1 ENS Live Breaking News

కులగణనపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ

అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేటి  మధ్యాహ్నం 2:30గంటల అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు జిల్లా బి.సి., సంక్షేమ సాధికారత అధికారి కె. రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా రూపొందించడంతో పాటు అమలు చేయడం, సామాజిక విద్యా ఆర్థిక జీవనోపాధి జనాభా అంశాలకు సంబంధించిన కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రతి కుల, వర్గ, సామాజిక, విద్య, ఆర్థిక, అభివృద్ధి వారి ప్రస్తుత స్థితిని తెలుసుకుంటామన్నారు. అణగారిన వ్యక్తుల లేదా ఆ వృత్తులను అనుసరిస్తున్న వారి సమస్యలను తెలుసుకుని వారి అభివృద్ధికి మెరుగైన విధానాల అమలు వ్యూహాలను రూపొందించేందుకు,  సున్నితమైన సమస్యలపై చర్చకు వీలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 

సముచితమైన విధాన రూపకల్పన ద్వారా అట్టడుగు వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కార్యక్రమాల ద్వారా ఏ కుల సమూహాలు ప్రయోజనం పొందాయో తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టనున్నట్టు తెలియజేశారు. నిజమైన అర్హత కలిగి ఉండి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చనున్నామన్నారు. సామాజిక న్యాయం ద్వారా సమ సమాజాన్ని సాధించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను కులగణన కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితర ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర సంఘాల నాయకులు, మేధావులు, విరివిగా పాల్గొని తమ అభిప్రాయాలను సలహాలు సూచనలను తెలియజేయాలని ఆమె కోరారు.

Anakapalle

2023-11-15 11:41:22

విశాఖ స్టీల్ ఉద్యమాన్ని దేశ రాజధానికి తీసుకు వెళదాం: ఆడారి కిషోర్ కుమార్

 విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదిక గా ఉద్యమించి కేంద్రానికి విశాఖ ఉక్కు సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు  

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం 1000 రోజులు దాటిన సందర్భంగా బుధవారం విశాఖ స్టీల్ పోరాట శిబిరం వద్ద జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఆడారీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపి లు కచ్చితంగా ఉద్యమానికి అండగా నిలబడాలని ప్రకటించారు లేని పక్షంలో వాళ్లని ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి ఉద్యమానికి అండగా నిలబడతామని తెలియజేశారు.

ఢిల్లీ లో  వైజాగ్ స్టీల్ ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేస్తే. కేంద్రానికి వేడి పడుతుందన్నారు. తెలుగు వారితో పాటు, ఉత్తర భారత దేశ వాసుల మద్దతు కూడా లభిస్తుందన్నారు.

ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-11-08 14:13:19

ఎంవిఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై భారీ అంచనాలు..!

ఎంవిఆర్(ముత్యాల వెంకటేశ్వర్రావు).. ఈ పేరు చెప్పగానే ఇపుడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఒకే రకమైన భారీ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈయన రాజకీయ రంగప్రవేశంపై ప్రచారం తారాస్థాయికి చేరింది. దీనితో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు ఈయనను వారి వారి పార్టీల్లోకి రావాలని ఆహ్వానాలు పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంటెలి జెన్స్ నివేదికులు కూడా అన్ని రాజకీయపార్టీలకు చేరుతున్నాయి. దానికి కారణం ఒక్కటే అధికారం, ధనబలం, కులబలం,నెట్వర్క్ ఉన్న నేతలే ప్రజల కోసం ఆలోచి, ప్రజాప్రతినిధులు చేపట్టని సేవా కార్యక్రమాలు, ప్రజల్లోకి అతి తక్కువ కాలంలోనే వెళ్లిపోవడమే. తన సేవా కార్యక్రమాల కోసం ఏకంగా ఒక ట్రస్టునే ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితోపాటు, ఆలయాల నిర్మాణం, గ్రామాల్లో జాతర నిర్వహణలకు సహకారం, యువతను క్రీడారంగంలో ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు, స్పోర్ట్స్ కిట్లు అందజేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసే సేవాల కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దానికితోడు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు, ఇతర నేతలతో చాల సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రతినిత్యం ఈయన ద్వారా సేవలు పొందే వారు అంటున్న మాట ఒక్కటే.. చాలా మందిని చూశాం..కానీ ఎలాంటి అధికార వ్యామోహం లేకుండా, నిరుపేదలను ఆదుకోవడం, ఆద్యాత్మిక కార్యక్రమాలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ప్రజల్లో నిలబడే వ్యక్తును చాలా తక్కువగా చూస్తున్నామని అంటున్నారు.

