1 ENS Live Breaking News

స్పందన, జగనన్నకు చెబుదాం అర్జీలకు ప్రాధాన్యత

స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలలో వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  మండల ప్రత్యేక అధికారులు ఫిర్యాదులు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు.  ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో స్పందన కార్యక్రమానికి వచ్చే సమయంలో జిల్లా శాఖల అధికారులు పూర్తి వివరాలతో రావాలన్నారు. గృహ నిర్మాణం, నాడు నేడు, ఇంజనీరింగ్ పనులు, అంగన్వాడి సెంటర్లు, హెల్త్  క్లినిక్ లు, వ్యర్ధాల నిర్వహణ మొదలైన వాటికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే పనులు జరిగేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్వో పి.వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Anakapalle

2023-05-15 12:56:16

విజయనగరం జిల్లా స్పంద‌న‌కు 122 విన‌తులు

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో సోమ‌వారం 122 విన‌తులు అందాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌. నాగ‌ల‌క్ష్మి ఇతర జిల్లాశాఖల అధికారులతో పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు, విద్యుత్ శాఖ‌కు సంబంధించి 01, డి.సి. హె చ్‌.ఎస్‌.-1, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌కు సంబంధించి 01, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ‌కు 06, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు సంబంధించి 10, జి ల్లా పంచాయ‌తీ అధికారికి 06, గృహ‌నిర్మాణంకు సంబంధించి 12, మునిసిప‌ల్ స‌మ‌స్య‌ల‌పై 5, రెవిన్యూకు సంబంధించి 80 విన‌తులు అం దాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీపెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఆయా ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి నిర్ధిష్టమైన సమాచా రం అందాలన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలన్నారు. అర్జీదారులను పదే పదే జిల్లాశాఖల కార్యాలయాల చుట్టూ తిప్ప రాదన్నారు.  జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ప్ర‌త్యేక డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లు సూర్య‌నారాయ‌ణ‌, ప‌ద్మ‌ లీల‌, బి.ఎస్‌.ఎన్‌.దొర త‌దిత‌రులు కూడా స్పందనలో విన‌తులు స్వీక‌ర‌ణ చేప‌ట్టారు. 

Vizianagaram

2023-05-15 10:54:37

VJFకి సర్వసభ్య సమావేశమా ఆ ఒక్కటీ అడక్కండి..!

ఎలాంటి ఎన్నికలూ లేకుండా మమ్మల్నే మరో 12ఏళ్లు ఉండిపోమనండి ఉండిపోతాం.. సభ్యుల ఆమోదం లేకుండా విజెఎఫ్ రెవిన్యుల్స్ చేయించమనండి అడ్డదారిన చేసేస్తాం.. కమిటీలో ఉన్న సభ్యులను కమిటీ ఆమోదంతో తప్పించేయమనండి అది మాకు చిటికెలో పని.. సొసైటీ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించమని మీరు చెప్పకపోయినా ఇన్నేళ్లూ మేము చేస్తున్నది అదే అంతే తప్పా.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)కి సర్వసభ్య సమావేశం పెట్టండి.. లెక్కలు చెప్పండి.. ఎందుకు సభ్యులకు తెలీకుండా విషయాలను దాచిపెట్టారు.. అని అడిగితే మాత్రం బాగోదు అంటోంది అనధికార కార్యవర్గం..!. నిజంగా ఇవన్నీ చేసేవాళ్లమే అయితే 2016ఒకటి, 2018లో ఒకటి 2 కోర్టు కేసులు డిస్ మిస్ అయిపోయిన తర్వాతే సర్వసభ్య సమావేశం పెట్టేవాళ్లం కదా..? మాకు తెలీకే ఇన్నేళ్లు ఆ సమావేశం పెట్టకుండా ఊరుకున్నామా..? సొసైటీ నిబంధనలు పాటించేవాళ్లమే అయితే ఇన్నిమాటలు మీతో ఎందుకు పడతాం చెప్పండి..? మాకు విజెఎఫ్ అన్నా.. ఇక్కడి పదవులన్నా చాలా ఇష్టం. ఒక పట్టాన వదిలేసి పొమ్మంటే ఎలా..? ఏదో 12ఏళ్లపాటు మిమ్మల్ని అందరినీ ఏదో చిన్న మోసం చేసినందుకు దీన్నె అంటిపెట్టుకొని మా కార్యకలాపాలు చేస్తున్నవారిని అనర్హులుగా ప్రకటిస్తామంటే ఇది పద్దతిగా ఉంటుందా..? మేమంతా మాకోసం గానీ ఇన్నేళ్లూ పదవుల్లో ఉన్నామా..? ఎంతో శ్రమకోర్చి..కష్టపడి కోర్టుకేసుల నెపంతో కాలం గడుపుకొచ్చాం.. కేసులు ఉన్నాయనే విషయాన్ని వాస్తవంగా చెప్పాల్సిన బాధ్యత కాలంచెల్లిన కమిటీగా మాపై ఉన్నా చెప్పలేదు.. ఇదంతా ఎందుకు చేశామో మీకు ఇప్పటికీ తెలియకపోతే ఎలా అంటూ ఎదురు దాడిచేస్తోంది ప్రస్తుత అనధికార కార్యవర్గం...! అవును వాళ్లు చేస్తున్న వాదనలోనూ వాస్తవం ఉంది. ఇన్నేళ్లు మాట్లాడని వారంతా ఇపుడే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఎన్నికలు ప్రకటించడానికి 3 నెలల ముందు నుంచే నార్లవెంకటేశ్వర భవన్, డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ కి రంగులు అద్దె కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నామో మీకు తెలియదా..? ఇన్ని తెలిసిన మీరు ఏ మొహం పెట్టుకొని సర్వసభ్య సమావేశం, లెక్కలు కోసం అడుగుతున్నారో అర్ధం కావడం లేదని గెక్కెట్టి మరీ ఏడ్చేలా చేస్తున్నారంటూ తెగ బాధ పడుతున్నారు కాలం చెల్లిన కార్యవర్గ సభ్యులు..

ఏంచేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ అధికారుల విచారణలో ప్రైవేటు లాయర్ ను తీసుకెళ్లడం మా తప్పా..? ఆమాత్రం ఆత్మరక్షణ, ఎదురుదాడిని తట్టుకునే స్వాతంత్ర్యం కూడా మాకు లేదా...? ఇన్నేళ్లపాటు సభ్యులందరికీ తెలియకుండా, మా అనధికార కార్యవర్గం విజెఎఫ్ ఖర్చుల చిట్టా ఒకేసారి చార్టెడ్ అకౌంటెంట్ తో మా ఆమోదంతోనే చేయించుకున్నాం.. మా ఆమోదంతోనే జాయింట్ సెక్రటరీని మూడు సమావేశాలకు పిలవకుండా ఆయన పేరుని కార్యవర్గం నుంచి, విజెఎఫ్ లెటర్ హెడ్ నుంచి తప్పించేశాం..అలా చేసుకునే అవకాశంగానీ, బయిలాలో నిబంధన పాటించి(మూడు సమావేశాలకు రాకపోతే) కావాలనే తప్పించే అవకాశం కూడా మాకు ఇవ్వరా..? ఇదెక్కడి న్యాయమండీ.. ఇన్ని చేసిన మాకు నిబంధనలు తెలియవంటారా..? మాకూ నిబంధనలు తెలుసు..? సర్వసభ్య సమావేశం పెట్టాలని కూడా తెలుసు.. అలా చేసి, ఖర్చుల చిట్టా ప్రకటిస్తే ఆ సమయంలో మాపనేంటో కూడా మాకు తెలుసు.. అందుకే కదా ఇన్నేళ్లపాటు కోర్టుకేసులు, కోవిడ్ నెపంతో ఉండిపోయాం...! ఇంత చేసిన మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఏదో మీకోసం 12ఏళ్లపాటు ఉండిపోయినందుకు ఇన్నేళ్ల లెక్కలు ఒకేసారి చెప్పాలంటే మాకు మాత్రం సమయం వద్దా..? అందుకనే జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున మా అనధికార కార్యవర్గంపై విచారణ వేసినపుడు.. కేవలం 2020 వరకూ మాత్రమే రెవిన్యువల్స్ చేయించిన సంఘం రిజిస్ట్రేషన్ కాపీ చూపించాం... ఇంకా మూడేళ్లు ఉండిపోయింది.. దానిని కూడా చేయించాలని చూశాం..మావల్ల కాలేదు. ఆమాత్రం దానికి విజెఎఫ్ నుంచి మమ్మల్ని పొమ్మంటే మేము ఏమైపోవాలి..? మీ అందరి కోసం ప్రతీ ఏదాది ప్రెస్, జర్నలిస్టు పనులను మానుకొని మరీ చందాలు, విరాళాలు, స్పాన్సర్ షిప్పుల కోసం తిరిగిన మా కష్టాన్ని గుర్తించకపోవడం చాలా శోచనీయం. మీరడిగినవి ఏమీ మేము చేయము.. జిల్లా కలెక్టర్ విచారణ నివేదిక కూడా మాకోసమే వాయిదాలు పడుతూ వస్తోంది. కాలం మాకు అలా కలిసి వస్తోంది. లెక్కలు, అందులోని బొక్కలూ చెప్పేది లేదు..ఇష్టం ఉంటే ఎన్నికలు పెడతాం..లేదంటే కలెక్టర్ కమిటీ నివేది వచ్చేంత వరకూ ఎన్నేళ్లయితే అన్నేళ్లూ కష్టపడి మళ్లీ మేమే ఉండిపోతాం. 

