1 ENS Live Breaking News

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఎప్పుడు.. పేస్కేలు అమలయ్యేనా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ శాఖ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శాఖ విశేషాలు తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూసి శభాష్ అంటూ మెచ్చుకుంది.. ఇంత వరకూ బాగానే వున్నా.. ఇందులో పనిచేస్తున్న సుమారు లక్షా 30వేల మంది ఉద్యోగుల్లో కొంత మందికి మొన్న అక్టోబరు2తో రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.  అలా ప్రొబేషన్ పీరీయడ్ పూర్తియన మొత్తం ఉద్యోగులందరికీ సర్వీసు రెగ్యులర్ చేసి పేస్కేలు అమలు చేయాలి. కాని సర్వీసు ప్రొబేషన్ పూర్తయి 3 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వశాఖల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. వాస్తవానికి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగుల నుంచి అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు అక్టోబరు 2నాటికే సర్వీసు ప్రొబేషన్ తంతు ముగించి నంబరు 2 న ఇచ్చే జీతాలు పేస్కేలుతో కలిపి ఇవ్వాల్సి వుంది. ఆవిధంగా జరగకపోవడమే ఇపుడు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం అవుతుంది. 

 సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఇదే జీతాలు ఇస్తారని కొందరు, కాదు కాదు మరో ఐదువేలు కలిపి 20వేల రూపాయలు ఇస్తారని కొందరు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఈ తరుణంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఉద్యోగుల్లో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందం అయితే ఉంది తప్పితే తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా, పేస్కేలు అమలు చేస్తారా, రెండేళ్లు పూర్తయినా ఇంకా ఎందుకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసు రెగ్యులర్ ఎందుకు చేయలేదనే అనుమానాలు ఉద్యోగులను వెంటాడుతూనే ఉన్నాయి.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ శాఖను అయితే ఏర్పాటు చేసింది తప్పితే ఇందులో పనిచేసే సుమారు 14శాఖల ఉద్యోగులకు మాత్రం వారి విధులు, నిధులు, పరిధిలు మాత్రం రెండేళ్లు దాటిపోతున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది ..కాదు కాదు కావాలనే కొన్ని ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు ఈ విధంగా వ్యవహరించి ఉద్యోగుల్లోని ఆందోళనకు, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అన్నింటికంటే ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టిన దానికి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగిస్తారనే మాట ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఇదే జరిగితే అలా ప్రసూతి సెలువులు తీసుకున్నమహి ళా ఉద్యోగులు సహచర ఉద్యోగుల దగ్గర ఆరు నెలలు సర్వీసులో జూనియర్ గా మారిపోవడంతోపాటు, పదోన్నతులు కూడా కోల్పోయే ప్రమాదం వుంది.  ఈ విషయంలో ప్రభుత్వంలోని జిఏడీ ప్రకటన చేయాల్సి వున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ప్రసూతి సెలవులు తీసుకున్న ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఆరు నెలల గడువు పొడిగిస్తారనే భావను ఉద్యోగులు వచ్చేస్తున్నారు. కాగా కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రసూతి సెలవులకు, సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధం లేదని అధికారులు తెగేసి చెబుతున్న ప్రకటనలు కూడా సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీసు రూల్సు ఏం చెబుతున్నాయనే విషయంలో ప్రభుత్వ అధికారులకు సైతం క్లారిటీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు సబార్టినేట్ సర్వీసు రూల్స్ 16హెచ్ విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ అంశం ఇపుడు మళ్లీ తెరపైకి వస్తుంది.

కాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లో సాధారణ పనిదినాలు కంటే అత్యధికంగా 2వ శనివారాలు, ఆదివారాలతోపాటు అదనపు పనిగంటకు కూడా పనిచేసి రోజులున్నాయి. ఇవన్నీ ప్రభుత్వంలోని సర్వీసు రూల్సు నిబంధనలోని కావు. అయినా..అదనపు పనులు చేయించుకున్న ప్రభుత్వ శాఖల అధికారులు నిబంధనలు అమలు, ఇచ్చిన జీఓలు తమ విషయంలో ఎందుకు పాటించి అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు ‘ఆ ఒక్కటీ అడక్కు’అనే సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు అహర్నిసలు సేవలు చేసినా..కరోనా కాటు బలైన ఉద్యోగులున్నా.. చాలామంది సచివాలయ ఉద్యోగులు నేటికీ కరోనా వ్యాధి భారిన పడుతున్నా ప్రభుత్వంలోని, ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలకు మాత్రం ఏమీ పట్టడటం లేదు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని నిబంధనలు, అదనపు పనిదినాలు, పనిగంటలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే చూస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసు రెగ్యులైజేషన్ కావడం ఆలస్యం కావడం పట్ల సచివాలయ ఉద్యోగుల్లో భయం నెలకొంది. వాస్తవానికి ఆ భయాన్ని ప్రభుత్వమే పోగొట్టాల్సి వున్నా నేటికీ సరైన ప్రకటన చేయకపోవడం విశేషం. ప్రభుత్వ నిబంధన ప్రకారం సర్వీసు రెగ్యులైజేషన్ కాస్త ఆలస్యంగా చేసినా.. ప్రభుత్వం ఉద్యోగ నియామక సమయంలో ఇచ్చిన నిబంధనల ఆధారంగా ఏ రోజుకైతే రెండేళ్ల సర్వీసు పూర్తయ్యిందో ఆ తేదీ నుంచి పేస్కేలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు, జీతం అమలు చేస్తారా లేదా అనేది కూడా ఇపుడు సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందో..!

Tadepalli

2021-12-21 05:07:16

జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మోకాలడ్డుతున్న జీఓనెంబరు-149..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, వ్యాధుల భారిన పడకుండా పరిరక్షిం చేందు ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల అనాలోచిత నిర్ణయాల కారణంగా జీవోనెంబరు 149 మోకాలు అడ్డుతోంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి, జీఓనెంబరు-149కి లింకేంటనే అనుమానం మీకు కలిగితీరాలి. లేదంటే పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులు చేసే తప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు వస్తుందో.. గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా సేవలు ప్రజలు ఎందుకు పూర్తిస్థాయిలో అందకుండా పోతున్నాయో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా విభజించిన సచివాలయాల పరిధిలు ఆధారంగా విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని అప్పగించి ప్రజలు సేవలు చేయించాలి. పేరుకే ఆ జీఓ ఉంది తప్పితే దానిని రెండేళ్లుగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ అమలు చేసిన పాపన పోలేదు. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలుగానే రెండేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి వచ్చింది. 

ఉత్తుత్తి కార్యదర్శిలు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీరంతా విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకూ వీరు సంతకం పెట్టే ఒక్క అధికారం కూడా పంచాయతీరాజ్ శాఖ వీరికి కల్పించలేదు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ప్రొబేషన్  రెండేళ్లు పూర్తవుతున్నతరుణంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు జరిగితే పల్లెలన్నీ అద్దంలా మెరిసిపోవాలి.. కానీ అలా జరగడం లేదు. దానికి కారణం గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలనే విషయం ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వంలోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు..మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు గుర్తించాల్సివుంది. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వీరిని జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శిలు లేని పంచాయతీలకు గ్రామ, వార్డు సచివాలయశాఖ జెసీల ఆదేశాలన్నాయంటూ వీరిని ఇన్చార్జిలుగా నియమించారు. దీనితో ఉద్యోగం చేసేచోట కంటే ఈ సీనియర్ కార్యదర్శిలకు ఇన్చార్జిలు ఇచ్చిన పెద్ద, మేజర్ పంచాయతీల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఈ తరుణంలో గ్రామస్థాయిలో పారిశుధ్యం పడకేస్తున్నది. కనీసం మేజర్ పంచాయతీల్లో వున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలైనా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే పారిశుధ్య సిబ్బంది వీరి మాట వినడం లేదు.

