1 ENS Live Breaking News

వెంగమాంబ ధ్యాన మందిరానికి శంఖుస్థాపన

తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమం దిరానికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. తిరుమలలో చాలాకాలం పాటు ఆమె ధ్యానం చేశారని, ధ్యానం చేస్తూనే శ్రీవారిలో ఐక్యమయ్యారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు శ్రీ ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి చైర్మన్ కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ  ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఇఇ  జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-29 08:03:19

సమాచారశాఖలో ఆర్జేడి వ్యవస్థకు మంగళం

సమాచార పౌరసంబంధాల శాఖలో ముఖ్యంగా మీడియాకి సకాలంలో సమాచారం అందిం చాలంటే కావాల్సిన అధికారులు డీపీఆర్వో, ఏపీఆర్వో, ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్, టైపిస్టు(పత్రికా పరిభాషలో హార్మోనిస్టు అంటారు అంటే వార్తలు కంపోజ్ చేసేవాడు అని అర్ధం) అవన్నీ లేకపోయినా.. సమాచార శాఖలో మాత్రం కార్యాలయ సిబ్బంది చక్కగా నిండుగా, మెండుగా ఉన్నారు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారంతా ఉత్సవ విగ్రహాలే. వారి వలన కొత్తజిల్లాల్లో డీపీఆర్వోలకు శిరోభారం తప్పా మరెలాంటి ఉపయోగం కొద్దిగైనా లేదు. అలాంటి తరుణంలో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాలకు మీడియాకి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, ముఖ్యమైన కార్యక్రమాల వీడియో విజువల్స్ అందించడానికి కావాల్సిన సిబ్బందిని నియమించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సమాచారశాఖలోని ఆర్జేడీ కార్యాలయాల దుఖాణాలు సర్దేసి అందులోని సిబ్బందిని సమాచారశాఖ అప్పగించింది. పనిచేయని సిబ్బంది వందమంది ఉంటే ఏ సుఖం అన్నట్టుగా  సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచార పౌర సంబంధాల శాఖకు ఆర్జేడీ కార్యాలయాల నుంచి వచ్చిన సిబ్బంది వలన కార్యాలయం నిండుగా కనిపిస్తుంది తప్పతే  ప్రతినిత్యం ఉపయోగ పడే సిబ్బంది తక్కువనే చెప్పాలి. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా డీపీఆర్వో కార్యాలయాలకు కావాల్సిన ఏపీఆర్వోలను మాత్రం నియమించడం లేదు. ఆర్ధిక భారం నెపంతో ఉన్న సిబ్బందిని సర్దేయడంతోపాటు,  విభాగాలను ఉన్న శాఖలోనే అనుసంధానం చేసి అక్కడ పనిచేసే అధికారులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేసేస్తున్నది.  ప్రభుత్వ శాఖల్లో విభాగాలను కుదించేసే కార్యక్రమాలు శరవేగంగా చేపట్టింది. దానికోసం ప్రాధాన్యత లేని విభాగాలు వ్యవస్థలకు మంగళం పాడేస్తుంది. ఇటీవలే సమాచార పౌర సంబంధాల శాఖలో ఆర్జేడీ(రీజనల్ డైరెక్టర్) కార్యాలయాలను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలో నాలుగు జోన్లలో నాలుగు ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నా వాటి వలన ప్రభుత్వానికి గానీ, మీడియా సంస్థలకు గానీ సమాచారశాఖ ద్వారా ఎలాంటి ఉపయోగం కూడా లేదు. దీనితో రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఉన్న ఆర్జేడీ పోస్టులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. అక్కడి కార్యాలయ సిబ్బంది కొత్త జిల్లాల్లోని డిపీఆర్వో కార్యాలయాల్లోకి సర్ధుబాటు చేసేసింది. సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచారశాఖకు సిబ్బందిని అలా సర్ధుబాటు చేసింది. ఉన్న కార్యాలయ సిబ్బందితో అదనంగా ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది వచ్చి చేరారు తప్పితే కొత్త జిల్లాల్లో పనిచేసే డీపీఆర్వోలకు సహకారంగా, సాంకేతిక సహాయం అందించే సిబ్బంది నేటికీ లేకపోవడం, ప్రభుత్వం నియమించకపోవడంతో అన్ని పనులు డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి వీరికి వాహనాల సదుపాయం కూడా లేకపోవడంతో వారి సొంత వాహనాల్లో ప్రభుత్వ కార్యాక్రమాల ప్రెస్ కవరేజికి వెళుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిగా వీరంతా ప్రభుత్వాన్నికానీ, సమాచారశాఖ కమిషనర్ ను గానీ అడిగే పరిస్థితి లేదు. ఒక వేళ ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు ద్రుష్ట్యా దైర్యం చేసి అడిగినా.. ఏపీఆర్వోలను గానీ, ప్రెస్ కవరేజికి సరపడే సిబ్బందిని గానీ నియమించే పరిస్థితి అంతకంటే లేదు. వాస్తవానికి ఏ ప్రభుత్వ శాఖలో సిబ్బంది, అధికారులు ఉన్నా లేకపోయినా సమాచార, పౌర సంబంధాల శాఖలో మీడియాకి సమాచారం అందించేందుకు అన్ని విభాగాల సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది కానీ గద పదేళ్లుగా ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ నియామకాలే తప్పితే కొత్త నియామకాలు జరిగింది లేదు. పోనీ ఉన్నవారికైనా పనొచ్చా అంటే అదీ లేదు. దీనితో కొత్తజిల్లాలతోపాటు, పాత జిల్లా కేంద్రాల్లో కూడా డీపీఆర్వోలు నరకం చూడాల్సి వస్తుంది. ఈ సాంకేతిక సమస్యను సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర అధికారులు ఎప్పుడు గుర్తిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది.

