1 ENS Live Breaking News

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్‌ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణోత్సవంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్టు సమాచారం.  యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా యాదాద్రి గర్భాలయంలో బంగారు తాపడం పనులు, కలశస్థాపన తదితర అంశాలపై సమీక్షిస్తారని తెలుస్తోంది..

Yadadri temple

2022-03-10 11:01:43

మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రత్యక్ష ప్రసారం..

మహిళా దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తరలి వెళ్లారు. విజయవాడలో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తోంది.

Tadepalli

2022-03-08 06:28:14

Tadepalli

2022-03-08 05:28:53

6న అనంతాళ్వారు 968వ అవతారోత్సవం

శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 968వ అవతారోత్సవాన్ని మార్చి 6వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉప‌న్య‌సించ‌నున్నారు.   సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

   పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.

         నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

Tirumala

2022-03-03 12:21:00

జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్.. జగనన్న తోడు కార్యక్రమం 2022 లో 5.10 లక్షల మందికి వారి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి. ఎంతో మంది వీధి వ్యాపారులకు  జగనన్న తోడు ద్వారా లబ్ది పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యక్షంగా అందిస్తున్నాం..

Tadepalli

2022-02-28 07:27:54

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. కమిషనర్ కన్నబాబు

ఆంధ్రప్రదేవశ్ ప్రభుత్వం దేశీయ మత్స్యకారులు అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ కె.కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. జీఓనెంబరు 217పైనా ఆయన మత్స్యకారులకు పలు అంశాలను వివరిస్తున్నారు. ఆ ప్రత్యత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం  ప్రత్యేకంగా అందిస్తున్నాం..

Tadepalli

2022-02-22 10:54:25

సినిమా పరిశ్రమ సమస్యకు పరిష్కారం దక్కిందంటున్న తారలు.. ఈఎన్ఎస్ లైవ్ ప్రసారం..

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్రుషితో పరిష్కారం అయ్యేవిధంగా మార్గం సుగమం అయ్యిందని హీరో చిరంజీవి చెప్పారు. ఆయనతోపాటు, హీరో మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, పోసాని క్రిష్ణమురళి, సీనియర్ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తిలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందించారని నటులు చెబుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలు ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..


విజయనవాడ

2022-02-10 08:46:28

జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..

అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న చేదోడు పతకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి.. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్  ద్వారా  అందిస్తున్నాం...సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సమ్మె, ఎల్లోమీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమ్మె చంద్రబాబు సీఎం కాకుండా ఉండిపోయారనే బాధపడుతున్నారంటూ మాట్లాడారు...ఆ ప్రత్యక్ష ప్రసారాలను మీ కోసం..

Tadepalli

2022-02-08 08:18:30

ఉద్యోగ సంఘాలతో చర్చలు సలఫలం.. అమరావతి నుంచి ఈఎన్ఎస్ లైవ్ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ తో ఉద్యోగ సంఘాలు చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల జేఏసి చర్చలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిరువురూ మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నారు. మంచి వాతవారణంలో చర్చలు ముగిసినట్టు వారు పేర్కొన్నారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి తలపెట్టి సమ్మెను విరమించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లకు కాస్త మార్పులతో మంత్రుల కమిటీ పచ్చజెండా ఊపింది. దానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా ఆమోద ముద్ర వేయడంతో రేపు జరగబోయే సమ్మకు తెరగినట్టు అయ్యింది..

Tadepalli

2022-02-05 16:57:45

ఆ రెండింటిలోనూ ఏదో ఒకటి ఉంటేనే అనుమ‌తి..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి  మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ - 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.  కావున భక్తులు త‌మ‌ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నది.

Tirumala

2022-01-24 11:29:33

సచివాలయ ఉద్యోగులను అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం ప్రశ్నార్ధకమే..

