1 ENS Live Breaking News

తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వవైభవం..

తిరుమలలోని పలు ప్రాంతాల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో జిఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతోపదేశం పార్కు, జిఎన్సి నుండి బస్టాండ్ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్దగల నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద రంగురంగుల పుష్పాలు,  పచ్చని మొక్కలతో చక్కగా పార్కులను అభివృద్ధి చేశామన్నారు. స్పెషల్ టైప్, నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్యానవనాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలో అకేషియా చెట్ల స్థానంలో సాంప్రదాయ మొక్కలు పెంచాలని, ఔటర్ రింగ్ రోడ్డులో ఆహ్లాదకరంగా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. 

విభాగాల వారీగా ఎన్నో ఏళ్లుగా లక్షలాదిగా ఉన్న ఫైళ్లు, ఇతర రికార్డులను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటైజ్ చేసి భద్రపరచాలని ఆదేశించారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి టాటా సంస్థ ముందుకు వచ్చిందని, అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. తిరుమల నూతన పరకామణి భవనానికి అవసరమైన యంత్రాలను మరో నెలలోపు సమకూర్చుకోవాలన్నారు. టిటిడిపై వస్తున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని న్యాయ విభాగం అధికారులను కోరారు.

        రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నోడల్ గోశాలలను అనుసంధానం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు. పాలనలో మరింత సమర్థత పెంచేందుకు వీలుగా నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా రోజువారీ పాలన వ్యవహారాల పర్యవేక్షణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని అన్నారు. అనంతరం పే అండ్ అకౌంట్స్, విద్య విభాగాలకు సంబంధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ పరిశీలించారు.   ఈ సమావేశంలో టిటిడి జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ  షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-10-19 16:52:55

ఇక పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులు

ఆంధ్రప్రదేశ్ లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సమయం దాటిని తరువాత ఇచ్చే పిల్లల సంరక్షణ సెలవుల విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సెలవులు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేవి. అయితే వాటిని ప్రభుత్వం పిల్లల సంరక్షరార్ధం 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులను మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవుల తరువాత పది విడతలుగా వీటిని వినియోగించుకునే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తరువాత వారి పిల్లల సంరక్షణలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా ఎవరైనా ఉద్యోగులు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఈ సెలవులను వినియోగించుకంటే మాత్రం వారి సర్వీస్ రెగ్యులైజేషన్ గడువు పెరుగనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి గడుపు తీరిన తరువాత వారి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంతో దీనిని అమలు చేశారు.

Tadepalli

2022-10-19 08:04:49

సమర్ధవంతంగా విధి నిర్వహణ చేయాలి

విధి నిర్వహణలో ఎక్కడా రాజీలేకుండా సమర్ధవంతంగా పనిచేయాలని శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ లకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ మార్గనిర్ధేశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనేవిధంగా పనిచేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐపీఎస్ లలో  ధీరజ్‌ కునుబిల్లి, జగదీష్‌ అడహళ్ళి, సునీల్‌ షెరాన్, రాహుల్‌ మీనా లు ఉన్నారు.

Tadepalli

2022-10-18 07:06:54

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరణ మ్రుదంగం..!

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు ఉద్యోగుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి ఈశాఖలో ప్రత్వం దాని పరిపాలన బాధత్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో కట్టబెట్టకపోవడం, నిర్ధిష్ట ప్రణాళికతో వ్యవహరించడకపోవడంతో అనుకున్న లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. అధికారుల మొండి వైఖరి, గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సిబ్బందిపై తీసుకొస్తున్న ఒత్తిడి కారణంగా ఉద్యోగులు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఒకే ఏడాది విశాఖజిల్లాలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లాలో హార్టికల్చర్ అసిస్టెంట్ సుభాష్ చంద్రవర్మ, కేవలం అధికారుల పని ఒత్తిడి కారణంగానే బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగాఉందో అర్ధంచేసుకోవచ్చు. ఒక విధివిధానం, ముందుచూపు, వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవరిస్తున్న అధికారుల తీరు ఉద్యోగుల ప్రాణాలను హరిస్తున్నాయి.

ఈ-కేవైసీకి ముందుకి రాని బడా రైతులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతుల భూముల వివరాలు, పంటల వివరాలు తెలుసుకోవడంతోపాటు వారికి పంటలు వేసిన సమయంలో ప్రక్రుతి వైపరీత్యాలు వచ్చిన నష్టానికి సహాయం అందించేందుకు గ్రామ సచివాలయాల్లోని హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఆయా ఆర్బీకేల్లో నమోదు చేస్తున్న ఈ-కేవైసీ చేయించుకోవడానికి బడా రైతులు ముందుకి రావడం లేదు. తమకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంగానీ, ఎలాంటి సహాయం వద్దని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పంటలు నమోదు చేసుకోవడానికి చిన్నా, చితకా రైతులు తప్పా మరెవరూ ఆశక్తి చూపించడం లేదు. పైగా ఈ-కేవైసీ ఎందుకు చేయించుకోవాలనే విషయంపై రైతులకు ముందుగా అవగాహన లేకపోవడం కూడా ఈ పరిస్థితి కారణం అవుతోంది. జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రభుత్వం ఈ-కేవైసీ ఎందుకు ప్రవేశపెట్టిందనే విషయాన్ని ముందుగా రైతులకు తెలియజేస్తే దానిపై అవగాహన పెంచుకొని, వివరాల నమోదుకి ముందుకి వస్తారు. కానీ ఆపనిని అరకొరగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.