 కొద్దో గొప్పో పంచాయతీల్లో వింటున్నా, సానిటేషన్ సామాగ్రికి, బ్లీచింగ్ ఫౌడర్ గా పేరుపెట్టుకున్న తెల్లబూడిద చల్లేందుకు, వాటిని తీసుకోవడానికి గ్రేడ్-1 కార్యదర్శిల నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల దగ్గరకు గ్రేడ్-5 కార్యదర్శిలు వెళ్లి దేహీ అంటూ పారిశుధ్య సిబ్బందిని, సామాగ్రిని అడుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి. 60శాతం మేజర్ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు సక్రమంగా లేనే లేరు. వున్నచోట పనిచేయించడానికి సిబ్బంది తక్కువగా ఉండటం పంచాయతీ ప్రధాన కార్యదర్శి( గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకూ) గ్రేడ్-5  సచివాలయ కార్యదర్శిలకు అందుబాటులోకి లేకుండా పోతున్నారు. అందునా గ్రేడ్-5 కార్యదర్శిలకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో వీరు గ్రామస్థాయిలో పారిశుధ్య నిర్వహణ కూడా చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయాన్ని మండల, జిల్లా స్థాయి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేరుగా వినతి పత్రం సమర్పించినా కనీసం చలనం లేదు. ఈ తరుణంలోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తడి, పొడి చెత్తవాహనాలు ప్రభుత్వ పంచాయతీలకు కేటాయించినా వాటిని వినియోగించడానికి డ్రైవర్లు సైతం లేని దుస్థితి నెలకొంది. దీనితో ఆ వాహనాలన్నీ పంచాయతీ కార్యలయాల ముందు అలంకరణ ప్రాయంగానే మిగిలిపోయాయి. అదే జీఓనెంబరు 149ని ప్రభుత్వం అమలు చేసి వుంటే..గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఉండేవి. ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి గ్రామస్థాయిలో అమలు చేయడానికి వీరికి పూర్తిస్థాయిలో అధికారాలుండేవి. పరిపాలన, పారిశుధ్య నిర్వహణ సదరు కార్యదర్శిలకు కేటాయించిన సచివాలయ పరిధిలో పూర్తిస్థాయిలో జరిగేది. 

ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లు సంయుక్తంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎదురయ్యే సమస్యలను, లోపాలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతూ వస్తున్నది. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలో కనీసం చలనం రాలేదు.  ఈ శాఖలో జరుగుతున్న తప్పులు, లోపాలు, సమస్యలు ప్రజలకైనా, ప్రజలను పాలించే ప్రజాప్రతినిధులకై అర్ధమవ్వాలనే సంకల్పంతోనూ.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో మంచి ఆశయంతో, లక్ష్యంతో, ప్రజలకు సేవసేయడానికి ప్రవేశపెట్టిన పథకాలకు ప్రభుత్వశాఖల ముఖ్య అధికారులే ఏ విధంగా గాలితీసేస్తున్నారో తెలియజేసే ఉద్దేశ్యంతోనే ఈ ప్రత్యేక కధనాలను ప్రజల ముందుకి తీసుకు వస్తున్నాం. అదే సమయంలో మంచి కార్యక్రమాలను కూడా అంతకంటే పెద్దస్థాయిలోనే ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియజేయడంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, బాధ్యతగా వ్యవహరిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జీఓ నెంబరు 149 అమలు విషయంలోనూ, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు, సచివాలయాల పరిధిలు కేటాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే తప్పా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమమే కాకుండా మరే ఇతర కార్యక్రమం, పథకాలు, సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాల్సి వుంది..చూడాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ద్రుష్టిపెడతారా లేదా అనేది..!

Tadepalli

2021-12-18 05:32:14

వారి సర్వీసు రెగ్యులరైజేషన్ కి 6నెలలు ఆగాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ ఆరునెలలు పొడిగించనున్నారు. ఫలితంగా ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా సర్వీసులో ఆరు నెలలు సీనియారిటీ కోల్పోయి సహచర ఉద్యోగుల దగ్గర జూనియర్ లుగా మారిపోబోతున్నారు. దీనితో ఇపుడు ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా లబో దిబో మంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో ఆరు నెలలు వీరు అదే 15వేల రూపాయల జీతానికే పనిచేయాల్సి వుంటుంది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు అక్టోబరు 2నాటికి క్రమబద్దీకరించాల్సి వుంది. కానీ ప్రభుత్వ ఆ తేదీకి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ చేయలేదు. ఆ నెలలో జిల్లా కలెక్టర్ల ద్వారా సమాచారం సేకరించి ప్రభుత్వశాఖల వారీగా సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారభించింది. ఆ సమయంలోనే అన్నిశాఖల ఉద్యోగులతోపాటు, మహిళా ఉద్యోగుల నుంచి సెలవుల జాబితాలు సేకరించిన సమయంలో ఈ విషయం తేటతెల్లమైంది. సచివాలయాల్లోని అందరు మహిళా ఉద్యోగుల నుంచి ప్రసూతి సెలవులు, మెడికల్ లీవులకు సంబంధించిన సెలవుల జాబితాను శాఖల వారీగా ప్రభుత్వం తీసుకుంది. అలా ప్రసూతి సెలవులు తీసుకున్నవారందరికీ సర్వీసు మరో 6 నెలలు పొడిగింపు వర్తిస్తుందని జిల్లా శాఖల అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం సచివాలయ మహిళా ఉద్యోగుల్లో నెలకొంది.   

అయితే ప్రభుత్వంలోని కొన్నిశాఖల అధికారులు మాత్రం సర్వీసు రెగ్యులరైజేషన్ కి, మెటర్నటీ లీవులకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ దానికి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవని కూడా అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు అన్నిరకాల లీవుల సమాచారం సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా శాఖల అధికారులు సేకరించారు. రెండేళ్లు పూర్తిచేసుకున్నవారి నుంచి సర్వీసు రెగ్యులరైజేషన్ కి సంబంధించి ప్రొఫార్మాను జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆ సమయంలో జిల్లా అధికారులు చేసిన సూచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ మహిళా ఉద్యోగుల గ్రూపులో పెద్ద ఎత్తున చర్చనడుస్తున్నది. రెండేళ్లు సమయం కేవలం 15వేలు జీతానికి పనిచేసిన సచివాలయ మహిళా ఉద్యోగులంతా మరో ఆరు నెలల పాటు అదే జీతానికి పనిచేయడానికి సిద్దంగా లేరనేది ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చల శారాంశం.

పోనీ 6 నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కోసం వేచి వుంటే సహచర ఉద్యోగుల దగ్గర సర్వీసు విషయంలో వీరంతా ఆరు నెలలు జూనియర్లుగా మారిపోతారు. అంతేకాకుండా ప్రమోషన్ సమయంలో వీరికి ఆరునెలల సమయం వలన చాలా ప్రయోజనాలు కోల్పోపోయే ప్రమాదం వుంది. ఈ తరుణంలో ప్రభుత్వం పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు మేలు చేసినట్టే, ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఏదైనా తీపి కబురు చెబుతుందాని అంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీఎన్జీఓ నేతలు కూడా సచివాలయ ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి వీరికి సర్వీసు రెగ్యులరైజేషన్ సమయానికి పూర్తయితే పర్వాలేదని, లేదంటే  ఈ విషయంలో కోర్టుకెళ్లడమే ఉత్తమంగా సచివాలయ మహిళా ఉద్యోగులంతా భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.  ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరుకి ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఒక క్లారిటీకి రావాలని ఉద్యోగులంతా భావిస్తున్నారని సమాచారం. 

అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆది నుంచి సమస్యలపైనా, అభివ్రుద్ధి కార్యక్రమాలపైనా, ప్రభుత్వ శాఖల అధికారుల తేడా వ్యవహారాలపై అక్షర సమరం చేస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ న్యూస్ యాప్ enslive, అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లతో ఇప్పటికే ఈ సమస్య నుంచి మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో ఒక మంచి మార్గం చూపించడానికి రంగంలోకి దిగింది. దీనికోసం అంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నిబందనలపై అధ్యయనం చేస్తున్నది. అంతేకాకుండా ఇలాంటి సమస్య వచ్చినపుడు గతంలో కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టుకి వెళ్లినపుడు వచ్చిన తీర్పులను కూడా న్యూఢిల్లీ నుంచి తెప్పించే పనిలో పడింది ఈఎన్ఎస్. అంతేకాకుండా మహిళా ఉద్యోగలకు జఠిలంగా మారిన ఈ సమస్యను పరిష్కరించడంలోనూ, ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకెళ్లడంలోనూ ప్రత్యేక ద్రుష్టిసారించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా, వారి పక్షాన ఈఎన్ఎస్ అండగా నిలబడుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. తల్లికావడమే సచివాలయ ఉద్యోగులు చేసిన పాపంగా ఇపుడు వారి సర్వీసు రెగ్యులైజేషన్ మరో ఆరు నెలలు వెనక్కి వెళితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అదైర్య పడకండి సచివాలయ ఉద్యోగుల్లో తల్లులుగా మారి సర్వీసు రెగ్యులైజేషన్ ఆరనెలలు పొడిగింపడిన వారి పక్షాన నిలిచి న్యాయం జరిగేలా ఈఎన్ఎస్ వంతు క్రుషిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం..

Tadepalli

2021-12-16 02:46:24

గ్రామ సచివాలయ మహిళా పోలీసుల గమ్యం ఎటు..? జీఓనెంబరు 59 పరిస్థితేంటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి చిక్కులూ లేకుండా గడిచిన వీరి విధులకు సరిగ్గా ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయంలోనే అన్ని రకాల అడ్డంకులూ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అదేసమయంలో ప్రభుత్వం కూడా హైకోర్టులో పడిన కేసుతో డోలాయమానంలో పడింది.  గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలుగా వున్న వీరిని జీఓనెంబరు 59తో మహిళా పోలీసులుగా మార్చింది పోలీస్ శాఖ. అప్పటి నుంచి కొంత కాలం ఐసిడిఎస్, పోలీస్ 2శాఖల్లోనూ విధులు నిర్వహించిన వీరు జీఓనెంబరు 59తో వీరి బాధ్యతలు, విధులు పోలీసు శాఖకే అత్యధికంగా కేటాయించారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టుని ఏర్పాటుచేయడం ఇష్టంలేని కొందరు పోలీసు సిబ్బంది, మరికొందరు దురుద్దేశ పరులు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్ధేశ్యంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఆ సమయంలో మహిళా పోలీలసును  చులకనగా చూస్తూ.. మీరు మా పోలీసులతో సమానం కాదని, మీరు ఎంత కాలంల ఈ పోస్టుల్లో ఉంటారో కూడా చూద్దామనే కామెంట్లు కూడా చేసినట్టు భారీగానే ప్రచారం జరిగింది. మహిళా పోలీసులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసిన విషయాన్ని గమనించి,  వీరి నియామకాలు చెల్లవంటూ కోర్టు కెక్కారు. ఇది వాస్తవానికి  అయినా..గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం వీరిని నియమించి రెండుళ్లుగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పిస్తూ వస్తుంది. ఏది ఎలా జరిగినా కేసు కోర్టుకి వెళ్లిన తరువాత ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలి.. అలా దాఖలు చేసే సమయంలో మళ్లీ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి జిఓనెంబరు 59ని ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకి తెలియజేసింది. అంతేకాకుండా వీరిని గ్రామసచివాలయాల్లోనే ఉంచి ఏ శాఖ ద్వారా విధులకు వినియోగించాలి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రకటన కూడా చేసింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులంతా తమ ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లిందనే భావనతో నేరుగా రాష్ట్ర పోలీసు ముఖ్య అధికారి డిజీపి గౌతం సవాంగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమను పోలీసుశాఖలోనే ఉంచాలని, యూనిఫారం ఇవ్వాలని, శిక్షణ ఏర్పాటు చేయాలని అర్జీ పెట్టారు. ఆ సమయంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. జీఓ నెంబరు 59ని ఉపసంహ రించుకోలేదని.. మహిళా పోలీసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పడం. వాస్తవానికి కోర్టులో మహిళా పోలీసులను పోలీసుశాఖలోకి విలీనం చేస్తూ చేసిన జిఓ నెంబరు 59ని ఉపసంహరించుకున్నట్టు పోలీస్ శాఖ హైకోర్టుకి తెలియజేసింది. ఇపుడేమో మహిళా పోలీసులు అర్జీ పెట్టిన సమయంలో ఆ జీఓను ఉపసంహచరించుకోలేదని చెప్పడంతో మహిళా పోలీసులంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఇదే గ్రామ, వార్డు మహిళా పోలీసుల్లో కొందరు ఖాకీ డ్రెస్సు వేసుకోవడం ఇష్టం లేని మరో వర్గం వారంతా తమను ఐసీడీఎస్ లో విలీనం చేయాలంటూ అధికారులను సంప్రదించడంతో..అసలు గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసుల పోస్టు అనేది ఉంటుందా..? ఊడుతుందా అనేది క్లారిటీ రాకుండా పోయింది. కానీ డీజీపీ గౌతం సవాంగ్ మాత్రమం తమకు అన్యాయం జరుగుతుందని మహిళా పోలీసులు అర్జీలు పెట్టే సమయంలో నేరుగా వారిని సముదాయిస్తూనే..కోర్టుకు అఫడవిట్లు దాఖలు చేసే సమయంలో జీఓను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసులు రెగ్యులర్ అయ్యే సమయానికి మహిళాపోలీసులందరినీ గాల్లో పెట్టడానికి కావాలనే కొందరు పథకం రచించి ఈ రకమైన కోర్టు కేసుల ద్వారా రెగ్యులర్ చేసే సమయాన్ని పొడిగించాలని ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అయితే ఆ విషయం గ్రామ సచివాలయలయంలోని చాలా మంది మహిళా పోలీసులకు అర్ధం కావడం లేదని, దీనితో పోలీసు ఉన్నతాధికారులను కలిసి అర్జీలు సమర్పించే సమయంలో అధికారులు చేసిన ప్రకటనలు మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఆందోళన రేకిస్తున్నాయనే అంశాన్ని ఇపుడు తెరపైకి తీసుకు వస్తున్నారు. హైకోర్టుకి జీఓనెంబరు 59ను ఉస సంహరించుకుంటున్నట్టు తెలియజేసిన పోలీస్ శాఖ..ఇపుడు మహిళా పోలీసులు నేరుగా వెళ్లి తమ ఉద్యోగాలు ఇక్కడే కొనసాగించాలని కోరిన సమయంలో జీఓనెంబరు 59ని ఉప సంహరించలేదని ప్రకటించడం వెనుక మర్మం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నా.. తరువాత మరింత పటిష్టంగా దానిని రూపొదింస్తారా..? అనే వాదన కూడా తెరపైకి వస్తుంది? ..మూడు రాజధానుల విషయంలో ఇచ్చిన జీఓను వెనక్కి తీసుకొని..మరింత పటిష్టంగా మళ్లీ తిరిగి జీఓను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగా మహిళా పోలీసుల విషయంలోనూ ఆ విధంగా ప్రకటించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2021-12-14 04:17:02

గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతిసెలవులపై నోరు మెదపని ఏపీఎన్జీఓ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మహిళా ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ముందుండే ఏపీఎన్జీఓ కూడా గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో నోరు మెదపకపోవడం ఉద్యోగులకు అసహనాన్ని కలిగిస్తున్నది. రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా వున్న ఏపీఎన్జీఓ సచివాలయ ఉద్యోగుల విషయంలో అనేక డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చని ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కూడా సిద్దపడింది. ఈ తరుణంలో వారికి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగు మద్దతు చాలా అవసరం. అయితే ఈ ఉద్యోగుల విషయంలో ఎల్లప్పుడూ ప్రకటనలు తప్పితే సీరియస్ గా వ్యవహరించిన దాఖలాలు లేవు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు తీసుకున్న దానికి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మరో ఆరు నెలలు వెనక్కి వెళుతుందనే విషయం, గ్రేడ్5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 అమలు చేయకపోవడం, అక్టోబరు 2నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయకపోవడం, వివిధ కారణాలతో ప్రభుత్వం కాలయాపన చేయడం, ప్రక్రుతి విపత్తు కరోనా నెపంతో రెండవ శనివారాలు, ఆదివారాలు అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వ అధికారుల  విషయంలోనూ ఏపీ ఎన్జీఓ సక్రమంగా నోరు మెదకపోవడం పట్ల సచివాలయ ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓకి తమ మద్దతు ఇవ్వాలా వద్దా అనే చర్చకు సామాజిక మాద్యమాల్లో తెరలేపారు. ఇదే సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు  పీఆర్సీ, డీఏలు, ఎరియర్స్ విడుదల సమస్యలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపైనా ఏపీఓ ఎన్జీఓ పోరాటం చేస్తుందని చెప్పినా గ్రామసచివాలయ ఉద్యోగులు ఎవరికీ నమ్మకాలు అయితే లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేతలు ఎక్కడికి వెళ్లినా గ్రామసచివాలయ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈరోజు విశాఖలో జరిగే రాష్ట్రనేతల సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రధాన సమస్యలపై స్పందించకపోతే, తమ యూనియన్ల ద్వారా మాత్రమే పోరాటం చేస్తాం తప్పితే ఏపీఎన్జీఓతో అంటీ ముట్టనట్టు ఉండాలనే భావనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వచ్చినట్టు సామాజిక మాద్యమాల్లో చర్చలు నడిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై విశాఖలో జరిగే సమావేశంలో ఏ మాట్లాడి, ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతారనిదే ఇపుడు చర్చనీయాంశం అయ్యింది..

Visakhapatnam

2021-12-07 03:18:14

విశాఖ మన్యంలో డోలీమోతలు లేకుండా చేస్తాం..

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తో కలిసి  మండలంలోని మూలపేట గ్రామ పంచాయతీ పాలమామిడి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఉదయం 6.30 గంటలకు డౌనూర్  చేరుకుని  బచ్చింత గ్రామం నుంచి కాలినడకన వెళ్లి గెడ్డ దాటి సుమారు నాలుగు  కిలోమీటర్ల దూరం (ఒక ప్రక్క) కొండలపైకి నడిచి మూలపేట పంచాయతీ పాలమామిడి గ్రామాన్ని చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డోలీ మోతల నివారిస్తామని చెప్పారు గ్రామానికి విద్యుత్, తాగునీరు, రహదారి, పాఠశాల భవనం లేదని గిరిజనులు  ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  గ్రావిటీ తాగునీటి పథకం, రహదారి నిర్మాణం పాఠశాల  భవనం నిర్మిస్తామని చెప్పారు. ఆర్వో ఎఫ్ ఆర్  పట్టాలు ఎంత మందికి మంజూరు చేసారని ఆరా తీశారు.  పంచాయతీ లో 400 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశామని సబ్ కలెక్టర్ వివరించారు. డోలీ మోతల గ్రామాల కష్టాలను ఐటీడీఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ వివరించారు. గతొలుత డౌనూర్ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల లో జరిగిన మన బడి నాడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు పరిశీలించారు. వంట పరిశీలించి మెనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత డౌనూర్ గ్రామ సచివాలయం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే వివరించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి, పురుషులు వార్డు, ఫార్మసీలో మందులు, ల్యాబ్ ను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఔషధ మొక్కలు నాటాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ట్రైకార్ ఎం డి ఈ.రవీంద్రబాబు ,గిరిజన సంక్షేమశాఖ డిడి  జి.విజయకుమార్, ఎస్ ఈ  ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2021-11-23 12:09:27

సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు వెనక్కి..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానిబిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఏజీ ఈ విషయాన్ని హైకోర్టుకి తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మూడు రాజధానుల విషయమై రాష్ట్రం పెద్ద స్థాయిలో చర్చనడుస్తుండటం, అదే సమయంలో టీడీపీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించనున్నారు.                                                                                           

Tadepalli

2021-11-22 07:30:33

మహిళా ఉద్యోగులకు ప్రసూతి శాపం.. సర్వీసు రెగ్యులైజేషన్ కి నిభందనల కళ్లెం..

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవే వుండదనే నానుడి మీకు గుర్తుండే వుంటుంది.. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులూ చేయని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు సాధారణ సెలవుదినాల్లోనూ ఉచితంగా చేసే అధనపు విధులు చూస్తే అచ్చు అదే గుర్తుకు వస్తుంది అందరికీ.. ఏంటీ ఏదో తేడా కొడుతుంది అనుకుంటున్నారా..నిజంగానే తేడా కొట్టింది.. ప్రభుత్వ సెలవుల్లో ప్రత్యేకంగా అదనపు విధులు విధులకు పిలిచి సాధారణ ఉద్యోగ సమయం కంటే అధికంగా  పనిచేయించుకోవడానికి అడ్డు రాని నిబంధనలు హఠాత్తుగా ప్రభుత్వానికి ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి నిభందనలు అడ్డువచ్చాయని వారిని ఓ ఆరు నెలలు వెనక్కి నెట్టేందుకు చూస్తున్నారు అధికారులు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం సాధారణ సెలవుల్లో ఉద్యోగులకు అదనపు విధులు ప్రభుత్వం అప్పగించకూడదు. అలా తప్పక అప్పగిస్తే చేసిన పనికి లెక్క కట్టాలి.. అది జీతంతోపాటు కలిపి ఇవ్వాలి. కానీ అది గ్రామ, వార్డు సచివాలయ శాఖలో జరగదు, ప్రభుత్వానికి అసలు ఆ నిబంధనే గుర్తులేదు. ప్రభుత్వ ఉద్యోగులకు దొరికే ఆ ఒక్కరోజు ఆదివారం, లేదా రెండవ శనివారాల్లోనే ప్రభుత్వానికి, సచివాలయ శాఖలో మిలితంగా వున్న 11 ప్రభుత్వ శాఖలకు అత్యవసరంగా పని పడుతుంది. అనుకున్నదే తడువుగా జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో వారికి ఆ సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా డ్యూటీలు వేస్తారు. అదేమంటే చెప్పింది చేయడమే మీ పని.. దానికి లాజిక్కులు, జీఓలు, రూల్సు మాట్లాడకూడదు అంటూ బెదిరింపులకు దిగుతారు అధికారులు. అసలే కొత్తగా వచ్చిన ఉద్యోగం, పూర్తిస్థాయిలో జీతం రాకపోయినా ఇచ్చే ఆ రూ.15వేలతో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు ఇపుడు వారానికి దొరికేది ఒక్కరోజు సాధారణ సెలవులు ఇంట్లో కనీసం బట్టలు ఉతుక్కునే అవకాశం కూడా లేకుండా ఆదివారం, రెండవ శనివారాలు ప్రత్యేకంగా చేసే ఉచిత విధులకే పోతున్నాయి. అయినా పర్లేదు ప్రభుత్వం తమని గుర్తిస్తుందీ అనుకుంటే ఇపుడు గుండెలపై బండరాయి వేసింది. అదే రెండేళ్ల కాలంలో ప్రసూతి సెలవులు మహిళా ఉద్యోగులు పెట్టుకున్న ఆ సెలువులు పూర్తయ్యే వరకూ సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తికాదనే అతి బరువైన మాట. 

