1 ENS Live Breaking News

విశాఖ పర్యటనలో సీఎం జగన్ ద్రుష్టికి విజెఎఫ్ పంచాయతీ..!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) పంచాయతీని విశాఖలోని జర్నలిస్టులు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటనలో ఆయన ముందుకి ఆధారాలతో సహా వెళ్లనున్నారు. దానికోసం సేవ్ విజెఎఫ్ ఉద్యమకారులు కాలంచెల్లం చెల్లిన అనధికార కార్యవర్గం చేసిన మోసాలన్నింటినీ లిఖిత పూర్వకంగా సీఎం  ముందు పెట్టనున్నాయి. 2015 నుంచి కార్యవర్గం అమలులో లేకుండానే అనధికారికంగా సదరు కమిటీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. విజెఎఫ్ బైలా ప్రకారం రూ.10వేలు ఖర్చుదాటితే సభ్యుల సమ్మతి సర్వసభ్య సమావేశంలో తీసుకోవాల్సి ఉన్నది. అలా కాకుండా కార్యవర్గం ఏకపక్షంగా సభ్యుల ఆమోదంతో పనిలేకుండా నేటి వరకూ లక్షలాది రూపాయాలు వారి సొంత నిర్ణయాలతో ఖర్చుచేస్తూ వచ్చారు. పైగా పెట్టని కార్యవర్గ సమావేశాలను పెట్టినట్టుగా 2015 నుంచి 2020 వరకూ చూపించి.. జిల్లా రిజిస్ట్రార్ కి విజెఎఫ్ పై 2 కోర్టుకేసులు దాఖలైన విషయాలను దాచి, నేటి వరకూ ఎలాంటి కేసులు దాఖలు కాలేదని లిఖిత పూర్వకంగా రాసి, ఆకాలంలో ఒక్కసారి కూడా ఇన్కమ్ టాక్స్ కట్టకుండా కేవలం ఆడిట్ రిపోర్టులు మాత్రమే చూపించి మరీ మోసం చేసింది. ఆపై విజెఫ్ సొసైటీని ఆన్ లైన్ లో 2020 వరకూ రెవిన్యువల్ ను ఆన్ లైన్ లో అడ్డదారిన చేసేసింది. వాస్తవానికి అలా తప్పుడు పత్రాలు సమర్పించినందుకు జిల్లా రిజిస్ట్రార్ విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వుంది. కాకపోతే ఈ విజెఎఫ్ సొసైటీ జర్నలిస్టులది కావడంతో గొడవలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంతో విజెఎఫ్ కార్యవర్గం సమాచారా న్ని సమాచారహక్కుచట్టం ద్వారా జర్నలిస్టులు బయటకు తీయడంతో 2020 తరువాత సొసైటీని రెవిన్యువల్ చేయడానికి జిల్లా రిజిస్ట్రార్ నిరాకరించారు. నాటి 
నుంచి నేటి వరకూ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సొసైటీ రెవిన్యువల్ కాకుండా అవస్థాన దశలోనే ఉండిపోయింది. అయినా అదేపేరుతో కార్యక్రమాలు మాత్రం జరిపిస్తోంది అనధికార కార్యవర్గం.