సాధారణ సేవకుడిగానే ఇంత ముందు చూపుతో ప్రజలకు ఉపయోగ పడే పనులు చేపడితే ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిస్తే మరిన్ని సేవలు ఎంవిఆర్ ద్వారా అందుతాయనే టాక్ ఇపుడు జిల్లాలో బలంగా నడుస్తుంది. ఎక్కడైనా ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి వస్తున్నారంటే అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు వారి దగ్గరకు పరుగుతు పెడతారు. కానీ ఏ ప్రాంతానికైనా ఎంవిఆర్ వస్తున్నారని తెలిస్తే స్వచ్చందంగా ప్రజలే ఆయనను కలుసుకోవడానికి వస్తున్నాంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం వయసు మళ్లిన మహిళలకు దైవ దర్శనాలు కల్పించడానికి ఎంవిఆర్ ట్రస్టు ద్వారా తీర్ధ యాత్రల సేవ చేస్తున్నారు ఎంవిఆర్. దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇవి కాకుండా జిల్లాలో ఏ గ్రామంలో కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నా, జాతరలు జరుగుతున్నా, క్రీడా పోటీలు జరుగుతున్నా.. ఈయన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాలు కూడా అందుతున్నాయి. ఇలా అందరివాడిగా..ప్రజా నేతగా ఎంవిఆర్ అపుడే ప్రజాప్రతినిధి అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇంతలా సేవచేస్తున్న వ్యక్తి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, మంత్రిగానో అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఈయన రాజకీయ రంగ ప్రవేశంపై అన్ని రాజకీయపార్టీలు విస్త్రుతంగా ఎంవిఆర్ కోసం చర్చిస్తున్నాయి. చూడాల త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్న ఎంవిఆర్ ఏ పార్టీ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనేది..! 

Anakapalle

2023-11-04 06:15:17

విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందించిన సీఎం

 విశాఖలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి ని గురువారం ఉదయం ఐటీ హిల్స్ హెలిప్యాడ్ వద్ద సొసైటీ గౌరవ అధ్యక్షులు కే.జి.రాఘవేందర్ రెడ్డి, అధ్యక్షులు బి . రవికాంత్ లు కలిసి తమ సొసైటీ ద్వారా రిజిస్టర్ అయిన అక్రిడేటెడ్ జర్నలిస్టుల వివరాలను ఆయనకు అందజేశారు. ఈ ఏడాది అక్రిడేషన్ ఉన్నజర్నలిస్టుల వివరాలు, 2006 నుంచి 2022 వరకు వివిధ సంవత్సరాల్లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల వివరాల జాబితాను ఆయనకు అందజేశారు. సుమారు 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.  దీనిపై ముఖ్యమంత్రి జగన్  సానుకూలంగా స్పందించారు.  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి కి సూచించారు.  విశాఖలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు  కె.మురళీ కృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2023-11-02 12:44:39

