1 ENS Live Breaking News

2022-04-21 06:00:47

కొత్త జిల్లాలకు సరికొత్త యూనివర్శిటీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలను చేయడంతోపాటు, ఆయా కొత్తజిల్లాలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్టం చేయడానికి జిల్లా ప్రాధాన్యతను బట్టి ఆ జిల్లాలో సంబంధిత యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటి వచ్చింది.  అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఆయ ఉత్తమ విద్యావిభాగాలకు చెందిన యూనివర్శిటీలను కొత్తజిల్లాల్లో ఏర్పాటు చేసి జిల్లాలను విద్యా కేంద్రాలుగా అభివ్రుద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. దానికితోడు అన్ని కొత్త జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తుండటంతో విద్య, వైద్యం, ఆరోగ్యం పరంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రులను అభివ్రుద్ధి కూడా చేస్తారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.  మెడికల్ కాలేజీతోపాటు, డిప్లమా నర్శింగ్, డిగ్రీ నర్శింగ్, పీజీ నర్శింగ్ కళాశాలలు కూడా కొత్తజిల్లాల్లోనే ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర వైద్యసేవలకు కావాల్సిన వైద్యులను, పారామెడిక్స్ ను ప్రభుత్వ కళాశాలలు, యూనివర్శిటీల ద్వారా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, వాణిజ్యం అభివ్రుద్ధి చెందాలంటే అక్కడ నూతన వంగడాల ఆవిష్కరణలు జరగాలి.. అలా జరగాలపంటే పరిశోధనలు జరగాలి. దానికోసం యూనివర్శిటీలు ఏర్పాటు ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నది. కేజీ నుంచి పీజీ వరకూ మొత్తం విద్యను ప్రభుత్వపరంగా అందించడం ద్వారా విద్యతోపాటు, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పూర్తిస్థాయిలో కల్పించవచ్చుననే ఆలోచనకు ప్రభుత్వం వచ్చంది. ఐటీ రంగాన్ని అభివ్రుద్ధి చేయడం ద్వారా సాఫ్ట్ వేర్ హబ్ లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. దానికోసం యూనివర్శిటీ స్థాయిలోనే పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని కూడా అంచనాలు వేస్తున్నారు. దానికోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి జిల్లాల్లో ఐటీ హబ్ లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే పాఠశాల విద్య నుంచి ఇంటర విధ్య వరకూ ఆరు విధానాలను అమల్లోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం ఆపై డిగ్రీ, పీజీలలో కూడా సరికొత్త విధానాలను అమలు చేయడం ద్వారా విద్యార్ధి చదువుకునే సమయంలోనే ఏదో ఉద్యోగానికి ఎంపిక అయ్యేలా కూడా కార్యాచరణ చేపడుతున్నది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలకు ధీటుగా కొత్త విద్యా విధానాలు, కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్ధులుగా ఉన్నప్పుడే ఉద్యోగులుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయినందున ఏఏ కొత్త జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలనే కోణంలో ఇప్పటికే ప్రభుత్వం నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2014 నాటి  26 జిల్లాల్లో 26 యూనివర్శిటీలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Tadepalli

2022-04-21 02:18:59

ఆధార్ కార్డులో జిల్లాల పేరు మార్పులు..

ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. మండలం, పిన్‌కోడ్ మ్యాపింగ్ చేసి వాటి ఆధారంగా మార్పులు చేస్తే ఆధార్‌లోనూ జిల్లా పేర్లు వాటంతట అవే మారేలా చేయవచ్చని సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి సరిదిద్దవచ్చని తెలిపారు. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే అని.. ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆధార్‌లో పాత చిరునామా ఉంటుందని.. ప్రింట్ తీసుకున్నా దాని ప్రకారమే వస్తుందని వివరించారు. తెలంగాణలోనూ కొత్త జిల్లాలు అమల్లో ఉన్నాయని.. అక్కడ కూడా ఇదే సమస్య ఉందని సీసీఎల్‌ఏ కార్యదర్శి గుర్తుచేశారు.

Tadepalli

2022-04-20 10:43:33

తిరుమలలో మరో దాత‌ల కౌంట‌ర్..

తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బుధవారం దాత‌ల కోసం మరో కౌంట‌ర్‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ చేశారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది.  దాత‌లు చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు స‌మ‌ర్పించేందుకు వీలుగా యూనియ‌న్ బ్యాంక్ సౌజ‌న్యంతో ఈ కౌంట‌ర్ ఏర్పాటు చేశారు. భ‌క్తులు రూ.100/- నుండి విరాళాలు అందించ‌వ‌చ్చు.  ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ప్రత్యేకాధికారి  జిఎల్ఎన్‌.శాస్త్రి, యూనియ‌న్ బ్యాంకు రీజనల్ మేనేజర్  శాస్త్రి, బ్రాంచి మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.

Tirumala

2022-04-20 09:45:17

YSR నిర్మాణ్ మరింత వేగం పెంచాలి..

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేరువ చేస్తోందని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు, భారీ ఎత్తున తలపెట్టిన నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ ను తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సిమెంట్ కర్మాగారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని మూడోబ్లాక్ లో మంగళవారం వైయస్ఆర్ నిర్మాణ్ లో భాగంగా సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలకు సిమెంట్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన మేరకు పరిశ్రమలు సిమెంట్ ను అందించాల్సి ఉందని, అయితే కొన్ని కంపెనీలు తమకే నిర్ధేశించిన దానిలో ముప్పైశాతం కూడా అందించలేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం  వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ళస్థలాలు ఇచ్చారని, మొదటి దశలో 16 లక్షల ఇళ్ళ నిర్మాణం ప్రారంభించారని మంత్రులు తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, విలేజ్ క్లీనిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు ఇలా ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగాల పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోందని, నాడు-నేడు కింద కూడా పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ నిర్మాణ పనులకు సిమెంట్ అవసరాలను ఆయా కంపెనీలు తీర్చాల్సి ఉండగా, అనుకున్న మేర సిమెంట్ సరఫరా చేయడం లేదని అన్నారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తమ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, సీఎం గారితో చర్చించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి పరిశ్రమలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ విషయంలో కొరత ఏర్పడితే అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుందని, దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. దీనిపై సిమెంట్ కంపెనీల ప్రతినిధులు కూడా మరోసారి సమీక్షించుకోవాలని, తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సిమెంట్ సరఫరాను సకాలంలో అందించాలని కోరారు. మంత్రుల విజ్ఞప్తిపై సిమెంట్ కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిర్ధిష్ట కాలవ్యవధిలోనే సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండి నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-04-19 15:38:26

21న అఖండ బాలకాండ పారాయ‌ణం

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 21వ తేదీన గురువారం 8వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమంలో బాలకాండలోని 33 నుండి 37 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్,  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని టిటిడి కోరుతోంది.

Tirumala

2022-04-19 07:53:38

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతా..

రాష్ట్ర  ఆరోగ్య, కుటుంభ సంక్షేమం,  వైద్య విద్య శాఖ మంత్రిగా విడదల రజని సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు భర్త, పిల్లలతో విచ్చేసిన ఆమెకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. వైద్య నిపుణులకు రూ.85 వేల వరకు జీతాలు పెంచుతూ తొలి సంతకం ఆమె చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా గొప్ప బాధ్యతలను తనకు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యాలు, ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలోని నిరుపేదలకు అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా అడుగులు వేస్తానన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజక  వర్గంలో ఒక వైద్య కళాశాల చొప్పున రాష్ట్రంలో పదహారు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుచున్నదన్నారు. అయితే అన్ని వైద్య కళాశాలల నిర్మాణ పనులన్నీ వచ్చే నెలాఖరులోపు ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. నాడు-నేడు పథకం అమల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపర్చడం జరుగుచుడంతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది పోస్టులన్నింటీ పెద్ది ఎత్తున భర్తీ చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తున్నదని, టెలీమెడిసిన్ సేవలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు  తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతగానో అభినందించడం ఇందుకు నిదర్శనం అన్నారు. క్యాన్సర్ పై ప్రత్యేకించి మహిళల్లో ప్రభలుతున్న క్యాన్సర్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు  ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని, ఈ అవగాహన కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరియు దీనికి సంబందించిన వైద్య సేవలను  ప్రజలకు మరింత చేరువులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు.  దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు పరుస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు కృషిచేస్తానన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తూ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా కృషిచేస్తూ  ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని ఆమె అన్నారు.  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇతర అధికారులు, అనధికారులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర  ఆరోగ్య, కుటుంభ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని కి పుష్పగుచ్చాలు అందజేసి అభినందలు తెలిపారు.