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వీరిని కాదని ఇతర శాఖలకు ప్రాధాన్యత ఇచ్చి వీరిని పక్కన పెట్టడం ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో..మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమే వాదన తెరపైకి తీసుకు వస్తున్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే తప్పా మనకి  ప్రభుత్వ సహకారం, గుర్తింపు ఇచ్చిన మాదిరిగానే ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించాలని, అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం కూడా అదే స్థాయిలో వుంటుదనే విషయాన్ని మీడియాకి లీకులిస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యస్థ ద్వారానే నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందిస్తున్నది. వీరి సహకారం ప్రభుత్వానికి కొరవడితే సంక్షేమం పడకేడయం తప్పదు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు విరమించుకుంటే దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రంగా వుంటుందనేది ఇపుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చేసింది. రెండేళ్ల పాటు చెప్పిన పని, చెప్పని పని చేసిన తమకు ఇదేనా గుర్తింపు అంటూ ఉద్యోగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశం అవుతుంది. 

కరోనా సమయంలో అన్నిప్రభుత్వ శాఖలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే పనులు చేయించిందని, కరోనా టీకా విషయంలో ప్రాణాలకు తెగించి ప్రజలందరికీ సేవలు చేస్తే ఇదేనా తమకు దక్కే గౌరవం అంటున్నారు ఉద్యోగులు. తొలిరోజు అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్, జెసి, మండల స్థాయిలో ఎంపీడీఓలు సచివాలయ ఉద్యోగులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలను మాత్రం ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. అవసరం అయితే పెన్ డౌన్ చేయాలనే నిర్ణయంతోనే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.  కొన్ని చోట్ల ఉద్యోగులు మాత్రం భయపడి కొన్ని అధికారిక వాట్సప్ గ్రూపుల్లోకి మళ్లి వెనక్కి చేరిపోయారు. కానీ చాలా చోట్ల మాత్రం ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే ఉద్యోగులు తెగించే ఉన్నట్టు కనిపిస్తుంది..

కాగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేసిన  ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్.జగ్మోహనరెడ్డి దగ్గరకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సీఎం కూడా బాధపడినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖ ఉద్యోగులు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడమేంటనే విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతోంది. దీనితో గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆగమేఘాలపై చర్చలు జరిపారు. ఆపై కలెక్టర్లు, జెసిలు, డిపీఓలు, ఆఖరికి ఎంపీడీఓలు కూడా సచివాలయ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల ద్వారా, వారికి అనుకూలంగా వున్న కొందరు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా వార్నింగులు ఇచ్చారు. ఆ సమయంలో సచివాలయ ఉద్యోగులు అప్పటికి కొంత మంది మెత్తబడినా.. తమకు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పోల్చుకుంటే తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందనే విషయాన్ని మనసులో పెట్టుకున్నారు.  ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులపాటు తమకు సమ న్యాయం చేయని ప్రభుత్వానికి ఎందుకు సహకారం అందించాలనే వాదనను తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి అదీ కూడా నిజమే.. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారు 13 లక్షలకు పైగా వున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు న్యాయం చేసినపుడు రాని ఆర్దిక భారం ఒక్క లక్షా 30వేల ఉద్యోగులం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనివారికి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారికి ప్రొబేషన్ పూర్తిచేయడం వలన ఆర్ధిక భారం పెరిగిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వంపై గౌరవంతోనే కేవలం 15వేల రూపాయల జీతానికే పనిచేశామని ఇంకెంత కాలం అదే జీతాలకు పనిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఏం చేసినా అలా పడుంటారని వారి కోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదనే విషయాన్ని ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సలహాదారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. అంతకీ మొండి పట్టు పడితే సస్పెండ్ చేస్తాం..ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని బెదిరిస్తే.. వాళ్లే దారిలోకి వస్తారని కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టుగా రాష్ట్రంలో అందరు సచివాలయ ఉద్యోగుల సామాజిక గ్రూపుల్లో తీవ్రమైన చర్చనడుస్తుంది. ఆ మాట కొస్తే సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల కారా, వారికి ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవా అంటే అంత అవసరం లేదన్నట్టుగానే ఇప్పటి వరకూ చేస్తూ వచ్చారని..అందుకే నేరుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా జూన్ తరువా అందరికీ ఒకేసారి సర్వీసు రెగ్యులర్ చేస్తామని ప్రకటించారని సచివాలయ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా జీతం నష్టపోయామని, మరో ఆరు నెలలు జీతం కోల్పోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్లే తమను కాదని, మిగిలిన ప్రభుత్వ శాఖల ప్రయోజల కోసం ఆలోచిస్తే...తమ పరిస్థితి ఏంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం కొనసాగితే ముందు ముందు తమ సహకారం ప్రభుత్వం అందుకోవడం కష్టమని కూడా మీడియాకి లీకులిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి కూడా అలానే కనిపిస్తున్నది. అణచివేయాలని చూస్తే ఎవరైనా తిరగబడతారనే లాజిక్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర అధికారుల జిల్లాల్లో జెసిలు, మండలాల్లోని ఎంపీడీఓలు మరిచిపోవడం కూడా చర్చనీయాం అవుతుంది. ఈ లోపాలనే ప్రతిపక్షాలు కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటే వాటి ప్రభావం వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా కనిపించే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రేపు రాష్ట్ర రాజధానిలో జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటేందనే విషం ఉత్కంఠను రేపుతోంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-01-09 07:56:32