గ్రామస్థాయిలో పరిస్థితి పట్టని జిల్లాఅధికారులు
గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వున్న ఆర్బీకేల ద్వారా ఈ-కేవైసీ, వివరాల నమోదు బాధ్యతను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారులు  అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీరా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ముందుకి రావకపోవడంతో గ్రామస్థాయిలో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. ఆ విషయాన్ని మండల, జిల్లా అధికారులతోపాటు కలెక్టర్, జెసిలకు చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. తాము చెప్పిన పనిచేయాల్సిందేనంటూ తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. కొంత మంది మొండిగా పని చేయిస్తున్నా..మరికొంత మందికి ఈ ఒత్తిడి మానసి శిక్షగా పరిణమిస్తోంది. గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితి పలానా విధంగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోకపోతే తాము ఇంకెవరికి చెప్పాలంటూ గ్రామ సచివాలయశాఖలో పనిచేసే ఆర్టికల్చర్, అగ్రికల్చర్, సెరీకల్చర్ అసిస్టెంట్లు నెత్తీ నోరూ కొట్టుకుంటూ లబోదిబో మంటున్నారు. ఈ తరుణంలోనే అధికారు ఒత్తిడి తట్టుకోలేక హార్టికల్చర్ అసిస్టెంట్ వర్మ గోదావరినదిలోకి దూకి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

బెదిరింపులు, ఒత్తిడి తోనే ఉద్యోగులతో విధులు
గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందితో జిల్లా అధికారులు తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు చేస్తూనే ఉద్యోగాలు చేయిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తరువాత శాఖల వారీగా జిల్లా అధికారులు సచివాలయాల్లో సిబ్బంది పనిచేసే విధి నిర్వహణను తనిఖీలు చేస్తున్నారు గానీ, టూర్ డైరీలు, డ్యూటీ రిజిస్టర్లు, ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్న విషయాన్ని గానీ పట్టించుకున్నది లేదు. కానీ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలొస్తే మాత్రం ఆ పనిభారాన్ని సచివాలయ సిబ్బందిపై నేరుగా రుద్దేస్తున్నారు.  సచివాలయశాఖలో కూడా కొన్నిశాఖల సిబ్బందికి నేటికీపూర్తిస్థాయిలో పనిలేదు. కొంత మంది ఉన్నా వారంతా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. మరికొందరు పనిచేస్తున్నా అలాంటి వారిపైనే అధికారులు కూడా పనిభారాన్ని తీవ్రంగా మోపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జెసిలు, జిల్లా అధికారులు, మండల స్థాయిలో మండల అధికారులు ఆఖరికి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిలు సైతం ఒకే విధంగా ఉద్యోగులపై తీవ్రస్థాయిలో బెదిరింపులు, ఒత్తిడి తీసుకు వచ్చి మాత్రమే పనిచేయిస్తున్నారు. మరికొంత మంది అధికారులు ఒక అడుగు ముందుకేసి పులిహోర కలిపి వారి, అవసరాలు తీర్చుకునే పనులు కూడా చేపట్టారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ప్రభుత్వశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం
గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత సదరుశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా శాఖల అధికారుల్లో సమన్వయం పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. సచివాలయ శాఖలో ఉన్న 19శాఖలకు సంబంధించిన ఆయాశాఖల ముఖ్యల కార్యదర్శిలు, కమిషనర్లు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంల నుంచి ఉత్తర్వులు రాకపోయినా..సచివాలయ సిబ్బంది సదరు ప్రభుత్వశాఖ ద్వారా జారీ అయిన ఉత్తర్వులను సేకరించి ఈ విషయాన్ని మండల అధికారులకు తెలియజేసినా..చూపించినా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. తమకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేస్తే తప్పా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వచ్చినా వాటిని అమలు చేసేది లేదంటే వాటిని ఏమీకాకుండా పక్కన పడేస్తున్నారు. పైగా సచివాలయంలోని ఎవరిశాఖల ఉద్యోగాలు, వారి శాఖల విధులు చేసుకోనీయకుండా మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు తీవ్ర ఒత్తిడిలు తీసుకొస్తున్నారు. 

ఒక్కముక్కలో చెప్పాలంటే మండల శాఖ అధికారులే సచివాలయశాఖ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలుగా వ్యవహరించడం విశేషం. ఒక్క విధి నిర్వహణలోనే కాకుండా పర్మిషన్లు, సెలవులు, సభలు సమావేశాలకు వెళ్లాలన్నా కూడా మండల అధికారుల అనుమతి కావాలని ఆదేశించి వాటిని కార్యదర్శిల ద్వారా అమలు చేయడం కూడా సచివాలయ సిబ్బంది విధి నిర్వహణకు, పనిఒత్తిడికి కారణం అవుతోంది. కేవలం జిల్లా కలెక్టర్ నుంచి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిల వరకూ పరిపాలన విషయంలో సమన్వయం లేకపోవడమే ఉద్యోగులపై ఒత్తిడికి కారణం గా కనిపిస్తున్నది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తరువాత మరో ఉద్యోగం చూసుకొని వెళ్లిపోతున్న ఉద్యోగల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలకు రిజైన్ చేసి కూడా వెళ్లిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా జిల్లా అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో పనిఒత్తిడి అధికమై సచివాలయ సిబ్బంది బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్రుష్టిసారించకపోతే ప్రజలకు సేవలందించే సచివాలయ ఉద్యోగుల పడుతున్న తీవ్రమైన ఒత్తిడి, అధికారుల మొండి వైఖరి, వ్యహార తీరుపై వ్యతిరేకత, నిరసన అధికమై ప్రభుత్వానికి మచ్చ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!