ఆ తరువాత జర్నలిస్టులు విజెఎఫ్ అనధికార కార్యవర్గం చేస్తున్న మోసాలను, అక్రమాలను, అవినీతిని, చేయని ఖర్చులకు లక్షల్లో చూపించిన బిల్లులు, ఆదాయానికి, ఖర్చుకు పొంతనలేకుండా చూపించిన ఆడిట్ రిపోర్టులను కలెక్టర్ కి నివేదించారు. వీటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున తొలుత, త్రీమెన్ కమిటీ, ఆపై ఫైవ్ మెన్ కమిటీ వేశారు. ఆసమయంలోనే జిల్లా ఆడిట్ అధికారితో విచారణచేయిస్తే సుమారు రూ.30లక్షలకు పైగా లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చాయి. అంతేకాకుండా పలువురు దాతలు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన రిసిప్ట్ లను మాయం చేసిన విషయం కూడా బయటకు వచ్చింది. పైగా 2020 నుంచి 2023 వరకూ కార్యవర్గంగా చెప్పుకుంటున్నా..సదరు విజెఎఫ్ సొసైటీ ప్రస్తుతం చచ్చిపోయి ఉంది. కారణం కాలం చెల్లినక కమిటీ చేసిన తేడా వ్యవహారాలతో జిల్లా రిజిస్ట్రార్ 2020 తరువాత విజెఎఫ్ సొసైటీని రెవెన్యువల్ చేయడానికి నిరాకరించారు. సమాచారహక్కుచట్టం ద్వారా జర్నలిస్టులు బైలా, బైలా సవరణలు, ఆడిట్ రిపోర్టులు, పెట్టని సర్వసభ్య సమావేశం పెట్టినట్టుగా చూపించిన రికార్డులను అధికారికంగా తీసుకోవడంతో అసలు విషయం క్లబ్ లోని మిగతా జర్నలిస్టులకి తెలిసింది. ఆ తరువాత కూడా కోర్టుకేసులకు సంబంధించి విజెఎఫ్ అనధికార కమిటీ సభ్యులకు ఎవరికీ సర్వసభ్య సమావేశం పెట్టి చెప్పకపోగా..అదే కోర్టుకేసులకు లాయర్ ఫీజు క్రింది సుమారు లక్ష రూపాయల వరకూ చెల్లించినట్టు ఆడిట్ రిపోర్టులో చూపించింది. ఆ విషయాన్ని ఫైవ్ మెన్ కమిటీ అధికారులు జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లడంతో..విచారణ చేయించి ఆ నివేదికను, జిల్లా ఆడిట్ ఆఫీసర్ బయటపెట్టిన ఆధారాలను, అనధికార కార్యవర్గం చేసిన మోసాలను విజెఎఫ్ నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచారు.

విజెఎఫ్ అనధికార కార్యవర్గంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు, అధికారుల కమిటీ నియామకం, లక్షలాధి రూపాయలవ్యత్యాసాలు బయటపడిన విషయం, ఆపై పోలీసు కేసు నమోదు అయిన అంశాలు, వాటి ఆధారాలు, ఆదాయానికి మించి.. నార్ల వెంకటేశ్వరభవన్ లో కార్యవర్గంలో ఒక సభ్యుడి ప్రైవేటు డాన్సు స్కూలు నిర్వహించుకున్నదానికి విజెఎఫ్ ఆదాయం నుంచే చెల్లించిన కరెంటు బిల్లుల వ్యవహారం.. ఇంకా లెక్కల్లోకి రాని ఆదాయాలు, చేసిన ఖర్చులు, నార్ల వెంకటేశ్వరభవన్ లోని బేకరీ షాపుల రెంటల్  అగ్రిమెంట్లు, వాటితోపాటు మరో మూడు షాపులకు చెందిన రెంటల్ అగ్రిమెంట్లు, భవనంపై ప్రచారం కోసం వేసి హోర్డింగ్ అగ్రిమెంట్లు, సంబంధం లేని అంశాలకు తీసిన హోటల్ రూముల బిల్లులు, ఇలా అన్ని ఆధారాలూ సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే సీఎంని కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు నియంత్రణ చర్యలతో కలవడానికి వీలుపడలేదని, ఇపుడు పోలీసులే అనధికార కార్యవర్గంపై సెక్షన్ 420, 34, 406r/w, ఎఫ్ఐఆర్ నమోదు అయినందున మార్గం సుగమం అయినట్టు సమాచారం అందుతుంది. కాగా ఇప్పటికే ఇదే సమాచారాన్ని అమరావతిలోకి సీఎం క్యాంపు క్యారాలయానికి ఒక నకలు, ఫిర్యాదు పంపించారని కూడా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పార్టీలోని పలువురి నేతలకు తెలియజేశాయని, ఆ కారణంగానే అనధికార కార్యవర్గంపై జిల్లా యంత్రాంగం వేగం చర్యలకు ఉపక్రమించిందనే ప్రచారం జరుగుతుంది.