తోటి ఉద్యోగులంతా రెండేళ్లు పూర్తికాగానే వారి సర్వీసులు రెగ్యులర్ అయిపోతున్న తరుణంలో మహిళా ఉద్యోగులు మాత్రం తమకు మాత్రుత్వం మిగిల్చిన కష్టంతో మరో ఆరు నెలలు వేచి వుండే పరిస్థితి దాపురించింది. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనే నిబంధన ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తాయి. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక్క సచివాలయ శాఖలోనే ఆ నిబంధన అమలు కాలేదు. కాదు కాదు అమలు చేయలేదు. సెలవు రోజుల్లో  అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వానికి ఆ సమయంలో గుర్తుకి రాని నిబంధనలు..తీరా తమ సర్వీసులు రెగ్యులర్ చేసే సమయానికి మాత్రం అసలైన జీఓలన్నీ తెరపైకి వస్తున్నాయంటూ మహిళా ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు. గర్భం దాల్చిన సమయంలోనూ తమతో సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా ఉచితంగానే అదనపు విధులు చేసేలా చేసిన మండల, జిల్లా అధికారులు ఇపుడు తీరా సర్వీసు రెగ్యులైజేషన్ సమయం వచ్చేనాటికి మాత్రం నోరు మెదపడం లేదని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని సుమారు లక్షా 24 వేలకు పైగా వున్న ఉద్యోగుల్లో 50శాతం వున్న మహిళా ఉద్యోగుల్లో ప్రసూతి సెలువులు పెట్టిన వారికి సర్వీసులు మరో ఆరు నెలలు పొడిగించే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన వారందరికీ సర్వీసు క్రమబద్దీకరణ చేస్తున్న తరుణంతో ఈ ప్రధాన అంశం తెరపైకి వచ్చింది. మెటర్నటీ లీవుతోపాటు, మెడికల్ లీవులు పెట్టిన వారికి సైతం సదరు సెలవులు పూర్తయ్యే వరకూ వారియొక్క సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి తమ తప్పులేదని చెప్పే ఉద్దేశ్యంలో మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను, ఇతరుల మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా వారికి సర్వీసులు రెగ్యులర్ చేయాలని ఒక అర్జీ పెట్టి ఊరకుండిపోయింది. అర్జీతోపాటు రెండేళ్లుపాటు కరోనా వైరస్ భయంకరంగా విజ్రుంభించిన వేళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గానీ, ప్రస్తుతం కూడా సాధారణ సెలవుల్లోకూడా ఉచితంగానే అదనపు విధులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని గానీ, రెండేళ్లలో పేస్కేలు జీతంలో చాలా కోల్పోయారని కానీ, ప్రత్యేక సమయంలో అదనపు పనిగంటలు కార్యాలయాల్లో పనిచేస్తున్నారని గానీ, కోవిడ్ వేక్సినేషన్ లో ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారనే అంశాలను ఆ అర్జీలో పొందు పరచలేదు. సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేయించుకుందో వాస్తవానికి ప్రభుత్వానికే తెలియాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత రికార్డుస్థాయిలో కోవిడ్ సమయంలోనూ ఉద్యోగులు పనిచేశారని, చాలా మంది కోవిడ్ భారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారని.. ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ చేసే సమయంలో నిబందన కొర్రీలు పెట్టడం చాలా ఆవేదనకు గురి చేస్తుందని సచివాలయ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అందునా మహిళా ఉద్యోగులైతే బిడ్డలకు జన్మనిచ్చిన సమయంలో తీసుకున్న సెలవులే తమకు శాపాలయ్యాయని పడుతున్న బాధ వర్ణణా తీతం. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధంగా అయితే సర్వీసు నిబంధనలను పక్కన పెట్టి సాధారణ సెలవుల్లోనూ, కరోనా స్పెషల్ డ్యూటీ, రెండవ శనివారాల్లో ఇంటింటి సర్వేలు, పంచాయతీ పన్నులు వసూళ్లు, మదింపులు విధులు సచివాలయ ఉద్యోగులతో ఉచితంగానే చేయించుకుందో..అదే రీతిగా వీరి ప్రసూతి, మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుందని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి.. అదనపు పని చేయించుకోవడానికి నిబంధనలు అడ్డురావు కానీ.. సర్వీసు రెగ్యులైజేషన్ కి మాత్రం ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయని చెబుతుందా.. లేదంటే ప్రభుత్వం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం సెలవు రోజుల్లో చేసిన అదనపు సెలవులను గుర్తుంచుకొని అందరికీ రెండేళ్లు పూర్తికాగానే ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసులు రెగ్యులర్ చేస్తుందో..!

Tadepalli

2021-11-11 02:32:51

గ్రామ సచివాలయాలకు 2ఏళ్లుపూర్తి.. జీఓ.నెం.149 అమలు మాత్రం నాస్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు.149 ద్వారా అధికారాలు బదలాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ ఇంకామీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెత్తీనోరూ కొట్టుకుంటూ ఏపనైనా ప్రభుత్వ జీఓ ప్రకారమే ఖచ్చితంగా చేయాలని ప్రతీ సమావేశంలో ఆదేశించినా.. జీఓలను అతిక్రమమించ వద్దని సూచించినా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఫలితంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్నా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎలాంటి అధికారాలకు నోచుకోలేదు. పేరుకి సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నా ఎలాంటి అధికారం ప్రభుత్వం కల్పించకపోవడం వీరంతా నేటికీ ఉత్సవ విగ్రహాల్లానే నిలబడాల్సి వస్తుంది. అసలు తమను ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో సచివాలయాలకు కార్యదర్శిలుగా నియమించిందో అర్ధం కావడం లేదని, అమలు చేయని జీఓలను ఎందుకు విడుదల చేసిందో తెలియడం లేదని గ్రేడ్-5 కార్యదర్శిలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4  పంచాయతీ కార్యదర్శిలకంటే అత్యధికంగా పంచాయతీల్లో పనులు చేస్తున్నా,  తమను మాత్రం ప్రభుత్వం చిన్నచూపే చూస్తుందని ఫలితంగా ప్రజలకు అధికారికంగా ఎలాంటి సేవలు అందించలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. దేశం మొత్తం తొంగిచూసేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తమను సిబ్బందిగా నియమించిందనే పేరు, ఆనందం కంటే.. నియమించి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదనే బాధ, నిరాసే అధికంగా వుందని కార్యదర్శి మొహాలు చిట్లిస్తున్నారు. ఒక దశలో తాము ఎందుకు పనిచేస్తున్నామో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వమైనా ఒక జీఓను విడుదల చేస్తే దానిని అమలు చేస్తుందని..విచిత్రంగా జీఓ ఇచ్చిన తరువాత రెండేళ్లు గడిచినా జీఓలను అమలు చేయని రాష్ట్రప్రభుత్వ అధికారులను ఇక్కడే చూస్తున్నామని సచివాలయ సిబ్బంది చీదరించుకుంటున్నారు. ప్రజలకు ఏదో చేద్దామని ఎంతో ఉన్నత ఆశయంతో ఉద్యోగాల్లోకి చేరితే..నాటి నుంచి నేటి వరకూ ఏ అధికారం లేకుండా ఉన్న సిబ్బందిని సూపర్ వైజ్ చేయడానికి తాము పనిచేస్తున్నట్టు అవుతుందని చెబుతున్నారు. ఆదిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇక జీఓలను పూర్తిగా తమ శాఖ ఉన్నతాధికారులే పక్కనపెట్టేస్తారని దానికి ప్రత్యేక ఉదాహరణ జిఓనెంబరు 149 గా నిలుస్తుందని అంటున్నారు.

మరోరా సారి కోర్టులో భంగపాటు తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి భంగపాటు పంచాయతీరాజ్ శాఖ ద్వారానే కలిగేటట్టు కనిపిస్తుందనే  సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంభించి, నిబంధనలను, జీఓలను అమలు చేయని శాఖగా అత్యధిక కోర్టు కేసులు ఎదుర్కొంటున్న  పంచాయతీరాజ్ శాఖ గ్రేడ్-5 కార్యదర్శిలు తమ అధికారాలు, విధులు, నిధులు బదాలాయింపు జీఓనెంబరు 149 ద్వారా చేయాలని కోర్టుకి వెళితే మరోసారి సారి వార్తల్లో నిలిచేలా వుందంటున్నారు విశ్లేషకులు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు ఉద్దేశ్య పూర్వకంగానే గ్రేడ్-5 కార్యదర్శిలకు రావాల్సిన అధికారాల బదాలాయింపు జీఓనెంబరు 149ని తొక్కిపెట్టారనే విషయం ఇప్పటికే రెండేళ్లుగా స్పష్టమవుతూనే వుంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించే పనికూడా ఉండదు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన అధికారాలన్నీ ప్రభుత్వం జీఓ ద్వారానే కల్పిస్తుంది. అలా అధికారాలు ఇవ్వడానికే ఇచ్చిన జీఓనెంబరె 149ని మాత్రం గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అలుచేసి అధికారాలు కల్పించలేదు. అధికారాలులేని ఉద్యోగం కల్పించడం ఎందుకని రేపుపొద్దున్న వీరంతా వేసిన కేసులో కోర్టు ప్రశ్నిస్తే అధికారులు అక్కడ కూడా తెల్లమొహం వేసే పరిస్థితి ఎదురవుతుంది. 