Tadepalli

2022-04-18 12:53:08

సచివాలయాల్లో తీన్మార్ బయో మెట్రిక్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీన్మార్ ను గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చింది. ఏంటి గ్రామ సచివాలయాలకు తీన్మార్ ను చేర్చడం ఏంటి అనుకుంటున్నారా.. అలా అయితే మీరు బయోట్రిక్ కధ, కొందరు సచివాలయ కార్యదర్శిల అతి, మరికొందరు స్టేషన్ ఎస్ఐలు పదే పదే పనులు చెప్పే తనం, ఆ పై ఏం చెప్పినా, చేసినా, తమ అనుమతి లేకుండా ఏమీ చేయకూడదన్న కొందరు తేడా ఎంపీడీఓల మొండిపట్టు, సచివాలయాల్లో ప్రతీరోజూ జరగని స్పందన ను ఖచ్చితంగా నిర్వహణ చేసేలా  నీళ్లు చల్లిన ప్రభుత్వ ఆదేశం తీన్ మార్ బయో మెట్రిక్ కోసం తెలుసుకోవాలి. అవునండి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తన జేబుల్లోనుంచి జీతాలు ఇస్తున్నట్టుగా ఫీలైపోయే అధికారులకు చాలా చక్కగా ప్రభుత్వం గుణపాఠం చెప్పింది.  సచివాలయాల్లో పనిచేసే సుమారు 11 నుంచి 14 ప్రభుత్వ శాఖల సిబ్బంది వారి జిల్లాశాఖల అధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని పనులపై సిబ్బంది వారి వారి మాత్రుశాఖల అధికారులు చెప్పే పనులు చేసే ఆదేశాలను పాటించి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో సచివాలయ కార్యదర్శిలు సచివాలయ సిబ్బందిపై ఒంటికాలిపై లేస్తున్నారు. చేసే ఉద్యోగం ఇక్కడే అయినా.. అస్తమానూ వారి జిల్లాశాఖల అధికారుల పనులపై బయటకు వెళ్లిపోతున్నారని, కార్యాలయ పనులు చేయడం లేదని, ఇలా అయితే సర్వీసు రెగ్యులైజేషన్ నిలిపేస్తామని, సాలరీలు పెట్టేది లేదని బెదిరింపులకు దిగుతూ, తెగఫీలైపోయి, వారి జేబుల్లోనే జీతాలు ఇచ్చేస్తున్నట్టుగా.. ఆఖరికి సిబ్బంది విధులు చేపట్టడం లేదన్నట్టుగా తేల్చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయాశాఖల ఉద్యోగులు చేయాల్సిన పనులపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు, సర్క్యులర్ ల ద్వారా సమాచారం పంపినప్పటికీ వాటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు సచివాలయాల్లో. అందులోనూ వచ్చే సర్క్యులర్ లు కూడా అటు జిల్లాశాఖల ప్రభుత్వ అధికారులు ప్రాపర్ ఛానల్ లో పంపించడం లేదు( రాష్ట్రశాఖ నుంచి జిల్లాశాఖకు, జిల్లాశాఖ నుంచి మండల కేంద్రానికి,  మండల కేంద్రం నుంచి గ్రామ, వార్డు సచివాలయానికి) దీనితో ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం చెబుతున్నది అనే విషయం సచివాలయాల్లోని కార్యదర్శి, స్టేషన్ ఎస్ఐ, పీహెచ్సీ వైద్యాధికారి, మండల ఇంజనీరు, వ్యవసాయాధికారి, ఉద్యానవన అధికారి, మండల సంక్షేమ అధికారి, మండల రెవిన్యూ అధికారులకు తెలియడం లేదు. ఈ క్రమంలో ఇటు సచివాలయాల్లోనూ, అటు మాత్రుశాఖల్లో చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఈ సమయంలో మాత్రుశాఖ అధికారులు, ఇటు సచివాలయ కార్యదర్శిలు చెప్పే పనులు చేస్తుంటే..ఎక్కడలేని మంట, ఇబ్బంది, చిరాకు, ఇతరత్రావన్నీ ఇరు పక్షాల అధికారులకూ వచ్చేస్తున్నాయి. అలాగని ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులను అనుసరించి నడుస్తున్నారా అంటే అదీలేదు. ఫలితంగా అధికారులు, సచివాలయ కార్యదర్శిల మధ్య తీవ్రమైన సమాచారలోపం తలెత్తుతుంది. వీరి మధ్యలో సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా నలిగిపోతున్నారు. 

ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకెళ్లింది. ఇటు సచివాలయ కార్యదర్శిలు చెప్పే పనులు, అటు మాత్రు శాఖల అధికారులు పురమాయించే విధులకు సచివాలయ సిబ్బంది మొత్తం వెళ్లిపోవడంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించ తలపెట్టిన స్పందన మరుగున పడిపోయింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం ఇపుడు మూడు సార్లు బయో మెట్రిక్ సచివాలయ ఉద్యోగులు వేయాలనే నిబంధన పెట్టింది. మధ్యలో వేసే బయో మెట్రిక్ హాజరు ప్రత్యేకంగా మధ్యాహ్నాం 3గంటలకే పెట్టింది. దానికి కారణం ఏంటంటే సచివాలయాల్లో ప్రతీరోజూ 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 30శాతం గ్రామ వార్డు సచివాలయాలు, పంచాయతీల్లో ఈ స్పందన నిర్వహించడంలేదు. ఫలితంగా ప్రజలంతా తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా రెండో బయో మెట్రిక్ మూడు గంటలకు వేయాలంటే సచివాలయ సిబ్బంది మొత్తం కార్యదర్శితో సహా సచివాలయాల్లో ఉండాలి. అలా ఉంటే స్పందన కార్యక్రమం నిర్వహణకు వీలుపడుతుంది. సరిగ్గా ఆ ఉత్తర్వులను అమలు చేసింది ప్రభుత్వం. స్పందన నిర్వహణకో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు సచివాలయ కార్యదర్శిలు, అటు మండల శాఖల అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టుగా చేసింది. 


ప్రస్తుతం చచ్చినట్టు సచివాలయ ఉద్యోగులంతా మధ్యాహ్నాం 3 గంటల వరకూ ఇతర కార్యక్రమాలన్నీ చూసుకొని, మధ్యాహ్నాం 3 నుంచి 5 వరకూ మాత్రం సచివాలయాల్లోనే ఉంటున్నారు. ఎన్ని ఉత్తర్వులు ప్రభుత్వశాఖల ద్వారా ఇచ్చినా వాటిని పెడచెవిన పెట్టే సచివాలయ కార్యదర్శిలు, మండలశాఖల అధికారులను మొత్తం ఏక కాలంలో పనిచేసే విధంగా తీసుకొచ్చిన ఈ తీన్మార్ బయో మెట్రిక్ వలన స్పందన కార్యక్రమం మళ్లీ పూర్తిస్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ సచివాలయాల్లో పనిచేయడం లేదని కార్యదర్శిలు, అలాగని మండలశాఖల అధికారులు చెప్పిన పనులు చేయలేదని వారు ఇద్దరూ మండలాధికారులు తెగ ఫీలైపోయేవారు. ప్రభుత్వం తీసుకున్న తీన్మార్ బయో మెట్రిక్ తో సచివాలయ కార్యదర్శిలతో పాటు, మండల అధికారుల అహంపైనా దెబ్బ కొట్టినట్టు అయ్యింది. ఇపుడు మాత్రుశాఖల పనులు చేయాలంటే ఖచ్చితంగా సచివాలయం నుంచి కార్యదర్శి, లేదంటే సదరు మాత్రుశాఖ అధికారి మాట్లాడుకోవాల్సి వుంటుంది. గతంలో ఈ విధంగా మాట్లాడి తమకు విధులు అప్పగించాలని సచివాలయ ఉద్యోగులు నెత్తీనోరూ కొట్టుకొని చెప్పినా వీరిరువురూ పట్టించుకునేవారు కాదు. శంఖంలో పోస్తేనే తీర్ధం అయినట్టు.. ప్రభుత్వం తీన్మార్ బయో మెట్రిక్ ను అమలు చేస్తే తప్పా వీరి అతికి అడ్డుకట్టపడలేదు. దీని ప్రభావం రోజువారి నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ స్పందనపై పడుతుందా..లేదంటే యదా ప్రకారంగా ప్రభుత్వ ఉత్తర్వులను అటు మండలశాఖల అధికారులు, ఇటు సచివాలయ కార్యదర్శిలు ఏమీ పట్టనట్టు వదిలేస్తారా అనేది తేలాల్సి వుంది.