Amaravati

2022-10-18 05:58:09

5 మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది ప్రవేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కొత్తగా ఏర్పాటు కానున్న ఐదు వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. శనివారం విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ లు చేపట్టేందుకు అవసరమైన వసతులు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. ఈ ప్రాంతాల్లో భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నందున ఆయా ప్రదేశాల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన అదనపు వసతులు కల్పిస్తూ భవనాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

 జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాల భవనాల నిర్మాణ పరిస్థితి, బోధనాసుపత్రిగా రూపొందించనున్న జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కల్పిస్తున్న అదనపు వసతులు ఏ మేరకు జరుగుతున్నాయనే పరిశీలన  చేసే నిమిత్తం ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు  జిల్లా కేంద్రంలో పర్యటించారు. తొలుత గాజులరేగ వద్ద నిర్మాణంలో వున్నా వైద్య కళాశాల భవనాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వచ్చే డిసెంబర్ నాటికి వైద్య కళాశాల భవనాలు సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థ ఎన్.సి.సి. ప్రతినిధులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్య కార్యదర్శి  బోధనాసుపత్రిగా మార్పు చేయనున్న దృష్ట్యా దీనికి అవసరమైన అదనపు సౌకర్యాల కల్పన ఏ మేరకు జరిగిందనే విషయం తెలుసుకునేందుకే ఈరోజు పర్యటిస్తున్నట్టు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. 

ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల్ని ఏర్పాటుకు నిర్ణయించారని, దీనిలో భారత వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రి సిద్ధంగా వున్నచోట వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకుల నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించి కొందరిని ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన పోస్టులకు నియామకాలు వచ్చే  వారంలో చేపడతామన్నారు. 

2022-10-15 11:27:03

ఏపీ ప్రభుత్వం దిమ్మతిరిగే ఉత్తర్వులు.. 17నుంచి పులుసు కారిపోద్ది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా జిల్లా కలెక్టర్లతో ఎన్ని వార్నింగులు ఇచ్చినా అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చాలా సీరియస్ గా తీసుకుంది. 17వ తేదీ నుంచి ప్రతీ ఉద్యోగి ఉదయం పదగంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధి నిర్వహణలో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీనెలా 75 ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇలా మొత్తం వారి మాన్యువల్, బయో మెట్రిక్ అటెండెన్సు సాధారణ పరిపాలనశాఖకు పంపించాలని పేర్కొంది.  

ఇకపై ఉద్యోగులు విధినిర్వహణలో చేసిన విధులకు సంబంధించి మాత్రమే జీతబత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోబుతన్నారనే వార్నింగ్ కూడా ఉత్తర్వులతో పేర్కొంది. ఇటీవలే ఐఏఎస్ అధికారులకు సైతం ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు అమలు చేసిన ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలనే ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లుపరిగెట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్నిఆదేశాలిచ్చినా వాటి అమలు చేయని ప్రభుత్వ శాఖలు తాజాగా ఇచ్చిన ఈ టైమింగ్ ఉత్తర్వులను ఏవిధంగా పాటిస్తారు.. ఏ మరకు విధిర్వహణ సాగిస్తారనేది..!

2022-10-15 10:44:58

ఏపీ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఆమోఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు అమోఘమని, అందరికీ ఆదర్శనీయమని ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పద్దతులను తెలుసుకునేందుకు రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం  తాము గమనిస్తున్నామని, వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకే నేడు ఇక్కడకు వచ్చామన్నారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్, ఇతర అధికారులు రాష్ట్రంలో రైతులకు  పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా  అమలు చేయబడుచున్న పలు పథకాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.

 విత్తు నుండి విక్రయం వరకూ అన్నిరకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేసే “వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల”  ఏర్పాటు, వాటి పనితీరు, వాటివల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలను బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఎంతో ఆసక్తితో తెలుసుకున్నారు. అందుకై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న పలు అప్లికేషన్లపై ఆరాతీశారు.  ముఖ్యంగా ఆర్.బి.కె.ల్లో ఏర్పాటు చేసిన  డిజిటల్  కియోస్క్ ల వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు, ఇ-క్రాప్ బుకింగ్, పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాలను అమలు పర్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను  ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పతుల మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటూ అందుకై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. 

జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ…..
గత మూడునర్రేళ్ల జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ అనే స్థాయిని తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర  వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ కు తెలిపారు.  రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778  వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను  ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తు నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తున్నామని  తెలిపారు.  ఇ-క్రాప్ నమోదు నుండి  బ్యాంకింగ్  సేవల వరకూ అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తూ బహుళార్ధక సాధక కేంద్రాలుగా ఈ ఆర్.బి.కే.లు పనిచేస్తున్నాయని వివరించారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 83 శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, వారిలో ఐదు ఎకరాల లోపు సాగు భూమి కలిగిన రైతులు ఎక్కువ మంది వున్నారన్నారు.  అటు వంటి చిన్న సన్నకారు రైతులు అందరినీ ఆదుకునేలా ప్రభుత్వం పలు అభివృద్ది సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ల్యాబ్ టు ల్యాండ్ మరియు ల్యాండ్ టు ల్యాబ్ విధానంతో  రైతులు అందరికీ ఆధునిక వ్యవసాయ పద్దతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.    రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న విధానంతో  రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్.బి.కె.లను ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలను రైతులకు అందజేస్తున్నారన్నారు.  ఫలితంగా దేశంలోని పలు వ్యవసాయ ఉత్పత్తులకు  ఆంద్రప్రదేశ్ ప్రముఖ కేంద్రంగా మారిందన్నారు. ధాన్యం, చేపలు, పండ్లు తదితర ఉత్పత్తులకు ఆంద్రప్రదేశ్  దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచినట్లు ఆమె వివరించారు. 

రాష్ట్ర వ్యసాయ శాఖ కమిషనర్  హరి కిరణ్, ఉద్యావన శాఖ  కమిషనర్  డా.శ్రీధర్,  ఏ.పి.ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఇ.ఓ. ఎల్.శ్రీధర్ రెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి. ఎ.విష్ణువర్థన రెడ్డి తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్దికి,  వ్యవసాయ యాంత్రీకరణకు, రైతులకు  ఉత్తమ వ్యవసాయ పద్దతులు అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ తో పాటు పొలిటికల్ ఎకానమీ ఎడ్వైజర్  నళిని రఘురామన్, సీనియర్  ట్రేడ్ ఎడ్వైజర్  పియూష్ అవాస్తి, ప్రాస్పరిటీ ఎడ్వైజర్ జావైద్ మళ్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

2022-10-14 11:58:00

సూర్యగ్రహణం రోజున ఉ..8వరకే సత్యదేవుని దర్శనాలు

శ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో ఈనెల 25వ సూర్యగ్రహణం సందర్భంగా స్వామవారి దర్శనాలు ఉదయం 4 గంటల నుంచి 8గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారని దేవస్థానం అధికారులు ఒక ప్రకనటలో తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు స్వామివారి ఆలయం మూసివేసి 26వ తేదిన ఉదయం తెల్లవారుజామున తెరుస్తారని పేర్కొన్నారు.  స్వామివారి వ్రతముల టికెట్లు  ఉ "08.00 గంటల వరకు మాత్రమే ఇస్తారని.. వివిధ సేవలు,  హోమములు ఉ"07.00 గంటలకు ప్రారంభించి 10.30 ని.లకు ముగించిన తరువాత ఆలయం మూతవేస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

2022-10-14 09:17:37

గ్రామ సచివాలయాల్లోనే మేరేజి సర్టిఫికేట్లు..

తలంబ్రాలు..జీలకర్రా బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఇలా కనుల పండుగగా జరిగే పెళ్లిళ్లకు ఇచ్చే ద్రువీకరణ పత్రం విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఒకప్పుడు పంచాయతీలు, దేవస్థానాల్లో ఇచ్చే ఈ పెళ్లి ద్రువీకరణ పత్రాలకు వధూవరూలు అమ్యామ్యాలు ఇస్తే తప్పా ఆ ద్రువీకరణ పత్రాలు చేతికి వచ్చేవి కాదు. దేవస్థానాలు, పంచాయతీల్లో ఈ సర్టిఫికేట్ దర కేవలం రూ.50 నుంచి రూ.100 మాత్రమే. అయితే గతంలో పంచాయతీలు, దేవస్థానాలుండే చోట అయితే రూ.5వేల వరకూ పంచాయతీ సిబ్బంది నొక్కేసేవారు. కానీ అలాంటి ముడుపుల ద్రువీకరణ విధానాలు ఇకపై ఉండకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి ద్రువీకరణ పత్రాలు జారీచేసే అధికారాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. వధూవరులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెళ్లైన తరువాత 60 రోజులు, పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సచివాలయాల్లోనే ద్రువీకరణ పత్రాలు ఇస్తారు. ఆ సమయం దాటితే మాత్రం రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాల్సి వుంటుంది. 

వివాహ ద్రువపత్రం కావాల్సిన వారు వధూవరుల ఆధార్ కార్డులు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పెళ్లి శుభలేఖ, ఒక వేళ ఏదైనా గుడిలో జరిగితే అక్కడ తీసుకున్న ద్రువీకరణ పత్రం, మండపం రసీదులు, పెళ్లిఫోటో జతచేసి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆపై వెంటనే పెళ్లి ద్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవస్థానాల దగ్గర్లో ఉండే పంచాయతీలు, తేడా కార్యదర్శిల చేతి వాటానికి అడ్డుకట్టవేసినట్టు అయ్యింది. అందేకాకుండా పాస్ పోర్టు, రేషన్ కార్డు, ఇంటి నిర్మాణాలు ఇలా చాలా వాటికి ఇపుడు పెళ్లి ద్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో చేతివాట పూర్తిగా తగ్గనుంది. ఒకవేళ ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తే సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

2022-10-14 07:10:48

అనంతలో భారీ వర్షాలు..కుటుంబానికి రూ.2వేలు

అనంతపురంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం  వైయస్‌.జగన్మోహనరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో కురుస్తున్న వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వివరించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం ఆరా తీశారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 
అదే సమయంలో  హఠాత్తుగా కుండపోత, ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి వివరాలను కూడా సీఎం ద్రుష్టికి అధికారులు తీసుకొచ్చారు. వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు బియ్యం, పామాయిల్‌, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలన్నారు. 
వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారుచేసి నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు..
 