YSRCPప్రభుత్వ మానస పుత్రికను పెడచెవిన పెట్టిన ఫలితం..

భారత దేశం మొత్తం తొంగిచూసే విధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వమే పెడచెవిన పెట్టింది. కరోనాలాంటి ప్రాణాంతక వైరస్ సమయంలో సెలవులు సైతం తీసుకోకుండా పనిచేసినందుకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పూర్తియినా..వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా పక్కన పెట్టింది. ప్రభుత్వానికి గ్రామస్థాయిలో ఎంతో బలాన్నిచేకూర్చిపెడుతుందనుకున్న సచివాలయ వ్యవస్థ, అందులోని ఉద్యోగులే ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వాస్తవానికి ఈ పరిణామాన్ని ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు. అయితే ఈ ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వచ్చినది కాదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వానికి కాస్త తేడాగా ఆలోచనలు రుద్ది కావాలనే సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని దూరంచేయడానికే..రెండేళ్లు ప్రొబేషన్ పూర్తయినా..కనీసం సచివాలయ ఉద్యోగులను అసలు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించకుండా ఇతర శాఖల ఉద్యోగులకు వరాలు ఇచ్చి..తమకు రిక్త హస్తం చూపిస్తారా అంటూ ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయారు. 

వినూత్నంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని  మండలాల్లోని అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చేసి..తమకు న్యాయం చేయాలంటూ సచివాలయ ఉద్యోగులంతా తమ తమ వాట్సప్ గ్రూపుల్లో స్టేటస్ లు పెట్టి మరీ నిరసన తెలియజేశారు. సోమవారం నుంచి తమ నిరసన దశలవారీగా పెంచుతామని మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకూ సందేశాలను పంపారు. ఒకేసారి లక్షా 28 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఏం చెప్పినా చేస్తారనే కోణంతో రెండేళ్లలో పెట్టాల్సిన డిపార్టమెంటల్ టెస్టులన్నీ రెండేళ్లు పూర్తయిన తరువాత పెట్టడం, కరోనా సమయంలో కనీసం సెలవులు ఇవ్వకపోవడమే కాకుండా, రెండవ శనివారం, ఆదివారాల్లోనూ అజమాయిషీ చేసి మరీ పనిచేయించుకున్న ప్రభుత్వం తమను ఇంత దారుణంగా పక్కన పెడుతుందని తాము కలలో కూడా ఊహించలేదని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు గ్రామస్థాయిలో ప్రజలందరికీ చేర్చడానికి, ఆరోగ్యసేవలు అందించడానికి ప్రాణాలు పణంగా పెట్టినా ప్రభుత్వం గుర్తించకుండా, కేవలం ఇతర ప్రభుత్వశాఖలకు ఇచ్చిన గౌరవం తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా జనవరి నెల జీతంతోనే పెంచిన పీఆర్సీ జీతం ఇవ్వడంతోపాటు, రెండేళ్లు సర్వీసు పూర్తయిన తమకు ప్రొబేషన్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో లేకపోయినా ప్రభుత్వానికి అనుగుణంగా పనులు అదనపు గంటలు, సెలవుల్లో పనిచేయించుకున్న ప్రభుత్వం...ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులకు మాత్రం సర్వీసు ప్రొబేషన్ ఆరు నెలలు పొడిగింపు ఇచ్చారని..అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగానే చేయించుకుంటూనే తమను పక్కనపెట్టి అవమానించారని ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు మండల స్టాఫ్ వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో బయటకు వచ్చేయడంతో విషయాన్ని గమనించిన ఎంపీడీఓలు సచివాలయ కార్యదర్శిలతో సచివాలయ ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీచేయించింది. అయినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. అదే సమయంలో కార్యదర్శిలను మచ్చిక చేసుకొని, సచివాలయ ఉద్యోగులకు వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నమూ చేశారు. దీనితో విషయం తెలుసుకున్న ఉద్యోగులు కొన్ని జిల్లాల్లో బహిరంగంగానే తమ నిరసన తెలియజేసి మీడియా ముందుకి వచ్చారు. దీనితో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనను ఆ శాఖ జేసిలే అడ్డుకోలేకపోయారు.