Tadepalli

2022-04-18 05:54:32

రామయ్య కు సీఎం పట్టువస్త్రాలు..

ఒంటిమిట్ట  శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి  వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న సీఎం కి టిటిడి చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి గారు, ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి గారు అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. అర్చకులు ముఖ్యమంత్రి కి తలపాగా కట్టి పళ్లెం లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. ముఖ్యమంత్రి వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి  శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  ముఖ్యమంత్రి కి స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రి రోజా, ఎంపీలు  మిథున్ రెడ్డి, శ్రీ అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్  ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు  మేడా మల్లిఖార్జున రెడ్డి,  పి. రవీంద్ర నాథ రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి,  కొరుముట్ల శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ  అన్బు రాజన్  ఉన్నారు. అంతకు ముందు టీటీడీ అథితి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.

Ontimitta

2022-04-15 15:05:04

కొత్త జిల్లాలకు అధికారులు కావలెను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విభజించిన 13 కొత్త జిల్లాల్లోని 75 ప్రభుత్వ శాఖలకు అధికారులు కొరవడ్డారు. ఈ జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమించినంత త్వరగా ప్రభుత్వం జిల్లా శాఖల అధికారులను నియమించలేకపోయింది. దానికి వివిధ శాఖల్లో అధికారుల లేమి స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో ఒక్కోశాఖ అధికారిని రెండు జిల్లాలకు అధికారిగా నియమించింది. కొత్తజిల్లాల్లో పరిపాలన ప్రారంభం అయినా జిల్లాలో పూర్థిస్థాయిలో అధికారులు సిబ్బంది లేకపోవడంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిజిల్లాల్లో అధికారులు నియమింతులైనా..ఇంకా కార్యాలయా సామాగ్రి రాలేదు. వచ్చిన చోట ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. అందులోనూ ప్రభుత్వం కొత్త జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం  కోసం జిల్లా కార్యాలయానికి సైతం సిబ్బందిని కుదించేయడంతో ఒక్కో కార్యాలయానికి కేవలం ఐదు నుంచి ఏడుగురు ఉద్యోగులు మాత్రమే పనిచేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇక కలెక్టరేట్లలో అయితే అన్ని విభాగాలను కుదించేసి కేవలం నాలుగు సెక్షన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అన్ని కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓలు తప్పా మిగిలిన శాఖల ఉద్యోగుల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. అరకొరగా ఉన్న సబ్బందితో జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేస్తున్న స్పందనకు సైతం అన్నిశాఖల అధికారులు రాలేకపోతున్నారు. వాస్తవానికి అధికారుల విభజన జిల్లాల విభజన కంటే ముందుగా చేపట్టినా అదిమాత్రం ఒక కొలిక్కి రాలేదు. అందులోనూ పాత జిల్లాల్లో తప్పితే.. కొత్త జిల్లాల్లోని అధికారులంతా డివిజనల్ స్థాయి అధికారులనే కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులుగా నియమించింది ప్రభుత్వం వారినే జిల్లా అధికారులుగా చూపిస్తూ సేవలు అందిస్తున్నది. కానీ వాస్తవానికి వారి కేడర్ లో మాత్రం మార్పు రాలేదు, పదోన్నతి, జీతాలు అసలే పెరగలేదు. కొత్తజిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖలకు అధికారులంతా జిల్లా అధికారులేనని గుర్తించి పరిపాలన సాగిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలు అయ్యాయి. ఆపై కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన మంత్రులు కూడా ప్రస్తుతం జిల్లాల్లోని అధికారుల కూర్పుపైనా ద్రుష్టిసారించాల్సి వస్తుంది. మంత్రులకు తెలిసిన వారు, జిల్లా క్యాడర్ కి తెలిసిన వారు, ఇంకా జిల్లాకి రావడానికి ఆశక్తిచూపేవారి జాబితాలను కొత్త మంత్రివర్గం తమకు కావాల్సిన అధికారులను తమ తమ జిల్లాలకు జిల్లా అధికారులుగా రప్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. అందులో ముఖ్యమం ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి, విశాఖజిల్లా, చిత్తూరు, విజయనగరం ప్రాంతాల్లో ఏర్పాటైన కొత్త జిల్లాలకు అధికారులను ఏర్పాటు చేసుకోవడానికి, పూర్తిస్థాయి పరిపాలనా జిల్లా అనిపించుకునేందు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఇతర కిందిస్థాయి కేడర్ నాయకులు కూడా గట్టిగానే శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మొదలు పెట్టిన పనులన్నీ పూర్తిస్థాయిలో జరిగి, అన్ని ప్రభుత్వశాఖలకు జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది రావాలన్నా, ఏర్పాటు కావాలన్నా 6నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం కూడా పూర్తవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పదవీకాలం పూర్తవడానికి ఏడాది ముందుగానే జిల్లాలను పరిపూర్ణ జిల్లాలుగా చేయాలన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తుంది. దానికి ఇటీవల ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేస్తుందా..లేదంటే ఉన్నవారినే సర్దుబాటు చేసి పరిపాలను ఇబ్బంది లేకుండా చూస్తుందా..? చూడాలి కొత్త జిల్లాలకు అధికారులు కావలెను అనే పదాలను ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వం ఏస్థాయిలో భర్తీచేస్తుందో..!