Tadepalli

2022-04-29 07:49:55

ఎన్ని‘కుల’ సంఘాలు ప్రభావితం చేస్తాయా

2024 ఎన్నికలను కుల సంఘాలు, సామాజిక వర్గాలు ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. రాజ్యాధికారం అంటే రెడ్లు, కమ్మవర్గానికే చెందిన వాళ్లే ఏళ్లకు ఏళ్లు పరిపాలించాలా, రాజ్యాధికారం అనుభవించాలా అనే ప్రశ్న నేడు బలంగా ఉద్బవిస్తోంది. ఏటెళ్లకాలం ఆ రెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారం చేస్తే..అత్యధిక సంఖ్యలో వున్న బీసీ సామాజిక వర్గాలు ఏమైపోవాలి. రాష్ట్రంలో అదిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత వర్గం, అంభేత్కర్ ముద్దుబిడ్డలైన ఎస్సీ, ఎస్టీలు ఏమైపోవాలి.. సరిగ్గా ఇపుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.  ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సామాజిక వర్గం బలాన్ని బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు కట్టబెట్టి అక్కడితో సరిపెట్టాలని..వారిని అక్కడే ఉంచాలని చూసే రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనే వాదనను యువ నాయకత్వం ఇపుడు తెరపైకి తీసుకు వస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్నాళ్లు ఒకరు పెట్టింది తినాలనే భావన ఇపుడు ప్రతీ సామాజిక వర్గంలోనూ మొదలైంది. చిన్నా చితకా పదవులతో సరిపెట్టుకుంటే వెనుక బడిన సామాజిక వర్గాలు రాజ్యాధికారం చేపట్టేది  ఎప్పుడు అనే ఆందోళన, బాధ, ఆలోచన ప్రతీ ఒక్క సామాజిక వర్గంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నందున ఇప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలను బలోపేతం చేసుకోవాలని అన్ని సామాజిక వర్గాలూ సమాలోచన చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒకతరం పెద్దలవలన అధికారానికి దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో ఇపుడు యువత తెరపైకి వస్తున్నారు. సామాజిక వర్గం బలాన్ని బట్టి.. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగితే వెనుక బడిన సామాజిక వర్గాల బలం కూడా రాజకీయ పార్టీలకు తెలుస్తుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత ఆయా రాజకీయపార్టీలు ముష్టివేసే నామినేనెడ్ పోస్టులతో సరిపెట్టుకోకుండా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారట. దానికి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు ఆయా ప్రధాన సామాజిక వర్గాలను, ఓటు బ్యాంకును పట్టించుకోకపోవడమనే ప్రధానకారణాన్ని ఇపుడు అన్ని సామాజిక వర్గాలు అంచనాలు వేస్తున్నాయని తెలుస్తుంది. ఇలా అయితే పాత తరంతోపాటు, వచ్చే యువతరం కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే కుల రాజకీయాలు చేయడం ఒక్కటే మార్గమని తలచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాల సంఘాల్లోనూ చర్చలు మొదలై సామూహిక సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది. గత ఎన్నికల సరళిని ద్రుష్టిలో పెట్టుకొని సామాజిక వర్గాల బలా బాలలను ప్రదర్శించడానికి 2024 ఎన్నికలే వేదిక కావాలని కూడా ప్రధాన సామాజిక వర్గాలు బేరీజు వేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత సామాజిక వర్గం కూడా ఈ సారి తమ బలాన్ని అన్ని రాజకీయ పార్టీల వద్ద చాలా బలంగా ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విభజించూ పాలించు అన్నట్టుగా రాజకీయాలు సాగాయాని, అందుకే ఈ దఫా ఎన్నికల్లో తమ సామాజిక వర్గం బలం తెలిసేలా అందరినీ ఏక తాటిపైకి తీసుకురావడానికి  చేనేత సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషిస్తోంది. దానికోసం ఇదే సామాజిక వర్గంలోని ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, సాధారణ సంఘాలు, యువ సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా అన్ని రకాల సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బల ప్రదర్శన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అపుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి అడుగు పెట్టిన వేళ ప్రస్తుతం కుల సంఘాలు ఈ ఎన్నికల్లో గట్టిగా ప్రభావితం చేస్తాయనే వాదన బలంగా వినిపిస్తుంది. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు ఎక్కువగా వున్న సామాజిక వర్గాలను లోబరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల రాజకీయ ముఖచిత్రం డిసెంబరు మాసం నుంచి ఏ విధమైన మలుపు తిరుగుతుందనేదే ఇపుడు ప్రతీనోట వినిపిస్తున్న మాట. చూడాలి ఈసారి ఎన్నికల్లోనైనా రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద సామాజిక వర్గమైన చేనేత సామాజిక వర్గానికి ఏ తరహా ప్రాధాన్యత దక్కుతుందో..!