ఏం ఇన్నేళ్లు సభ్యులందరినీ మోసం గడిపేసిన మాకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వరా..? ఇదేనా సాటి జర్నలిస్టులకు మీరిచ్చే గౌరవం(ఇందులో జర్నలిస్టులు ఎంతమందున్నారు..?) సొసైటీ నిబంధనలు అంటే ఏంటో మాకు తెలీకనే వాటిని తుంగలోకి తొక్కామా..? ఏం సర్వసభ్య సమావేశం పెట్టాలని మాకు తెలీకే.. ప్రతీ ఏటా అన్ని కార్యక్రమాలు చేసేమేము సర్వసభ్య సమావేశం పెట్టకుండా దానాని తెలివిగా దాటవేసుకుంటూ వచ్చామా..? ఎప్పుడు ఏ పని ఏవిధంగా చేసి మిమ్మల్ని బురిడీలును చేయాలో మాకు తెలీదా చెప్పండి..? మీరూ కూడా కాస్త అర్ధం చేసుకోవాలి.. పనిచేసేవారు ఎవరు? పనిగట్టుకొని విజెఎఫ్ ను అంటిపెట్టుకున్నవారెవరు..? ఎందుకు ప్రభుత్వం నిబంధనల పట్టించుకోకుండా సొసైటీని నియమ, నిబంధనలు తుంగలోకి తొక్కిందెవరు..? ఇన్నేళ్లూ పరిపాలించేసినా.. ఇంకా పదవుల కోసం, నార్లభవన్ లోని రెండు అంతస్తులను సొంత అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నవారెవరు..? దానికోసం కుల, మత, వర్గ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్నవారెవరు..? ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా..? విజెఎఫ్ సభ్యులుగా మా అనధికార కార్యవర్గం ఏం చేసిందో, ఎలాంటి సంక్షేమం చేసిందో.. దానిని అడ్డం పెట్టుకొని ఎలా ఎదిగిందో.. అంతకంటే చక్కని రాజకీయం ఎలా చేసిందో మీకు తెలుసు. మంచి మనసుతో ఆలోచించండి..? మాకు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వండి..? అంతే తప్పా సర్వసభ్య సమావేశాలు, ప్రతీఏటా చేసిన ఖర్చులు, సొసైటీ నిబంధనలు, కాలంచెల్లిపోయిన పదాలు వాడొద్దు.. మాకు మనసులేదా..? మీరు ఇన్నేసి మాటలు అంటున్నా మాకు పట్టనట్టు ఎందుకుండిపోతున్నామో కూడా మీరు గుర్తించలేకపోతున్నారు..? అలాగని జిల్లా అధికారులు సైతం ఎందుకు మేము చేసిన తప్పులను కూడా వెంటనే ప్రకటించలేదో కూడా మీకు తెలుసు.. ఇన్ని తెలిసిన మీకు మళ్లీ మళ్లీ మాకే అవకావం కల్పించాలని మీకు తెలీదా..? మాకు మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరా..అలా అయితే మేము ఏమైపోతాం..? విజెఎఫ్ నే నమ్ముకొని పెట్టుకున్న మా లక్ష్యాలు నీరు గారీపోవడమేనా..?  మేము మాత్రం ఇంతకంటే ఏం చెప్పగలం.. ఎందుకంటే ఇలాంటి తేడా ఆలోచనలు ఊరకనే రావు.. విజెఎఫ్ లాంటి ఒక కల్ఫ వృక్షం ఉంటే తప్పా.. మీరంతా మంచి జర్నలిస్టులు.. తప్పులను ఎత్తిచూపే వారి మాటలను ఏ మాత్రం నమ్మొద్దు..మాపై మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా.. మళ్లీ మళ్లీ మాకోసం మాత్రమే ఆలోచించండి.. ఇంతకన్నా మేము మిమ్మల్ని ఏమీ అడగము.. అడగలేము..?!

Visakhapatnam

2023-05-15 02:50:45

రాజకీయాలను తలపిస్తున్న VJF ప్రెస్ క్లబ్ ఎన్నికలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అధికారపార్టీ చేపట్టిన ట్టు మెరుపుల కార్యక్రమాలు చేపడుతున్నారు. 12ఏళ్లపాటు సొసైటీ చట్టానికి విరుద్ధంగా, ఒక్క సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించకుండా కోర్టు కేసుల నెపంతో కాలం గడిపేసిన కాలంచెల్లిన కార్యవర్గం ఎన్నికల ప్రకటించగానే అభివృద్ధి కార్యక్రమాలకు తెరలేపారు. ఆగమేఘాలపై డాబాగార్డెన్స్ లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు ఫైబర్ బోర్డులు పెట్టించడం, సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్ కి మరమ్మతులు చేపట్టి..డిజి టల్ డయాగ్రామ్ లను వాట్సాప్ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజంగా విజెఎఫ్ పై అనధికార కార్యవర్గానికి అంత సచ్చీలతే వుంటే పద వీకాలంలో ఎప్పుడైనా చేపట్టవచ్చు. కానీ అనధికార కార్యవర్గం చేపడుతున్న అప్రజాస్వామిక వ్యవహారాలను సంఘం సభ్యులే తిరుగుబావుటా ప్రకటించి ఎదురు తిరిగిన వెంటనే చేయడం మొదలు పెట్టారంటే ఈ అనధికార కార్యవర్గానికి ఇంకా పదవులపై ఎంత వ్యామోహం ఉందో తెలుసుకోవచ్చు. నిజంగా ఈ అభివృది ఆదిలోనే చేసి ఉంటే ఇప్పటికే విజెఎఫ్ ఆస్తులు, ఆదాయం రెట్టింపు అయ్యేవి ఈ 12ఏళ్లలలో.  గత పాలక వర్గాలు విజెఎఫ్ ఆస్తులను, ఆదాయాలను పెంచితే..ఈ పాలక వర్గం మాత్రం అప్పులను మిగిల్చింది. వాస్తవానికి డాబాగార్డెన్స్, సీతమ్మధారలోని నార్లవెంకటేశ్వర భవన్ లోని గ్రౌండ్ ఫ్లోర్అద్దెలు, పక్కనే వున్న షాపుల ఆద్దెల ద్వారా ఏడాదికి రూ.లక్షల్లోనే ఆదాయం వస్తుంది. పైన ఉన్న అంతస్తు అద్దెకిస్తే.. దాని ద్వారా మరికొంత అద్దెరూపంలో ఆదాయం వచ్చేది. కానీ కార్యవర్గంలోని ఒకరి సౌలభ్యం కోసం అక్కడ డాన్సు శిక్షణకు, సొంత కార్యక్రమాలకు దానిని వినియోగించుకుంటున్నారు.

