1 ENS Live Breaking News

Visakhapatnam

2022-05-16 10:48:33

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.  ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.  రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాధం, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  దామోదరం పాల్గొన్నారు.

Tirumala

2022-05-16 06:33:47

Tadepalli

2022-05-16 06:18:39

అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌సేవ కొనసాగింపు

తిరుమలలో వేసవి భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది.  అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు.  ఆన్లైన్ లో  సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవకు అనుమతించాలని టిటిడి  నిర్ణయించింది. అదేవిధంగా, అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో సూచించింది.

Tirumala

2022-05-16 05:53:20

అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది  వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా , స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారిని  " మూలతో బ్రహ్మరూపాయ ..మధ్యతశ్చ మహేశ్వరం..  అధతో విష్ణురూపాయ..  త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.  క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి , ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891 , ఆగస్టు 6వ తారీకున ప్రతిష్టించి , ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటుంటాడు.

Annavaram

2022-05-11 16:10:29

పిఆర్సీ అమలుపై ప్రభుత్వ జిఓలు జారీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి అమలుకు సంబంధించిన వివిధ జిఓలను ప్రభుత్వం జారీ చేసింది.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పిఆర్సి అమలుకు సంబంధించిన సమావేశం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,జిఏడి కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్ ల సమక్షంలో జరిగింది.ఈసందర్భంగా పిఆర్సి అమలుకు సంబంధించిన 8 ప్రభుత్వ ఉత్తర్వులను(జిఓ)జారీ చేసి ఆజిఓల ప్రతులను సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆర్ధికశాఖ అధికారులు అందచేశారు. ఈసమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పిఆర్సి అమలుకు సంబంధించి బుధవారం 8జిఓలను జారీ చేయడం జరిగిందని మరో రెండు జిఓలను కూడా బుధవారం రాత్రికి లేదా గురువారం విడుదల చేయడం జరుగుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చెప్పారు.మరికొన్ని జిఓలు త్వరలో విడుదల అవుతాయని అన్నారు.
ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి పెండింగ్ అంశాల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.అదే విధంగా వివిధ పెండింగ్ బిల్లులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పిఆర్సితో పాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సకాంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి,ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ,ఇంకా ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-11 16:03:33

వైఎస్సార్ మత్స్యకార భరోసా 13కి వాయిదా..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసని తుఫాన్ ప్రభవావం ఉన్నందున ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో  మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13 (శుక్రవారానికి) కు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్తమానం పంపించారు. ఈ విషయాన్ని మత్స్యకారులకు తెలియాలని జిల్లా కలెక్టర్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు, సచివాలయాల పరిధిలోని మత్స్యశాఖ సహాయకుల ద్వారా తెలియజేయాలని సూచించారు.  

Tadepalli

2022-05-10 11:30:37

భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయానికి రండి

తిరుమల తిరుపతి దేవస్థానం భువనేశ్వర్ లో నిర్మించిన  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌  వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.  మే  21 వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో  గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి పాల్గొన్నారు.

Tadepalli

2022-05-10 08:18:36

12న అన్నవరం సత్యదేవుని కళ్యాణం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి కళ్యాణం ఈనెల 12వ తేదిన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన దేవస్థానంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 11 నుంచే ప్రారంభం అవుతాయని చెప్పారు. అదేరోజున స్వామివారు, అమ్మవార్లను పెళ్లికొడుకు, పెళ్లికూతుర్లను చేస్తారని, 12వ తేదిన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా 17వ తేదిన పుష్పయాగం చేపట్టడంతో కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయని తెలియజేశారు. స్వామివారి కళ్యాణం జరుగుతున్న విషయాన్ని భక్తుల సమాచారార్ధం పెద్ద ఎత్తుప ప్రచారం కూడా చేపట్టినట్టు చెప్పారు. రెండేళ్ల తరువాత మళ్లీ స్వామివారి కళ్యాణం భక్తుల సమక్షంలో జరుగుతుందని, దానికోసం ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఈఓ పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి క్రుపకు పాత్రులు కావాలని ఈఓ ఈ సందర్భంగా మీడియా ద్వారా భక్తులను కోరారు.