ఏలూరులో ప్రారంభమైన మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్ర

ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం మేరీ మట్టి మేరీ దేష్  అని డిఆర్వో వెంకేటశ్వ ర్లు పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా నుంచి కలస యాత్రను ఆయన జండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్ఫూర్తిని కలిగిస్తూ..భావి తరాల వారిలో దేశభక్తి పెంపొందించడానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ , జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లా నుండి 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢిల్లీ పయనమైనట్టు తెలియజేశారు. 547 గ్రామ పంచాయతీల నుండి సేకరించిన మట్టితో మండల వారీగా ఏర్పాటు చేసిన కలశాలతో ఏలూరు జిల్లా నుంచి 36 మంది విజయవాడ నుంచి ప్రత్యేక ట్రైనులో వాలంటీర్లు ఢిల్లీ చేరుకుంటారన్నారు.  ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 30, 31న రెండు రోజులు జరుగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.  జిల్లా నుంచి బాషా సాంస్కృతిక శాఖ, యువజన శాఖ, పంచాయతీ రాజ్ సమన్వయంతో అమృత కలశ యాత్ర చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జిల్లా యువజన అధికారి కిషోర్, సెట్వెల్  సీఈఓ మహారాజ్ వ్యవహరించగా అమృత కలశ యాత్రలో డిపిఆర్సీ, సెట్వెల్, యువజన కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Eluru

2023-10-28 03:31:59

సామాజిక చైతన్యమే లక్ష్యంగా జగనన్న పాలన

జగనన్నమార్గదర్శకత్వంలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న 'సామాజిక బస్సు యాత్ర' అన్ని వర్గాల ప్రజలనూ ఆప్యాయంగా కలుసుకునేందుకు నిర్వహిస్తు న్న కార్యక్ర మమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వివరించారు. విజయదశమి సందర్భంగా తీసుకున్న భవానీ దీక్ష పూర్తయిన  అనంతరం శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‌ఈ నెల 26 నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభమైన సామాజిక చైతన్య బస్సు యాత్ర లక్ష్యాన్ని ఎంపీ వివరించారు. తిరుపతిలో నిర్వహించే బస్సు యాత్రలో తాను పాల్గొనబోతున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో అణగారిన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. కేవలం వారిని ఓట్ల బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వారిని చైతన్య పరిచే ఏ ఒక్క కార్యక్రమాలను పాలకులు చేయలేదన్నారు. 

ఎనభై శాతం ఓట్లున్న సామాజిక వర్గాన్ని వెనక్కి నెట్టేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సమ న్యాయాన్ని పాటిస్తూ పాలన దిస్తున్నారని తెలిపారు. జగనన్న సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్లు ఉంటే వాటిలో 9 అణగారిన వర్గాలకే ఇచ్చారన్నారు.  బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 67 శాతం మంత్రి వర్గంలో అవకాశం కల్పించడం, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అవకాశాలు, సహాయం అందజేయడం జరుగుతోం దన్నారు. మహిళా బిల్లు మొన్ననే చట్టం కూడా అయిందని, దీనివల్ల మరింత చైతన్యం కలుగుతుందన్నారు. మరి ఇవన్నీ గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ఎంపీ ప్రశ్నించారు. ఎంత సేపూ ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడం..అడ్డంగా బొక్కేయడం తప్పిస్తే సామాన్యుల స్థితిగతులపై, వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు. గతంలో సామాన్యులకు జరిగిన మోసాలు, దోపిడీని వివరిస్తూ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాలకు చేసిన సామాజిక న్యాయాన్ని ఈ బస్సు యాత్రల ద్వారా వివరిస్తామని ఎంపీ భరత్ తెలిపారు.

 సనాతన హైందవ ధర్మానికి ఏ మాత్రం చిన్నపాటి అవమానం జరిగినా విశేషంగా స్పందించే హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు, సంఘాలు‌ రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంపై ఎందుకు స్పందచలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు.  హిందువుల  ఆరాధ్య దైవాలను రాక్షసులుగా చిత్రీకరిస్తూ 'జగనాసుర' వధ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తే వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి.. ఇవన్నీ ఎందుకు నోరు మెదపలేదని‌ ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్నాధుడు అంటే విష్ణుమూర్తి అంశం, అలాగే కృష్ణభగవానుడు నామమని..అటువంటి హిందూ దైవాలని రాక్షసులుగా చిత్రీకరించడం భారతీయులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. హిందూ దైవాలను రాక్షసులుగా చిత్రీకరించిన ఎవ్వరినీ ఉపేక్షించకూడదని, ఈ విషయమై లోక్ సభలో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తానని ఎంపీ స్పష్టం చేశారు.

