1 ENS Live Breaking News

స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకి పార్టీలు సహకరించాలి

అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా తయారీకి వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఓటర్ల ఎన్రోల్మెంట్ అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కోరారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు తొలగింపులు ప్రతివారం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.  రానున్న పది రోజులలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికానుందని, జాబితా స్వచ్చీకరణ కొరకు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ క్షుణ్ణమైన పరిశీలనతో జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఓటు తొలగించే సమయంలో ఫారం 7 తప్పనిసరిగా ఉండాలని, బిఎల్ఓ రిపోర్టు ఉండాలని, స్పష్టమైన డాక్యుమెంట్లు ఉండాలని చెబుతూ ఏ వార్డులోనైనా రెండుకుమించి ఓట్లు తొలగింపు చేయవలసి వచ్చినప్పుడు ఈఆర్వో సమక్షంలో జరగాలన్నారు.  రాజకీయ పార్టీల వారు ప్రతి వార్డుకు తమ బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించి బూత్ స్థాయి అధికారికి సహకరించాలన్నారు.  తమ ఓటు నమోదు చేసుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తూ విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు.  దీనిపై ప్రసార మాధ్యమాలలో ప్రకటనలు, గ్రామాలలో దండోరా వేయడం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్ఓ పి. వెంకటరమణ అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరాం, ఎస్డీసీలు ప్రమీల గాంధీ, అనిత, జ్ఞాన వేణి, రామలక్ష్మి రాజకీయ పార్టీలకు చెందిన కే హరినాథ్ బాబు వై ఎన్ భద్రం వి రాము బి శ్రీనివాసరావు ఎస్ రామచంద్రరావు జి శ్రీరామ్ ఏ సెక్షన్ సూపరెంట్ లక్ష్మీదేవి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:28:19

డిసిఎంఎస్ ను ప్రగతిపథంలో నడిపించాలి

ప్రగతి పథంలో డిసిఎంఎస్ ను నడిపేందుకు అందరి సహకారం అవసరమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి  డిసిఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం విశాఖపట్నం కో- ఆపరేటివ్ మార్కెటింగ్ సోసైటీ (డిసిఎంఎస్) కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మశ్రీ మాట్లాడుతూ కోపరేటివ్ వ్యవస్థ గాజుబొమ్మ లాంటిదని ఆయన అభివర్ణించారు.  ప్రోఫర్టీ ఉండి ప్రోఫిట్ లేని సంస్థ డిసిఎంఎస్ అని ఆయన అన్నారు. ఈ సంస్థ లాభాలు బాట పట్టేందుకు అందరి సహకారం అవసరమన్నారు. బిసిలు బ్యాక్ బొన్ లాంటి వారన్నారు. పార్టీ ని నమ్ముకున్న వారి కి పదవులు వస్తుంటాయని అన్నారు. అయితే కొన్ని సామాజిక సమీకరణలు వల్ల పదవులు ఒకేసారి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు.యాదవ్ లకు సముచిత స్థానం కల్పించి ఇలాంటి సంస్థ కు ఛైర్మన్ పదవి కేటాయించడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ని అందరూ ఆదరించాలని ఆయన అన్నారు. తొలుత నూతనంగా డిసిఎంఎస్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పల్లా నర్సింగరావు  ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు నర్సింగరావు కు గజమాలాలుతోను, పూల బొకే లతోను ఘనంగా సత్కరించారు.

