1 ENS Live Breaking News

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఆప్కాస్ చొరవ ప్రశంసనీయం

వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ ఐ సమస్యల పరిష్కారం కోసం అప్కాస్(ఎపి కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్  సర్వీసెస్) చూపుతున్న చొరవ ప్రశంసనీయమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ అన్నారు.  ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇఎస్ఐ కార్డులను ఆయన అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఏపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అప్ కాస్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నివాస్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇపిఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆప్కాన్ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన ఇపిఎఫ్, ఇఎస్ఐ మరియు వారి సాంకేతిక పరమైన సమస్యలను ఆప్కాస్ సిబ్బంది అక్కడికక్కడే పరిష్కరించారు.  కార్డుల ప్రాముఖ్యతను అప్కాస్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) బి. నాగ ప్రసాద్ ఉద్యోగులకు వివరించారు. కుటుంబంలోని కొత్త సభ్యులను చేర్చుకోవటంతోపాటు సభ్యుల వివరాలను అప్డేట్ చేయటం వంటి సమస్యలను కూడా పరిష్కరించామని ఈ సందర్భంగా కమీషనర్ నివాస్ గారికి జిఎం వివరించారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అన్లైన్లో పరిశీలించి, కొంతమంది వివరాలను అప్డేట్ చేయటంతో పాటు మరికొంతమందికి జాయింట్ డిక్లరేషన్ ఫారంలను కూడా అందజేశామన్నారు. ఈ సందర్భంగా అప్ కాస్ సిబ్బందికి నివాస్ గారు అభినందించారు. 

Tadepalli

2022-11-14 14:18:36

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాస్త ఆలస్యం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6500 పోలీసు కానిస్టేబుల్ నియామకాల విషయంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని రకాల అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తుందని ఏపీ డీజిపి కేవి రాజంద్రనాధ్ రెడ్డి ప్రకటించడం దానికి బలం చేకూరింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటులో మహిళా పోలీసులను నియమించిన విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే అలాంటి ఇబ్బందులు త్వరలో తీయబోయే భారీ నోటిఫికేషన్ లో రాకూడదనే ఉద్దేశ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వం  పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది.  ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐల సంఖ్య పెరగడం, తగ్గడం, కొన్ని కుదించుకుపోవడం, మరికొన్ని పదోన్నతులలో పోవడం ఇలా చాలా వరకూ సాంకేతిక అంశాలను పోలీసుశాఖ పరిశీలస్తున్న విషయం మరోసారి డిజిపీ మాటల్లో తేటతెల్లం అవుతుంది.  అయితే నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కాగా వస్తుందని మాత్రం ఆయన చెప్పారు. తీరా నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఏ ఒక్క అభ్యర్ధి ఇబ్బందులు పడకూదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పోలీసు ఉద్యోగాలకు  సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, దీనిపై ఇప్పటికే డిజిపి కార్యాలయం నుంచి కూడా చాలా సమాచారం ప్రభుత్వం సేకరించిందని చెబుతున్నారు. నవంబరు నెలాఖరుకి తొలుత నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం 5నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని తొలుత ప్రభుత్వం భావించినట్టుగా చెబుతున్నారు. అయితే తాజా నోటిఫికేషన్ విషయంలో సమస్యలు తలెత్తితే అభ్యర్ధులు ఎక్కడా నష్టపోకుండా 
ఉండేందుకు, వయస్సు విషయంలోనూ కాస్త మార్పులు చేసే అవకాశాలున్నట్టు కూడా సమాచారం అందుతంది. చూడాలి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమస్యలను అధిగమించి ప్రకటన జారీ చేస్తుందనేది..!

Tadepalli

2022-11-14 12:53:20

ఇంకా ఏఓబీలో మావోయిస్టు కార్యకలాపాలు

మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు ఏపీ డీజిపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల నియంత్రణకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రభుత్వం సహాయ సహకార కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్టున్నట్టు చెప్పారు. మావోయిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపి పిలుపునిచ్చారు.  కాగా జిల్లాల
పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన  చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.ఈ మీడియా సమావేశంలో శాంతిభద్రత విభాగం అదనపు డిజి డా. రవిశంకర్ అయ్యన్నార్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. దీపిక పాటిల్ పాల్గొన్నారు.

Tadepalli

2022-11-14 12:11:04

అవినీతి నిర్మూలనకు 144‌‌‌00 యాప్ వాడాలి..డిజీపి

అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేసామన్నారు.  లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు  చేపడుతున్నదన్నారు. లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు. రుణాలు తీసుకొనే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నా రన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.  

Vizianagaram

2022-11-14 12:01:08

16న రాష్ట్ర సమాచార కమీషనర్ల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ నూతన కమీషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 16న జరగనుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపిఎం అండ్ ఎఆర్)ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 16వతేది బుధవారం మధ్యాహ్నం 3గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ఆయన తెలియ జేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమీషనర్ గా మహబూబ్ భాషా,సమాచార కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లను నియమిస్తూ గత నెల 21వతేదీన రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్.ల సంఖ్య 128,129ల ద్వారా  ఆదేశాలు జారీ చేసిందని ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈఇరువురు నూతన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.

Tadepalli

2022-11-14 11:47:10

గ్రామ సచివాలయాల్లో వింత పరిస్థితి..ఏ పనీ లేక..!