ఇంత కాలంలేని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే ఎందుకు చేయిస్తున్నారని విజెఎఫ్ సభ్యులు ప్రశ్నిస్తే.. ఆ ఒక్కటీ అడక్కూడదు మీరం తా... ఏం 12ఏళ్ల పాటు, కోర్టుకేసుల నెపంతో మోసం చేసినా, కనీసం సర్వసభ్య సమావేశాలు పెట్టకపోయినా, ప్రతీ ఏటా తమ ప్రచారం కోసం కార్యక్రమాలు చేస్తున్నా.. అప్పుడు మాట్లాడని వారు ఇపుడెందుకు మాట్లాడుతున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు ప్రస్తుతం కాలంచెల్లిన కార్యవర్గ సభ్యులు. మేం చేసిందే కార్యక్రమం, మేము పెట్టాలనుకుంటే సర్వసభ్య సమావేశం పెడతాం..ఒక వేళ అలా సొసైటీ నిబంధనలు పాటించకపోయినా.. మా తప్పులను వెనుకేసుకు వచ్చే సీనియర్ జర్నలిస్టులు, సానుభూతి పరులు మా వెనుకే పెద్ద సంఖ్యలోనే ఉన్నారనే ప్రచారం సైతం తమ వెనునున్నవారితో సోషల్ మీడియాలో ఊదర గొడుతున్నారు.  ఇక దాతల నుంచి వచ్చిన విరాళాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.. కనీసం విజెఎఫ్ పై భవనాల ద్వారా వచ్చిన అద్దెలు, ఆదాయాలు ఏమయ్యాయో అసలే తెలీదు.. కానీ 12ఏళ్లలో విహార యాత్రలు మాత్రం అనధికార కార్యవర్గం క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నది ఈ అధికారం లేని పాలకవర్గం. సమయం దాటిపోయినా.. కోర్టు కేసుల విషయంలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కని వారు కోర్టు 2 కేసులను ఒకటి 2016లోనూ, మరొకటి 2019లో డిఫాల్ట్ డిస్ మిస్ చేస్తే..తీర్పు విజెఎఫ్ కి అనుకూలంగా వచ్చిందని సభ్యులను దారుణంగా మభ్యపెట్టారంటే వీరి పదవీ కాంక్షకు కోర్టు కేసులను కూడా ఏవిధంగా వాడుకున్నారో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదంతా రాజకీయపార్టీలు చేస్తున్న కార్యక్రమాల కంటే దారుణంగా చేపడుతుండటం విశేషం.

ఏ కార్యవర్గం విజెఎఫ్ ను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా దానిని సభ్యులంతా స్వాగతించాలి.. అభినందించాలి.. కానీ విజెఎఫ్ పై వచ్చిన ఆదాయాన్ని దాతల దగ్గర నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చులు క్రింద చూపించేయడంతోపాటు, ఇంకా అప్పులు చూపించడమే ఇపుడు సభ్యులందరికీ చిర్రెత్తుకొస్తున్నది. ఆ విషయాన్నే సర్వసభ్యసమావేశం పెట్టి ఆదాయ వ్యవయాల లెక్కలు చెప్పమంటే మాత్రం ప్రస్తుత అనధికార కార్యవర్గం ఏమీ పట్టనట్టు..అసలు అలాంటివేమీ తమకు తెలియనట్టు.. ఇంకా మాట్లాడితే ఎందుకు సర్వసభ్య సమావేశాలు పెట్టాలన్నట్టు బీరాలు పోతున్నారు. తాము చేసింది అభివృద్ధి కాదా..సభ్యుల సంక్షేమం కోసమే అప్పులు చేశాం తప్పితే తమ సొంత ప్రయోజనాలకా అంటూ ఎదురుదాడి చేస్తోంది. విషయాన్ని, సదకు అప్రజాస్వామిక కార్యవర్గం చేస్తున్న తేడా తనాన్ని సభ్యులకు తెలిసేలా చైతన్యం చేస్తున్న తరుణంలో కొందరి చేత ఫోన్లు చేయించి తిట్టించడం, మరికొందరితో సోషల్ మీడియాలో వార్నింగ్ ఇప్పించడం, కులసంఘాలను ఈ విజెఎఫ్ ఎన్నికల్లోకి దించి వారికి ఫోన్లు చేసి..ఎదురు తిరిగేవారందరికీ కాలో చేయో తీయించేస్తామని, వారి అంతు చూస్తామని చెప్పడం తదితర వ్యవహారాలన్నీ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. అసలు ఇంత దారుణంగా విజెఎఫ్ పరువు తీసిన ఈకాలంచెల్లిన కార్యవర్గానికి, 12ఏళ్లపాటు ఏకబిగిన సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించాలని మెజారిటీ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విజెఎఫ్ అనధికార పాలకవర్గం వ్యవహార శైలిపై త్రిసభ్య కమిటీ వేసిన జిల్లా కలెక్టర్ నివేదిక ను కూడా ప్రకటించే అవకాశం వుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!


Visakhapatnam

2023-05-12 06:53:51

విశాఖలో ఉత్కంఠ.. విజెఎఫ్ పై 12న వచ్చే నివేదిక అదేనా..?!