కాగా ఇప్పటికే విజయనగరం ప్రెస్ క్లబ్ విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముక్కుసూటిగా వ్యవహరించి..అవినీతికి పాల్పడిన కార్యవర్గం నుంచి ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇపుడు విశాఖలోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ విషయంలో కూడా అదే జరిగింది. అనధికార కార్యవర్గం నుంచి తాళాలు, రికార్డులు జిల్లా కలెక్టర్ నియమించిన ఫైవ్ మెన్ కమిటీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇపుడు సభ్యుల గుర్తింపు కోసం ఐదుగురు సీనియర్ జర్నలిస్టులతో కూడా కిమటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహాంలో ఏఏ ప్రభుత్వశాఖలకు జర్నలిస్టులు ఫిర్యాదులు చేశారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ చేపట్టిన కార్యాచరణ, బయటపెట్టిన వాస్తవాలు, ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో అనధికార కార్యవర్గం చేసిన రచ్చ, దానికి సంబంధించిన వీడియో ఫుటేజి ఇలా మొత్తం ఒక పెద్ద ఫైలే సీఎం ముందుకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్దం చేసిందని చెబుతున్నారు. ప్రస్తుత అనధికార కార్యవర్గం చేసిన మోసాలను, అక్రమాలను, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి తూట్లు పొడి, విజెఎఫ్ బైలాను అతిక్రమించి ఈ కాలం చెల్లిన కార్యవర్గం చేసిన వ్యవహారాలను ఆధారాలతో సహా బయటపెట్టడం ద్వారా మరో కార్యవర్గం ఇలాంటి తేడా వ్యవహారాలు, తప్పుడు పనులకు పూనుకోకుండా ఉంటుందనేది ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఆలోచనగా కనిపిస్తున్నది. చూడాలి ఈ మొత్తం పంచాయతీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వెళ్లిన తరువాత ఎలాంటి పరిణామాలు, చర్యలు చోటుచేసుకుంటాయనేది..!