ఇప్పటికే డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శి నుంచి వీఆర్వోలకు బదిలీ చేసిన విషయంలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న పంచాయతీరాజ్ శాఖకు అప్పట్లో కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు..అదే పంచాయతీలు ఉండగా గ్రామసచివాలయాలు ఎందుకు అదనంగా ఏర్పాటు చేశారనే గుర్తున్నా.. ఆమాటలతో మళ్లీ డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించినా.. ఎందుకనో గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో మాత్రం మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ సమయంలోనే తమ సర్వీసులు రెగ్యులర్ కాకుండా కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండాలని బావించిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా సర్వీసు రెగ్యుల్ అయిన మరుక్షణం తమ అధికారాల కోసం కోర్టుకి వెళ్లి ప్రభుత్వాన్ని, పంచాయతీరాజ్ శాఖను ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంత వరకూ తాము అధికారులే జీఓనెంబరు 149 అమలు చేస్తారని భావించామని, ఈ విషయంలో ఎంపీడీఓలు, డీపీఓలు, జెసి, జిల్లా కలెక్టర్ ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం వినతి పత్రాలు ఇచ్చినా అవి బుట్టదాఖలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమకి న్యాయం జరగాలన్నా, ప్రజలకు తమను నుంచి సేవలు అందాలన్నా అధికార బదలాయింపు జరగాల్సిందేనంటున్నారు గ్రేడ్-5 కార్యదర్శిలు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది..!

Tadepalli

2021-11-01 05:45:47

సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ కి అన్నీ అడ్డంకులే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొభేషన్ డిక్లరేషన్, సర్వీసు రెగ్యులైజేషన్ కి సాంకేతిక కారణాలు, హైకోర్టులో దాఖలవుతున్న కేసులు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ కారణాలన్నీ గట్టెక్కాలంటే కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వార్త చదివే వారందరికీ కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాని సాంకేతిక కారణాలు, ఎదురుగా కనిపిస్తున్న సమస్యలు సంగతి తెలుసుకుంటే సచివాలయ ఉద్యోగులంతా ముక్కున వేలేసుకోక తప్పదు. వాస్తవానికి ఇదంతా ప్రభుత్వం కావాలని చేసినది కాకపోయినా రెగ్యులర్ జాబ్ కి పాటించాల్సిన నియమ నిబంధనలు ప్రభుత్వ శాఖలు ఖచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి. అక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. అదే సమయంలో కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు వారికేదో ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పినట్టుగా.. సచివాలయాల సందర్శనకు వచ్చిన సమయంలో పనిగట్టుకొని మరీ చేస్తున్న ప్రచారాలు కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచేస్తున్నాయి. దీనితో సచివాలయ ఉద్యోగాలు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ సమయంలో కాకుండా మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టేయవచ్చే ప్రచారం ఊపందుకుంది. సాంకేతిక కారణాలు, కొందరు అధికారులు చేస్తన్న ప్రచార విషయం ఇదే శాఖలో వున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు సైతం తెలియకపోవడం, వారికి తోచినట్టుగా ప్రకటనలు మీడియాకి జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు ఒక లక్షా 24వేలకు పైగా ఉద్యోగులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అందులో అత్యధిక శాతం మంది ఉద్యోగులు అక్టోబరు నెలలోనే విధుల్లోకి చేరలేదు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ విధుల్లోకి చేరిన వారూ ఉన్నారు. అంటే వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్లు పూర్తిస్థాయిలో సర్వీసు పూర్తిచేసుకుంటేనే ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఆస్కారం వుంటుంది. అలా కాకుండా మెడికల్ లీవులు పెట్టినా, ప్రసూతి సెలవులు పెట్టి మళ్లీ సర్వీసు రెగ్యులైజేషన్ ను వాడుకున్న సెలవులన్నీ పూర్తి అయ్యేవరకూ అంటే.. విధుల్లోకి చేరిన తేది తరువాత ఆరునెలలు దాటితేనే(ప్రసూతి, మెడికల్ సెలవులకు అయితే) వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేయడానికి మాత్రమే వీలుపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కోవిడ్ వైరస్ వచ్చి 14 రోజులు మెడికల్ సెలవులు తీసుకున్నా, అంతకంటే అధికంగా సెలవులు తీసుకున్నా అదే పరిస్థితి ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ విషయం చాలా మంది ఉద్యోగులకు తెలియదు. ఈ అంశాలన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తప్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు రాసినా, సర్వీసు రూల్స్ ని రెగ్యులర్ ఉద్యోగులకు ఖచ్చితంగా అమలు చేసి తీరక తప్పని పరిస్థితి ప్రభుత్వానిది. ఆ విధంగా నిబంధనలు పొందుపరిచారు.

ప్రభుత్వంలో ఏ శాఖలోని రెగ్యులర్ జాబ్ అయినా ప్రొబేషన్ పూర్తి అయి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే.. ఖచ్చితంగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకొని తీరాల్సిందే. దీర్ఘకాలిక సెలవులు పెట్టకూడదు. శాఖపరమైన శిక్షణ పూర్తిచేసుకొని ఉండాలి. డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా ఖచ్చితంగా పాసై వుండాలి. అన్నింటికంటే మించి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే సర్వీస్ రిజిస్టర్(ఎస్.ఆర్) ప్రారంభంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ పూర్తి అయి వుండాలి. అవన్నీ ఏ ఉద్యోగి అయితే క్లియర్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం సర్వీసుని రెగ్యులర్ చేస్తుంది. అలాకాకుండా ఏ ఒక్కటి మిగిలిపోయినా వారి సర్వీసు అనుకున్న సమయానికి రెగ్యులర్ కాకపోగా, నిబంధనలను అనుసరించి సమయం వచ్చే వరకూ ప్రభుత్వానికి సర్వీసు రెగ్యులర్ చేసే అవకాశం వుండదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ నిబంధన అమలు చేయకపోయినా సదరు శాఖ జిల్లా అధికారులు, డిఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఇరకాటంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇక గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సాంకేతిక కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో ఉన్న ఉద్యోగులంతా వారి విధుల్లోకి ఒకే సమయానికి చేరలేదు. అక్టోబరు 2 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ విధుల్లో చేరుతూనే ఉన్నారు. అలా చూసుకుంటే వీరి ప్రొబేషన్ సమయం పూర్తవ్వాలంటే ఫిబ్రవరి వరకూ ఆయా ఉద్యోగుల విధుల్లో చేరిన నెలను బట్టి ఆధార పడి వుంటుంది. అంతేకాకుండా అన్నిశాఖల ఉద్యోగులకు శాఖాపరమైన శిక్షణ పూర్తికాలేదు. చాలా మందికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు కూడా పూర్తికాలేదు. అన్నింటికంటే మించి 60శాతం ఉద్యోగులకు పోలీస్ వెరిఫికేషన్ ఇంకా పూర్తికాలేదు. కొన్నిశాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పూర్తయినా వారు పాస్ అయ్యారో, లేదో వారి ఫలితాలు వెలువడకపోవడం కూడా మరో కారణం. వీటితోపాటు పలు కేసులు హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రాకపోవడం. ఇంత వరకూ ఒక ఎత్తైతే కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకూ ఇప్పుడిచ్చే జీతం రూ.15వేలు కాకుండా రూ.20వేలకు పెంచి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. కాగా అక్టోబరు 2 నాటికి ఎంతమంది ఉద్యోగులకైతే రెండేళ్లు పూర్తయిందో వారి సర్వీసులను సర్వీస్ రూల్స్ ను అనుసరించి రెగ్యులర్ చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి నుంచి వచ్చిన సర్క్యులర్ ఆధారంగా జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయ జెసీలు ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. అదీ కూడా పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే. 