 ఈసందర్భంగా డిసిఎంఎస్ ఛైర్మన్ నర్సింగరావు మాట్లాడుతూ  అందరి సహకారం తో సంస్థ ను ప్రగతి బాట లో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ కి అభిమానులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి, ఆనంద్, ఎ.సత్యారావు, డేవిడ్, కె. దేముడు,పి.అప్పారావు, కలగా సోమునాయుడు, సేనాపతి సత్యారావు, దొండా రాంబాబు, వెంకటరావు, కోనపల్లి రామమోహనరావు, డిసిఎంఎస్ పాలకవర్గ సభ్యులు పి.డి నర్సింగరావు (గాంధీ), జి. సత్యదేవ్, పి.అప్పారావు,ఎస్.సుకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:03:27

ఆదివాసీల సంస్కృతిని గౌరవించాలి.. కలెక్టర్ రవిపట్టన్ శెట్టి

ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటుచేసిన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు, బిర్సాముండా,  గాం గంటం దొర,  గాం మల్లు దొర చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రపంచంలో వివిధ ఆదివాసి తెగలను పరిచయం చేయడం వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  భారతీయ మూలాలు సజీవంగా ఉన్నాయంటే ఆదివాసుల వల్లనే నని గుర్తించి వాటిని అవగాహన చేసుకుని ప్రచారం చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నిజాయితీగా అమాయకంగా ఉండే గిరిజనులు అభివృద్ధి బాట పట్టారని చెప్పారు.

   అనకాపల్లి జిల్లా గిరిజన ప్రాంతాలన్నీ ఏజెన్సీని ఆనుకొని ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు చైతన్యం నింపేందుకు ఉత్తరాంధ్రలో  అల్లూరి, మన్యం పేర్లతో రెండు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు.  జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, వైద్య, విద్యా పరంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.తొలుత గిరిజన బాలికలు ప్రదర్శించిన ధింసా నృత్యాలు ఇతర గిరిజన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ డిడి రాజేశ్వరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగ శిరీష , బుచ్చయ్య పేట, జెడ్ పి టి సి దొండా రాంబాబు, సర్పంచ్ పెంటయ్య నాయుడు, జిల్లాలోని రామన్నపాలెం, కోనాం, తాండవ, నరసయ్య పేట, తాటిపర్తి ఇతర ప్రాంతాల నుండి గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:00:33

1407 జంటలకు వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు

విజయనగరం జిల్లాలో 1407  జంటలకు వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు.  అల వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకం క్రింద 2023 ఏప్రిల్  - జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న 18,883 జంటలకు రూ.141.60 కోట్లు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జ్   శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు, డి ఆర్ డి ఏ పి.డి  కల్యాణ చక్రవర్తి , జి.ఎస్.డబ్ల్యూ. జిల్లా కార్డినేటర్ నిర్మల దేవి,  రెడ్డికే వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్  రౌతు భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జిల్లాలో  1168 బిసి -  జంటలకు ,  149 ఎస్.సి జంటలకు ,  26  ఎస్.టి జంటలకు , 17 దివ్యాంగ జంటలకు , 7 మైనారిటీ జంటలకు ఇంటర్ చస్తే  వారికి   వెరసి 1407  జంటలకు రూ.8.32  కోట్లు మంజూరు అయ్యాయన్నారు. వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకాలతో ఆర్థిక కారణాలతో మధ్యలోనే విద్యను నిలిపి వేసే అవకాశం బాగా తగ్గుతుందని అన్నారు. సామాజిక మార్పులో ఒక విశిష్టమైన పాత్రను పోషిస్తుందని అనడంలో సందేహం లేదని ఆయన చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి తదితర వర్గాలకు ఇది ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు నుండి బయటకు రావడానికి, సామాజిక హోదా, సామాజిక సామరస్య సాధనకు ఇది దోహదం చేస్తుందని  అన్నారు. 