Visakhapatnam

2023-07-28 06:26:13

విజెఎఫ్ లెక్కల్లో బొక్కలు కప్పేయడానికి మాస్టర్ ప్లాన్..!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) లెక్కల్లో బొక్కలు పూర్తిగా కప్పేయడానికి అనధికార కాలం చెల్లిన కమిటీ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తున్నది. దానికి అను గుణంగా జిల్లా అధికార యంత్రంగాం కూడా వ్యవహరిస్తున్నట్టు తాజా పరిణిమాలు రుజువుచేస్తున్నాయి. అసలు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తేడా వచ్చిన లెక్కల్లో బొక్కలు తేల్చకుండా..మాయం చేసిన రిసిప్ట్లు బయటకు తీయకుండా.. లక్షల్లో వచ్చిన లెక్కల్లో తేడాలు బయటకు రాకుండా..డాబాగార్డెన్స్, సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్ ద్వారా వచ్చే ఆదాయంలోని అసలు విషయం బయట పడకుండా తెరవెనుక పెద్ద కార్యాచరణ జరుగుతుందనే విషయం ప్రస్తుతం విజెఎఫ్ లో సభ్యులు గుర్తించినట్టుగా చెబుతున్నారు. భారీమొత్తంలో జరిగిన అవినీతి, లెక్కలకు బొక్కలు పెట్టి చూపిన ఆడిట్ రిపోర్టులు, అద్దెకిచ్చిన షాపులకు లేని అగ్రిమెంట్లు..ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేయకుండా చూపించిన చిట్టాపద్దుల ఆడిట్ రిపోర్టులు..అడుగడుగునా అత్యంత భారీ తేడా వ్యవహారాలే ప్రెస్ క్లబ్ విషయంలో కాలం చెల్లిన కమిటీ చేసినట్టు ఆధారాలు బయటకొచ్చాయి. ఇంత జరిగినా జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు తేడా వచ్చిన మొత్తాన్ని రికవరీచేసే ప్రయత్నంగానీ, వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేందకు అనర్హత వేటు గానీ వేయలేదు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420, 34, 406 r/w క్రింద  కేసులు నమోదు అయినా నేటికీ అరెస్టులు చూపించలేదు. ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తుందనే అనుమానాలను ప్రెస్ క్లబ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లెక్కల్లో లక్షల్లో వచ్చిన బొక్కలు పూడ్చేయాలన్నా..ఈ విషయాన్ని తారుమారు చేసి సభ్యులను గతంలో మాదిరి మభ్య పెట్టేయాలన్నా.. ఇపుడు అర్జెంట్ గా ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు పెట్టేయాలి. ఎన్నికలు పెట్టేస్తే గెలిచిన వారే ఈలెక్కలు, అందులో వచ్చిన బొక్కలు, వాటికి కాలం చెల్లిన కమిటీ చూపిన కారణాలు అన్నీ వారే చూసుకుంటారు..? అపుడు జిల్లా అధికారులు ఎంచెక్కా చేతులు దులిపేసుకోవచ్చు..! దానికోసమే ఇంత పెద్ద మొత్తంలో లెక్కల్లో తేడాలు వచ్చినా.. ఆలెక్కలపై అనధికార కార్యవర్గం నుంచి రికవరీ చేసే ప్రయత్నం కూడా జిల్లా అధికారులు చేయడం లేదు. వాస్తవానికి జిల్లా రిజిస్ట్రార్ కి సర్వసభ్యసమావేశాలు జరపకుండానే..జరిపినట్టు చూపి సమర్పించిన రికార్డులతోనే ఆయనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలి. అందులోనూ..ప్రతీఏటా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల ఆమోదంతో లెక్కలన్నింటికి జమాఖర్చులు రాయించి వాటికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేయించి.. ఈఫైలింగ్ చేసిన తరువాత మాత్రమే(2015 నుంచి 2020 వరకూ మధ్యలో ఒక్క 2018‌-2019కి మాత్రమే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ వేసినట్టుగా ఆధారాలు చూపించారు) విజెఎఫ్ సొసైటీని జిల్లా రిజిస్ట్రార్ రెవిన్యువల్ చేయాల్సి వుంది. కానీ అవేమీ జరగకపోయినా 2015 నుంచి 2020 వరకూ అనధికార కమిటీ సర్వసభ్యసమావేశాలు పెట్టకుండా పెట్టినట్టు చూపిన ఆడిట్ రిపోర్టుతోనే రెవిన్యువల్ చేసేశారు. ఆతరువాత 2020-2023 వరకూ సొసైటీ చచ్చిపోయే వుంది. కారణంగా విషయం బయటకు తెలిస్తే..తనకు చిక్కులు ఎదురవుతాయని జిల్లా రిజిస్ట్రార్ తరువాత నుంచి సొసైటీ రెవన్యువల్ చేయడానికి నిరాకించారని చెబుతున్నారు. విజెఎఫ్ సమర్పించిన తేడా నివేదికలు, రికార్డులు కూడా ఫైవ్ మెన్ కమిటీకి సమర్పించినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి రెవిన్యువల్ లేకుండా ఉంటే విజెఎఫ్ సొసైటీ చచ్చిపోయినట్టే లెక్క. ఆసొసైటీకి ఇపుడు చట్టబద్దత కూడా లేదు. అయినప్పటికీ అనధికార కార్యవర్గం కార్యక్రమాలు చేస్తూ..వారి ఖర్చులను కూడా సొసైటీ డబ్బుల నుంచే చెల్లిస్తుండటం విశేషం. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ విజెఎఫ్ సొసైటీ కార్యవర్గంపై చర్యలు తీసుకోలేదు. లక్షల్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన రిసిప్ట్ లు మాయం అయినా..పూర్తిస్థాయిలో రికార్డులు కాలం చెల్లిన కమిటీ జిల్లా అధికారులకు చూపించకపోయినా..ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా..విచారణ జరుగుతుందని చెబుతూనే విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు నిర్వహించేయడానికి అధికారులతో కమిటీ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో కలెక్టర్ చెప్పాల్సి వుంది. తొలుత త్రీమెన్ కమిటీ, ఆపై ఫైవ్ మెన్ కమిటీ విజెఎఫ్ రికార్డుల్లోని లెక్కలన్నీ బొక్కలతోనే ఉన్నాయని నిర్ధారించిన తరువాత కూడా అనధికార కార్యవర్గంపై అనర్హత వేటు వేయకుండా ఇప్పటి వరకూ నెట్టుకొస్తూ వచ్చారు. ఈవిషయంలో ఎంత మంది జర్నలిస్టులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా..ఎప్పుడు ఫిర్యాదులు వచ్చినా ప్రధాన పత్రికల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కేవలం చిన్నపత్రికల నుంచే అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కూడా జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసినపుడు జిల్లా కలెక్టర్ ప్రస్తావించడం విశేషం.