విశాఖలోని జర్నలిస్టుల్లో ఉత్కంఠ కట్టలు తెంచుకుంటోంది.. వైజాగ్ లో ఏఇద్దరు జర్నలిస్టులు తారసపడినా ఇదేటాపిక్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)పై జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఏం తేల్చబోతుందనేది. 12ఏళ్లుగా విజెఎఫ్ అనధికార, కాలం చెల్లిన కార్యవర్గం సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన విధానా లపై జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుమేరకు కలెక్టర్ కమిటీ వేయడం, అధికారులు రిపోర్టు తయారుచేయడం జరిగిపోయాయి. కాకపోతే నాటి నుంచి నేటి వరకూ కలెక్టర్ ఆని వేదికను ప్రకటించలేదు. ఇటీవలే ముదపాకలో కలెక్టర్ ను కలిసిన మీడియా విజెఎఫ్ విచారణ నివేదిక ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా,12న ప్రకటిస్తామని చెప్పారు. దీనితో ఆనాటి నుంచి ఆ ఉత్కంఠ మరింత ఎక్కువైపోయింది ఇటు జర్నలిస్టులు, అటు కాలంచెల్లిన కార్యవర్గంలో కూడా. అయితే కమిటీ విచారణ తరువాత చాలా రకరకా లపుకార్లు షికార్లు చేశాయి. ఈసమయంలో కొందరు ఫోన్లుచేసి విజెఎఫ్ సభ్యులను ఫోన్లలో బండబూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటం, కులసంఘాలను, ప్రజాప్ర తినిధులతో తెరచాటు సంప్రదింపులు చేసినా ఫలితం లేకపోయింది.12న నివేదిక విడుదలకానుంది..!

Visakhapatnam

2023-05-10 17:11:11

ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు..

మనమంతా ప్రజా సేవకులమని, ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం ఉదయం  కలెక్టరేట్‌లోని సమావేశ  మందిరంలో స్పందన ,రీ సర్వే, మ్యుటేషన్లు , భూ సేకరణ , యు ఎల్ సి భూములు తదితర రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ‌తో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌ మాట్లాడుతూ భూ హక్కు పత్రాల బదిలి ,  మ్యుటేషన్ కరెక్షన్  వంటి చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇంత దూరం వస్తున్నారంటే మండల లెవెల్ లో  సిబ్బంది  సరిగా పనిచేయడం లేదని  అర్థమవుతోందన్నారు. స్పందన అర్జీల్లో రీ రీఓపెన్ కాకుండా పరిష్కరించి , ఈ సంఖ్య పూర్తిగా తగ్గాలని ఆయన ‌ స్పష్టం చేశారు. టూరిజం ప్రాజెక్టులకు భూమి సమస్యలు లేకుండా వేగవంతం చేయాలనీ ఆదేశించారు .

ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకొని జీవో నెం. 388, 301 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన రిజిస్ట్రేషన్ , పట్టాలో మార్పులు , చేర్పులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు . పట్టాలు పొందినవారు, సగం డబ్బు కట్టిన వారు,  ఇంకా పూర్తిగా డబ్బు కట్టని వారిని తహసిల్దార్లు సచివాలయాల ద్వారా  ప్రోత్సహించి ధరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. 150 చదరపు గజాల కు పైబడి యు ఎల్ సి భూములలో ఇండ్లు నిర్మించుకున్న యజమానులు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. జిల్లాలో ప్రజలకు సంబంధించి పెండింగ్ సమస్యలలో భూములకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని, స్పందన ద్వారా వచ్చే ప్రతి అర్జీను తహసీల్దార్లు , సర్వేయర్లు , వార్డు సచివాలయ సిబ్బంది  క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన అర్జీల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే ప్రజల యొక్క సమస్యలను అత్యంత శ్రద్ధతో పరిష్కరించి జిల్లాను ముందు వరసలో ఉంచాలని అన్నారు.  మోచా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎస్ శ్రీనివాస్ మూర్తి, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, భీమిలి ఆర్డివో భాస్కర్ రెడ్డి , ఎడి సర్వే విజయకుమార్ , ఎస్డీసీలు తహసీల్దార్లు ,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-05 11:20:02

VJFఅనధికార కార్యవర్గాన్ని తక్షణమే రద్దుచేయాలి

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం( వీజేఎఫ్- ప్రెస్ క్లబ్) అనధికార కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ శనివారం వీజేఎఫ్ సభ్యుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ .మల్లికార్జునకు ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనధికార కార్యవర్గం చేపట్టిన సభ్యత రెన్యువల్ ,నూతన సభ్యత్వం నమోదు చెల్లుబాటు కాదని అర్హులైన సభ్యులందరికీ సభ్యత్వ నమోదుకు ఐదుగురితో కూడిన కమిటీని వేసుకోవాలని మెజారిటీ సభ్యులు భావిస్తున్నారని, అనంతరం అధికారుల సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహణకు సహకారం అందిం చాలని కలెక్టర్ ను ప్రతినిధులు కోరింది. 2015లో జరగాల్సిన కార్యవర్గ ఎన్నికలు కోర్టు ఇంజక్షన్  వల్ల సంవత్సర కాలం నిలిచిపోయా యని ఈ కేసు ఓ పి నెంబర్ 661 /2015 ను 2016 లోని కోర్టు  కొట్టివేసిందని  అప్పటినుండి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవని కలెక్టర్ తెలిపారు. ఇంకా కేసులు ఉన్నాయంటూ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపూరితంగా గత ఏడేళ్లుగా అనధికారకంగా కార్యవర్గం కొనసాగుతుందని వివరించారు. 