అన్నవరం

2022-05-08 14:51:01

టిటిడి ఈఓ(ఏఎఫ్ఏసి) గా ఎవి.ధర్మారెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కొలువులో 19 నెలల పాటు భక్తులకు సేవలు అందించానని, దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి టిటిడి ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిని శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటంతో సన్మానించారు.  ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పలు కార్యక్రమాలు ఇంకా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత బోర్డుతోపాటు రానున్న ఈఓ ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తన పదవీ కాలంలో సహకరించిన ధర్మకర్తల మండలికి, టిటిడి అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

      అనంతరం టిటిడి ఈవో(ఎఫ్ఎసి)  ఎవి.ధర్మారెడ్డి టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జెఈఓ(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో(ఎఫ్ఎసి) ఎవి.ధర్మారెడ్డి  మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పాటు తాను అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వహించానని, శ్రీవారి ఆశీస్సులతో ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో  నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, ఎస్ఈ  జగదీశ్వర రెడ్డి, అడిషనల్ సీవీఎస్వో  శివ కుమార్ రెడ్డి డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు, హరీంద్ర నాథ్ , కస్తూరి బాయి, భాస్కర్,  హెల్త్ ఆఫీసర్ Dr. శ్రీ దేవి, పేష్కార్లు  శ్రీహరి,  పార్థసారథి  తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-08 13:32:33

Rajahmundry

2022-05-08 06:46:28

తిరుమలలో అన్యమత ప్రచారం నిషేదం..

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు,  చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి,  తిరుమ‌లకు తీసుకువెళ్ళ‌డాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.  టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేస్తున్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి  స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది.

Tirumala

2022-05-07 15:21:51

25నుంచి హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

తిరుమ‌ల‌లో ఈ నెల 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతిని వైభ‌వంగా నిర్వ‌హిం చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారు ల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఉద‌యం హ‌నుమ‌జ్జ‌ యంతి ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.   ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌ల‌మైన అంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ వ‌ద్ద‌, జాపాలీ తీర్థం, నాద‌నీరాజ‌నం వేదిక‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం నిర్వ‌హించేందుకు ఆయా విభాగాల అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆయా రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాల‌ను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛాన‌ళ్ల ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌న్నారు. ఈ ఉత్స‌వానికి సంబంధించి ఆక‌ట్టుకునేలా ప్రోమో రూపొందించాలని కోరారు.

నాదనీరాజ‌నం వేదిక‌పై నిర్వ‌హించే ప్ర‌వ‌చ‌నాల‌కు సంబంధించి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌,  ప‌వ‌న‌కుమార శ‌ర్మ త‌దిత‌ర పండితుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. అంజ‌నాద్రి వైభ‌వం, ఇతిహాస హ‌నుమ‌ద్విజ‌యం, యోగాంజ‌నేయం, వీరాంజ‌నేయం, భ‌క్తాంజ‌నేయం ప‌లు అంశాల‌పై ప్ర‌వ‌చ‌నాలు ఉంటాయ‌న్నారు. ఏర్పాట్ల‌కు సంబంధించి ఇంజినీరింగ్‌, అన్న‌దానం, ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌, భ‌ద్ర‌తా విభాగం, పిఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు.   ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిఇ ర‌విశంక‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, పండితులు ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌,  కుప్పా విశ్వ‌నాథ‌శర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-07 13:07:15

Tadepalli

2022-05-07 05:23:16

సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్ధేశించుకు న్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం, ఈ అంశంపై సీఎం  వైఎస్‌ జగన్‌తో సమావేశమై చర్చించిన నీతి ఆయోగ్‌ సభ్యుల బృందం. ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌ (ఐఏఎస్‌), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్‌ ఎస్డీజీ ఆఫీసర్స్‌ అలెన్‌ జాన్, సౌమి గుహ, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రెప్రజెంటెటివ్‌ డెన్నిస్‌ కర్రీ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-06 16:28:57