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింత పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం ఎంతో  ముందుచూపుతో గ్రామస్థాయిలోనే  ప్రజలకు ఇంటిముంగిటే అన్నిరకాల సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 పంచాయతీ  కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. కేవలం మిగిలిన సిబ్బందిని కో-ఆర్డినేషన్ చేసుకోవడం, అడపా దడపా వారి పరిధిలో పారిశుధ్య  నిర్వహణ తప్పితే మరేపనీ చేయడానికి అవకాశం లేదు. అలాగని వారిని ఖాళీగా ఉన్న పంచాయతీలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారా అంటే అదీలేదు. గ్రేడ్-4 నుంచి గ్రేడ్-1 కార్యదర్శిలను మాత్రమే ప్రభుత్వం ఇన్చార్జిలుగా నియమిస్తోంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 6వేలకు పైగా వున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు చేతి నిండా పనిలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం  చేసుకోవచ్చు.  అలాగని వాస్తవ పరిస్థితి మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు కూడా జిల్లా  కలెక్టర్లు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లడం లేదు. కేవలం మండల అధికారుల సమావేశాలు, సచివాలయాల పరిధిలోని చెత్త ఎత్తించడం,  అడపా దడపా పన్నులు వసూలు చేసే కార్యక్రమాలు తప్పా వీరికి మరో పనిలేకుండా పోయింది. 

ఆ పంచాయతీల్లో ఇద్దరు కార్యదర్శిలూ ఉత్సవ విగ్రహాలే..
రాష్ట్రంలోని మేజర్ పంచాయతీలుగా ఉన్న చోట ప్రభుత్వం గ్రేడ్1 కార్యదర్శితోపాటు ఇతర రెండు గ్రామ సచివాలయాల్లోనూ గ్రూడ్-5  కార్యదర్శిలను నియమించింది. కానీ వారికి చేతినిండా పనిలేదు. చెక్ పవర్ లేదు, కనీసం సచివాలయాల్లో జారీ చేసే దృవీకరణ పత్రాలపై  సైతం వారి సంతకాలకు విలువ కూడా లేదు. పంచాయతీ కార్యాయంలో ఉన్న సచివాలయ కార్యదర్శితోపాటు వారి పరిధిలోని  పంచాయతీ పనులు చేయడం తప్పా మరేమీ చేయడానికి వీలు లేకుండా పోతుంది. అలాగని బ్లీచింగ్, ఫినాయిల్, వీధిలైట్లు, వీధి  
కుళాయిలు ఇలా ఏ పనులు చేయించాలన్నా మళ్లీ వీరిద్దరూ వెళ్లి పంచాయతీ కార్యాలయంలోని గ్రేడ్-1 కార్యదర్శి వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని మూడు సచివాలయాలు ఉన్నచోట పరిధిలు విస్తరించినా.. ప్రధాన పంచాయతీ కార్యాలయం ద్వారానే  అన్నిపనులు జరుగుతున్నాయి. దీనితో ఈ ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోతున్నారు. తమ పరిస్థితిని రాష్ట్ర, జిల్లా  యూనియన్ ల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా నేటికీ ఫలితం శూన్యం. ఈ అవకాశం కాస్త ఆడుతూ, పాడుతూ పనిచేసేవారికి  మాత్రం భలే కలిసి వస్తోంది. నిజంగా ప్రజలకు సేవలచేయాలనుకునే వారికి ప్రతిబంధకంలా మారింది. 