మరోపక్క గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ప్రసూతి సెలవుల అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా సర్వీసు రెగ్యులర్ చేయాలని, మెడికల్ లీవులు(కరోనాలీవ్,  సిక్ లీవ్)ను కూడా పరిగణలోకి తీసుకోకుండా చూడాలని ఉద్యోగ  సంఘాలు చేసిన వినతిపత్రాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది(ఇంకా పరిశీలన దశలోనే ఉంది). అంతా బాగుంది అనుకుంటే మహిళా పోలీసులను జీఓ నెంబరు 59 ద్వారా పోలీసుశాఖలో విలీనం చేయడం చట్టవిరుద్దమంటూ హైకోర్టులో కేసుపడటం, అంతేకాకుండా జీవో నెంబరు 2 ద్వారా గ్రామకార్యదర్శిలకు కాకుండా వీఆర్వోలకు డీడీఓ అధికారాలు కట్టబెట్టిన అంశం కూడా హైకోర్టు పరిధిలోనే వుంది. ఈ విషయంలో ప్రతివాది పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సివచ్చిందనే ఘాటు వ్యాఖ్యలను కూడా హైకోర్టు చేయడం ప్రభుత్వం తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. పైగా సుమారు 5 నుంచి 10 శాతం మంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, మరి కొందరు ఉద్యోగులను జెసిలు, జిల్లా కలెక్టర్లు కొన్ని కొన్ని శాఖాపరమైన అంశాల్లో సస్పెండ్లు చేయడం(కొందరికైతే ఇంకా రీపోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు) ఇలా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కు అడుగడుగునా అవాంతరాలే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వలను, సర్వీసు నిబంధనలను  అనుసరించి 19ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి జిల్లా అధికారులు జాబితాలను సిద్దం చేస్తున్నప్పటికీ పరిస్థితి ఇప్పుడప్పుడే తీరేటట్టుగా అయితే కనిపించడం లేదనే విషయం ఎదరుగా వున్న కొరకరాని కొర్రీలే స్పష్టం చేస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. వీరి సర్వీసును రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఎంతమందికి సర్వీసు రెగ్యులర్ చేస్తుందో.. పేస్కేలు ఏవిధంగా  అమలు చేస్తుందో..!

Tadepalli

2021-10-29 01:45:24

సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోతలు..

అవును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత మొదలైంది.. దానికి బయో మెట్రిక్ హాజరు, సెలవులు, ప్రభుత్వమే  జీఓ ద్వారా ఇచ్చిన సెలవులను కూడా కలిపేసి జీతాల్లో కోత విధిస్తున్నట్టు ఉద్యోగుల సీఎఫ్ఎంఎస్ ఐడీ జాబితాలను ఉద్యోగులకు చరవాణిలకు పంపింది ప్రభుత్వం. రోజుకో కొత్త నిబంధన తెరపైకి తెస్తున్న ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ ను జీతాల కోతకు కారణంగా చూపింది. ఇదే సమయంలో సెలవురోజుల్లో పనిచేసిన పనిని సైతం గుర్తించకపోగా.. బయో మెట్రిక్ మిషన్లు పనిచేయని తప్పుకి కూడా ఉద్యోగులనే బాధ్యులను చేసింది. ఫలితంగా ఇచ్చే రూ.15వేలు జీతంలో ఒక్కో ఉద్యోగికి ఒక్కో విధంగా జీతం కోత విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం వారి జీతం కోత జాబితాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి చెబుతూనే ఉంది బయో మెట్రిక్ హాజరు లేకపోతే  జీతాల్లో కోత విధిస్తామని.. చెప్పినట్టుగానే అక్టోబరు మాసం నుంచే దానిని అమల్లోకి తీసుకు వచ్చింది.  ప్రభుత్వమే ఇచ్చిన సెలవులకి, చేసిన పనికీ కూడా జీతాల్లో కోత విధిస్తారని.. తమ జీతంలో కోత పడినట్టు సమాచారం వస్తే తప్పా తమకి తెలియలేనది సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామసచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ ప్రొబేషన్ పీరియడ్ తరువాత ఉద్యోగులందరినీ సర్వీసు నిబంధనలు అనుసరించి రెగ్యులర్ చేయాల్సి వుంది. ఆ సమయంలోనే వారికి ఖచ్చితంగా విధులకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేస్తేనే జీతం ఇస్తాం.. లేదంటే కోతవిధిస్తామనే భయాన్ని తెలియజేసింది. ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగులకే కాకుండా గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తింపజేసింది ప్రభుత్వం. దీనితో అక్టోబరు మాసం జీతాల్లో ఒక్కో ఉద్యోగికి రూ.800, 1500, 2500 చొప్పున జీతాల్లో కోత పడినట్టుగా ఉద్యోగుల చరవాణీలకు సమాచారం రావడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. విధులకు వచ్చి పనిచేసినా జీతాల్లో కోత విధించడమేంటని తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన సెలవులు వినియోగించుకున్నవారికి కూడా జీతాల్లో కోతవిధించడం విశేషం. చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పూర్తయిన తరువాత సాయంత్రం 5గంటలకు బయో మెట్రిక్ వేయాల్సి వుంది. ఆ సమయంలో సర్వర్లు పనిచేయక బయో మెట్రిక్ పనిచేయని తప్పకి కూడా ఉద్యోగులే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏ రోజు అయితే బయో మెట్రిక్ పనిచేయలేదో ఆ విషయాన్ని బయోమెట్రిక్ మిషన్ ను మొబైల్ ఫోన్లలో స్క్రీన్ షాట్లు తీసి, ఫోటోలు తీసి అధికారులకు సామాజిక మాద్యమాల్లోనూ, రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కాగా ప్రొబేషన్ పూర్తయి సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఉద్యోగులకు విధినిర్వహణ ఖచ్చితత్వం గురించి తెలయాలని, ప్రభుత్వ ఆదేశాలు ఏ స్థాయిలో అమలు జరుగుతాయో తెలియడం కోసమే ఈ బయోమెట్రిక్ హాజరు నిబందనను అమలు చేసి చూపించినట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే జీతాల్లో కోత విధించినట్టుగా వచ్చిన జాబితాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..లేదంటే ఉద్యోగులు అధికారుల ద్వారా సమస్యను తెలియజేసిన విధంగా వార్ణింగ్ గా చూపించి రూ.15వేలు జీతం పూర్తిగా ఇస్తుందా అనేది దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. కాగా అటు అధికారులు మాత్రం ముందుగా చేసిన హెచ్చరిక మేరకే జీతాల్లో కోత విధించినట్టుగా చెబుతున్నారు. ఇక్కడ మరో మెలిక ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల బిల్లులు ప్రతీ నెలా 25వ తేదీన ఆన్ లైన్ చేస్తారు. కానీ ఉద్యోగుల జీతాల్లో కోత పడినట్టుగా 22వ తేదీనే ఉద్యోగుల సెల్ ఫోన్లకు సమాచారం రావడం విశేషం. దానిని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మండల, జిల్లా, రాష్ట్ర అధికారుల ద్రుష్టికి సైతం తీసుకెళ్లేలా చేసింది. మొదలైన ఈ బయోమెట్రిక్ జీతాల కోతను సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా కొనసాగిస్తుందా..లేదంటే ఉద్యోగులకు ఒక అవకాశం ఇస్తుందా అనేది తేలాల్సి వుంది..చూడాలి ఏం జరుగుతుందో..!