Tadepalli

2022-04-29 03:07:08

ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమల

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టిటిడి అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ - 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము కూడా సహరిస్తామని తెలిపారు. అనంతరం అదనపు ఈఓ మీడియాతో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు తిరుమల దుకాణదారులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఐదో సమావేశం నిర్వహించామన్నారు. తయారీదారుల నుండి ప్లాస్టిక్ కవర్లలో వచ్చే కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అదనపు ఈఓ తెలిపారు. అనంతరం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ హైస్కూల్‌లో పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకొచ్చిన అభివృద్ధిని వివరించారు. ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్  మల్లికార్జున, విజిఓ  బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-28 11:56:10

కొత్త జిల్లాల్లో సమాచారశాఖకు రక్తకన్నీరు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన సమాచార పౌర సంబంధాలశాఖ(డీపీఆర్వోలు)కు ప్రాణ సంకటంలా మారింది. మూలిగే నక్కపై తాడిపండు పడిట్టుగా అసలే తీవ్రమైన సిబ్బంది, అధికారుల లేమితో కొట్టిమిట్టాడుతున్న సమాచార శాకకు కొత్తజిల్లాల్లో ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సమాచారశాఖకు రక్త కన్నీరే. అవునండీ జిల్లాల విభజన తరువాత సమాచారశాఖకు ప్రభు త్వం పూర్తిస్థాయిలో కార్యాలయాలు కూడా కేటాయించలేదు సరికదా.. సరిపాడా సిబ్బందిని కూడా నియమించలేదు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మీడియాకి తెలియజేయా లంటే కావాల్సిన కంప్యూటర్లుగానీ, ఇంటర్నెట్ గానీ లేవు. కొత్త జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు ఒక్క డీపీఆర్వోనే చూసుకోవాలి. కనీసం సహాయం చేయడానికి, ఒకేసారి ప్రభుత్వ కార్యక్రమా లు అధికంగా జరిగితే మొత్తం కవర్ చేయడానికి  ఔట్ సోర్సింగ్ ఏపీఆర్వోలను సైతం ప్రభుత్వం నియమించలేదు. ఆఖరికి కార్యక్రమాలు కవర్ చేసే టపుడు వెళ్లడానికి వాహన సదుపాయం అసలే లేదు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారిని మీడియాకి ప్రెస్ నోట్ అందించే పనిచేయడం కూడా చేత కావడంలేదు. మరికొన్నిచోట్ల డీపీఆర్వోలు అసలు ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు తయారు చేసి ఇచ్చే సామర్ధ్యం కూడా లేకపోవడంతో అధికారికంగా వచ్చే మెసేజ్ లను ప్రెస్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసి చేతులు దులుపుకుంటు న్నారు. ఇంకొన్ని కొత్త జిల్లాల్లో తమకి చేతకాని పని మీడియాకి తెలియకుండా ఉండేందుకు ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో ప్రధాన మీడియా సంస్థలనుగానీ, జర్నలిస్టులను గానీ చేర్చుకోవడం లేదు. అదేమంటే అలా మీడియా గ్రూపుల్లో జర్నలిస్టులను చేర్చుకోవాలంటే రాష్ట్ర అధికారుల అనుమతి ఉండాలని కొత్త కధలు చెబుతున్నారు. వాస్తవానికి సమాచారశాఖలో డీపీఆర్వోతోపాటు ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టైపిస్టు, ఒక ఏపీఆర్వో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి వుంది. కొన్ని చోట్ల వీడియోగ్రాఫర్లు వున్నా ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలను మీడియాకి పంపించడానికి ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లూ లేవు. కొన్ని చోట్లు వీడియో గ్రాఫర్లు ఉన్నా కెమెరాలు లేవు. దానితో వారి మొబైల్ ఫోన్లలోనే కార్యక్రమాల వీడియోలు కవర్ చేయాల్సి వస్తుంది. డీపీఆర్వోలు వారి సెల్ ఫోన్లతోనే అధికారిక కార్యక్రమాలు ఫోటోలు తీయాల్సి వస్తుంది. ఏజెన్సీల జిల్లాల్లో అయితే డీపీఆర్వోల పరిస్థితి రక్త కన్నీరే. కనీస సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు డీపీఆర్వోలు ముందుగానే జిల్లా కేంద్రంలోని ప్రధాన మీడియా ప్రతినిధుల ఫోన్ నెంబర్లతో డీపీఆర్వో ప్రెస్ వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో ప్రభుత్వ అధికారులకు చెందిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు తప్పితే ప్రెస్ నోట్లు అందించలేకపోతున్నారు. కొందరు డీపీఆర్వోలకి ప్రెస్ నోట్లు కూడా రాయడం రాక అయితే, మరికొందరికి రాయడం వచ్చినా కనీస సదుపాయాలు లేకపోవడంతో సమాచారం మీడియాకి అందించలేకపోతున్నారు. ఆదరాబాదరాగా ప్రభుత్వం కొత్త జిల్లాలకు డీపీఆర్వోలను సమాచారశాఖలో నియమించగలిగింది కానీ, వారి ద్వారా మీడియాకి కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన సమాచారం అందించే ఏర్పాటు చేయలేకపోతుంది.. కొత్తజిల్లాల్లో  75 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇవ్వాల్సి వున్నా.. అవకాశం లేక, సిబ్బంది కొరతతో కేవలం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమాచారం మాత్రమే అందిస్తున్నారు డీపీఆర్వోలు. అటు కొత్త జిల్లాలకు వెళ్లడం చాలా మంది సమాచారశాఖ అధికారులకు, సిబ్బందికి ఇష్టం లేకపోవడంతో విధుల్లోకి చేరినా ఆడుతూ, పాడుతూ పనిచేస్తున్నారు తప్పితే డీపీఆర్వోలకు మాత్రం కార్యాలయ సిబ్బంది నుంచి కనీస సహకారం అందడం లేదు. మరికొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాలకు బదిలీలు చేయడంతో ఆరోగ్యకారణాలతో లాంగ్ లీవ్ పెట్టేసి ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి తరుణంలో సమాచార పౌర సంబందాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా కమిషనర్ రంగంలోకి దిగి కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలకు కార్యాలయాలు, సహాయానికి ఏపీఆర్వోలను నియమించకపోతే ముందు ముందు పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో..!