Rajamahendravaram

2023-10-27 05:52:46

అసంబద్ధ కేసులతో నిజాయితీని అడ్డుకోలేరు..దువ్వారపు

అసంబద్ధ సత్తువ లేని కేసులతో చంద్ర బాబు నాయుడు ప్రభంజనాన్నిఅడ్డుకోలేరని ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు అన్నారు. శుక్రవారం విశాఖ లోని ఆడారి కిషోర్ కుమార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు పై పెట్టిన కేసుల్లో సత్తువ లేదన్నారు.  పాలకులు చూపించిన పైత్యానికి అధికారులు నిబంధనలు తుంగలోకి తొక్కడం క్షమార్హం కాదన్నారు. త్వరలోనే ప్రజలు వీళ్ళకి బుద్ది చెప్తారన్నా రు. ఉత్తరాం ధ్ర ను అభివృద్ధి చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి 2 చీకటి జిఓలు విడుదల చేశారన్నారు.  తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ను వీళ్ళు కొత్తగా అభివృద్ధి చేయడం ఏంటని.. సహజ సిద్ధంగా వనరులున్న ఉన్న ఉత్తరాంధ్ర ను దోచుకోడానికి అధికార ఆర్ట్ వేసిన కుట్రగా అభివర్ణించారు.  విశాఖ రాజధాని వద్దు అనే నినాదం తో ఈ సభల్లో తీర్మానం చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసులు నేడు సుప్రీం కోర్టులో కొట్టి వేయడం ద్వారా  న్యాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రసీ ఇన్ డేంజర్ పేరిట అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, విద్యావేత్తలతో  రౌండ్ టేబుల్ సమావేశం ర్వహిస్తు న్నామని చెప్పారు.  ఆదివారం అరకు, పాడేరు ల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, అసుర పాలన తో పౌరుల నుంచి ప్రతిపక్షాల వరకూ అందరూ విసిగిపోయారన్నారు జనసేన మెడికల్  సెల్ ప్రతినిధి డా.బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ, జనసేన టీడీపీ సంయుక్తంగా పోటీ చేసి రానున్న ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. గత నాలుగున్నర ఏళ్ళల్లో విశాఖ పై లేని ప్రేమ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు.  ఈకార్యక్రమంలో కంచర పాలెం  తెలుగు దేశం వార్డ్ అధ్యక్షులు గోర్లే అప్పారావు, కుట్ట కార్తిక్ తదితరులు ల్గొన్నారు.

Visakhapatnam

2023-10-13 08:24:16

ఓటర్ల సవరణ జాబితా పకడ్బందీగా చేపట్టాలి

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి  నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు నియోజకవర్గాల ఇఆర్వోలు, ప్రత్యేక అధికారులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన  ఓట్లకు సంబంధించిన 3 రకాల రికార్డులను, ఓటర్ నోటీసులు, పంచనామా పత్రాల్లో అధికారుల సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 ఓటర్లకు మించకుండా ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఓటర్ ఇంటి నెంబర్ ఉండాలని,  ఏ ఇంటి  నంబరు ఏ పోలింగ్ కేంద్రంలో వస్తుందో పక్కాగా సమాచారం వుండాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల అనుసరించి ఓటర్ల జాబితాలో మూడు రకాలు అనగా మృతి చెందిన, శాశ్వతంగా వలస పోయిన, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు సంబంధించి తొలగించిన ఓటర్ల  రికార్డులను పరిశీలించడం జరుగుతుందని, వాటి పరిశీలనకు సిద్ధం చేయాలన్నారు. 