ఇక్కడుండలేం బదిలీలైతే వెళ్లిపోతాం బాబోయ్
గ్రామసచివలయశాఖలో ఎలాంటి అధికారం లేని గ్రేడ్-5 కార్యదర్శిలు తమకు అధికారికంగా ఎలాంటి పనీ లేకపోవడం, తమ సంతకానికి విలువలేకపోవడం, చేసే పనికీ గ్రేడ్-1 కార్యదర్శి చుట్టూ సాధారణ ప్రజలు పనులు మాదిరి ప్రదక్షిణలు చేయాల్సిరావడంతో మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలు ఎంత త్వరగా బదిలీలు జరిగితే అంతే త్వరగా బయటకు వెళ్లిపోవడానికి కార్యాచరణ  సిద్ధం చేసుకుంటున్నారు. అలా కాకపోయినా, తమకు సహకరించే గ్రేడ్-1 కార్యదర్శిలు ఉన్న మేజర్ పంచాయతీలకైనా వెళ్లిపోతామని 
బాహాటంగానే చెబుతున్నారు.  తాము పేరుకి పంచాయతీ కార్యదర్శిలమే అయినా తమకు సచివాలయాల్లో విలువ చాలా తక్కువగా ఉందని, అలాగని తమ సచివాలయ పరిధిలోని ప్రజలకు పనిచేయాలన్నా తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. చెత్త వాహనాలు, చెత్త బండ్లు, పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ సామాగ్రి ఇలా అన్నింటికోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని సార్లు తమ సొంత డబ్బులతోనే పనులు చేయిస్తున్నామని..అలా ఖర్చు పెట్టిన డబ్బులకి నేటికీ అతీ గతీ కూడా లేదని బాధపడుతున్నారు. ఎలాంటి అధికారాలు, పనిచేయడానికి పారిశుధ్య సిబ్బంది కూడా లేకుండా తాము ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాల్లో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయాల్లో వాస్తవ పరిస్థిని గుర్తించని జిల్లా కలెక్టర్లు
రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ జిల్లాకలెక్టర్లు గ్రామ సచివాలయాల్లోని వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదు. ఎప్పుడు పర్యటనలకు వచ్చినా సచివాలయాలు ఎలా ఉన్నాయి.. అక్కడ సేవలు అందుతున్నాయా లేదా.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది అనేవిషయాలను పరిశీలన చేస్తున్నారు తప్పితే మిగిలిన అంశాలను పరిశీలంచడం లేదు. కనీసం గ్రేడ్-5 కార్యదర్శిల సేవలు పంచాయతీలు, గ్రామాల్లో ఏవిధంగా అందుతున్నాయి..? వారికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయి..? వారు చేస్తున్న ప్రధాన విధులేంటి..? గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రమే ఇతర పంచాయతీల్లో ఇన్చార్జిల బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు..? మేజర్  పంచాయతీల్లోని ప్రధాన పంచాయతీ కార్యలయంలోని సచివాలయంతోపాటు ఇతర రెండు సచివాలయాల్లోని సిబ్బంది, కార్యదర్శిలు  ఏం చేస్తున్నారు..? వారికి ఏవిధంగా పంచాయతీ కార్యాలయం నుంచి సహకారం అందుతుంది..? ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారు..? ఖాళీగా వున్న చిన్న పంచాయతీలకు వీరిని ఎందుకు పంపడం లేదు..? అసలు సచివాలయ కార్యదర్శిలు ప్రభుత్వం నిర్ధేశించిన రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? ఎంతమంది పూర్తిస్థాయిలో సచివాలయాల్లోనే ఉండి సేవలు అందిస్తున్నారు? బయో మెట్రిక్ వేసి ఇతర కార్యక్రమాల పేరుతో ఎందరు జంప్ అయిపోతున్నారు..? తదితర అంశాలపై రాష్ట్రంలో 
ఇప్పటి వరకూ ఒక్క జిల్లా కలెక్టర్ సైతం ద్రుష్టి పెట్టలేదు. అలా పెట్టివున్నా, తెలుసుకునే ప్రయత్నం చేసినా..గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు మేజర్ పంచాయతీల్లో వీరికి ఏ స్థాయిలో పనులున్నాయో..అసలు వీరేం చేస్తున్నారో జిల్లా కలెక్టర్లకు ఒక క్లారిటీ వచ్చేది.

 పంచాయతీరాజ్ లో 2024తరువాత భారీగా ఖాళీలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలను..ఇప్పటి వరకూ ఇన్చార్జిల పాలనతో ఉన్న పంచాయతీలకు సర్ధుబాటు చేస్తే కనీసం అక్కడ పంచాయతీలన్నీ  పూర్తిస్థాయిలో అభివ్రద్ధి చెందడానికి, ప్రభుత్వ సేవలు  అందడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే 2024 తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖలో భారీగా ఖాళీలు ఏర్పడితే అప్పుడు పరిస్థితి  మరింత జఠిలం అవుతుంది. వాస్తవానికి మేజర్ పంచాయతీల్లో గ్రేడ్-1,2 స్థాయి కార్యదర్శిలు ఉన్నచోట మరో ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిల అవసరం వుండదు. కానీ ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలు ఏర్పాటు చేయడంతో వీరిని నియమించింది. నాటి నుంచి నేటి వరకూ వీరికి పనిలేకుండానే పోయింది. ఇప్పటికైనా గ్రామ,వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి వీరి అధికారాలు, సేవలు,  విషయంలో ఆలోచిస్తే తప్పా..వీరికి చేతినిండా పనిదొరకదు సరికదా.. కార్యదర్శిలు లేని గ్రామపంచాయతీలు సైతం ఎలాంటి  ప్రభుత్వసేవలకు నోచుకోకుండా పోయే ప్రమాదం వుంది. మరోపక్క గ్రేడ్-1,2 కార్యదర్శిలను ఇతర పంచాయతీలకు  ఇన్చార్జిలగా నియమిస్తుండటంతో వారు రెండుచోట్లా పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీలు లేకుండా పోతుంది. ఇదే సమయంలో ఆదాయం వచ్చే  పంచాయతీలకే కొందరు కార్యదర్శిలు పరిమితమైపోతున్నారు.  సచివాలయాలు, అక్కడి సేవల్లో ఎవరికీ అందుబాటులో లేకుండా  పోతున్నారు.

అసలు విషయమిదే..
గ్రామ సచివాలయాల్లో అంతమంది సిబ్బంది వున్న సేవల విషయంలో కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకునే క్రమంలో ఈఎన్ఎస్  నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ గ్రౌండ్ లెవల్ రియాల్టీని  పరిశీలిన చేసింది. తొలుతగా గ్రామ సచివాలయాల పరిస్థితిని ప్రజలకు, అటు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక  కధనాన్ని అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇక్కడ జరిగే ప్రతీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా  బాహ్య ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏ మీడియాని రాయనన్ని కధనాలు కూడా ఒక్క ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా అందించిన విషయం కూడా ప్రజలకు, పాఠకులకు, అటు అధికారులకు కూడా తెలుసు.  ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా.. అడుతూ పాడుతూ  పనిచేసేవారు ఓ.. తెగఫీలైపోయి గుక్కెట్టి ఏడ్చేసినా.. వాస్తవం తెలుసుకున్నవారు కనీసం వీళ్లైనా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లారని ఆలోచించినా.. అన్నింటినీ ఈఎన్ఎస్ ఒకేలా స్వీకరిస్తుందని మాత్రం  గుర్తుపెట్టుకోవాలి.  సీఎం వైఎస్.జగన్ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలశాఖ ద్వారా ప్రజలకు  పూర్తిస్థాయిలో సేవలు అందాలనేదే మా యొక్క లక్ష్యం. గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల  ద్వారానే సిద్ధిస్తుందని నమ్మి  ప్రజలు, ప్రభుత్వం, పాఠకుల పక్షాన నిలబడి అక్షర సేద్యం చేస్తున్నాం.  ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదని మరోసారి బల్లగుద్ది చెబుతున్నాం..!