Tadepalli

2022-04-27 03:03:23

తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. మే 14వ తేదీ వరకు 19 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మే 5వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ''శ్రీభాష్యం'' పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌ప‌త్తేదార్  గుర్ర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-26 12:59:16

జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్య‌క‌లాపాలు భేష్

నీతి ఆయోగ్ యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో చేప‌డుతున్న కార్య‌క‌లాపా లు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ పేర్కొన్నారు. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అమ‌లు చేస్తున్న విధ‌నాలు, ప‌థ‌కాలు అభివృద్ధి అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఉప‌క‌రిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. విజయనగరం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షా స‌మావేశం అనంత‌రం మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కార్య‌క్ర‌మం అమ‌లును ప‌ర్య‌వేక్షించేందుకు చేసిన‌ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న గ‌మ‌నించిన అంశాల‌ను వివ‌రించారు. ప్ర‌ధాన మంత్రి దేశ అభివృద్ధిని కోరుకుంటున్నార‌ని, దానిలో భాగంగా ఈ రోజు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించాన‌ని, త్వ‌ర‌లోనే జిల్లాలో అభివృద్ధి చెందిన జిల్లాల స‌ర‌స‌న చేరుతుందని మంత్రి ఆకాంక్షించారు. జిల్లాకు మ‌ళ్లీ వ‌స్తాన‌ని అప్ప‌టికి జిల్లాలో ఆశించిన ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో చేప‌డుతున్న ప‌నుల్లో కొన్నింటిని మ‌రింత ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించవ‌ల‌సి ఉంద‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న, ఇత‌ర‌ ప‌థకాల ద్వారా జిల్లాలోని ప్ర‌జ‌లు సంతృప్తిక‌ర జీవ‌నం సాగించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తులు, జీవ‌నోపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఒక‌టి, రెండు సంవ‌త్స‌రాల్లో ఆశాజన‌క జిల్లాల జాబితా నుంచి బ‌య‌ట ప‌డి అభివృద్ధి చెందిన జిల్లాల జాబితాలో విజ‌య‌న‌గ‌రం చేరుతుంద‌ని అన్నారు. జిల్లాలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నులు భవిష్య‌త్తు అభివృద్ధికి సూచిక‌గా నిలుస్తాయన్నారు. గ్రామ స‌చివాల‌యాలు, పేద‌లంద‌రికీ గృహాలు, వెల్ నెస్ సెంట‌ర్ సేవ‌లు, ఉపాధి హామీ ప‌థ‌కం ప‌నుల అమ‌లు తీరు సంతృప్తిక‌రంగానే ఉన్నాయ‌ని, అభివృద్ధి ప‌నులు కూడా బాగానే జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2022-04-26 12:38:46

విద్యుత్ సాంకేతిక నష్టాలను అధిగమించాలి

విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు డిస్కంలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మంగళవారం ఈస్ట్, సెంట్రల్, సౌత్ డిస్కం సిఎండిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో డిస్కంల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో డిస్కంల పాత్ర కీలకమైనదని అన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ ను అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని కోరారు. విద్యుత్ చౌర్యాలను పూర్తిస్థాయిలో అరికట్టడం, ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యలను నియత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ విషయంలోనూ ట్రాన్స్ ఫార్మర్ లు ఫెయిల్ అయిన వెంటనే డిస్కం అధికారులు తక్షణం స్పందించాలని కోరారు. వారం రోజుల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను మార్చాలని, లేనిపక్షంలో రైతులు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ట్రాన్స్ ఫార్మర్ లను మార్చడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని అన్నారు. దీనిపై డిస్కం సిఎండిలు దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో సిఎండిలు పర్యటించడం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు. ట్రాన్స్ ఫార్మర్ ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్ ల ఫెయిల్యూర్ రేటును మరింత తగ్గించాలని అన్నారు.  క్వాలిటీ టెస్టింగ్ , సిపిఆర్ఐ డిజైన్లు, నిబంధనల ప్రకారం పరీక్షించిన తరువాతే ట్రాన్స్ ఫార్మర్ ల కొనుగోళ్ళు చేయాలని అన్నారు.  ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.

'జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు'
జగనన్న కాలనీలు సీఎం శ్రీ వైయస్ జగన్ మానస పుత్రికలని, కాలనీలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 మంది పేదలకు ఇళ్ళస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని, వాటిని అన్ని వసతులను కల్పించాలనే సీఎం గారి లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జగనన్న కాలనీలకు ఫేజ్ -1 కింద 10,067 లేఅవుట్ల లోని 14.80 లక్షల ప్లాట్ లకు రూ.4500 కోట్లతో విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఈ పనుల విషయంలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.

కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అధికారులు మంత్రికి వివరించారు. ఆర్డిఎస్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, 2023 డిసెంబర్ నాటికి 46.41 లక్షల మీటర్లు భిగించాల్సి ఉందని తెలిపారు. అలాగే 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల మీటర్లను భిగించాల్సి ఉంటుందని తెలిపారు. 
 సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్క్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డిస్కం సిఎండిలు జె.పద్మాజనార్థన్ రెడ్డి, (సిపిడిసిఎల్) కె.సంతోషరావు (ఇపిడిసిఎల్), హెచ్ హరనాథ్ రావు(ఎస్పిడిసిఎల్), ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-04-26 10:33:47

సచివాలయాలను వెక్కిరిస్తున్న ‘స్పందన’