 జెసిలు ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు పంచాయతీల్లోని గ్రేడ్ 5 కార్యదర్శిలపై మండిపడ్డారు..కొన్ని చోట్ల కార్యదర్శిలు సచివాలయ ఉద్యోగులకు నచ్చజెప్పాలని చూసినా, భయపెట్టాలని ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. పైగా ఆ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వారి వారి సామాజిక మాద్యమాల్లో షేర్ చేసి మరీ..అందరికీ తెలియజేసుకున్నారు సచివాలయ ఉద్యోగులు. అసలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులంగా మనం ప్రభుత్వాన్ని సరర్వీసు రెగ్యులర్ చేయమని అడగటమేంటని..అన్ని ప్రభుత్వశాఖల్లోనూ ఏవిధమైన నిబంధలు పాటిస్తున్నారో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనూ అవే నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ప్రభుత్వానికి ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖలో మాత్రం లేనిపోని నిబంధనలు, అన్నిరకాల పనులు అప్పగించి చేయించిన ప్రభుత్వం ఎందుకు తమను పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఇప్పటి వరకూ పనిచేసి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల కారణంగా గౌరవం తీసుకొచ్చిన ఉద్యోగులే ఇటు ప్రతిపక్షాల ముందు, అటు ఇతర ప్రభుత్వ శాఖ ముందు ప్రభుత్వానికి గాలి తీసేసే చర్యకు పూనుకున్నాయి...

 కాదు కాదు..ఈ విధంగా పూనుకునేలా ప్రభుత్వానికి తమ సొంత నిర్ణయాలు ఆపాదించే లా చేసిన కొంత మంది ద్వారా మాత్రమే జరిగిందనేది ఇపుడు తేటతెల్లమైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ మానస పుత్రికకు ప్రాధాన్యత ఇచ్చిన తరువాత ఇతర ప్రభుత్వశాఖలకు ప్రాధాన్యత ఇచ్చివుంటేపరిస్థితి వేరాలా ఉండేది. కాని దానికి వ్యతిరేకంగా జరగడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం చర్చనీయాంశం అవడంతోపాటు, ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చిపెట్టింది. సలహాలిచ్చేవారికి పరిపాలనపై పట్టులేకపోతే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయనే విషయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాల్సిందేనని వాదన సర్వత్రా వినిపిస్తున్నది.