2022-10-13 05:24:58

తిరుమ‌ల‌లో బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు

తిరుమ‌ల‌లోని త‌డిచెత్త ద్వారా బ‌యోగ్యాస్ ఉత్ప‌త్తి చేసేందుకు టీటీడీ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐఓసిఎల్‌)తో ఎంఓయు కుదుర్చుకుంది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టీటీడీ ఎస్ఇ - 2   జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఐఓసిఎల్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  అనీల్‌కుమార్ ఎంఓయు  ప‌త్రాల‌ను మార్చుకున్నారు.  స్వ‌చ్ఛ తిరుమ‌ల‌లో భాగంగా టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా టీటీడీ రూ.6 కోట్లు, ఐఓసిల్ రూ.6 కోట్లు క‌లిసి మొత్తం రూ.12 కోట్ల‌తో రెండు ఎక‌రాల విస్తీర్ణంలో తిరుమ‌ల‌లో ప్లాంట్‌ను  ఏర్పాటు చేయ‌నున్నారు. 

ప్ర‌తి రోజు 35 ట‌న్నుల వ్య‌ర్థాల‌ను ఇందు కోసం వినియోగిస్తారు. తిరుమ‌ల‌లో రోజుకు 3.5 నుండి 4.5 మెట్రిక్‌ ట‌న్నుల గ్యాస్ అవ‌స‌రం కాగా, ఇందులో 1.6 మెట్రిక్ ట‌న్నుల గ్యాస్ ఈ ప్లాంట్ నుండి ఉత్ప‌త్తి అవుతుంది. దీనిని అన్న‌ప్ర‌సాదాల త‌యారీ కేంద్రంలో వినియోగించాల‌ని నిర్ణ‌యించారు. ఈ సమావేశంలో ఓఎన్‌జిసి సిజిఎం  సూర్య‌నారాయ‌ణ రాజు, జిఎం  సుబ్ర‌మ‌ణ్యం, టీటీడీ ఇఇ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 13:36:23

ఇక ఐఏఎస్ లకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచనలం రేపుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొత్త విధానాలను అమలు చేయడం, వాటిని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులతో సైతం పాటించేలా చేయడం ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకూ అందరూ అధికారులేనని..వారంతా విధి నిర్వహణకు వచ్చినపుడు అటెండెన్సు తప్పక వేయాలనే నిర్ణయం ఇపుడు ఏపీలోని సివిల్ సర్వీస్ అధికారులను సైత ఆలోచింపచేస్తున్నది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ఇపుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అందరు అధికారులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేయాలి. దానికోసం యాప్ డౌన్ లోడ్ చేయాలి.

ఇప్పటికే ఈ విధానం రాష్ట్ర సచివాలయంలోని ఐఏఎస్ లకు ఇతర రాష్ట్రస్థాయి అధికారులకు అమలు చేయగా.. దానిని 26 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులంతా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జీఏడీ నుంచి అందరికీ ఆదేశాలొచ్చాయి. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఒక విధానంలో అటెండెన్సు వేస్తే అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు, సిబ్బంది పాటిస్తారనేది ప్రభుత్వ ఆలోచన దీనికోసం నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడం విశేషం. ఇప్పటి వరకూ బయో మెట్రిక్ అటెండెన్సు మాత్రమే ప్రభుత్వశాఖల్లో అందుబాటులో ఉండేది. ఇపుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే అన్ని శాఖల వారు అటెండెన్సు వేయాల్సి వుంటుంది. 

ఇలా చేయడం ద్వారా విధి నిర్వహణలో జవాబుదారీతనం వుంటుందని, జిల్లా కార్యాలయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసిన అధికారులు వారి పర్యటనలో కూడా ముఖ్యంగా దీనినే పర్యవేక్షణ చేస్తారని సీఎం కార్యాలయం భావిస్తోంది. చాలా చోట్లు బయో మెట్రిక్ అటెండెన్సులు వున్నా దానిని సక్రమంగా నిర్వహణ చేయడం లేదు. వినియోగించడం లేదు. దీనిని పూర్తిస్థాయిలో గమనించిన ప్రభుత్వం తొలుత ఐఏఎస్ అధికారులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు అమలు చేస్తే అన్నిశాఖల అధికారుల్లోనూ, సిబ్బంది విధిగా పాటిస్తారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు ద్వారా సివిల్ సర్వీస్ అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోలేదు. 

ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని అందరు ఐఏఎస్ అధికారులతోపాటు మిగిలిన సివిల్ సర్వీస్ అధికారులంతా ఇపుడు వారి వారి మొబైల్ ఫోన్ లలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని ఇనిస్టాల్ చేస్తున్నారు. ఈ విధానం ఎంత పక్కాగా మిగిలిన శాఖల్లోని అధికారులు, సిబ్బందితో ప్రభుత్వం అమలు చేస్తుందనేది ముందు ముందు తేలుతుంది. అటెండెన్సు ద్వారానే నెలవారీ జీతం వస్తుందనే మెలికను కూడా ప్రభుత్వం పొందు పరచడం విశేషం. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంలోని కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులంతా విధి నిర్వహణకి డుమ్మాకొట్టడానికి వీలుపడదు సరికదా..కాకిలెక్కలు..చిలపలుకులు పలకడానికి ఆస్కారం లేకుండా పోతుంది..!