ప్రజల ఇంటి ముంగిట సమస్యలను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 అక్టోబరు 2న ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలను నాటి నుంచి నేటి వరకూ స్పందన కార్యక్రం వెక్కిరిస్తూనే ఉంది. వినడానికి కాస్త బాధగానూ, వింతగానూ ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడే గ్రామస్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పంది. ప్రభుత్వం ఏర్పాటై సుమారు మూడేళ్లు దాటున్నా నేటికీ సచివాలయాల్లో స్పందన ఊసేలేదు. నేటికీ స్పందన కార్యక్రమం అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది జిల్లా కలెక్టర్, జిల్లా కార్యాలయాలు మాత్రమే. సచివాలయాల్లో సిబ్బంది మొత్తం మధ్యాహ్నాం 3 నుంచి 5 గంటలవ రకూ అందుబాటులో ఉంచే విధంగా తీన్ మార్ బయోమెట్రిక్ అమలు చేస్తున్నా.. సచివాలయాల్లో మాత్రం స్పందన కార్యక్రమం జరగడం లేదు. అదేమంటే ప్రభుత్వం పెట్టిన ప్రతీదీ అమలు చేయాల అంటున్నారు ఇటు జిల్లా అధికారులు, మరో పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేస్తూ కష్టపడిపోయే పంచాయతీ కార్యదర్శిలు. ఎవరైనా మండల అధికారులు, జిల్లా అధికారులు పర్యటనలకు వచ్చే సమయంలో మాత్రం సచివాలయాల ముందు సబ్బరంగా బ్లీచింగ్ చల్లించి, ఆరోజు ఒకరిద్దరిచేత స్పందన దరఖాస్తులు స్వీకరించి దుఖాణం కట్టేస్తున్నారు. ఇదే వరస కొనసాగుతూ వస్తోంది. ప్రతీ ఒక్కరూ తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికే వెళ్లేటట్టు అయితే గ్రామ పంచాయతీ, వార్డుల పరిధిలో సచివాలయాలు ఎందుకనే మాట ప్రతీనోట దారుణంగా వినిపిస్తుంది. అసలు నేటికీ సచివాలయల్లో ఎంత మంది సిబ్బంది, ఏఏ సేవలు అందుతాయో రాష్ట్రంలో 20శాతం మంది ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో అవగాహనలేదంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండే సమయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఇతర శాఖల అధికారులకు భారం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇపుడు 13 జిల్లాలు కాస్తా, 26 జిల్లాలుగా మారి అధికారుల సంఖ్య పెరిగినా కూడా జిల్లా అధికారులు కాదు గదా, జిల్లా కలెక్టర్లు సైతం గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ప్రతీ రోజూ స్పందన కార్యక్రమం నిర్వహించే చర్యలు తీసుకోలేకపోతున్నారు. మొదట్లో అంటే సచివాలయాలు ఏర్పాటైన ఆరు నెలలకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా సచివాలయాల్లో స్పందన ఎక్కడ అనే విషయాన్ని రాస్తే.. గ్రామ, వార్డు  సచివాలయాలు ఇప్పుడే పుట్టిన పురిటి బిడ్డలు, అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం పెట్టేస్తారా అని ఒంటి కాలిపై లేచారు రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులు, కలెక్టర్లు, ఆఖరికి  సచివాలయ సిబ్బంది వరకూ. రేపు అంటే 2022 అక్టోబరు 2 వస్తే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతాయి. అంటే ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులుగానీ, జిల్లా కలెక్టర్లు గానీ ఆ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే దానిని ఏమనాలో ప్రభుత్వం చెప్పాల్సి వుంది. ఒకప్పుడు గ్రామ పంచాయతీలో కార్యదర్శి, గుమాస్తా పారిశుధ్యసిబ్బంది మాత్రమే ఉండేవారు. తరువాత కాలంలో వీఆర్వోలు అందుబాటులోకి వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏకంగా సచివాలయాల్లో 11 నుంచి 16 ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులోకి వచ్చినా నేటికీ సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన కార్యక్రమాన్ని అమలు చేయలేకపోతున్నారంటే లోపం ఎక్కడుందోప్రభుత్వంలోని పెద్దలు, రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులకే తెలియాలి.. ఇదేదో గ్రామ, వార్డు సచివాలయాలపై అక్కసుతో మేము అంటున్న మాటలు కాదు. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే మాటలు సందర్భంలోనే అనేక ప్రస్తుత అంశాలను గుర్తుచేస్తున్నాం. మేము అనడం కాదు.. స్పందన కార్యక్రమాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జరగడం లేదు అనడానికి సాక్ష్యాలుగా జిల్లా నలుమూలల నుంచి ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లలో అందుతున్న అర్జీలే వాటికి నిదర్శనం. నిజంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించి గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే.. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేవలం పెద్ద పెద్ద సమస్యలు మాత్రమే అర్జీలుగా నమోదు అయ్యేవి. కానీ గ్రామస్థాయి సమస్యలకు కూడా ప్రజలు నేటికీ జిల్లా  కలెక్టర్ కార్యాలయాలకే వెళుతున్నారంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏ స్థాయిలో సేవలు అంతున్నాయి. ఏ స్షాయిలో స్పందన నిర్వహిస్తున్నారో జిల్లా అధికారులే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వం రోజుకి మూడు సార్లు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ వేయాలని నిబంధన పెట్టినపుడే స్పందన కార్యక్రమం ఇక్కడ అమలు జరగడం లేదంటే లోపాన్ని జిల్లా పంచాయతీ అధికారితోపాటు ఇతర జిల్లా శాఖలు, కలెక్టర్, జిల్లా ఎస్పీలు గుర్తించాల్సి వుంది. పాత పెద్దజిల్లాల సమయంలో ఎలాగూ సచివాలయాలను ప్రభుత్వం గానీ, జిల్లా యంత్రాంగం గానీ చక్కదిద్దలేకపోయింది. ఇపుడు జిల్లాలు రెండింతలై.. అధికారులు కూడా అదే స్థాయిలో రెండింతలు పెరిగారు. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన నిర్వహించి, కామన్ సర్వీస్ సెంటర్ సేవలన్నీ అందుబాటులోకి తీసుకోవాలని ఆశిద్దాం.. అంతేకాదు ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. అప్పటీకీ స్పందన కార్యక్రమం జరగలేదంటే మాత్రం అటు ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని అధికారులకు..ముఖ్యంగా జిల్లా అధికారులకు ఒక ప్రత్యేక నమస్కారం పెడదాం..!