వీజేఎఫ్ బైలా ప్రకారం రెండేళ్లకు ఒకసారి  ఎన్నికలు ,ప్రతి ఏడాది సర్వసభ్య సమావేశం నిర్వహించి కార్యక్రమాలను నివేదిక , జమా ఖర్చుల వివరాలు సభ్యులకు అంద అందజేసి సమావేశం ఆమోదం పొందాలన్నారు ఈ నిబంధనలను కార్యవర్గం పాటించలేదని కలెక్టర్ కు చెప్పారు. సంస్థకు వస్తున్న ఆదాయం ,డొనేషన్లు వివరాలు సభ్యులు చెప్పకుండా రహస్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యపై  ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేశామని అనివేదిక తమకు చేరిందని తెలిపారు. నివేదిక పరిశీలన అనంతరం చర్యలు చేపడతామని త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. కలెక్టర్ ను కలవడానికి ముందు కలెక్టరేట్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు .అనధికార  కార్యవర్గం  దిగిపోవాలని,  జరుగుతున్న అక్రమాలపై న్యాయ విచారణకుజరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

  ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఎన్. వర్మ, బి. రవికాంత్ ,ఎల్ ,జి, నాయుడు ,బంటయ్య, సూర్యం , వాసు, కుర్ర విజయ్ కుమార్, ఈశ్వర్ చౌదరి ,పి సత్యనారాయణ, సూర్యం, కీర్తన ,బి. ఏ. నాయుడు, హరనాథ్ ,చక్రవర్తి ,నరసింహం,,శ్రీనివాసరావు,కుమార్ ,కిరణ్ ,దొండా రమేష్,ఎస్వీ రమణ ,గౌతమ్ , ఎం .శ్రీహరి ,పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-29 17:01:30

అనకాపల్లిలో 80% పూర్తైన జగనన్నే మా భవిష్యత్తు

జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గంలో 80% పూర్తిచేసినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. శనివారం అనకాపల్లిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దంతులూరి దిలీప్ కుమార్ కలిసి ఆ యన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. మ ళ్లీ గుడివాడ అమర్నాధ్ నే ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనే మాట ప్రతీ ఒక్కరి నుంచి పెద్దఎత్తున వస్తుందన్నారు. వైెఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడం తోపాటు మద్దతు కూ డా పొందామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పొందిన వారు ప్రభుత్వం సూచించిన నెంబరుకి మిస్డ్ కాల్స్ కూడా తమ మద్దతుని తెలియజేశా రని చెప్పారు. మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, గైపూరు రాజు, జాజుల రమేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Anakapalle

2023-04-29 07:02:52

నూకాంబిక అమ్మవారి ట్రస్టుబోర్డుని నియమించండి

 అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దేవస్థానం ట్రస్టు బోర్డు నియమకానికి మొక్కుబడి ప్రకటన కాకుండా పూర్తి వివరాలతో సమగ్ర ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేయా లని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కో`ఆర్డినేటర్‌, సమాచార హక్కు, వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ గురువారం ఒక ప్రటకనలో డిమాండ్‌ చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ట్రస్టు బోర్డు నియామకం కోసం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వు (నెం. ఎ1/396/2023 తేది : 25-4-2023) అసం పూర్తిగా, ఆక్షేపనీయంగా ఉందని విమర్శించారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌లకు లేఖ వ్రాసినట్టు పేర్కొన్నారు. ఏటా రూ. 4 కోట్లు ఆదాయం సమకూరుతున్న దేవస్థానానికి ట్రస్టు బోర్డును నియమించాలని ఏడాదిగా ఆర్టీఐ చట్టం (కేసు నెం. 19032/ఎస్‌ఐసీ-ఆర్‌ఎస్‌ఆర్‌/2022) ద్వారా చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షనీయమన్నారు. అయితే తాజాగా వెలువడిన ఉత్తర్వులో ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య, అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు నమూనా, చిరునామా తదితర వివరాలు లేకుండా మొక్కుబడిగా ప్రకటన జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్దేశపూర్వకంగా సాంకేతిక సమస్యలు సృష్టించి ట్రస్టు బోర్డును నియమించకుండా కాలయాపన చేసే దురుద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులా ఉందని వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు.

                ఆచార వ్యవహారాలు, ఆగమశాస్త్రంపై అవగాహన ఉన్న అర్హులను మాత్రమే ధర్మకర్తలుగా నియమించాలని ఆయన కోరారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టం 30/1987లోని సెక్షన్లు 13, 15, 17, 18, సవరణ చట్టం 8/2014, 31/2019, ప్రభుత్వ సర్య్కులర్లు (నెం.42 తేది : 8-12-2001)కు విరుద్దంగా జరిగిన ట్రస్టు బోర్డు సిఫార్సులు, నియామకాలకు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలని వెంకటరమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

                ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి 10 దేవస్ధానాల్లో ఒకటిగా, ఆదాయం ప్రాతిపాదికన 6`ఎ2 దేవస్థానంగా గుర్తింపు పొందిన శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్ధానానికి గత 8ఏళ్లుగా ట్రస్టు బోర్డు నియామకానికి నోచుకోకపోవడం ‘స్ధానిక’ పాలకుల వైఫల్యమని ఆయన దుయ్యబట్టారు. 2019లో ట్రస్టు బోర్డు నియామకం కోసం ప్రభుత్వ ఉత్తర్వు (ఆర్టీ నెం. 986 రెవిన్యూ (ఎండోమెంట్స్‌-11) డిపార్ట్‌మెంట్‌ తేది : 30-9-2019) ప్రకారం స్వీకరించిన దరఖాస్తులు ఏమైనట్టు ఆయన నిలదీశారు. భక్తుల ఆదాయంతో నడుస్తున్న దేవస్ధానాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు జీతాలు పొందుతూ ట్రస్టు బోర్డును నియమించకుండా జాప్యం చేస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకోవాలని కాండ్రేగుల వెంకటరమణ ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