Tadepalli

2022-11-14 08:09:17

ప్రముఖుల కార్యక్రమాల ప్రాంతాల్లో నో డ్రోన్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖుల కార్యక్రమాలు జరిగే ప్రదేశంలో నోడ్రోన్ జోన్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ లు పై నుంచి చిత్రీకరణ చేసే సమయంలో అసాంఘిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరగవచ్చుననే ముందస్తు సంకేతాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా సభాస్థలం వద్ధ డ్రోన్ కెమెరాలతో షూట్ చేయాలనుకుంటే ముందుగా నగర పరిధిలో అయితే సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా పరిధిలో అయితే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి  వుంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్  
లు ఆపరేట్ చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, కార్యక్రమాల సమయాల్లో సైతం డ్రోన్లను నిషేదిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇదే విధంగా ప్రముఖుల కార్యక్రమాలు జరిగే సమయంలో ముందస్తు ప్రకటనలు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వాటిని ప్రభుత్వమే చేపట్టే విధంగా  అనుమతులు మంజూరు చేయనున్నారు. 

Tadepalli

2022-11-13 10:14:41

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపికబురు అందనుంది. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతి నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నందున ఉద్యోగులను బదిలీలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టినట్టు సమాచారం. మూడేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీలు చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యుగులు, రెగ్యులర్ అయిన ఉద్యోగుల వివరాలను శాఖల వారీగా క్రోడీకరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తం సుమారు ఒక లక్షా 22 వేలకు పైగా ఉన్న ఉద్యోగులను జీఓఎంఎస్-5 ద్వారా ప్రభుత్వం సర్వీస్ ప్రొభేషన్ డిక్లరేషన్ చేసింది. అలా చేసిన ఉద్యోగులు, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చేరిన ఉద్యోగులు, మధ్యలో పదోన్నతులు పొంది చేరిన కొత్త ఉద్యోగులు ఇలా అందరు ఉద్యోగుల జాబితాలను ప్రభుత్వం ఒక ప్రత్యేక జాబితాగా రూపొందిస్తున్నది. అందులో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మాత్రం బదిలీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి అన్ని రకాల సదుపాయలు, బదిలీల నియమ నిబంధనలు వర్తిస్తాయా, లేదంటే ప్రత్యేకంగా నిబంధనలు రూపొందిస్తున్నారనే అనే అంశంపై ప్రభుత్వశాఖల కమిషనర్లతో చర్చలు జరుపుతున్నారని కూడా సమాచారం అందుతుంది. అన్ని ప్రభుత్వశాఖల రెగ్యులర్ ఉద్యోగులు లా అయితే వీరికి కూడా స్థానిక జిల్లాల బదిలీలతోపాటు, అంతర్ జిల్లా బదిలీలు కూడా జరిగే అవకాశం వుంది. లేకపోతే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆ అవకాశాన్ని కల్పిస్తూ జీఓ జారీ చేయాల్సి వుంటుందని ఓ ఉన్నతాధికారి తెలియజేశారు.

మొన్నటి వరకూ డిసెంబరు నాటికి బదిలీల ప్రక్రియ జరుగుతుందని భావించినా.. రాష్ట్రప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖపై ఉన్నతాధికారులు విదివిధానాలు రూపొందించకపోవడం వలనే ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. ఈలోగా ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామిపై సంక్రాంతి నాటికి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసి ఆ తరువాత మార్చి లోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర  
సమయం ఉన్నందున ముందుగా బదిలీలు చేపడితే ఆ తరువాత మళ్లీ ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశాలపైనా ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తున్నది. 2024ఎన్నికలు ఆరు నెలల సమయం ఉందనగా ఒకే చోట మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాల్సి వుంటుంది. ఆ విధంగా బదిలీలు చేస్తారా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం  ప్రత్యేక నియమ నిబంధనలు రూపొదించి బదిలీలు చేస్తారా అనే విషయం ఇంకా బయటకు రాలేదు. చూడాలి సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు సంబధించి ఏ విధమైన ప్రకటన జారీ చేస్తుందనేది..!

Tadepalli

2022-11-08 01:49:54

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో మోరాయిస్తున్న వెబ్ సైట్

ఉత్తరాంధ్రాలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల సంఘం ఆన్ లైన్ సర్వర్ మోరాయిస్తుంది. చాలా చోట్ల ఆన్ లైన్ ద్వారా ఓటరు  నమోదు ప్రక్రియకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాలని ఓటర్లు కోరుతున్నారు.