Tadepalli

2022-01-08 17:27:18

ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. సచివాలయ ఉద్యోగులకు ఆ జీతం జూలై తరువాతే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్న వేళ.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతం విషయంలో అందించిన  కధనాలు మరోసారి అక్షర సత్యం అయ్యాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రస్తావించారు కూడా. అవును మీరు చదువుతున్నది నిజం.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు 2తో రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన తరువాత  వారికి కేవలం రూ.20 వేలు మాత్రమే జీతం అందుతుందని, మరో ఏడాది పాటు ఉద్యోగులు అదే రూ.15వేలు జీతానికి లేదా మరో ఐదు వేలు పెంచి  రూ.20వేలు చేసి మాత్రమే ఇస్తుందని(పీఆర్సీ అమలు జరిగితేనే అది కూడా)ముందుగానే ప్రత్యేక కధనాన్ని అందించింది. అయితే ఆ కధనాన్ని చూసిన సచివాలయ ఉద్యోగులు, మరి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఫేక్ వార్త అని, సత్యదూరమని కొట్టిపడేశాయి. అంతేకాదు ఎవరూ నమ్మ వద్దని పట్టించుకోవద్దని కూడా ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈఎన్ఎస్ కధనంలో చెప్పిన విధంగానే 2022 జూలై నెల జీతంలో అదీ పెంచిన జీతం జూలై నెల జీతంతో  అమలు చేస్తామని ప్రకటించింది. దీనితో ఈఎన్ఎస్ రాసే వార్తల్లో ఎక్కడా తేడాలు ఉండవని, అసత్యలు ఉండవని మరోసారి ప్రభుత్వ ప్రకటన ద్వారా తేటతెల్లం అయిపోయింది. తేడాగా ఆలోచించే ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు, ఈఎన్ఎస్ కధనాలను మరింత తేడాగా, తప్పుడుగా వారి వారి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసే వారికి ప్రభుత్వ ప్రకటనే ఒక చెంపపెట్టులా తగిలిందనేది అందరూ గుర్తుంచుకునేలా చేసింది.

ఇక్కడ రాష్ట్రప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు..తప్పు పట్టడం అసలే లేదనే విషయాన్ని కాస్త తేడాగాళ్లు గుర్తుంచుకోవాలి. కేవలం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత ఏ మీడియా సంస్థ వెలుగులోకి తేవని విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా బయటకు తీసుకు రావడంతో పాటు, ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలు, అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తామని అక్టోబరు 2నే ప్రకటించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అదే చేస్తున్నాం. ఇక ముందు కూడా అదే చేస్తాం.. అయితే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న న్యూస్ నెట్వర్క్ ను వినియోగించి తాజా విశేషాలను ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మధ్యలో ప్రజానికానికి చేరవేస్తున్నాం. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తయిన తరువాత కూడా రూ.15 వేల జీతం మాత్రమే వస్తుందని, లేదంటే మరో ఏడాది రూ.5వేలు పెంచి రూ.20 మాత్రమే జీతం అందుకుంటారని సరిగ్గా ఆరు నెలల క్రితమే ఈవిషయాన్ని ప్రత్యేక కధనంగా అందించాం. ఇపుడు అదే నిజమైంది. అంతేకాదు పీఆర్సీతోపాటు పెరిగిన జీతం జూలై నెల నుంచి మాత్రమే అమలు చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డే ప్రకటించడం కూడా విశేషం. అంటే ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ జీతం జనవరి నుంచే తీసుకుంటే ఒక్క సచివాలయ ఉద్యోగులే ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ చెప్పటినట్టుగా ఏడాది తరువాత రూ.20వేలు పెరిగిన జీతంగా తీసుకుంటున్నారు. అంటే ఏడాది పాటు పెరిగిన జీతం నష్టపోతున్నట్టే కదా(ఏమో చెప్పలేం ఏడాది తరువాత రెగ్యులర్ పేస్కేలు, పెంచిన పీఆర్సీ పే స్కేలు జూలై నెల జీతం కలిపి ఇచ్చినా ఇవ్వొచ్చు, లేదంటే ప్రభుత్వంపై భారం పడుతుందని ఇవ్వకపోవనూ వచ్చు)..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సమస్యలు, ప్రభుత్వం అమలు చేయని జీఓల విషయంలోనూ, ప్రొబేషన్ రెండేళ్లుపూర్తయినా వారి సర్వీసులు రెగ్యులర్ చేయని విషయంలోనూ, సాంకేతిక కారణాలను, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ ప్రత్యేక కధనాల రూపంలో అందిస్తున్నది. రానున్న రోజుల్లో కూడా అందిస్తుంది కూడా. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈఎన్ఎస్ వారి వెనుక ఉండి వారి సమస్యలను ప్రత్యేక కధనాల రూపంలో ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతుంది. అప్పుడైనా..ఇప్పుడైనా..ఎప్పుడైనా.. ఈఎన్ఎస్ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాత్రమే పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. వాస్తవానికి ప్రొబేషన్ పూర్తిచేసుకొని, ప్రభుత్వం పెట్టిన అన్ని టెస్టులు పాసైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెంచిన జీతం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు అమలు చేసి వుంటే సచివాలయ ఉద్యోగులకు కూడా చాలా ఆనందించేవారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. కనీసం సచివాలయ ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారాల్లో సైతం వారి సాధరణ పనులు చూసుకోకుండా ప్రభుత్వం కోసం పనిచేశారనే కోణంలో కూడా ఆలోచించలేదు. పైగా కరోనా పాండమిక్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందించిన సేవలు మాత్రం వెలకట్టలేనివి. చాలా మంది కరోనా మహమ్మారికి బలయ్యారు..మరికొంద మంది ఆ వైరస్ భారిన పడి మంచాన కూడా పట్టారు. అలాంటి సమయంలోనూ ఒక్క ఉద్యోగి కూడా ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులు నిర్వహించారు. కానీ ఇవేమీ ప్రభుత్వం పనిగణలోకి తీసుకోలేదు. ఆ విషయాలను కూడా ఈఎన్ఎస్ తన ప్రత్యేక కధనాల విషయంలో ప్రస్తావించిన పాఠకులకు తెలుసు.

అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు లబ్ది(జనవరి నెల నుంచి పీఆర్సీ అమలు చేసిన పెరిగి జీతం) సమానంగా చేకూరిందా అంటే లేదనే ప్రభుత్వ ప్రకటన ద్వారానే తేటతెల్లమైపోయింది. అంతేకాకుండా నాటి నుంచి నేటి వరకూ వీరి సర్వీసు రూల్సు విషయంలోనూ, వారి వారి ప్రభుత్వశాఖల జిల్లా అధికారుల ఆదేశాలు సచివాలయాల్లో అమలు జరిగే విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తరువాతనై తీసుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఫలితంగా చాలా మంది ఉద్యోగులు, ఇటు కొంతమంది పంచాయతీ కార్యదర్శిలు, కొద్ది మంది తేడా సచివాలయ కార్యదర్శిలు, మరికొంత మంది మండల అధికారుల ఓవర్ యాక్షన్ వలన నరకం చూడాల్సి వస్తుంది. చాలా కాలం తరువాత చాలా మంది పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువ మంది అన్నిశాఖల సిబ్బంది చూడటం ద్వారా వారి పైశాచికత్వాన్ని, తెలిసీ తెలయని ప్రభుత్వ నిబంధనలు(వీరిలో చాలా మందికి ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్, యాక్టు తెలియనే తెలియవనే విషయం గుర్తుంచుకోవాలి) అజమాయిషిని, దానికి కాస్త తేడా ఓవరేక్షన్  కూడా సచివాలయ ఇతరశాఖల ఉద్యోగులపై కూడా చూపిస్తున్నారు. ఇది ఈఎన్ఎస్ చెబుతున్న విషయం కాదు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు. సహచర ఉద్యోగులు పడుతున్న వేదనలు. అయితే సిబ్బంది కూడా తాము ఇబ్బంది పడుతున్నా బాధలు పడి సర్వీసు రెగ్యులైజేషన్ కోసం అంతా వేచి ఉన్నారు.

ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ పూర్తయిపోతే లెక్క తేడా వుంటుందని సంకేతాలు కూడా కొంత మంది ఉద్యోగులు ఇస్తున్నారు కూడా.. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడంతో వీరి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ కూడా మరో ఏడాది పొడిగింపు  జరుగుతుందని ప్రభుత్వం చెప్పకనే పీఆర్సీ ప్రకటించిన సమయంలో చెప్పేసింది. చివరిగా ఈఎన్ఎస్ చెప్పేది ఒక్కటే ప్రభుత్వానికే కాదు మరెవరికీ తాము వ్యతిరేకం కాదు, మరెవరకీ చేరువ అసలే కాదు.. ప్రభుత్వం చేసే అభివ్రుద్ధి, మంచి ఏస్థాయిలో పతాక శీర్షికలతో కధనాలు అందించామో..అదే సమయంలో కొందరు అధికారుల అనాలోచిత చర్యల వలన ప్రభుత్వానికి మచ్చవచ్చే సమయంలోనూ, అదే సమయంలో ఉద్యోగులు పడే ఇబ్బందులను, తద్వారా ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరును కూడా ఆదే స్థాయిలో ఆ విషయాలను,వాస్తవాలను బయటకు తీసుకు వస్తామని ప్రకటిస్తున్నాం. ఈ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఎవరికీ భయపడేది అసలే లేదని బల్లగుద్ది చెబుతున్నాం. తేడాగా ఆలోచించే వారి విషయంలో వాస్తవాల కధనాలతోనే ప్రజల ముందుకి వెళతామని, అందిస్తామని హెచ్చరిస్తున్నాం కూడా. ఈఎన్ఎస్ కథనాలు వాస్తవాలవడం ఇది మొదటి సారి కాదు, చివరి సారి అసలే కాదు..ఈ పరంపర జీవనదిలా కొనసాగుతూనే వుంటుంది..!

