‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు, అంగ‌న్‌వాడీ కేంద్రాలతోపాటు, ఇంటివ‌ద్ద ఉండిపోయిన పిల్ల‌ల‌ను కూడా గుర్తించి, మాత్ర‌ల‌ను పంపిణీ చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని తెలిపారు. ఎఎన్ఎంలు, ఆశా కార్య‌క‌ర్త‌లు వీరివ‌ద్ద‌కు వెళ్లి, మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత మాత్ర‌ల‌ను మ్రింగిస్తార‌ని చెప్పారు. ఈ మాత్ర‌లు ఎంతో సుర‌క్షిత‌మైన‌వ‌ని, ఎటువంటి దుష్ప‌రిణామాలు క‌ల‌గ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏడాది నుంచి 2 ఏళ్లు వ‌య‌సున్న పిల్ల‌ల‌కు 200 మిల్లీగ్రాముల‌ మాత్ర‌, 2 ఏళ్లు పైబ‌డిన‌వారికి 400 ఎంజి మాత్ర‌ను సింగిల్ డోసుగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకొని, నులిపురుగుల నిర్మూల‌న‌కు స‌హ‌క‌రించాల‌ని గోపాల‌కృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

           ఈ కార్య‌క్ర‌మంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ ఎం.రాజేశ్వ‌రి, సిడిపిఓ జి.వెంక‌టేశ్వ‌రి, కెఎల్‌పురం అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ వైద్యులు డాక్ట‌ర్ ఉషారాణి, ఆర్‌బిఎస్‌కె జిల్లా మేనేజ‌ర్ పి.లోక్‌నాథ్ ప్ర‌శాంత్‌, పాఠ‌శాల హెచ్ఎం కృష్ణ‌వేణి, అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ శ్రీ‌విద్య‌,  అండ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Kanapaka

2022-03-03 11:54:03

ఎంఎస్ఎన్ ఆస్తులను ప్రభుత్వం కాపాడాలి..

కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం.ఎస్.ఎన్ పి.జి సెంటర్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న బయోడైవర్సిటీ  పార్కుకి కేటాయించిన ఐదు ఎకరాలు వెనుకకు తీసుకోవాలని, ఎమ్.ఎస్.ఎన్ ఆస్తులను కాపాడాలని పిజి సెంటర్ స్పెషల్ ఆఫీసర్ కమల కుమారికి ఎస్ఎఫ్ఐ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా గురువారం కాకినాడలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ, మల్లాడి సత్యలింగ నాయకర్ విద్యాదానం పేరుతో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యను అందించాలనే ఉద్దేశంతో భూములు ఇచ్చారని చెప్పారు. దానిలో భాగంగానే పి.జి సెంటర్ కు 40 ఎకరాలు ఇచ్చారని.. నాయకర్  ఆశయం మేరకు ఈ స్థలంలో విద్యకు సంబంధించిన, విద్యార్థులు సంబంధించిన కార్యకలాపాలు చేయాలని వీలునామా కూడా  రాసి ఉందని గుర్తుచేశారు. నాయకర్ వీలునామా కు వ్యతిరేకంగా పీజీ సెంటర్ లో ఐదెకరాలు బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వ స్థలంలో పార్క్ ఏర్పాటు చేసి  రుసుము వసూలు చేయడం అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడమే అని ఆరోపించారు. జిల్లాల విభజనలో భాగంగా భవిష్యత్తులో పి జి సెంటర్ యూనివర్సిటీ అయ్యే అవకాశం ఉందన్నారు.  యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బయట ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు మాధవ్,  నాయకులు శైలజ రెడ్డి, సుస్మిత, మిన్నీ సైనిక్ భార్గవ్ మేఘన, ప్రసన్న, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-03-03 11:16:55

సచివాలయ సిబ్బంది యూనిఫామ్ ధ‌రించాల్సిందే..

ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫారంను  గ్రామ, వార్డు  స‌చివాల‌య సిబ్బంది త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నెల్లిమ‌ర్ల మున్సిపాల్టీ ప‌రిధిలోని వార్డు స‌చివాల‌యం-04 ను, ఆమె బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. యూనిఫామ్ ధ‌రించ‌ని సచివాల‌య సిబ్బందిపై ఆమె ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.      ముందుగా స‌చివాల‌య సిబ్బంది హాజ‌రు, ఇత‌ర‌ రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది బ‌యోమెట్రిక్ హాజ‌రును త‌నిఖీ చేశారు. ఓటిఎస్‌, జ‌గ‌న‌న్న గృహ నిర్మాణం, పోలియో వేక్సినేష‌న్‌, కోవిడ్ వేక్సినేష‌న్‌, రేష‌న్ కార్డుల జారీ, పెండింగ్ ద‌ర‌ఖాస్తులు, పింఛ‌న్ల పంపిణీ త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. ఓటిఎస్ అమ‌లు జాప్యంపై ప్ర‌శ్నించారు. అర్హులంద‌రికీ ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింపజేయాల‌ని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన వారందరిచేతా ఇళ్లు క‌ట్టించాల‌ని, అర్హులైన కొత్త‌వారికి కూడా 90 రోజుల ప‌థ‌కం క్రింద ప‌ట్టా మంజూరు చేయాల‌ని సూచించారు.  జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ఎంత‌మందికి అందిందీ, తిరిగి రుణాన్ని ఎంత‌మంది చెల్లిస్తున్న‌దీ ఆరా తీశారు. ఇంటింటి చెత్త సేక‌ర‌ణ‌, యూజ‌ర్ ఛార్జీల వ‌సూలుపై విరాలు తెలుసుకున్నారు. దిశ‌యాప్‌ను ప్ర‌తీఒక్క‌రూ డౌన్‌లోడ్ చేసుకొనేలా చూడాల‌ని సూచించారు. ఈ త‌నిఖీలో నెల్లిమ‌ర్ల‌ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.బాలాజీ ప్ర‌సాద్‌, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్‌, తాశీల్దార్ కెవి ర‌మ‌ణ‌రాజు, ఇఓపిఆర్‌డి ఎం.భానూజీరావు, హౌసింగ్ ఎఇ కెవి ర‌మ‌ణ‌రాజు, మున్సిప‌ల్ మేనేజ‌ర్ శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Nellimarla

2022-03-02 14:24:30

సిక్కోలు సఖి సిరులు కురిపించాలి..

సిక్కోలు సఖి బ్రాండ్ పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాలు సాగనున్న  శ్రీకాకుళం జిల్లా ఉత్పత్తులకు మంచి గిరాకీ లభించి, మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు, మండల మహిళా సమాఖ్య, సెర్ఫ్  ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంఘాలు తయారుచేస్తున్న ఉత్పత్తులను 'సిక్కోలు సఖి' పేరుతో మార్కెటింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లోగో, గోడ పత్రికలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మబుగాం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోలు సఖి ఉత్పత్తులు దేశీయంగా అంతర్జాతీయంగా మంచి నాణ్యతతో అందించాలని, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల అందుబాటులో లేని, పరిచయం కూడా లేని ఉత్పత్తులు శ్రీకాకుళం జిల్లాలోనే తయారు కావడం గర్వకారణమని చెప్పారు.  డిఆర్డిఎ పీడీ బి.శాంతి శ్రీ మాట్లాడుతూ జిల్లా ఉత్పత్తులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, అయితే ఇప్పటి వరకూ ఒక బ్రాండ్ పేరు అంటూ ఏదీ లేకపోవడంతో సిక్కోలు సఖి పేరుతో మార్కెటింగ్ చేయాలని నిర్ణయించామని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.శ్రీధర్, పోలాకి జడ్పిటిసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, పలువురు గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

మబుగాం

2022-03-02 08:07:32

ఖచ్చితమైన పనివేళలు పాటించాలి.. డిప్యూటీ సీఎం

ఉపాధి హామీ పథకంలో వేతన దారులకు మూడు గంటల కనీస ఖచ్చితమైన పనివేళలు ఉండేలా చూడాలని, ఏదో వస్తున్నాం.. వెళ్తున్నాం.. అనేలా ఉండకూడదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకి రానున్న ఖరీఫ్ సీజన్లో ఉపయోగపడేలా ఉపాధి హామీ పనులను గుర్తించాలని సూచించారు. ధర్మ లక్ష్మీపురం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాటకర్ తో కలిసి బుధవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగిన డిప్యూటీ సీఎం రికార్డులను తనిఖీ నిర్వహించారు. పేరుపేరునా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని వారు నిర్వహిస్తున్న విధులను అడిగారు. అంతకు మునుపు ఆయన చిన్న కిట్టాలపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డి- వార్మింగ్ మాత్రలను వేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. పాఠ్యాంశాలలో పలు ప్రశ్నలు అడిగారు. భోజనం నాణ్యత గురించి ప్రశ్నించారు. పాలకొండ ఆర్టిఓ టీ వీ జే ఎస్ కుమార్, ఆర్అండ్బి ఎస్.ఈ బి. కాంతిమతి, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, జడ్పీటీసీ వరుదు నాగేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