Visakhapatnam

2022-11-05 09:06:10

నవంబరు 1న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 1వ తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబరు 31న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.  పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం  
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం  నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.  మధ్యాహ్నం 1 నుంచి 5 

గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.  ఈ కారణంగా  అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం  ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2022-10-30 15:33:47

ఏపీలో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పులు-1

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..జిల్లా కలెక్టర్ మంచి అధికారి, ప్రజా సంక్షేమం కోరుకునే అధికారిగా వ్యహరిస్తే జిల్లా అభివ్రుద్ధి పధంలో ముందుంటుంది. ఒక జిల్లాలో 75 ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. అలాంటి జిల్లా కలెక్టర్ తన విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడం వలన, కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై మూడేళ్లు దాడుటుతున్నా నేటికీ ఇక్కడ అందే సేవలేంటో ప్రజల్లో అవగాహన లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతీరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాటి అమలు ఎక్కడా జరగడం లేదనే విషయం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులే స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన స్పందన కార్యక్రమాన్ని ఎందుకు జిల్లా కలెక్టర్లు అమలు చేయించలేకపోతున్నారనే ప్రశ్నకు వారి దగ్గరే సమాధానం లేదు. ఇదేదో కావాలని అంటున్నమాటలు కావు..రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవ్ లో ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తెలియజేస్తున్న విషయాలు. తమకు అవసరమైన ద్రువీకరణ పత్రాలకోసం అర్జీలు పెట్టుకున్నవాటినే సచివాలయంలో స్పందన దరఖాస్తులు సిబ్బంది చూపిస్తున్నారు. వాటి ద్వారానే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు సచివాలయా సిబ్బంది. ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్లు తమ సచివాలయాల పర్యటనల్లో గుర్తించకపోవడం విశేషం.

ముందస్తు సమాచారంతోనే జిల్లా కలెక్టర్లు, జెసిల పర్యటనలు
జిల్లా కలెక్టర్, జెసిలు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో మండల అధికారులకు సమాచారం ముందుగా అందించిన తరువాతే సందర్శనలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా అక్కడ సిబ్బంది అలెర్ట్ అయిపోతున్నారు. దీనితో అక్కడ లోపాలను కలెక్టర్ గుర్తించడానికి వీలుపడటం లేదు. అందులోనూ సచివాలయాలను సందర్శించే సమయంలో కొందరు జిల్లా కలెక్టర్లు సిబ్బంది డ్యూటీ చార్టులు, రిజిస్టర్ లను తనిఖీలు చేయడం లేదు. పరిస్ధితిని సాధారణంగా కనుక్కోవడం తప్పితే, నవరత్నాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.. అసలు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుందా..జరిగితే ఎన్ని అర్జీలు స్వీకరించారు..ఎన్ని పరిష్కరించారు.. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయాలనికి ఎందుకు దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే విషయాన్ని ఒక్క సచివాలయ సిబ్బందినిగానీ, మండల అధికారులను గానీ ప్రశ్నించినట్టు ఇప్పటి వరకూ కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మాత్రం తమ పర్యటనల విషయం మండల అధికారులకు, సచివాలయ సిబ్బందికి తెలియకుండా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలా చేసిన సమయంలో వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి వీలుపడుతుంది. అలాంటి చోట్ల కాస్త అధికారులతో భయంతోనైనా స్పందన కార్యక్రమాన్ని అప్పుడప్పుడైనా నిర్వహిస్తున్నారు.

సచివాలయ సిబ్బంది ధరించే యూనిఫాంపై ద్రుష్టేది..?
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం కాకుండా వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఎల్లప్పుడూ సివిల్ డ్రెస్సుల్లోనే సిబ్బంది దర్శనమిస్తున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం బ్యాండ్ మేళం డ్రెస్సులా ఉందనే బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సచివాలయానికి రాగానే యూనిఫారంలో ఉన్నవారంతా సచివాలయ సిబ్బంది అని గుర్తించడానికి ప్రభుత్వం ఉద్యోగులకు యూనిఫారం ఇచ్చింది. అయితే దానికి విరుద్దంగా సిబ్బంది వ్యవహరిస్తున్నా చాలా జిల్లాల్లో కలెక్టర్లుగానీ, జెసిలుగానీ..అక్కడే ఉండే మండల అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ముందుగా కలెక్టర్ పర్యటనలు చేస్తున్న సమాచారం మండల అధికారులకు అందించడంతో  వచ్చే సమయానికి మాత్రం యూనిఫారాల్లో సిబ్బంది దర్శనమిస్తున్నారు. అప్పుడు కూడా షర్ట్ సచిలయానిది ఫ్యాంట్ వేరే రంగులో ఉన్నదీ ధరిస్తున్నారు. ఆ సమయానికి, ఆ తేదికి రికార్డులు సిద్దం చేస్తున్నారు. సచివాలయ పరిశరాల్లో బ్లీచింగ్ లు చల్లి జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో తామంతా సక్రమంగా ఉన్నట్టు కలరిస్తున్నారు. అంతే తరువాత రోజునుంచి మళ్లీ సివిల్ యూనిఫారంలోనే వస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ కార్యదర్శిలే ఈ విధంగా చేస్తున్నారు. తమ కార్యదర్శి యూనిఫారం వేసుకు రాకుండా వస్తే లేనిది తామెందకు వేసుకోవాలంటూ మిగిలిన సిబ్బందికూడా లైట్ తీసుకుంటున్నారు. దీనితో సచివాలయానికి వచ్చే ప్రజలకు ఎవరు సచివాలయ ఉద్యోగులో.. ఎవరు సాధార ప్రజలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కనీసం మండల అధికారులు కూడా సిబ్బందిని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