Amaravati

2022-04-15 02:08:27

రామయ్య బ్రహ్మోత్సవాలకు రండి..

ఒంటిమిట్టలో  ఏప్రిల్ 9 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించే  శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సిఎం కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. డిప్యూటి ఈవో  రమణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

Tadepalli

2022-04-08 15:14:37

ప్రమాణ స్వీకారానికి పక్కాగా ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈమేరకు శుక్రవారం ఆయన సియం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను,పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు పొటోకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ మరియు సమాచారశాఖ అధికారులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.
అంతకు ముందు ముఖ్యకార్యదర్శి(పొలిటికల్)ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక,అలంకరణ,ఆహ్వాన పత్రిక,రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులుగా డిజిగ్నేట్ కాబడిన వారికి ఆహ్వానం పకడం వంటి ఏర్పాట్లు,వారికి తగిన రవాణా సౌకర్యం వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగు తుందని తెలిపారు.ఇందుకుగాను ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించే విధంగా కొంతమంది ప్రోటోకాల్ అధికారులను నియమిస్తున్నట్టు ముత్యాల రాజు సిఎస్ కు వివరించారు.
అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వతేదీన కరకట్ట రోడ్డును రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి,హైకోర్టు చీఫ్ జస్టిస్,ఇతర న్యాయమూర్తులు,మంత్రులుగా నియమించబడిన వారికి,ఎంపి,ఎంఎల్సి,ఎంఎల్ఏలు వంటి ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా కేటాయించడం జరుగుతుందని తెలిపారు.మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.అదే విధంగా  పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసమావేశంలో డిఐజిలు సి.త్రివిక్రమ వర్మ,రాజశేఖర్ సమాచారశాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతోపాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి,ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి,ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-04-08 11:00:50

అఖండ విష్ణుసహస్రనామ పారాయణం

తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 9న అఖండ విష్ణుసహస్రనామ పారాయణం జరుగనుంది.  ప్రస్తుతం జరుగుతున్న శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం ఏప్రిల్ 9న ముగియనుంది. కాగా, అదే రోజు తిరుమలలో టిటిడి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నాద నీరాజన వేదికపై సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కుప్పా నరసింహంతో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని టిటిడి  ఎస్వీబీసీ ఛానల్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు వారి వారి ఇళ్లల్లో ఉండి కూడా ఈ అఖండ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొనాలని టిటిడి భక్తులను కోరుతోంది.