Vizianagaram

2023-08-09 10:09:58

నులిపురుగుల నివార‌ణతో పిల్ల‌లకు సంపూర్ణ ఆరోగ్యం

నులి పురుగుల‌ నివార‌ణ ద్వారా పిల్ల‌ల ఆరోగ్యానికి పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. ఎస్. భాస్క‌రరావు పేర్కొన్నారు. 1-19 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు 400 గ్రా. మాత్ర‌లు వేయ‌టం ద్వారా బంగారు భ‌విష్య‌త్తును అందించ‌వ్చ‌ని హిత‌వు ప‌లికారు. ఆగ‌స్టు 10న‌ జాతీయ నులిపురుగుల నివార‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జిల్లాలో నిర్వ‌హించ‌బోయే కార్య‌క్ర‌మాల నిమిత్తం బుధ‌వారం త‌న కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు. ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు వేయటం ద్వారా పిల్ల‌ల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంద‌ని, ఇత‌ర అనేక‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,834 కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివార‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని దానిలో భాగంగా జిల్లా కేంద్రంలోని మ‌హారాజ సంస్కృత క‌ళాశాల‌లో గురువారం మధ్యాహ్నం జిల్లా క‌లెక్ట‌ర్, డిప్యూటీ స్పీక‌ర్, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ చేతుల మీదుగా కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. జిల్లాలోని అంగ‌న్వాడీ కేంద్రాలు, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నామ‌ని ఈ మేర‌కు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామ‌ని అవ‌స‌ర‌మైనంత మేర‌కు మాత్ర‌లు స‌ర‌ఫ‌రా చేశామ‌ని పేర్కొన్నారు.

 ఒకే రోజు 3,60,974 మంది 1-19 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల‌ పిల్ల‌ల‌కు ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు అంద‌జేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామ‌ని వివ‌రించారు. అన్ని విభాగాల అధికారులు, ప్ర‌జ‌లు భాగ‌స్వామ్య‌మై కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చారు.మిగిలిపోయిన వారికి 17వ తేదీన‌ గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఒక వేళ ఎవ‌రైనా మందులు తీసుకోలేకపోయిన‌ట్ల‌యితే వారి కోసం ప్ర‌త్యేకంగా 17వ తేదీన ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు అంద‌జేస్తామ‌ని డీఎం&హెచ్‌వో స్ప‌ష్టం చేశారు. అలాగే ఏడాది లోపు వ‌య‌సు క‌లిగిన చిన్నారులు, మూడు నెల‌ల లోపు గ‌ర్బిణీలు ఈ మాత్ర‌ల‌ను తీసుకోరాద‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివార‌ణ దినోత్స‌వానికి సంబంధించిన పోస్ట‌ర్న ఆవిష్క‌రించారు.స‌మావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్వో డా. ర‌వి కుమార్, డెమో చిన్నిత‌ల్లి, ఎపెడిమిక్ సెల్ ఇన్ఛార్జి స‌త్య‌రాజ్, ఆర్.బి.ఎస్.కె. ఇన్ఛార్జి లోక్‌నాథ్ ప్ర‌శాంత్, ర‌మ‌ణ‌, రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-09 10:07:14

ఎస్ఎస్ఆర్ ఓటరు జాబితా సవరణ గుర్తించాలి

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరుపుతున్న ఇంటింటి సర్వే లో బూత్ స్థాయి అధికారులు ఓటరు గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం నియోజక వర్గాల వారిగా ఓటరు గుర్తింపు సర్వే పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో లతో సర్వే పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్ష లో భాగంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, వచ్చే ఏడాది రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహించే క్రమంలో ఓటరు జాబితా లో ఓటరు గుర్తింపు, ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, ఇల్లు, నియోజక వర్గం మారిన ఓటరు గుర్తింపు, మరణించిన వారి వివరాలు వంటి ప్రతి ఒక్క ప్రక్రియ ను అత్యంత జాగ్రత్తగా సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో బూత్ స్థాయి లో ఇంటింటి సర్వే ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా నియోజక వర్గ స్థాయి ఓటరు నమోదు చేసే ఈ ఆర్ వో లు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మార్పులు,  చేర్పులు, యువ ఓటరు నమోదు పై వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టి రాబోయే 14 రోజులు అత్యంత కీలకం అని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,  జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-08-08 14:41:13