జిల్లా కలెక్టర్లకి తగ్గిపోయిన పరిధి..అయినా ఎక్కడి సమస్యలు అక్కడే
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన తరువాత 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అంటే అదనంగా 13 మంది జిల్లా కలెక్టర్లు, 13 మంది జాయింట్ కలెక్టర్లు కొత్తగా వచ్చినా.. ఉమ్మడి జిల్లాలు విభజన జరిగి విస్తీర్ణం, వారి పరిధి తగ్గిపోయినా జిల్లాల్లో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామ, వార్డు స్థాయిలో కార్యాలయాలు.. సుమారు 10 నుంచి 19 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. నేటికీ సచివాలయాల్లో అందే సేవలు, సిబ్బంది ఎవరు, ఏఏ ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా ఉన్నారో.. ఆ ప్రాంత ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో.  గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు లక్షా 23వేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినా.. ఫలితాలు మాత్రం మూడేళ్లు దాటిపోతున్నా కనీసం 20శాతం కూడా మెరుగు పడలేదు. జిల్లా కలెక్టర్లు పర్యటనలు చేసే సమయం మందుగా సమాచారం అందుకొని..కలెక్టర్లను సిబ్బంది, మండల అధికారులు బురిడీలు చేస్తున్నారు తప్పితే వాస్తవానికి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందులోనూ మండలశాఖల్లోనూ రెగ్యులర్ అధికారులు లేకపోవడం, 70శాతం ఇన్చార్జిల పాలనతో ఉండటంతో ఈ సమస్య మరింత జఠిలం అవుతోంది.  గ్రామస్థాయిలో నేరుగా పది ప్రభుత్వ శాఖలు అందుబాటులో ఉన్నా, గ్రామసచివాలయం ఉన్నా స్పందన కార్యక్రమం మాత్రం జరగడం లేదు. అలా జరిగితే సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేవనే విషయాన్ని కలెక్టర్లు గుర్తించకపోవడం విశేషం. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ విధంగా బురిడీ కొట్టించే సిబ్బందిని కలెక్టర్లు, జెసిలు సస్పెండ్లు చేస్తున్నారు. ఆ పరిస్థితి రాష్ట్రమంతా జరిగితే విషయం వేరే లెవల్ ఉంటుందనడంలో సందేహమే లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసిలు తనిఖీలు చేయనవి ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ చాలా వరకూ జిల్లా కలెక్టర్లు, జెసిలు,  గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లే సమయంలో తనిఖీ చేయని అంశాలు క్రమ సంఖ్యలో తెలుసుకుంటే.. గ్రామాల్లోకి సిబ్బందిని తీసుకెళ్లి వీరిలో ఎంతమంది గ్రామస్తులకు తెలుసు అని ప్రశ్నించడం, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైనేజిల సమస్యలు, సిబ్బంది డ్యూటీచార్టులు, రిజిస్టర్ల నిర్వహణ, సిబ్బంది యూనిఫారం ధరించకపోవడం, ముఖ్యంగా సచివాలయాల్లో స్పందన నిర్వహంచని అంశం, శాఖల వారీగా వచ్చిన అర్జీలు, పరిష్కరించిన సమస్యలు, ప్రధానంగా పరిష్కారించాల్సిన సమస్యలు, కార్యదర్శిలు ఏ విధంగా సచివాలయాలు నిర్వహిస్తున్నారు..అందుబాటుల్లో ఉంటున్నారనే అంశం, సచివాలయ సేవలను సిబ్బంది ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తున్నారనే విషయం, కలెక్టర్ల పర్యటన సమయంలోనే కాకుండా నెలలో ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు, బ్లీచింగ్ లు చల్లుతున్నారు, దానికోసం ఫినాయిల్, ఫాగింగ్ ఇతర వాటికి ఎంత మొత్తం లో ఖర్చు చేస్తున్నారు. అసలు చెత్తను పారిశుధ్య కార్మికులు ఏఏ ప్రాంతాల్లో..ఏఏ రోజుల్లో చేస్తున్నారు..? ఎంత మొత్తంలో లెక్కలు చూపిస్తున్నారు..తీసుకు వచ్చిన ఫలితాలేంటి, ముఖ్యంగా సచివాలయాలను నిర్వహించే కార్యదర్శిల రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? అసలు నిర్వహిస్తున్నారా లేదా? ప్రభుత్వ ఉత్తర్వులు అసలు నోటీసుబోర్డులో పెడుతున్నారా లేదా.. ఎన్ని ప్రభుత్వ ఉత్తర్వులను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎన్ని ఉత్తర్వులను రిజిస్టర్లు వారీగా నమోదు చేస్తున్నారు. సచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందికి ప్రధాన వీధులు, వాలంటీర్లు గ్రామంపై ఎంత పట్టుంది..? తదితర అంశాలను జిల్లా కలెక్టర్లుగానీ, జెసిలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు..

ముఖ్యగమనిక.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలనే తొలుతగా ఎందుకు తెలియజేశామంటే..ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖపై అన్ని అంశాలను ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఏకకాలంలో తెలియజేస్తూ వస్తున్నాం. నిజంగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు, సిబ్బంది ప్రజలకు చేరువ అయ్యేవారు. కానీ అలా జరగలేదు. కొన్నిచోట్ల జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ లక్ష్యం మేరకు శ్రమిస్తున్నా,  పనిచేయని సిబ్బందిని సస్పెండ్లు చేస్తున్నా, మార్పు తీసుకురావాలని చేపడుతున్న చర్యలు.. ఫలితాలు అంతంత మాత్రంగానే వుస్తున్నాయి. ఆ కారణంతోనే ఈ పరిశోధనాత్మక కధనం అందించాల్సి వచ్చింది. ఈ విషయంలో మండలం అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు, జెసిలు ఇతర జిల్లా అధికారులను బురిడీలను చేస్తున్నారు. మండల అధికారులు ఏవిధంగా జిల్లా కలెక్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారే విషయానికి సంబంధించిన వివరణాత్మక కధాన్ని వచ్చే కధనాల్లో అందిస్తాం. 