2022-10-12 05:07:00

ఏడాదిలో విజ‌య‌వంతంగా 729 హార్ట్ సర్జరీలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి)లో ఏడాది కాలంలో 729 హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, శ్రీ‌వారి ఆశీస్సుల‌తో చిన్నారుల‌కు పున‌ర్జ‌న్మ ప్ర‌సాదించిన‌ట్లు టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి చెప్పారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో మంగ‌ళ‌వారం ఈవో మీడియా తో మాట్లాడారు.  గ‌త ఏడాది అక్టోబ‌రు 11వ తేదీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 70 ప‌డ‌క‌లు, 3 ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ల‌తో ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్లు చెప్పారు. ఆసుప‌త్రి ప్రారంభించిన ఏడాది కాలంలో దేశంలోనే అత్యున్న‌త వైద్య సేవ‌లు అందించే 10 ఆసుప‌త్రుల‌లో ఒక‌టిగా  గుర్తింపు తెచ్చుకుంద‌ని తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద రాష్ట్ర ప్ర‌జ‌లు, ఆయుష్మాన్ భార‌త్‌ ద్వారా ఇత‌ర రాష్ట్రాల రోగులకు ఉచితంగా చికిత్స‌లు అందిస్తున్నామ‌న్నారు.

       ఒక బిడ్డ‌ గుండె శ‌స్త్ర‌ చికిత్సకు ల‌క్షల‌ రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, ఆ ఖ‌ర్చును భ‌రించే దాత‌ల కొర‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆప‌న్న హృద‌యాల‌య స్కీం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఈ స్కీంకు విరాళాలు అందించే దాత‌ల‌కు ఐదు బ్రేక్ టికెట్లు అందిస్తున్నామ‌న్నారు. ఒక పేషంట్‌కు స‌ర్జ‌రీ చేసిన ఘ‌న‌త దాత‌ల‌కు వ‌స్తుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎస్వీ ఆప‌న్న హృద‌యాల‌య స్కీంకు 150 మంది దాత‌లు విరాళాలు ఇచ్చార‌న్నారు. జీవ‌న్ దాన్ లైసెన్స్‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు, దాత‌లు ఎవ‌రైనా గుండె ఇస్తే పిల్ల‌ల‌కు గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్స‌లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ముఖ వైద్య నిపుణులు ఆసుప‌త్రిలో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు.  

         శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రికి 2022 మే 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భూమి పూజ నిర్వ‌హించార‌ని, రూ.320 కోట్ల‌తో 350 బెడ్ల‌తో అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో చిన్న పిల్లల ఆసుప‌త్రి మ‌రో రెండు సంత్స‌రాల‌లో అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆసుప‌త్రి నిర్మాణానికి 160 మంది దాత‌లు రూ.కోటి చొప్పున విరాళంగా ఇచ్చార‌ని, వీరికి ఉద‌యాస్త‌మాన సేవ టికెట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో స్విమ్స్‌, బ‌ర్డ్‌, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రుల‌ను అనుసంధానిస్తామ‌న్నారు. త‌ద్వారా రోగుల‌కు మ‌రింత త్వ‌రిత గ‌తిన నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందిచ‌వ‌చ్చ‌ని చెప్పారు. త్వ‌ర‌లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్ ( సెంట్ర‌లైజ్డ్ ల్యాబ్‌)ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఈవో తెలిపారు.  బ‌ర్డ్ ఆసుప‌త్రిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక‌ సిటి స్కాన్‌, ఎక్స్ రే సేవ‌ల‌ను తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల రోగులు నేరుగా వ‌చ్చి త‌క్కువ ఫీజు చెల్లించి వినియోగించుకోవ‌ల‌సిందిగా ఈవో కోరారు.  

        శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుప‌త్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ, ఆసుప‌త్రిలో 30 మంది ప్ర‌ముఖ గుండె వైద్య నిపుణులు ఒక టీంగా ఏర్ప‌డి నిరంత‌రం చిన్న‌పిల్ల‌ల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. గుండె స‌మ‌స్య‌లు ఉన్న పిల్ల‌ల‌ను స‌రైన స‌మ‌యంలో ఆసుప‌త్రికి తీసుకురావ‌ల‌న్నారు. దేశంలోని 10 ప్ర‌ముఖ ఆసుప‌త్రుల‌లోని డాక్ట‌ర్లు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో  ఉచితంగా సేవ‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా త్వ‌ర‌లో ఫెలోషిప్ కోర్సులు పీడియాట్రిక్‌, అన‌స్థీషియా, త‌దిత‌ర కోర్సులు అందించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు వివ‌రించారు.  జెఈవో  వీర బ్రహ్మం, సిఎంవో  ముర‌ళీధ‌ర్, చిన్న పిల్లల హృదయాలయం ఆర్ఎంఓ డాక్టర్ భరత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