చంద్రబాబుపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి..మంత్రి అమర్

హింసాత్మక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఆ తెలివితోనే పుంగనూరులో ఆయన ఇదేవిధమైన కుట్రను అమలు చేశాడని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతమాటంటే అంతమాట అంటున్నారు. అయితే, ఆ ముగ్గురి కుట్రపూరిత ఆలోచనలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు తగిన బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పోలీసుల్ని రెచ్చగొట్టడం, తద్వారా వారు ఫైరింగ్‌ ఓపెన్‌ చేస్తే..ఎవరో ఒకరు చనిపోతే.. మా పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా చంపారంటూ ఒక డ్రామాతో రాజకీయ లబ్ధి పొందాలనేది బాబు రాజకీయ పన్నాగం పన్నారన్నారు.  మొన్న పుంగనూరు బైపాస్‌లో పోలీసులపై టీడీపీ దాడికి ముమ్మాటికీ చంద్రబాబునే కారకుడన్నారు. ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయని చంద్రబాబుపైనే రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

Visakhapatnam

2023-08-08 13:58:20

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పగడ్బందీ ఏర్పాట్లు

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు.  జిల్లాలోని అధికారులతో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే వేడుకలను పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  మైదానంలో ఏర్పాట్లను పోలీస్ శాఖ, జిల్లా రెవెన్యూశాఖ , అలాగే సౌండ్ సిస్టం ఏర్పాట్లను సమాచార శాఖ డిఐపిఆర్ఓ పర్యవేక్షించాల న్నారు. వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి, తాగునీరు శానిటేషన్ జీవీఎంసీ జోనల్ కమిషనర్, డిపిఓ పర్యవేక్షిస్తారని చెప్పారు.  వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, తాగునీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య, పట్టణాభివృద్ధి, డ్వామా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖలు జిల్లాలో ఆయా శాఖల అభివృద్ధిని తెలియపరిచే శకటాలను ప్రదర్శించాలన్నారు.  జాయింట్ కలెక్టర్ మెరిట్ సర్టిఫికెట్లను పర్యవేక్షిస్తారని, ముఖ్య ప్రణాళిక అధికారి, జి ఎస్ డబ్ల్యు ఎస్ ప్రత్యేక అధికారి కార్యక్రమాల అనుసంధాన, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

Anakapalle

2023-08-08 12:43:16

చీమలాపల్లి సర్వే నెంబరు-54 వెనుక అసలు కథ..!

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ లక్ష్మినృసింహ స్వామివారి దేవస్థానం భూములు కళ్లముందు కనుమరుగైపోతున్నాయి..చీమలాపల్లి సర్వే నెంబరు-54లోని 6.48 ఎకరాల భూమి విషయంలో జరిగిన భూ రికార్డుల భూమాయ బయటకు వచ్చిన విషయం ఇటు రెవిన్యూ, అటు దేవస్థానం అధికారులకు చెమటలు పట్టిస్తున్నది. అసలు అక్కడ ఏం జరిగింది..ఎవరు కథ నడింపించారో..దానిని మరెవరు సొమ్ము చేసుకున్నారు.. ఇంకెవరు మరోలా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు..తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net రంగంలోకి దిగాయి. దీనితో 
కళ్లు చెదిరే విషయాలు మా ద్రుష్టికి వస్తున్నాయి. ఈ వ్యవహరానికి సంబంధించిన వాస్తవాలను దారావాహికంగా మీముందు ఉంచబోతున్నాం.