చివరిగా ఒక్క మాట.. దేశంలో అత్యున్నత ఉద్యోగం ఐఏఎస్..అలాంటి ఐఏఎస్ లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం ఏకకాలంలో జరుగుతుంది. వారికి ఈఎన్ఎస్ ద్వారా కేవలం క్షేత్రస్థాయిలో జరగుతున్న విషయాలను, వాస్తవాలను మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ లక్ష్యం ఏ తప్పిదం వలన వెనెకబడిపోతుందో తెలియజేయాలని మాత్రమే గ్రౌండ్ లెవల్ లో మా నెట్వర్క్ ద్వారా సమాచారం సేకరించి ఈ విషయాలను తెలియజేశాం. వచ్చే కధనంలో మండల అధికారుల విషయంలో జరుగుతున్న తప్పులను వివరించే ప్రయత్నం చేస్తాం..!

Tadepalli

2022-10-22 03:17:53

తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌రో ముంద‌డుగు

తిరుమ‌ల ప‌విత్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో టీటీడీ మ‌రో ముంద‌డుగు వేసింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ రథాల (ఉచిత బ‌స్సుల‌) స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల‌కు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు, ఆర్‌టిసి, టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌ను కాలుష్య ర‌హిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్ధ‌డానికి ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, క‌వ‌ర్ల నిషేదం కూడా ఇందులో ఒక భాగమ‌న్నారు. తొలివిడ‌త‌గా తిరుమ‌ల‌లో ప‌నిచేసే అధికారుల‌కు విద్యుత్‌తో న‌డిచే కార్ల‌ను అంద‌జేశామ‌న్నారు. రెండ‌వ విడ‌త‌గా తిరుప‌తి, తిరుమ‌ల మ‌ధ్య విద్యుత్ బ‌స్సులు ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. వీటికి భ‌క్తుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపారు.

 రెండ‌వ విడ‌త‌లో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ‌ర‌థాల స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు 10 బ‌స్సులు విరాళంగా ఇవ్వాల‌ని ఒలెక్ట్రా కంపెని అధినేత శ్రీ కృష్ణారెడ్డిని కోరాన‌ని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బ‌స్సుల‌ను విరాళంగా అందించేందుకు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. బ‌స్సుల డిజైనింగ్‌, నిర్వ‌హ‌ణ ఎలా ఉండాల‌నే అంశంపై చ‌ర్చించేందుకు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌క్తుల‌కు స‌దుపాయంగా ఉండేలా బ‌స్సుల‌ను డిజైన్ చేయాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు. 

 అనంత‌రం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నం నుండి లేపాక్షి స‌ర్కిల్ వ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి అధికారుల‌తో క‌లిసి విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించారు.  మూడ‌వ ద‌శ‌లో తిరుమ‌ల‌లో తిరిగే ట్యాక్సీలు, ఇత‌ర అద్దె వాహ‌నాల స్థానంలో టీటీడీ స‌హ‌కారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు బ‌స్సుల డిజైన్లు, నిర్వ‌హ‌ణ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. టీటీడీ చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి కోరిక మేర‌కు 10 విద్యుత్ బ‌స్సులు విరాళంగా అందించ‌డం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు త‌మ‌కు అందించిన గొప్ప వ‌రంగా భావిస్తున్నామ‌ని కంపెని సిఎండి ప్ర‌దీప్ చెప్పారు. ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్  గోపినాథ్ రెడ్డి, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి చెంగ‌ల్‌రెడ్డి, టీటీడీ ర‌వాణా విభాగం జిఎం  శేషారెడ్డి, తిరుమ‌ల డిపో మేనేజ‌ర్  విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.       

Tirumala

2022-10-21 11:24:37

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్లు చేసే అతిపెద్ద తప్పు..!

ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు చేసే పరిపాలనకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పరిపాలనలో అందించే అధికారులే తప్పుచేస్తే.. ప్రజా పరిపాలన 75 ప్రభుత్వశాఖలను ఏ విధంగా సమన్వయం చేస్తారు..? ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయా..? ఏంటి నేరుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్లు పడ్డాయని అనుకుంటున్నారా.. ఈ వార్త, తరువాత రాబోయే దారావాహికంలో ఇంకెలాంటి వార్తలు రాబోతున్నాయని అనుకుంటున్నారా..మీరు అనుకున్నది నిజమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సివిల్ సర్వీస్ అధికారులు(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్) ఇలా అందరు అధికారులు చేస్తున్న చిన్న చిన్న తప్పులు, చూసీ చూడనట్టు వదిలేస్తున్న విషయాల కారణంగా జరగాల్సిన అభివ్రుద్ధి, పరిష్కారానికి నోచుకోవాల్సిన సమస్యలు, ప్రజలకు దగ్గర కావాల్సిన ప్రభుత్వ సేవలు ఎక్కడివి అక్కడే ఉండిపోతున్నాయి. 