అర్జెంట్ గా విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు పెట్టేస్తే..ఇప్పటి వరకూ జిల్లా ఆడిట్ ఆధికారి బయటకు తీసిన లెక్కల్లోని బొక్కలన్నీ కొత్తగా వచ్చిన కమిటీ కుస్తీలు పడుతుందనే ఆలోచనలో జిల్లా అధికారులు ఉండే ఎన్నికలు నిర్వహించేయాలనే తపనతో ఉన్నట్టు ప్రెస్ క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆర్ధిక లావాదేవీల్లో పెద్ద మొత్తంలో తేడాలు వచ్చినపుడు..దానికి సంబంధించిన రికార్డులు లేనపుడు, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి విరుద్ధంగా వ్యవహరించినపుడు.. పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టుగా తప్పుడు నివేదికలు జిల్లా రిజిస్ట్రార్ కి ఇచ్చినపుడు.. విజెఎఫ్ ఆస్తులను అద్దెకిచ్చే సమయంలో సదరు వ్యాపారులతో చేసుకున్న ఒప్పందాలు బహిర్గతం చేయనపుడు.. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కనిపించకుండా రిసిప్ట్ బుక్ లోని పేపర్లు మాయం చేసినపుడు.. ఏళ్ల తరబడి సొసైటీకి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్నప్పుడు..  సర్వసభ్య సమావేశాలు పెట్టకుండా పెట్టినట్టు చూపి సొసైటీని ఆన్ లైన్ లో రెవిన్యుల్ చేసినపుడు.. సొసైటీ బైలా ప్రకారం సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదం లేకుండా లక్షల్లో ఆదాయాన్ని ఖర్చుచేసినపుడు..  తప్పులన్నీ ఆధారాలతో తేలిన తరువాత అనధికార కార్యవర్గంపై 420 కేసు నమోదు అయినా వాటినేం పట్టించుకోకుండా కేవలం ఎన్నికలు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే..ప్రస్తుత అనధికార కమిటీపై అనర్హత వేటు వేయకుండా ఉండేందుకు వీలుపడుతుందనే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ తోనే ఈ తేడా పథకాన్ని అమలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తం లెక్కల్లో తేడాలు వచ్చినపుడు దానికి అనధికార కాలం చెల్లిన కార్యవర్గం సమాధానం చెప్పకపోయినా వారి నుంచి ఆధారాలు సేకరించని జిల్లా అధికారుల వ్యవహార శైలిపైనా అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి విజెఎఫ్ లెక్కల్లో లక్షల్లో వచ్చిన బొక్కలు కప్పేయడానికి ఇంకెన్ని మాస్టర్ ప్లాన్ లు వేస్తారో అనేది..!

Visakhapatnam

2023-07-26 06:07:10

విద్యార్ధులు ర్యాగింగ్ కి పాల్పడి జీవితం నాశనంచేసుకోద్దు

విద్యార్ధులు ర్యాగింగ్ భారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని విశాఖజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవిశేషమ్మ సూచించారు. మంగళవారం ఆంధ్రామెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రొహిభిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కి పాల్పడిన వారికి జైలుశిక్ష జరిమానాలు ఉంటాయన్నారు. విద్యార్ధులు స్నేహ భావంతో మెలగాలి తప్పితే ఎక్కడా ఇతర విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేసే  పనులు చేయకూడదన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలు, యూనివర్శిటీల్లో  ఈ యాక్టు అమలులో వుంటుందని తెలియజేశారు. విద్యార్ధులు ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డా.రవీంధ్రకిషోర్, డా.టి.సురేఖ, డా.ఎం.హేమరాధిక ఇతర అధ్యాపకులు, పెద్ద ఎత్తున విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-25 15:41:41

ఈనెల 27న విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సమావేశం

ఉమ్మడి విశాఖజిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్టు జెడ్పీ సిఈఓ పి.శ్రీరామ్మూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో మీడియాకి విడుదల చేశారు. మొత్తం ఏడు అంశాలను స్థాయి సంఘ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలియజేశారు. కాగా ఈ సమావేశాలకు జిల్లాశాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో రావాలని కూడా జెడ్పీ సిఈఓ పేర్కొన్నారు. 