తొలగించిన ఓటర్లకు సజావుగా నోటీసులు పంపించే ప్రక్రియ ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందడం లేదా పంచనామా నిర్వహించి ఓట్లను తొలగించడం పక్కగా చేయాలన్నారు. బూతు స్థాయి అధికారుల నుండి ఏఈఆర్వోలు, ఈఆర్ఓలు, ప్రత్యేక అధికారులు, పూర్తిగా పరిశీలన చేయాలనే, చివరగా జిల్లా ఎన్నికల అధికారి పరిశీలనకు సిద్ధంగా ఉంచాలన్నారు. నియోజకవర్గ పరిధిలో తొలగించిన ఓట్లలో ఓటర్ల నమోదు అధికారి ఈఆర్వో1000 ఓట్లను, యాదృచ్ఛికంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించాలన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు 500 ఓట్లను, జిల్లా ఎన్నికల అధికారిగా 100  తొలగించిన ఓట్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  పరిశీలించి సరైన పత్రాలతో దస్త్రాలు ఉన్నాయా లేదా గమనించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, నియోజకవర్గం ఇఆర్వోలు భీమవరం దాసిరాజు, ఆచంట ఎస్ టి వి రాజేశ్వరరావు, నరసాపురం కే కృష్ణవేణి, పాలకొల్లు కే సి హెచ్ అప్పారావు, ఉండి జీవీకే మల్లికార్జునరావు, తణుకు జెడ్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారులు జాషువా, ఆశా కిరణ్, ఎలక్షన్ సూపరింటెండెంట్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Bhimavaram

2023-09-05 15:41:05

ప్రతి వ్యక్తి విజయానికి గురువే మూలం..కలెక్టర్

ఏ ఒక్కరి విజయంలోనైనా గురువే ప్రముఖంగా కనిపిస్తారనీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అన్నారు.  మంగళవారం గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన  గురుపూజోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఏ రంగంలోనైనా ఏ స్థాయిలోనైనా గురువుకు ప్రథమ స్థానం ఉంటుందన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో టీచర్లు బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అయితే అందరూ ఆధునిక పరిజ్ఞానంతో అప్డేట్ అవ్వాలన్నారు.  మారుతున్న ఆధునిక కాలంతోపాటు మనము సాంకేతికతను సొంతం చేసుకోవాలన్నారు.  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా అందరి మదిలో గురువుకు గౌరవ స్థానం ఉంటుందని చెప్పారు.  సమాజం యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం ఒక్క గురువు వల్లే సాధ్యమవుతుందన్నారు.  మన దేశ రెండవ రాష్ట్రపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 63 మందిని సన్మానించి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు బాలబాలికల ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, వైసిపి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి,డిప్యూటీ డిఇఓ  వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-09-05 14:38:44

ఉమ్మడి విశాఖలో 70 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ‌అభ్యర్థులకు కలెక్టర్ అందజేశారు. ఉమ్మడి విశాఖపట్నం  జిల్లాలో సాధారణ కారుణ్య నియామకాలు క్రింద 70 మందికి, రెవెన్యూ శాఖ 9 మందికి, గ్రామ సచివాలయాలు 3 , ఆర్టీసీ 21 మంది , రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 43 మొత్తం 146 మందికి  నియామక పత్రాలు కలెక్టర్‌ అందజేశారు . ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈరోజు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో కలిపి 436 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఉన్నత విద్యనభ్యసించాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ విధులను నిర్వహించాలన్నారు. 

ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి చేసే పనిలో నైపుణ్యత, నాలెడ్జ్,  అవగాహన కలిగి ఉంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని... క్లిష్ట సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించిన బాద్యత యుతంగా  పనిచేసి ఉన్నతాధికారుల గుర్తింపు పొందాలని కలెక్టర్ అన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా సరిగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు ప్రజలకు సేవ చేయాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్ శ్రీనివాసమూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి ఈశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-09-05 14:10:15

నేక్ సంస్థ ద్వారా ఉచిత ఎలక్ట్రీషియన్ శిక్షణ

నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  నిరుద్యోగ యువతకు ఉపాధి కొరకు ఎలక్ట్రీషియన్ కోర్సులో 'ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0' పథకం కింద ఎలక్ట్రీషియన్ కోర్స్ లో ఉచిత శిక్షణ, ఉపాధి నిమిత్తము నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్లు నేక్ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. అభ్యర్థులు 10 వ తరగతి పాసై 15 సం. నుండి 45 సం.ల వయసు కలవారే ఉండాలన్నారు. సుమారు 2 నెలలు శిక్షణా కాలం ఉంటుందని తెలిపారు. 60 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  మాకవరపాలెం "నేక్" శిక్షణా కేంద్రంలో శిక్షణ,  స్టేషనరీ ఉచితముగా అందజేయబడుతుందన్నారు. శిక్షణ  నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వుంటుందని శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత రంగంలో (ప్రైవేటు సెక్టారులలో) ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని వివరించారు.  ఆశక్తి గల అభ్యర్థులు 7780275922 లేదా 9394885164 ఫోన్ నెంబరులో  సంప్రదించాలన్నారు.