Anakapalle

2023-04-27 10:53:23

చేపలవేట సమయంలో రక్షణ చర్యలు తప్పక పాటించాలి

మత్స్యకారులు సముద్ర జలాల్లో వేటకు వెళ్లే సమయంలో రక్షణ చర్యలు ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణ రక్ష జరుగుతుందని విజయ నగరం జిల్లా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎం. నిర్మల కుమారి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం క్రింద 30 మంది సముద్ర మత్స్యకారులకు “సముద్ర రక్షణ పరికరాలు మరియు భద్రత” అనే అంశంపై ౩ రోజులపాటు ఫిష్ సీడ్ ఫారం లో నిర్వహించి న నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను మత్స్య కారుల సద్వినియోగం చేసుకొని లబ్దిపొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించాల్సిన రక్షణ చ ర్యలు, ఆ సమయంలో ఉపయోగించాల్సిన పరికరాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా  తమ తమ గ్రామాల లో మిగిలిన ఇతర మత్స్యకారులకు తెలుసుకున్న విషయాలను చెప్పాలన్నారు. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించాల్సిన రక్షణ పరికరాల వివరాలు, వాటి వినియోగంపై విశాఖపట్నం సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నాటికల్ అండ్ ఇంజ నీరింగ్ ట్రైనింగ్ యునిట్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈ  శిక్షణా కార్యక్రమంలో జిల్లా మత్స్యాకార సహకర సంఘం అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న, సిఐఎఫ్ట టి  ప్రతినిధులు డా. ఎం.ఆర్. మహాదేవ్ కొంకణి, అభిషేక్, నిశిత్, ఎఫ్డీఓ యు.చాందిని,  ఇతర మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-27 08:05:26

విశాఖజిల్లాకు వసతి దీవెన రూ.41.17 కోట్లు

జగనన్న వసతి దీవెన క్రింద రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో  41.17కోట్ల రూపాయలు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా, నార్పల లో ఏర్పాటు చేసిన బహిరంగ  సభలో పాల్గొని ముఖ్యమంత్రి వె.యస్.జగన్మోహన్ రెడ్డి వర్చు వల్ విధానం ద్వారా 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో సీఎం ప్రారంభించగా, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య మంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం విశాఖపట్నం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా రూ.41,17,45,000 మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున ప్రజా ప్రతినిధులతో  తో కలిసి లబ్ధిదారులకు  అందజేసారు. 

తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్ధులకు స్కాలర్ షిప్లు లభించాయని తెలిపారు.  విశాఖపట్నం జిల్లాకు 43,938 మంది విద్యార్ధులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో 41.17 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో 4,238 మంది ఎస్.సి విద్యార్థులు వారి తల్లుల  ఖాతాల్లో 3.95 కోట్ల రూపాయలు, 168 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో 15.52లక్షలు, 38,109 మంది బి.సి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.35.72 కోట్లు, 1,423 మంది మైనారిటీ  విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.1.34 కోట్ల  రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు వసతి  దీవెన కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయం లో ఉండే సంబంధిత అధికారులకు తెలియజేసినట్లు అయితే  వారు పరిష్కరిస్తారన్నారు.

   జిల్లా నుండి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.యస్ విశ్వనాథన్, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణ మూర్తి, జిల్లా బి. సి సంక్షేమాధికారి శ్రీదేవి, డిసిఎంఎస్ చైర్ పర్సన్ పల్లా చిన్నతల్లి, నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిళ్ళా సుజాత , రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ , యాత కార్పొరేషన్ చైర్ పర్సన్ పిళ్ళా సుజాత నూకరాజు , నాగవంశం సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ అప్పలకొండమ్మ ,   పలువురు విద్యార్థులు పాల్లొన్నారు.

Visakhapatnam

2023-04-26 15:13:01

చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్పాహార వితరణ

విశాఖలోని చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బాలక్రిష్ణ నిరాశ్రయులైన రోడ్డుప్రక్క అనాధలకు అల్పాహారం వితరణ కార్య క్రమం చేపట్టారు. ఈ మేరకు మంగళవారం విశాఖలోని  రైల్వేస్టేషన్ కి వెళ్లేదారిలోని దొండపర్లి ఫ్లై ఓవర్ క్రింద ఉన్న 50మందికి పెరుగువడ, నేతి వడలు, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాపా బాలక్రిష్ణ మీడియాతో  మాట్లాడుతూ, నిత్యం నిరుపేద భక్తులను కాశీ యాత్రకు ఉచితంగా తీసుకెళ్లి వస్తుంటామని, ఆ సందర్భంలో యాత్రముగించుకొని వచ్చిన తరువాత ఇలా అన్నదాన సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆశ్రమంలోని భక్తులతోపాటు, రోడ్డుప్రక్కన నిరాశ్రయులైన వారికి కూడా తమ ట్రస్టుద్వారా ఆహారాన్ని అందిస్తుంటా మని చెప్పారు. ఇదేరోజు ఆశ్రమంలో కూడా 50 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిపిట్టు వివరించారు. ఆ పరమశివుని కరుణతో తన వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