సావరకోట

2022-03-02 06:17:21

రాష్ట్ర ప్రగతికి రహదారులే చిహ్నం.. డిప్యూటీ సీఎం

ఎక్కడైతే రోడ్ నెట్ వర్క్ బాగుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రోడ్లు మన అవసరం మాత్రమే కాదని, మన ప్రాణాన్ని రక్షించి భద్రతను ఇచ్చేవని చెప్పారు. సారవకోట మండలంలో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వడ్డెనవలస - కొమ్మనాపల్లి, పాకి వలస - జమచక్రం రెండు రోడ్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయని అన్నారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టామని ఇప్పటికే  70 '
శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2022 జూన్ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.  నాడు-నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బి.లాటకర్, పాలకొండ ఆర్టిఓ టీ వీ జే ఎస్ కుమార్, ఆర్అండ్బి ఎస్.ఈ బి. కాంతిమతి, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, జడ్పీటీసీ వరుదు నాగేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

సావరకోట

2022-03-02 05:54:44

పోలియో నిర్మూలనకు రెండే రెండు చుక్కలు..

పసిపిల్లలను  జీవచ్ఛవాలుగా చేసి వారి బంగారు భవిష్యత్తును నరకప్రాయం చేసే పోలియో వ్యాధి ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గొలుగొండ వైస్ ఎంపీపీ జక్కు నాగమణి పేర్కొన్నారు. ఆదివారం జోగుంపేట గ్రామంలో సర్పంచ్ జువ్వల లక్ష్మితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1995 నుంచి ప్రతి ఏటా పల్స్ పోలియో టీకాల కార్యక్రమం జరుగుతుండడంతో పోలియో వ్యాధి నిర్మూలన జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ వ్యాధి రాకుండా ఉండటం కోసం అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని వైస్ ఎంపీపీ జక్కునాగమణి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Jogumpeta

2022-02-27 05:08:47

ఎస్ఐ శోభన్ కుమార్ ను మర్యాదపూర్వంగా కలిసిన మహిళా పోలీసులు..

అన్నవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శోభన్ కుమార్ ను శంఖ వరం మండలంలోని అన్ని గ్రామసచివాలయాలకు చెందిన మహిళా పోలీసులు మర్యాద పూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం సచివాలయ మహిళా పోలీసులు ఎస్ఐని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఎస్ఐ శోభన్ కుమార్ గ్రామసచివాలయ మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.  అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. ముఖ్యంగా పోలీసు సేవలు ప్రజలు అందేలా చూడటంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశయాప్ ను విద్యార్ధినిలు, మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో ఇనిస్టాల్ చేయించి దాని ఉపయోగాలు, వినియోగం వారికి తెలిసేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. త్వరలోనే స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామసచివాలయాలను సందర్శిస్తానని చెప్పారు. ఎస్ఐని కలిసిన వారిలో సచివాలయ మహిళా పోలీసులు, పిఎస్ఎస్ కళాంజలి, జిఎన్ఎస్ శిరీష, గంగ గౌతమి, దుర్గ, స్వర్ణలత, యరకయ్యమ్మ, నీలిమ, రజియాసుల్లానా, రమ్యశ్రీ, చైతన్య, ఉమ అంజని, శ్రావణి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2022-02-26 16:51:20

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలు అవగాహన పెంచుకోవాలి..

మనం బయటకు వెళ్లే సమయాల్లో తెలియని వ్యక్తులు చనువు తీసుకొని  మాట్లాడే సమ యంలో నిర్జన ప్రదేశాల్లో తాక కుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని పెదమల్లాపురం గ్రామసచివాలయ మహిళా పోలీస్ నాగమణి విద్యార్ధినిలకు సూచించారు. శనివారం శంఖవరం మండల పెద మల్లాపురం గిరిజన సంక్షేమ ఆశ్ర ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని సూచించారు. విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో విద్యార్ధినిలకు చైతన్యం కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయినిలు, విద్యార్ధినిలు పాల్గొన్నారు.

Pedamallapuram

2022-02-26 11:39:55