తాడేపల్లి

2022-01-08 04:27:26

జిఓనెం-2లో ఈఎన్ఎస్ చెప్పిందే అక్షర సత్యమైంది.. ప్రభుత్వమే ఆ జీఓను వెనక్కి తీసుకుంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలకు అధికారాలిస్తూ విడుదల చేసిన జీఓనెంబరు-2 విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పినట్టే జరిగింది. ప్రభుత్వం ఈ జీఓను వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. జీఓనెంబరు-2 విడుదలచేసి సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమించినపుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. ఈ జీఓ విడుదల విషయంలో వచ్చిన ఇబ్బందులు, ఆ తరువాత సాంకేతిక కారణాలు చాలా మందికి వీఆర్వోలకు కనీసం డిగ్రీ అర్హత లేకపోవడం, పరిపాలనపై పట్టులేకపోవడం, పంచాయతీల్లో సిబ్బంది వీఆర్వోలను డిడిఓలుగా అంగీకరించకపోవడం తదితర పరిణామాలపై ప్రత్యేక కధనాలు అందించింది. ఆ తరువాత సర్పంచ్ లు, కార్యదర్శిలు ఈవిషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గ్రామ పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని. దీనితో కంగారు పడిన పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామసచివాలయ వ్యవస్థకే ముసలం వస్తుందని భావించిన ప్రభుత్వం ఆ తరువాత వెంటనే జీఓని రద్దు చేయకుండా మళ్లీ డీడీఓ అధికారాలు పంచాయతీలు, సచివాలయ కార్యదర్శిలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మెమో జారీ చేశారు. ఈ విషయంలో కోర్టుకి వెళ్లిన పంచాయతీ సర్పంచ్ లు తమ వాదన బలంగా వినిపించడంతో గత్యంతరం లేక ప్రభుత్వం జీఓనెంబరు 2ను ఇపుడు వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి తెలియజేసింది.

 ప్రభుత్వ పరిపాలన, జీఓలు అమలు, లోపాలు, సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, ముఖ్యం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ  విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యేక కధనాలు అందిస్తూ వచ్చింది. ఇకపై కూడా అందిస్తూనే వుంటుంది కూడా. అయితే అప్పుడు వాస్తవాలను ముందే గమనించి రాసిన సమయంలో ఈఎన్ఎస్ కధనాలను రాష్ట్ర వ్యాప్తంగా వున్న చాలా వీఆర్వోలు కొట్టిపడేశారు..ప్రభుత్వమే ఇపుడు ఆ జీఓను వెనక్కితీసుకుంటుందని హైకోర్టుకి తెలియజేయడంతో ఎవరైతే కామెంట్లు, ఓవరేక్షన్ చేశారో వారంతా ఇపుడు ముక్కున వేలుసుకున్నారు. ఈఎన్ఎస్ ప్రభుత్వ పరిపాలన విషయంలో అందించే పరిశోధనాత్మక కధనాలు, వాస్తవాలు జీఓనెంబరు 2 విషయంలో కూడా వొమ్ముకాలేదని, తన కధనాల్లో ఏవైతే విషయాలు ప్రస్తావిస్తూ ప్రచురించిందో అదేవిధంగా.. జీఓనెంబరు రద్దుకాక పోతే పాలనా పరమైన ఇబ్బందులు, కోర్టుల్లో ఇబ్బందులు తప్పవనే విషయాలు ఇపుడు తేటతెల్లమయ్యాయని ఎవరైతే కామెంట్లు చేసి..లైట్ తీసుకున్నారో వారందరికీ ఈఎన్ఎస్ కధనాలు కళ్లు తెరిపించాయి.