Tadepalli

2021-10-23 07:11:01

ప్రభుత్వ సెలవులన్నీ అదనపు విధులకే..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సాధారణ సెలవులన్నీ అధనపు విధులు హరించేస్తున్నాయి.. కాదు కాదు ఆవిధంగా అధికారులు వీరికి సెలవులు రానీయకుండా చేస్తున్నారు.. ప్రతీ పనీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే చేస్తుందని కాస్త గట్టిగా మాట్లాడే అధికారులు.. ఏ నిబంధనతో ప్రభుత్వం  ఇచ్చే సెలవు రోజుల్లో సచివాలయ ఉద్యోగులతో అదనపు విధులు నిర్వహిస్తున్నారో సెలవు రోజుల్లో డ్యూటీలు వేసే అధికారులు వివరించాల్సి వుంది..  ప్రభుత్వం ఇచ్చే సెలవురోజుల్లోనే సచివాలయ ఉద్యోగులకు ఏదో ఒక అదనపుపని అప్పగిస్తూ(అడిషనల్ ఫ్రీ డ్యూటీ.. ఇది ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాదు, లెక్కగట్టరు..) వీరికి కనీసం సెలవులను వినియోగించుకునే అవకాశం ఇవ్వడం లేదు. మిగిలిన శాఖల సిబ్బందితో పోల్చుకుంటే ఆరోగ్య సహాయకుల పరిస్థితి అయితే మరీదారుణం. వీరు చేపట్టే కోవిడ్ విధులకు వేళాపాలా అస్సలు ఉండటం లేదు. కోవిడ్ వేక్సినేషన్ సమయంలో ఉదయం 8గంటలకు ప్రత్యేక క్యాంపైన్ చేసే రోజుల్లో అయితే ఉదయం 6గంటలకే విధులకు హాజరైతే.. ఇచ్చిన టార్గెట్ వేక్సిన్లు పూర్తయ్యేవరకూ వాళ్లు ఇంటి మొహం పెట్టడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఆదివారాలు, 2వ శనివారాలు, ఇతర సాధారణ సెలవులు ఇలా ఎప్పుడు పడితే అపుడు వీరికి సెలవులను వినియోగించుకోకుండా చేస్తున్నారు అధికారులు. శెలవురోజుల్వో అధనపువిధులు చేసినందుకు వీరికి మిగిలిన సమయంలో సెలవులు ఇస్తున్నారా అంటే అదీలేదు. పైగా ఇచ్చిన ఇచ్చిన సెలవులన్నీ మాత్రం సిక్ లేదా సిఎల్ రిజిస్టర్ లో తప్పనిసరిగా రికార్డవుతున్నాయి.. అధికారులు వాటిని ఖచ్చితంగా నిబంధనల ప్రకారం చేయాలని ఆదేశాలు సైతం జారీచేస్తున్నారు. ఇలా సిఎల్ పెట్టినపుడు సెలవులను ప్రభుత్వ నిబంధనల ప్రకరారం రికార్డు చేసే అధికారులు, సెలవురోజుల్లో పనిచేసినందుకు మాత్రం ఎందుకు ప్రత్యేక ఆదేశాలతో పనిచేసినందుకు రికార్డు చేయడం లేదంటే.. అది మా పరిధిలో లేదని చేతులెత్తేస్తున్నారు.  మరి ఎందుకు తమతో సెలవురోజుల్లోనూ అదనపు విధులు అప్పగిస్తూ ఎందుకు  పనిచేయిస్తున్నారని ప్రశ్నిస్తే ఆ ఒక్కటీ అడక్కు అంటూ బీరాలు పోతున్నారు అధికారులు. ఇచ్చే రూ.15వేల జీతంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు ఒక లక్షా 24వేల మందికి పైగా ఉద్యోగులు ప్రభుత్వం ఏవిధంగా చెబితే ఆవిధంగానే విధులు నిర్వహించాల్సి వస్తుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన మూడు నెలలకేయ కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ కరోనా పేరుతోనే సచివాలయ సిబ్బంది సెలవు రోజుల్లో కూడా అదనపు విధులు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అదనపు విధులు చేసినందుకు చాలా మంది ఉద్యోగులు కోవిడ్ బారిన సైతం పడ్డారు. కొందరు గ్రామవాలంటీర్లు, సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు మ్రుత్యువాత పడిన సందర్భాలూ ఉన్నాయి.  ఎవరూ ఎదురు ప్రశ్నవేయకుండా సర్వీసు రెగ్యులరైజేషన్ బూచీని చూపిస్తూ కొన్ని చోట్ల అధికారులు సైతం బెదిరింపులకు దిగుతుండటం విమర్శలకు తావిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో ఉద్యోగులతో అదనపు పనులు చేయించకూడదు. ఒకవేళ చేయించాల్సి వస్తే.. అలా చేయించిన ప్రతీ పనికీ అంటే ఎన్నిరోజులు పనిచేస్తే అన్ని రోజులకు.. సాధారణ రోజుల్లో విధులకి ఇచ్చే జీతాన్ని లెక్క గట్టి ఉద్యోగులకు ఇవ్వాలి. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఈ నిబంధనల అమలు కాకపోగా ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సెలవులను అధికారులే అదనపు పనులు అప్పగించి హరించేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు కూడా కావాలని చేయడం లేదు.. ప్రభుత్వం వారికి అప్పగించిన పనిని సాధారణ రోజుల్లో కాకుండా సెలవు రోజుల్లోనే సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇప్పటికే సర్వీసు రెగ్యులరైజేషన్ పేరుతో కనీసం పేస్కేలు జీతానికి కూడా నోచుకోని సచివాలయ సిబ్బంది, ఇపుడు ప్రభుత్వం ఇచ్చే సెలవులను సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఏమైనా అడగాలంటే వీరికి పై అధికారులుగా ఉన్న ఎంపీడీఓలు, వారిపై ఉండే డీఎల్డీఓలు, ఆపై గ్రామ, వార్డు సచివాలయ జేసీలు వీరిపై కన్నెర్ర జేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తమను కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పరిగణించకుండా.. స్కూలు, కాలేజీ విద్యార్ధులను బెదిరించినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వింత నిబంధనలు, సెలవు రోజుల్లో రికార్డుకాని అధనపు విధులు, రెండేళ్లు పూర్తయినా సర్వీసు నిబంధన అమలు చేయకపోవడం, ఉద్యోగులకు బెదిరిపులు ఇవన్నీ చూడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించినా.. ఇందులో పనిచేసే అత్యధికశాతం మంది ఉద్యోగుల నుంచి మాత్రం తీవ్ర నిరసన ఎదుర్కొనేలా చేస్తున్నాయి అధికారులు చేస్తున్న విధానాలు. ఈ విషయాలన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు, ప్రభుత్వం ఈ శాఖకోసమే నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లకు తెలిసినా, ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించినా..షరా మామూలుగానే ప్రభుత్వ సెలవు దినాల్లోనే వీరికి అధనంగా పనులు అప్పగించడం విశేషం. బహుసా ప్రభుత్వ సెలవులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అర్హులు కారేమో..!

Tadepalli

2021-10-19 04:24:06

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సీఎం వైఎస్ జగన్ పూజలు..

సీఎంవైఎస్‌ జగన్‌ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్‌ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి  వెంకటేశ్వర రావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపి వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2021-10-18 12:16:11

రేపే ఈద్ మిలాదిన్ నబి.. ప్రభుత్వ శెలవుదినం

ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈ ఉత్తర్వులను జారీచేశారు.

Tadepalli

2021-10-18 10:36:29

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టు హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ ఆర్డరును  రిజిస్ట్రార్ జనరల్ బి.ఎస్.భానుమతి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా  జస్టిస్ రవినాథ్ తిల్హరితో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.  న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ గంగారావు, జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ రఘనందనరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్  సురేష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోషియేషన్ అద్యక్షులు కె.జానకి రామి రెడ్డి, సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్,రిజిస్ట్రార్స్ తదితరులు ఈ ప్రమాణ స్వీకార  కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tadepalli

2021-10-18 08:30:01