Anakapalle

2023-09-05 07:18:21

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగులు కోవిడ్ తో మృతి చెందారని.. సదరు మృతి చెందిన కుటుంబ సభ్యులకు గ్రామ, వార్డు సచివాలయాలలో వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేస్తూ.. 4గురికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరూ సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంచార్జ్ డిఆర్ఓ మురళీ కృష్ణ, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-09-04 09:03:32

చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్..అన్ స్కిల్డ్ పొలిటీషియన్

ఆర్థిక నేరాలలో అడ్డంగా దొరికిపోయినా, తాను ఇంకా నిజాయితీపరుడనంటూ  చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమ ర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆర్థిక నేరాలను అంకెలతో సహా ఆదా య పన్ను శాఖ అధికారులు రుజువు చేసినా, వాటితో తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు బుకాయించటం విడ్డూరంగా ఉందని అన్నారు. కుట్రలు, కుతంత్రా లు, అవినీతితో  నిర్మితమైన ఆయన రాజకీయ జీవితం అంతా చీకటి చరిత్ర అని అమర్నాథ్ విమర్శించారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుకే ఉన్నాయని ఆయన చెప్పారు. ఏలేరు, స్టాంపుల కుంభకోణాలలో బాబు హస్తం ఉందని అనేకసార్లు రుజువైందని ఆయన చెప్పా రు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన రాజకీయంలోకి వచ్చారని ఆయన అన్నారు. నారావారిపల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు ఆయన ప్రతి అడుగు అవినీతి మయమేనని అమర్నాథ్ విమర్శించారు. తాను నిజాయితీపరుండని   రోజు  ప్రవచనాలు వల్లించే చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల తన లంచావతారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. అన్నా హజారే వారసుడునని, గాంధీజీ తమ్ముడనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన అవినీతి ఆరోపణలపై వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా, చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ శాఖ బాబు బాగోతాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆయన ఎక్కడెక్కడ నుంచి డబ్బులు ఎలా దండుకున్నాడో 46 పేజీల షోకాస్ నోటీసులో స్పష్టంగా పేర్కొందని అమర్నాథ్ చెప్తూ, దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించకపోగా, తన పేరు అందులో లేదు కదా, మీరెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అంటూ ఐటీ అధికారులను అర్థం లేని ప్రశ్నలు వేస్తూ తప్పించుకుంటున్నాడని ఆయన అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ బాబు గారి ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని, టిట్కో ఇల్లు, హైకోర్టు నిర్మాణం సి ఆర్ డి ఏ లో చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించి డబ్బులు ఏవిధంగా తీసుకున్నారో వెల్లడించారని ఆయన తెలియజేశారు.  దుబాయ్ నుంచి కూడా దినామ్స్ లో 15 కోట్ల రూపాయలు వరకు చేజిక్కించుకున్నారని అమర్నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు అధికారులను మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు 350 కోట్ల రూపాయలు కొట్టేసారని ఆయన వివరించారు.
చంద్రబాబు నాయుడు అవినీతి చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళతామని, ప్రజా కోర్టులో ఆయన సమాధానం చెప్పుకోవాలని, ఆయనకు శిక్ష తప్పదని అమర్నాథ్ అన్నారు.  చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరాల విషయంలో ఈ.డి. జోక్యం చేసుకోవాలి అని అమర్నాథ్ డిమాండ్ చేశారు.