Tadepalli

2022-04-26 06:33:54

తెరపైకి కొత్తగా మున్సిపల్ కార్పోరేషన్లు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని 13 జిల్లాలను 26జిల్లాలుగా విభజించింది. అదే సమయంలో ప్రధాన జిల్లాల్లో అంతర్భాగంగా వున్న మున్సిపల్ కార్పోరేషన్ లను మరోసారి విభజించే ప్రక్రియ చేపట్టాలని యోచిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని ప్రస్తుతం వున్న మున్సిపల్ కార్పోరేషన్లు ఏఏ జిల్లాలకు అందర్భాలుగా ఉన్నాయి..కొత్త జిల్లాల్లో అయితే ఏఏ జిల్లాల్లో మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలి. అనే అంశాలను పట్టణ పురపాలక శాఖ ద్వారా అంచనాలు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. జిల్లాలను విభజించిన ప్రభుత్వం ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లను కూడా విభజించకపోతే అభివ్రుద్ధి పూర్తిగా కుంటుపడిపోతుంది. జనాభాలెక్కల ప్రాతిపదిక కూడా 2026నాకిటి ఈ ప్రక్రియ పూర్తిజరగాల్సి వుంది. దానికోసం ప్రస్తుతం ఏ మున్సిపల్ కార్పోపరేషన్ పరిధి ఏ కొత్తజిల్లాలో భాగంగా వుంది. ఏ జిల్లా నుంచి మున్సిపల్ కార్పోరేషన్ ను విడదీసి ఏ జిల్లాలో కొత్తగా మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కొత్తజిల్లాలతోపాటు, మున్సిపల్ కార్పోరేషన్లను కూడా విభజించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీల నిధులు అధికంగా వచ్చే వెసులు  బాటు వుంది. అదే సమయంలో జిల్లాలు మారిపోయిన తరువాత ఏ ప్రధాన పని కావాలన్నా ఇపుడు పాత జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అలా చేసిన సమయంలో జిల్లా పేరు, ద్రువీకరణ మారిపోతుంది. ప్రస్తుతం కొత్తజిల్లాలు విభజన జరిగిపోయిన తరువాత చాలా మంది ఆధార్ కార్డులు, ఇతర ఇంటి అడ్రసులన్నీ మార్పులు చేర్పులు చేయించుకుంటన్నారు. ఇలాంటి సమయంలో నగరపాలక సంస్థ పరిధిలో కూడా మార్పులు చేయించుకోవాలంటే కొత్తగా మారిన జిల్లాల్లోనే కొత్త కార్పోరేషన్లు ఉండాలి. అలా కాకుండా జిల్లా ఒక దగ్గర, కార్పోరేషన్ ద్రువీకరణ మరో జిల్లాలోనూ ఉంటే సాంకేతిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం వుందని ప్రభుత్వం గుర్తించి నట్టు సమాచారం. ఉదాహరణకు మహావిశాఖ నగరపాలక సంస్థనే తీసుకుంటే శివారు ప్రాంతమైన అనకాపల్లి జిల్లా జివిఎంసీ పరిధిలో వుంటుంది. నేటికీ జివిఎంసీ జోనల్ కార్యాయలయం అనకాపల్లిలోనే వుంది. కానీ జిల్లా మారినపుడు, నరగరపాలక సంస్థ కూడా మారాలి. కానీ నేటికీ మారలేదు. ఇదే విషయాన్ని ఇటు జివిఎంసీ అధికారులు, ఇటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టర్, జేసిలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లనట్టు సమాచారం అందుతుంది. దీనితో కొత్త జిల్లాల పరిధిని బట్టి, మున్సిపాలిటీలుగా వున్నవాటిని కలుపుతూ, నగర పాలక సంస్థలుగా మార్చాలా, లేదంటే జిల్లా కేంద్రంలోనే మున్సిపల్ కార్పోషనర్లు ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా మంతనాలు చేస్తోంది. కొత్తజిల్లాల్లో కొత్త మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలపై జూలై నెలాఖరుకి ఒక కొలిక్కి వస్తుందని తెలుస్తుంది. అదే జరిగితే జివిఎంసీ నుంచి అనకాపల్లి విడిపోయి.. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకూ పరిధిని పెంచి అనకాపల్లి మున్సిపల్ కార్పోరేషన్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జివిఎంపీ పరిధిలో పలు అనుమతుల కోసం పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం ఆలోచిస్తున్నతీరు, కొత్త జిల్లాలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వుంది. మహానగరపాలక సంస్థలను విడదీస్తారా.. కొత్త నగరపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారా.. అలాకాకుండా ఎక్కడి కార్పోరేషన్లను అక్కడే వుంచి పరిపాలనా సౌలభ్యం కోసం కొద్ది పాటి మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి..

Tadepalli

2022-04-25 01:29:42

తిరుప‌తికి చేరిన సేంద్రియ శ‌న‌గ‌లు

తిరుమ‌ల శ్రీ‌వారి ప్రసాదాల తయారీకి  ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన  వంద ట‌న్నుల శ‌న‌గ‌లు టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మ‌క్షంలో అధికారులు అందుకున్నారు. తిరుప‌తిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ‌నివారం అద‌పు ఈవో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ,  గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యం స‌మ‌ర్పించాల‌ని  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌న్నారు. ఇందులో భాగంగా గ‌త ఏడాది అక్టోబ‌రులో రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్‌ల‌తో టీటీడీ  ఒప్పందం చేసుకుంద‌ని చెప్పారు. దాదాపు 2500 మంది రైతులు ఎలాంటి ర‌సాయ‌న ఎరువులు, పురుగు మందులు ఉప‌యోగించ‌కుండా,  ప్ర‌కృతి వ్య‌య‌సాయంతో పండించిన శ‌న‌గ‌ల‌ను రైతు సాధికార సంస్థ ద్వారా సేక‌రించి, మార్క్‌ఫెడ్ ద్వారా, త‌మ మిల్ల‌ర్ల‌లో టిటిడి అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా రూపొందించి ఇస్తోంద‌న్నారు.  ప్ర‌తి ఏడాది ల‌డ్డూ ప్ర‌సాదాల త‌యారీకి 7 వేల ట‌న్నుల శ‌న‌గ‌లు, 896 ట‌న్నుల రెడ్ గ్రామ్ దాల్‌, 215 ట‌న్నుల బ్లాక్ గ్రామ్ దాల్‌, 474 ట‌న్నుల  బెల్లం, 54 ట‌న్నుల ధ‌నియాలు, 25 ట‌న్నుల ప‌సుపు, 237 ట‌న్నుల సోనామ‌సూరి బియ్యం, 22 ట‌న్నుల జీల‌క‌ర్ర, 83 ట‌న్నుల ఎండు మిర్చి, 284 ట‌న్నుల పెస‌రప‌ప్పు, 25  టన్నుల శ‌న‌గకాయ‌లు సేంద్రియ వ్య‌వ‌సాయం చేసే రైతుల నుండి  ఒక‌టి, రెండు సంత్స‌రాల్లో కొనుగోలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ఏడాది  గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన 2300 టన్నుల శ‌న‌గ‌లు అందుతాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 1800 ఎద్దులు, వ‌ట్టిపోయిన ఆవులను రైతుల‌కు అందించామ‌ని, శ్రీ‌వారి ప్ర‌సాదంగా భావించి వారు పూజ‌లు చేసి పోషించుకుంటున్నారని వివ‌రించారు. అంత‌కుముందు అద‌న‌పు ఈవో మార్కెటింగ్ గోడౌన్‌లో స్వామి, అమ్మ‌వారి చిత్ర‌ప‌టాల‌కు పూజలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో  న‌టేష్‌బాబు, మేనేజ‌ర్  సుబ్ర‌మ‌ణ్యం, మార్క్‌ఫెడ్ మేనేజ‌ర్ శ్రీ‌ధ‌ర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-23 12:22:17