2022-10-11 12:18:43

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ కోల్పోయింది రూ.లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ విభజనలో హైదరాబాదులో ఒక్కచోటే రాజధాని ఉండటం ద్వారా కోల్పోయిన విలువైన ఆస్తులు, ప్రభుత్వకార్యాలయాలు, కర్మాగారాలు లెక్కేలేదు. ఇదంతా రాష్ట్రప్రజలు పన్నులతో నిర్మించిన రాజధానిని కేవలం విభజన ద్వారా మనకు రావాల్సిన ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల్లో మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. విభజన జరిగిన 13ఏళ్లకు గానీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా హైదరాబాదు నుంచి తెచ్చుకోలేకపోయామంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రాల అభివ్రుద్ధిలో వికేంద్రీకరణ ప్రముఖ పాత్రపోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రం విడిపోయిన తరువాత కానీ తెలిసిరాలేదు. అలాగని కేంద్రం కూడా ఏపీని ఆదుకోవడంలో ముందుకు వచ్చిందా అంటే అదీ లేదు. కేవలం నిర్లక్ష్యం వహించిందనే చెప్పాలి. నేటికీ విభజన హామీలు పూర్తికాలేదంటే అతిశయోక్తికాదేమో. ఒకేచోట రాజధాని ఉండాలనుకునే రాజకీయపార్టీలు, ఒక వర్గం ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటే ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకొని తీరాలి కూడా. అంత విలువైన సంపదను, భవిష్యత్లును ఏక రాజధాని వలన ఏపీ కోల్పోయిందనే విషయాన్ని ముందుగా యువత గుర్తించాల్సి వుంది.

ఏపీ రాజధాని కోల్పోయిన ఆస్తులు రూ. వేల కోట్లలోనే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా విడిపోయిన తరువాత మనం, మన రాష్ట్రం కోల్పోయింది అసెంబ్లీ, శాసనమండలి, హైదరాబాద్ రైల్వేజోన్, ఆయుర్వేద ఫార్మసీ, యునానీ ఫార్మసీ, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంధ్రభారతి, అసెంబ్లీ క్వార్టర్స్, సచివాలయ భవన సముదాయం, సాలర్జంగ్ మ్యూజియం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ విభజనలో ఏమీకాకుండా కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అలాగని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా కేంద్రం విభజనలో ఇప్పటి వరకూ ఏపీకి కేటాయించలేదు. నిర్మించలేదు. నేటికీ తెలంగాణకి విభజన తరువాత మిగిలిన లక్షల కోట్ల ఆస్తుల్లో ఏపీ నేటికీ ఏమీ సమకూర్చుకోలేకపోయింది. దానికి కారణం రాజధాని లేకపోవడం, ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయాలనే పట్టుదల ఉండటం. అదే సమయంలో రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఆలోపాలన్నీ పెద్ద గ్రంధమే అవుతుంది.

ఏక రాజధాని వద్దు..మూడు రాజధానులే ముద్దు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత జరిగిన తీవ్రమైన నష్టాన్ని ఏకరాజధానిగా అనుకున్న అమరావతి ద్వారా కూడా గత ప్రభుత్వం ద్వారా మనం పూడ్చుకోలేకపోయాం. అంతేకాకుండా విభజన ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన సంస్థలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సదుపాయాలు, ఆర్ధిక సహాయం కూడా పూర్తిస్థాయిలో రాకుండా పోయాయి. రాష్ట్రవిభజన జరిగిన తరువాత కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చే విశాఖలాంటి రైల్వే డివిజన్ ను సైతం కేంద్రం నేటికీ రైల్వే జోన్ గా ప్రకటించలేదు. ఉమ్మడి రాజధానిగా ఉండటం వలనే హైదరాబాదు సాఫ్ట్ వేర్ హబ్ గా అవతరించింది. హైటెక్ సిటీలాంటి సంస్థలు నిర్మాణాలు జరిగాయి. ఇపుడు ఆ పరిస్థితి ఏపీలో కూడా రావాలంటే ఒకేచోట రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాదని, దానిని వికేంద్రీకరణ చేయడం ద్వారానే వస్తుందని ప్రభుత్వం బలంగా నమ్మి దానిని చట్టం రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది. దానిని ఒక వర్గం ప్రజలు వ్యతిరేకించినా..అత్యధికశాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రాజధాని మాత్రమే ఉండటం ద్వారా ఏమోం కోల్పోయామో అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని అన్ని వర్గాల ప్రజలు కూడా అభివ్రుద్ది వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారు.

మూడూ రాజధానులతో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోశాసన రాజధాని, కర్నూలో న్యాయరాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుచేయాలనే ఆలోచనతో చేస్తున్న కార్యాచరణకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తున్నది. ఫలితంగా మూడు ప్రాంతాల్లో ఒకేసారి అభివ్రుద్ధి ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా అన్నివర్గాల ప్రజలకు విద్య, ఉపాది, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఏర్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక వర్గం ఆందోళనతో ఇపుడు మూడు రాజధానుల విషయాన్ని రాజకీయం చేయాలని చూసినా మెజార్టీప్రజలు మూడు రాజధానులు కోరుకోవడం ద్వారా అంతా ఆలోచించే పరిస్థితి నెలకొంది. మూడు రాజధానులు ఏర్పాటు అయితే అటు కేంద్రం నుంచి రావాల్సిన కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా మూడు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయడానికి, రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుంది. ఏపీలో సాఫ్ట్ వేర్ రంగాన్ని బోలోపేతం చేయాలన్నా, న్యాయవిభాగాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేర్చాలన్నా, పరిపాలనను వికేంద్రకరించాలన్నా, అభివ్రుద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నా.. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు అత్యంత ముఖ్యమని అంతా భావించాలి. ఒక రాజకీయ పార్టీ, ఒక వర్గం రాజకీయానికి రాష్ట్రాభివ్రుద్ధి విఘాతం అయితే దానిని ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ తిప్పికొట్టాల్సిన సమయం ఆశన్నమైంది. తద్వారా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసే ప్రక్రియలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి..మూడు రాజధానులతోనే నిజమైన అభివ్రుద్ధి, మూడు ప్రాంతాలకు ఆత్మగౌరవం దక్కుతుందని గమనించాలి..!