Pendurthi

2023-08-08 09:52:31

జగన్ వస్తే విశాఖ కనుమరుగైపోతుంది.. ఎమ్మెల్యే గంటా

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రక్షణ.. అధికారంలోకి వచ్చాక బక్షణ.. ఇది సీఎం వైఎస్.జగన్ రెడ్డి తీరని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.  మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖలో వైఎస్సార్సీపీ నాయకులపై ఛార్జ్ షీట్ అనే కార్యక్రమం ద్వారా జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ,  జగన్ రెడ్డి విశాఖపట్నంలో దురాగతాలను ఎండగడుతూ.. ఇక్కడి ప్రజలను మోసం చేసిన తీరునుపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే సేవ్ విశాఖ పేరుతో జగన్ భారీ మీటింగ్ పెట్టాడని.. ప్రజలందరూ నిజమని నమ్మి జగన్ ని గెలిపిస్తే..అదే ప్రజలను ఇపుడు నట్టేట ముంచారాని ఆరోపించారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చినతరువాత విలువైన భూములను దోచేశారన్నారు. నాలుగు దిక్కులా ఉన్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారని ఆరోపించారు. జగన్ విశాఖకు రావడం 
శుభవార్త కాదు ప్రజలకు చేదువార్త అని అన్నారు. జగన్ విశాఖ రాకుండానే  ప్రభుత్వ ఆస్తులు తనకా వంటి దురాగతాలు జరుగుతుంటే అతనొస్తే ఇంకా అనర్ధాలు జరుగుతాయొ ప్రజలు గుర్తించాలన్నారు. సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-08 06:56:32

వైజాగ్ లో ప్రారంభమైన ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ

కోవిడ్ తర్వాత వైద్యరంగంలో వివిధ దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని,   ముఖ్యంగా యువకులు గుండెపోటుకు అధికంగా గురి అవుతున్నారని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున అన్నారు. అవి చాలా ప్రాణాంతకం గా మారుతున్నాయని చెప్పారు. దీనికి గల ఖచ్చితమైన కారణాలు కనుగొనడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిందని అన్నారు. సోమవారం ఉదయం కేజీహెచ్ లో జరిగిన ఏ పి  స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి 19 వరకూ 10 రోజుల పాటు సిహెచ్సీ, పిహెచ్సీ లలో వైద్యులు,  నర్సులు,  పారామెడికల్ సిబ్బందికి  ఏపి స్టెమీ ప్రాజెక్ట్ శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను గుండె పోటు నుండి రక్షించి మరణాలను తగ్గించవచ్చని వివరించారు.
 గుండెపోటు కారణంగా మరణాలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టెమీ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించిందని అన్నారు.  

సుదూర ప్రాంతాలలో, గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలలో ఈ.సీ.జీ చేయడం ద్వారా గుండెపోటును గుర్తించడానికి వైద్యులు శిక్షణ పొందుతారని మరియు కార్డియాలజీ విభాగంలోని కార్డియాలజిస్ట్‌కు సమాచారం పంపడం ద్వారా  వైద్యులు చికిత్సను సూచిస్తారన్నారు . ఆ తర్వాత సీహెచ్‌సీ పీహెచ్‌సీ వైద్యులు గుండె రక్తనాళాల్లో క్లాట్ కరిగించే మందులు ఇంట్రావీనస్‌ ద్వారా ఇస్తారని, అడ్డంకులు తొలగిపోయి ఛాతీ నొప్పి తగ్గుతుందన్నారు . అనంతరం వారు రోగులను కెజిహెచ్  కార్డియాలజీకి పంపడం జరుగుతుందన్నారు. ఇది హబ్ మరియు స్పోక్ మోడల్ అని ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే తమిళనాడు, కేరళ,  అస్సాం , జార్ఖండ్, మహారాష్ట్ర , గోవాలలో  ఉందని తెలిపారు. టెర్షియరి సంరక్షణ ఆసుపత్రులకు దూరంగా ఉన్న రోగులలో గుండెపోటు కారణంగా మరణాలను ఆపడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు . 

Visakhapatnam

2023-08-07 17:32:43

హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి

జర్నలిస్టుల హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్ నిధుల నుంచి) ప్రభుత్వమే చెల్లించాలని  ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా యూనిట్ సభ్యులు జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి విన్నవించారు. సోమవారం ఈ సందర్భంగా జర్నలిస్టుల అభ్యర్ధనపై కలెక్టర్ స్పందించారు. తప్పనిసరిగా హెల్త్ కార్డు విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం రాంబాబు, జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి జోగి నాయుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కే.చంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భాస్కర్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్, పాల్గొన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అదేసమయంలో రావడంతో కాసేపు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.