Tirumala

2022-04-08 08:48:37

జిల్లాల విభజనతో అవినీతికి అడ్డుకట్ట..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం జిల్లాల విభజనతో ప్రభుత్వ శాఖలో పేరుకు పోయిన అవినీతికి అడ్డుకట్టపడినట్టైంది. లేదంటే రాష్ట్రంలో ఒక్కో జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లోని జిల్లా అధికారుల నుంచి మినిస్టీరియల్ స్టాఫ్ వరకూ వివిధ పనులపై జిల్లా కార్యాలయాలకు పనులపై వెళ్లే ఆయా ప్రభుత్వ సిబ్బంది నుంచే దండిగా లంచాలు మేసేవారు. అంతేకాకుండా పెద్దజిల్లాల్లో జిల్లా అధికారులుగా పోస్టింగులకోసం తహ తహ లాడేవారు. అలాంటిది జిల్లాల విభజన తరువాత వారి అవినీతి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్టు అయ్యింది. అంతేకాకుండా జిల్లా కార్యాలయాల్లోనూ అధికారులను, సిబ్బందిని కుదించడంతో పరిపాలన మరింత సత్వరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాశాఖల అధికారుల వద్ద ఏ సమస్య అయినా చాలా వరకూ పెండిగింగ్ లో వుండేది. అర్జీ పెట్టిన తరువాత ఎప్పుడు పరిష్కారం అవుతుందో అసలు గ్యారంటీ ఉండేది కాదు. ఇపుడు ఏపీలోని 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మారడం రెవిన్యూ డివిజన్ల సంఖ్య కూడా పెరగడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటికే జిల్లాల విభజన విజయవంతంగా పూర్తికావడంతో ఇపుడు జిల్లాల్లోని 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల నియామకాల జరుగుతున్నాయి. కొన్నిజిల్లాల్లో అధికారులు తక్కువగా ఉండటంతో  ఉన్న జిల్లా అధికారులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా ప్రధాన శాఖలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీ రాజ్ తదితర శాఖల్లో జిల్లా అధికారుల నియామకాలు పూర్తికాలేదు. అవినీతి వ్యవహారాలు కూడా ఈ శాఖల్లోనే అధికంగా వుండటంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాపం చాలా మంది జిల్లాశాఖల అధికారులకు  మింగుడు పడనీయడం లేదు. ఒకప్పుడుు జిల్లాల విస్తీర్ణం, పరిధి, మండలాలు పెద్దవిగా ఉండటంతో జిల్లా అధికారులు సైతం అభివ్రుద్ధిపైనా, సమస్యలపైనా పెద్దగా ద్రుష్టిసారించేవారు కాదు. కానీ ఇపుడు జిల్లాల విభజన జరిగిన తరువాత జిల్లా కలెక్టర్ల నుంచి అన్ని శాఖల అధికారులకు పరిధిలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనితో అన్నిప్రాంతాలు అభివ్రుద్ధితోపాటు, సమస్యల పరిష్కారం, పరిపాలన కూడా ఇక చాలా తేలక అవుతుంది. నేడో రేపో కొత్తగా ప్రకటించిన గ్రూప్1, 2 ఉద్యోగ ప్రకటనల ద్వారా మరో 250కి పైగా ఉద్యోగాలు భర్తీతో ఖాళీగా ఉన్న జిల్లాశాఖలు, డివిజన్ శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ కానున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ జిల్లాల విభజనతో ప్రజలకు మెరుగైన పాలన పూర్తిస్థాయిలో అందనుంది. అయితే విభజన అధికారుల కేటాయింపు ఇప్పుడిప్పుడే జరగడంతో మొత్తం వ్యవహారం పూర్తిస్థాయిలో అమలు కావడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మెరుగైన పరిపాలన ఏ స్థాయిలో ప్రజలకు అందుతుందనేది.

Tadepalli

2022-04-08 03:38:46