2022-10-11 02:33:00

గ్రామస్వరాజ్య సాధన దిశగా సచివాలయాలు

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం భారతదేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నేటితో ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. ఇంటి ముంగిటే ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో సుమారు 19శాఖల సిబ్బందిని ఒకే గూడులో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలోని 26 జిల్లాల పరిధిలోని ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ఈ శాఖలోని 14వేల 5 సచివాలయాల ద్వారా సేవలులు అందిస్తున్నారు. ఒక్క గ్రామసచివాలయం ద్వారానే 750 ప్రభుత్వ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రప్రభుత్వం సేవలను విడతల వారీగా అందుబాటులోకి తీసుకుస్తూ ప్రజలకు సచివాలయాలను చేరువ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇపుడు దేశం మొత్తాన్ని రాష్ట్రంవైపు చూపు తిప్పుకునేలా చేస్తున్నది.

గ్రామంలోనే స్పందన పరిష్కారాలు
గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా సమస్యల వేదిక స్పందనను అన్ని సచివాలయాల్లోనూ ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు పరిష్కరించేలా క్రుషి చేస్తున్నది. ఒకప్పడు స్పందన కార్యక్రమం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రజలు ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోని తమ సమస్యలను విన్నవించుకొని ఇప్పుడిప్పుడే పరిష్కారాలు పొందుతున్నారు. తద్వారా వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన చాలా వరకు పనులు ఇక్కడే పరిష్కారమవుతున్నాయి. ఒకప్పుడు ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇపుడు ఆ సేవలు కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు, సర్టిఫికేట్లు సచివాలయాల ద్వారానే ప్రభుత్వం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నది.

గ్రామాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
ప్రభుత్వ కార్యాలయాలంటే ఒకప్పుడు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉండేవి. కానీ గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఒక్కోచోట మూడు పక్కా ప్రభుత్వ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీనితో ప్రతీ గ్రామంలోనూ ఇపుడు ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో కళ కళ లాడుతున్నాయి. 104, 108 సేవలు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే విలేజ్ క్లినిక్ ప్రారంభం అయితే గ్రామాల్లోనే అవ్వా, తాతలకు ప్రాధమిక వైద్యసేవలు కూడా గ్రామాల్లోనే అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన తరుణంలో ప్రజలకు కూడా అన్ని అంశాలపై అవగాహన వస్తున్నది.

జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు తీసుకు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ విషయంలో అధికారులు అంటీ ముట్టనట్టు వ్యవహరించడం వలన ఇంకా గ్రామ సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహనలేదనే విషయం ప్రతీ సోమవారం జాల్లా కలెక్టర్ కార్యాలయం, కమిషనరేట్ లలో నిర్వహించే స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలే స్పష్టం చేస్తున్నాయి. కలెక్టర్, కమిషనర్ గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే యూనిఫాం, ఉద్యోగుల డ్యూటీచార్ట్, స్పందన దరఖాస్తులు, పారిశుధ్యం, వినతుల పరిష్కారం, సచివాలయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచే విషయం, ప్రాపర్ ఛానల్ విధానాలు, శాఖాపరమై విధులు, బాధ్యతలు(గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, కమిషనర్ కార్యాలయం, మండల కార్యాలయాలు, జిల్లాశాఖల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే జీఓలు, వాటిని ఒక విధానంలో అమలు చేసే ప్రక్రియ)పై అధికారులు ద్రుష్టి సారించడం లేదు.

ఈ విషయంలో మండల, జిల్లా అధికారులను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం ఈపాటికే పూర్తిస్థాయిలో నెరవేరి గ్రామ స్వరాజ్య స్థాపన జరిగేదనే విషయాన్ని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా మండలాలు, జిల్లాల్లో అధికారులు పూర్తిస్థాయి అధికారులు కాకపోవడం, ఇన్చార్జి పాలనే పూర్తిస్థాయిలో కొనసాగం, చాలా సంవత్సరాల తరువాత కార్యదర్శిల నుంచి జిల్లాఅధికారుల వరకూ ఎక్కువ మంది సిబ్బందిని ఒకేచోట చూడటం, ఆపై తమలోని ప్రత్యేకను సిబ్బందిపై రుద్దడం తదితర అంశాలు కూడా ప్రజా సేవలకు విఘాతం కలిగిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రశాఖల ముఖ్యకార్యదర్శిల నుంచి జీఓలు నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. దానిపై జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు సైతం ద్రుష్టి సారించడం లేదు. ఒక్కోసారి సదరు జీఓలు మండల కేంద్రాలకు వచ్చినా వాటిని ఎంపీడీఓలు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఈ విషయాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి పూర్తిస్థాయిలో గాంధీజి కలలు గన్న గ్రామస్వరాజ్యం గ్రామాల్లో సిద్ధిస్తుందనే వాదన కూడా సర్వత్రా బలంగా వినిపిస్తోంది..!

Guntur

2022-10-02 07:10:53