Anakapalle

2023-08-07 10:33:23

సామాన్యుల సేవ ఎంతో సంతృప్తి నిచ్చింది

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌పాటు ఛైర్మ‌న్‌గా ప‌నిచేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, త‌న వెన్నంటి ఉన్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారులు, సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-07 10:05:58

చేనేత దినోత్సవం స్ఫూర్తితో నేతన్నలకు ప్రోత్సాహం

జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇద్దామని జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.  జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన స్టాల్ ను జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. వస్త్ర ప్రదర్శన లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల డిజైను లని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆస్తిత్వానికి అసలైన గుర్తింపునిచ్చే చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. గత సంవత్సరం చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకపై ప్రతి వారం వస్త్ర ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ వంటి ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు  చేస్తోందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తోందన్నారు. వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం కింద మగ్గాల ఆధునికీకరణకు ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఇస్తోందన్నారు.  చేనేత వస్త్రధారణ ఆరోగ్యదాయకమని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో  చేనేత జౌళిశాఖ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ రమణమ్మ, డి ఎల్ డి ఓ పూర్ణిమా దేవి, డి ఈ ఓ చంద్రకళ, ఏ డి విభిన్న ప్రతిభా వంతుల శాఖ మాధవి, తదితర జిల్లా మహిళా అధికారిణి లు , సిబ్బంది, 
వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-08-07 08:34:33

చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం అండగా వుంటుంది..

చేనేత కార్మికుల‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌ని, జిల్లాప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియా డారు. జాతీయ చేనేత దినోత్స‌వాన్ని సోమ‌వారం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక స‌ర్వ‌జ‌న‌ ఆసుప‌త్రి జంక్ష‌న్ నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు హేండ‌లూ మ్ వాక్ నిర్వ‌హించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న శాల‌ను, జెడ్‌పి ఛైర్మ‌న్ ప్రారంభించారు. జిల్లా అధికారులు, సిబ్బంది చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించారు. చేనేత వ‌స్త్రాల ప్రాశ‌స్త్యాన్ని పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల‌కు వివ‌రించారు. ప‌లువురు నేత కార్మికుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు.  ఈ సంద‌ర్భంగా జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి త‌న సుదీర్ఘ‌ పాద‌యాత్ర‌లో, చేనేత కార్మికుల క‌ష్టాల‌ను తెలుసుకొని, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటి ప‌రిష్కారానికి కృషి చేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోని, నేత కార్మికుల‌ను ఎన్నో ప‌థ‌కాల‌తో ఆదుకున్నార‌ని అన్నారు. 

దీనిలో భాగంగా వైఎస్ఆర్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం క్రింద ప్ర‌తీఏటా  రూ.24,000 చొప్పున జిల్లాలోని 3,595 మందికి చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. అలాగే ముద్ర ప‌థ‌కం క్రింద రూ.50వేలు నుంచి రూ.5ల‌క్ష‌లు వ‌ర‌కు రుణాల‌ను, సొసైటీల‌కు డిసిసిబి ద్వారా రుణాల‌ను ఇప్పించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. ముఖ్యంగా నేత వృత్తిదారుల‌కు 50 ఏళ్లు నిండితే  చాలు పింఛ‌ను మంజూరు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ విధంగా జిల్లాలో 3,165 మంది నేత‌న్న‌లు చేనేత పింఛ‌న్ పొందుతున్నార‌ని తెలిపారు.   సుదీర్ఘ‌కా లంగా వృత్తిని కొన‌సాగిస్తున్న సీనియ‌ర్ చేనేత కార్మికులు ఎం.పెంట‌య్య‌, బ‌ల్ల ఈశ్వ‌ర్రావు, నాయుడు స‌త్యారావుల‌ను జెడ్‌పి ఛైర్మ‌న్ స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, ఎస్‌.కోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, వెల‌మ‌కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నెక్క‌ల నాయుడుబాబు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, చేనేత జౌళిశాఖ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ బి.వసంత‌సాయి, సిబ్బంది, వివిధ చేనేత సొసైటీలు, నేత కార్మికులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-07 07:33:23