Visakhapatnam

2023-04-25 13:29:39

మిస్సింగ్ కేసులపై తక్షణమే దృష్టిసారించండి

మిస్సింగ్ కేసులు, సాధారణ మరణాలు (174 సి.ఆర్.పి.సి), ఫోక్షో కేసులను పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మురళీ కృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి, దర్యాప్తు లో ఉన్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్షో కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి నిర్ణీత సమ యంలో చార్జ్ సీట్ వేయాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న నిందితులు పై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం ద్వారా పీ.డీ యాక్టు నమోదు చేయ డానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, తగాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు తో పాటు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం మరియు రోడ్డు భద్రత నియమాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.వేసవి కారణంగా రాత్రి సమయాలలో వేడిని తట్టుకోలేక చాలామంది ప్రజలు ఆరుబయట నిద్రిం చటం, ఇంటి తలుపులు తెరిచి ఆదమరిచి నిద్రించడం జరుగుతోందన్నారు. దొంగలు అదునుగా తీసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉ న్నందున ప్రజలు తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి పగలు గస్తీలలో అనుమానాస్పద వ్యక్తుల ను ఫిన్స్ పరికరం ద్వారా తనిఖీ చేస్తూ, సంబంధిత వ్యక్తికి నేరచరిత్ర తెలుసుకోవడం ద్వారా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్పందన ఫిర్యాదు దారుల సమస్యలు ప్రాముఖ్యతనిచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దత్తత గ్రామాల కానిస్టేబుల్స్, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల గ్రామాల నుండి వచ్చే సమాచారంపై అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయ భాస్కర్, అదనపు ఎస్పీ (క్రైమ్స్)  పి.సత్యనారాయణ రావు, అనకా పల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ  పి.శ్రీనివాసరావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ కె.ప్రవీణ్ కుమార్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, లక్ష్మణ్ మూర్తి, అప్పలనాయుడు, సతీష్ ఎస్సైలు  భీమరాజు, రఘువర్మ   జిల్లా సిఐలు , ఎస్సైలు ఈసమా వేశంలో పాల్గొన్నారు.

Anakapalle

2023-04-25 12:17:48

భూ సర్వేపనులు సత్వరమే పూర్తిచేయాలి

భూ సర్వే పనులు నిర్ణీత  కాలవ్యవధిలో పూర్తి చెయ్యాలని  రెవెన్యూ డివిజనల్ అధికారులు,మండల తాసిల్దారులను జాయింట్ కలెక్టర్ కే ఎస్  విశ్వనాథన్ ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్  సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తాసిల్దార్లుతో జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ రెవిన్యూ  శాఖ పనులపై   సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశం లో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీసేవ, ఏపీ సేవ, స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చే దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏపీఐఐసి, ఎన్ హెచ్ 16, రైల్వేస్ భూములకు సంబంధించి మ్యుటేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. , రీ సర్వే పనులు నిర్ణీత కాల వ్యవధి లో పూర్తి చేయాలని అధికారులకు  ఆదేశించారు.  

ఈనెల 26 నుండి మే25 వరకు  నెల రోజులు పాటు  మండల తాసిల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజలు  భూపట్టాలకు సంబంధించి సవరణలు చేసుకోవచ్చన్నారు. గాజువాక హౌసింగ్ కి సంబంధించి జీవో  నెంబరు 301 మరియు,388 పై ప్రజలకు సచివాలయ సిబ్బంది ద్వారా  అవగాహన కల్పించాలని అన్నారు . పంపిణీకి సిద్ధంగా ఉన్న భూ పట్టాలను ప్రజలకు వెంటనే అందించాలన్నారు .   సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసి భూములకు సంబందించిన పనులు , స్పందన వినతులు  పరిష్కరించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   డిఆర్వో శ్రీనివాసమూర్తి , భీమిలి ఆర్డిఓ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్  సర్వే విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఈశ్వరరావు,ఎస్ డి సీలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-04-25 11:34:30

కీట‌క జ‌నిత వ్యాదుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

కీట‌క జ‌నిత వ్యాదుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని  ఐటిడి ఏ  పిఓ  వి. అభిషేక్ అన్నారు.మ‌లేరియా నివార‌ణ మనంద‌రిపైనా ఉంద‌న్నారు. మంగ‌ళ‌వారం  ప్ర‌ప్రంచ మ‌లేరియా దినోత్స‌వం సంద‌ర్బంగా స్థానిక అంబేడ్క‌ర్ కూడ‌లి వ‌ద్ద మ‌లేరియా నివార‌ణ‌పై అవ‌గాహ‌నా ర్యాలీని ఆ య‌న జెండా ఊపి ప్రాంభించారు. ఈ సంద‌ర్భంగా పి ఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల‌లో మ‌లేరియా నివార‌ణ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిం చాల‌న్నారు. దోమ‌ల పెరుగుద‌ల‌ను అరిక‌ట్ట‌డానికి  డ్రైడేల‌ను ప‌క్కాగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఇంటి ప‌ర‌స‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ఎక్క‌డా నీటి నిల్వ‌లు లేకుండా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు.శుక్ర‌వారం , సోమ‌వారం, బుధ‌వారాల‌లో డ్రైడే పాటించాల‌ని స్ప‌ష్టం చేసారు.  ఏదో ఒక ప‌నిచేసామ‌ని కాకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌క్కాగా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డితే ప్ర‌జ‌ల‌ను మ‌లేరియా బారిన ప‌డ‌కుండా కాపాడ‌వ‌చ్చ‌ని అన్నారు. దోమ తెర‌ల వినియోగంపై గిరిజ‌నుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పేర్కొన్నారు.  అనంత‌రం  ర్యాలీని అంబేడ్క‌ర్ కూడ‌లి నుండి  ఐటిడి ఏ  కార్యాలయం వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ  కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌లేరియా అధికారి సాంబ‌మూర్తి, వైద్య సిబ్బంది, మ‌లేరియా సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Paderu

2023-04-25 11:23:07