శ్రీవారి భక్తులకు వేగంగా టైమ్ స్లాట్లు

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత వేగంగా, సౌక‌ర్యవంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందిచాల‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల జారీ  కౌంటర్లను శ‌నివారం ఈవో, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల విధానం పునరుద్ధరించాలని టీటీడీ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినిరింగ్ అధికారులు ఈవో, అద‌న‌పు ఈవోల‌కు వివ‌రించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, అవ‌స‌ర‌మైన చోట్ల షెల్ట‌ర్‌ల ఏర్పాటు, భక్తుల సౌక‌ర్యార్థం క్యూలైన్లలో మార్పులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ముందుగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను ఈవో పరిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈవో వెంట జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎస్ఇ (ఎల‌క్ట్రిక‌ల్)  వెంక‌టేశ్వ‌ర్లు, అద‌న‌పు సివిఎస్‌వో  శివ‌కుమార్ రెడ్డి, ఐటి విభాగాధిపతి  శేషారెడ్డి, విజిఓ  మనోహర్, డిఎస్‌పి ముర‌ళీకృష్ణ‌ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

Tirumala

2022-04-23 12:21:13

వైఎస్సార్ సున్నావడ్డీ రూ.1.261కోట్లుజమ

ఆంధ్రప్రదేశ్ లోని 9.76 డ్వాక్రా సంఘాల్లో సుమారు కోటి మందికిపైగా మహిళలకు డా.వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన వడ్డీ రూ.1.261 కోట్లు నగదును మాఫీకి సంబధించి రాష్ట్రంలోని అన్ని డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఒంగోలు నుంచి కంప్యూటర్ మీట నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యక్షంగా అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అకౌంట్లకు నగదు జమ చేసిన తరువాత నేరుగా అన్నిజిల్లాల నుంచి లబ్దిదారులతో సీఎం నేరుగా వర్చువల్ విధానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రాష్ట్ర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.

Ongole

2022-04-22 07:02:25

రాష్ట్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సచివాలయంలో తన ఛాంబర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజల చేసిన‌ అనంతరం  పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టారు. త‌న‌కు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కో ట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌పై గురుతరమైన బాధ్య‌త ఉంచార‌ని, మంత్రిగా రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తానని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తాన‌ని గుడివాడ అమ‌ర్ చెప్పారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ది, ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తాన‌ని వివ‌రించారు. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాన‌ని చెప్పారు. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం విశాఖ‌ప‌ట్నానికి ఉంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృధ్దికి, పెట్టుబడులకి అనుకూలమైంద‌ని, 900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్నాయ‌న్నారు. దేశంలోనే గొప్ప పరిపాలనాధ‌క్షుడైన సీఎం వైయ‌స్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని,  దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు.. ఆయన ఆశయాలని కొనసాగిస్తాన‌ని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

Tadepalli

2022-04-21 16:58:12

ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎం. ప్రసాదరాజు

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ చీఫ్ విప్ గా  ముదునూరి ప్రసాద రాజు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో  కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన  ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా  బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు అధికారులు, అనధికారులు ఆయన పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ బాధ్యతలను అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసన సభ సజావుగా జరిగేలా, విప్ లు మరియు సభ్యులు అందరినీ సమన్వయ పరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు  వచ్చేలా, ప్రజాసమస్యలపై శాసన సభలో సమగ్రంగా చర్చ జరిగేలా మరియు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని ఆయన తెలిపారు. అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పిస్తూ సుస్థిర మైన  పాలనను ప్రజలు అందజేస్తున్న ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా రంజకంగా ముఖ్యమంత్రి అందజేస్తున్న పాలనను ప్రజ లందరూ మెచ్చుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు.  

Tadepalli

2022-04-21 14:12:05