వాటిని మూడేళ్లుగా గ్రౌండ్ రియాలిటీలో ఈఎన్ఎస్ నెట్వర్క్ పరిశీలించింది. అలా పరిశీలించిన విషయాలను, అంశాలను అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ద్రుష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో కొందరు ఐఏఎస్ అధికారులు నొచ్చుకున్నా..మరికొందరు మెచ్చుకున్నా.. కేవలం ప్రభుత్వ లక్ష్యం వారు చేసె తప్పుల కారణంగా ఏవిధంగా అభివ్రుద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించాలని సంకల్పించాం. ఇదే సమయంలో కొన్ని విషయాలను రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడిన సమయంలో తెలిసిన అంశాలను కూడా వార్తల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తుంటే..అదే సమయంలో ఐఏఎస్ లతో పాటు ఇతర సివిల్ సర్వీసు అధికారులు కాస్త ఉదాసీనంగా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించడం వలన జరిగే అనర్ధాలను కూడా ఈ దారావాహికంలో అందించే ప్రయత్నం చేస్తాం.

 కేవలం అధికారులు ఆ విధంగా చేయడం వలన..ఇప్పటి వరకూ ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎందుకు చేరలేదనే విషయాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాం. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా మేము అందించే కధనాలు సూచనలుగా ఉంటాయని కూడా భావిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే జిల్లాకి ముఖ్యమైన అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తే ఫలితాలు వస్తాయనే విషయంలో మేము మూడేళ్లుగా పరిశీలించిన విషయాలను అందిస్తాం. మేము అందించే కధనాలు మీకు నచ్చితే మీరు మీకు తెలిసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్రుష్టికీ కూడా తీసుకెళ్లవచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల తప్పులు ఎంచేటంత తోపులం అని చెప్పడం లేదు గానీ..కేవలం ఆ విధంగా జరగడం వలన జరిగిన అనర్ధాన్ని మాత్రమే తెలియజేయాలని సంకల్పించాం.. వచ్చే కధనంలో ఏ ప్రభుత్వ శాఖలో ఏ తప్పు జరిగిందో, దానిని జిల్లా కలెక్టర్ నుంచి ఇతర సివిల్ సర్వీస్ అధికారులు ఎందుకు వాటిని పట్టనట్టు వదిలేశారనే విషయాతో మీముందుకి వస్తాం..!

Tadepalli

2022-10-21 01:50:37

ఏపిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అటకెక్కినట్టేనా..?

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లును నిర్మాస్తామని చెప్పిన మాటను అంతే త్వరగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తున్నది. 13 కొత్తజిల్లాల్లో శాస్వతంగా కొత్త కలెక్టరేట్లు నిర్మించాలని హుటా హుటీన స్థలసేకరణ చేసి, అక్కడ 75 ప్రభుత్వ శాఖలను ఒకేచోట ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాల విభజన తరువాత అద్దె ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లను, జిల్లా కార్యాలయాలను నిర్వహిస్తోంది. కొత్త జిల్లాల్లోని అధికారులతోపాటు, కార్యాలయాల్లోని సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. ఇటీవల రెండు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినా అవి ఎప్పటికి పూర్తవుతాయో కొత్తజిల్లాల్లో ఖాళీలు ఉన్న అధికారులను సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా చాలా మంది అధికారులు, సిబ్బంది పాత జిల్లాల నుంచే రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు శాస్వత భవనాలు లేక 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కేవలం నలుగురు నుంచి ఐదుగురు సిబ్బందితోనే జిల్లాకార్యాలయాలు నడుస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఒకేచోట ప్రభుత్వ శాఖల సేవలన్నీ అందుతాయి. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా కార్యాలయాల నిర్వహణ వ్యయం కూడా చాలా కలిసొస్తుంది. ఒకేచోట ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు బ్లాకుల వారీగా ఏర్పాటవడంతో జిల్లా కలెక్టర్ కు సైతం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యవసర సమావేశాలు పెట్టినపుడుకూడా జిల్లా అధికారులంతా ఒకే చోట నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాలు హాజరు కావడానికి వీలుపడుతుంది. వేర్వేరు చోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అధిక కరెంటు, వినియోగ, భవనిర్మాణాల వ్యయం కూడా చాలా ఎక్కువగానే అవుతుంది. అలా కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట పెద్ద భవనం బ్లాకుల వారీగా ఏర్పాటు చేస్తే ఇటుప్రజలకు , ప్రభుత్వానికి రెండింటికీ ఎంతో మేలుగా వుంటుంది.

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన చేసింత త్వరగా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తామని చేసిన ప్రకటనను కూడా పక్కన పెట్టేసింది. కొన్ని కొత్త జిల్లాల్లోప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అందుబాటులోలేవు. దీనితో ప్రభుత్వం కొన్ని చోట్ల తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటు పూర్తయిన తరువాత అయినా నిర్మాణాలు చేపడుతుందని భావిస్తే వాటిని పూర్తిగా పక్కనపెట్టింది. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మాణంతోపాటు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, ఆర్డీఓ, ఇలా అందరికీ ప్రభుత్వ నివాస స్థలాలు క్యాంపు కార్యాలయాలు కూడా నిర్మించాల్సి వుంటుంది. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేడెట్ కలెక్టరేట్లను కూడా కొంత కాలం వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల, తరగతుల ప్రారంభంలో ప్రభుత్వం బిజీగా వుంది. బహుసా వీటి నిర్మాణాలు పూర్తయిన తరువా కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-10-20 02:51:57