వాస్తవానికి గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో అధిపతిగా వున్న పంచాయతీ, సచివాలయ కార్యదర్శిలకే డిడిఓ అధికారాలుండాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పంచాయతీ కార్యదర్శిలే మొత్తం సచివాలయాలను, పంచాయతీలను పరిపాలిస్తుంటారు. అలాంటిది వారికి కాకుండా సిబ్బందిలో ఒకరైన వీఆర్వోకి డిడిఓ అధికారాలు కట్టబెట్టడం అనేది అవివేక చర్యగానే ఇపుడు తేలిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో రెండు, మూడు గ్రామ సచివాయలయాలు ఉన్నచోట కూడా పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు డిడిఓ అధికారాలు, జీఓనెంబరు-149ని అమలు చేసి అధికారాలు కట్టబెడితే ప్రభుత్వం అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149 విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకపోతే..గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలు వారి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత మళ్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే జీఓనెంబరు 2 విషయంలో ఏం జరిగిందో అపుడు కూడా తప్పని సరిగ్గా జిఓనెంబరు149ని కూడా అమలు చేయాల్సి వుంటుంది. అలాకాకుండా ముందుగానే అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి మద్దతు రావడంతోపాటు గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడానికి ఆస్కారం వుంటుంది..

Tadepalli

2022-01-05 05:17:14

రెండేళ్లు దాటిపోతున్నా అమలు కాని జీఓ-149..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల ప్రొబేషన్ రెండేళ్లు దాటిపోతున్నా జీఓనెంబరు 149 ఆధారంగా సంక్రమించాల్సిన అధికారాలు, విధులు, నిధులు మాత్రం పంచాయతీరాజ్ శాఖ వీరికి అమలు చేయలేదు. దీనితో రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు ఎలాంటి అధికారాలు లేని ఉత్సవ విగ్రహాల్లా కనీసం సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుంది. జీఓ నెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు వారు పనిచేసే సచివాలయ పరిధిని మొత్తం వీరికి అప్పగించాలసి వుంటుంది. దానికోసం మేజర్ పంచాయతీని విభజించి అందులోని నిధులను, విధులను, అధికారాలను కూడా బదలాయించాలి కానీ..ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలు ఏర్పాటై 26 నెలలు గడుస్తున్నా వీరికి మాత్రం ఆ అధికారాలను ప్రభుత్వం బదలాయించలేదు. దీనితో అధికారాలు ఇవ్వని జీఓలు ఎందుకు విడుదల చేయాలంటూ గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వం మరియు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ వ్యవహరా శైలిపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలందించాలని సచివాలయ కార్యదర్శిలు ఉద్యోగాల్లోకి చేరినా నాటి నుంచి నేటి వరకూ ప్రభుత్వం జీఓనెంబరు 149 ద్వారా చట్టబద్ధంగా తమకు రావాల్సిన అధికారాలను బదలాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం  రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు ఆరు వేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓల దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం నేటికీ ఫలితం లేకుండా పోయింది. తమకు అధికారాలు లేకపోవడం వలన ఆఖరుకి పారిశుధ్య నిర్వహణ కూడా సొంతంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎందుకు విధులు నిర్వహిస్తున్నామో తమకే తెలియడం లేదంటూ నిరసన తెలియజేస్తున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటి మరో మూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో అయినా ప్రభుత్వం గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, తమ సచివాలయ పరిధిని లెక్కల ప్రకారం విభజిస్తుందా లేదంటే ఇప్పటివరకూ ఎలాంటి అధికారమూ ఇవ్వకుండా పనిచేయించినట్టుగా వారితో విధులు నిర్వర్తించేలా చేస్తుందా అనేది తేలాల్సి వుంది..

Tadepalli

2022-01-01 05:19:38