Visakhapatnam

2023-09-04 07:21:07

నన్నయ్య వర్శిటీ నూతన ఈసీగా డా.సులేమాన్

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నూత న కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు మీడియాకి తెలియజేశారు. ప్రభుత్వం జీవో 77ను విడుదల చేసిందని చెప్పారు. ఆయా విభాగాల నుంచి నిష్ణాతులైన వారిని ఈసీ సభ్యు లుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డా.షేక్ సులేమాన్  గతంలో వైఎస్ కళాశాల అధ్యాపకుడిగా, ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధిశా ఖలో పనిచేశారు. విద్యారంగంలో ఆయనకున్న విశేష అనుభవాన్ని గుర్తించిన ప్రభుత్వం తాజాగా నన్నయ్య యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా నియమించింది. ఈయన నియామకం పట్ల ఉన్నత విద్యావంతులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ప్రొఫెసర్ జాన్ క్రిష్ఠపర్(మహర్షి), నన్నయ్య యూనివర్శిటీ విసి ఆచార్య కె. పద్మరాజు కూడా అభినందనలు తెలియజేశారు. 

Narsapur

2023-09-03 15:29:15

ఆర్థిక నేరాల కథనాలపై చంద్రబాబు స్పందన ఏంటి?

అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన ఆర్థిక నేరాలు ఒక ఆంగ్ల పత్రిక ద్వారా బహిర్గతమయ్యాయని, ఇవన్నీ తప్పని, తాను నిజాయితీపరుడనని,ఈ కథనాలు రాసిన పత్రికపై కేసు వేయడానికి చంద్రబాబు లేదా లోకేష్ ముందుకు వస్తారా? అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ 
అమర్నాథ్ ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాలరు. లోకేష్ తన తల్లిని తాము పల్లెత్తు మాట కూడా అనకపోయినా, తమపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన కథనాలు తప్పని ఆయా పత్రికలపై కేసులు వేయడానికి ముందుకు వస్తాడా? లేక నా తండ్రికి నాకు ఎటువంటి సంబంధం లేదని వదిలేస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థిక నేరాలన్నీ రుజువులతో సహా బహిర్గతమయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు ముడుపుల వ్యవహారాలు పత్రికల్లో వచ్చాయని, వాటిని ఆయన ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, అవన్నీ నిజమేనని స్పష్టమవుతోందని అమర్నాథ్ చెప్పారు. 

గతంలో తాను అసెంబ్లీలో ఇదే అంశంపై అన్ని ఆధారాలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడానని అమర్నాథ్ తెలియజేశారు. చంద్రబాబు ఆస్తులపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించినప్పుడు లెక్కల్లో లేని 2000 కోట్ల రూపాయలు దొరికినట్లు ఆధారాలతో సహా సంబంధిత శాఖ బహిర్గతం చేసిందని అమర్నాథ్ చెప్పారు. 2016 సంవత్సరానికి ముందు నుంచే కాంట్రాక్టర్ల దగ్గర కిక్ బ్యాగ్స్ తీసుకున్నాడని, అమరావతి నిర్మాణాలలో అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బదలాయించాడో చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ ద్వారా ఇన్కమ్ టాక్స్ అధికారులు తెలుసుకున్నారని అన్నారు.  అవినీతి అంటే ఏంటో తనకి తెలియదని, అవినీతి డబ్బు తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడని అని ప్రశ్నించారు. 
చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతి ఊబిలో కోరుకుపోయాడని, తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా శేష జీవితంలో శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ జన్మలో చేసిన పాపాలు .ఈ జన్మలోనే అనుభవిస్తాడని ఆయన అన్నారు.కదా చంద్రబాబు నాయుడుకొత్తగా భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ కొత్త నిదానంతో ప్రజల ముందుకు వస్తున్నాడని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానమైనా నెరవేర్చడా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను, మహిళలను పూర్తిగా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మద్దని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు. చంద్రబాబు తన బుర్ర ఉపయోగించి ఒక కొత్త పథకాన్ని అయినా ప్రకటించగలిగాడా అని ఆయన ప్రశ్నించారు.

Visakhapatnam

2023-09-01 15:39:35