Visakhapatnam

2023-07-25 06:52:35

కాకినాడ జిల్లాలో మహిళా పోలీసులకు బదిలీల కౌన్సిలింగ్

కాకినాడ జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులు దరఖాస్తు చేసుకున్న అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి మంగళవారం జూమ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు పోలీసుశాఖ పేర్కొంది. పరస్పర బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు, డిజిపి కార్యాలయం నుంచి అప్రూవల్ వచ్చిన వారు మాత్రమే ఈ జూమ్ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు సదరు పనిచేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నో డ్యూస్ సర్టిఫికేట్ తోపాటు, ఇతర అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తోపాటు ఒక సెట్ జెరాక్సు ప్రతుల సిద్దం చేసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా అభ్యర్ధులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాలని కూడా జిల్లా పోలీసు కార్యాలయం పేర్కొంది. అన్ని శాఖల్లోని బదిలీ ప్రక్రియ పూర్తిఅయిపోయింది ఒక్క మహిళా పోలీసులకే ఆలస్యంఅయ్యింది. నేటి ఉత్తర్వులతో ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తికానుంది.

Kakinada

2023-07-24 15:23:42

టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా కృషి

పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రగతి సాధించేలా స్టార్టప్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్ల విస్తరణకు తగిన కృషి చేస్తున్నామని  సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ చైర్‌ రాయ్‌ కొడాలి అన్నారు. విశాఖలోని వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌, భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నాడు ఇంటర్‌ప్రైజింగ్‌ భారత్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ మధ్య కాలంలో స్టార్టప్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్లు నగరాల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే వీటిని రూరల్‌ ప్రాంతాల్లో సైతం విస్తరించేలా, గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా ఉపయోగపడాలనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు..   గ్రామీణ, పట్టణ వ్యాపార పర్యావరణ వ్యవస్థల మధ్య విభజనను తగ్గించడం తమ ఉద్దేశమన్నారు.  తద్వారా ఆర్థిక వ్యవస్థలను మరింత మెరుగ్గా తయారు చేసేందుకు దోహదపడుతుందన్నారు. భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు కార్యదర్శి, గ్రామీణ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పౌండర్‌ శ్రీరామమ్మూర్తి మాట్లాడుతూ  సాంకేతికత అందుబాటులోకి రావడంతో, భౌగోళిక సరిహద్దులు చెరిగిపోయాయన్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వారి ఇంటి నుంచి ప్రపంచ మార్కెట్‌లను ప్రభావితం చేస్తున్నారన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏపీఐఎస్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.  యువ ప్రతిభను పెంపొందించడంలో  స్టార్టప్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

Visakhapatnam

2023-07-22 18:41:18

సచివాలయ మహిళా పోలీసులకు శనివారం విశాఖలో కౌన్సిలింగ్

గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు జూలై 22న విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ జరుగుతుందని పోలీసుశాఖ ప్రకటించింది. పరస్పర బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు, డిజిపి కార్యాలయం నుంచి అప్రూవల్ వచ్చిన వారు మాత్రమే ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు సదరు పనిచేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నో డ్యూస్ సర్టిఫికేట్ తోపాటు, ఇతర అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తోపాటు ఒక సెట్ జెరాక్సు ప్రతులతో కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి వుంటుందన్నారు. అదేవిధంగా అభ్యర్ధులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాలని కూడా జిల్లా పోలీసు కార్యాలయం పేర్కొంది. కాగా ఇప్పటి వరకూ అన్ని శాఖల్లోని బదిలీ ప్రక్రియ పూర్తిఅయిపోయింది ఒక్క మహిళా పోలీసులకే ఆలస్యంఅయ్యింది. నేటి ఉత్తర్వులతో ఈ ప్రక్రియ కూడా శనివారంతో పూర్తికానుంది.

Visakhapatnam

2023-07-21 03:58:28

విదేశీ వీసాలు పేరిట మోసాలతో జరభద్రం

విదేశీ విద్య, వీసాలు పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సీతమ్మధారలో గల ఎన్ బీ ఎం లా కళాశాల లో ఇంటర్నేషనల్, ఇమ్మిగ్రేషన్ లా అంశంపై ఏర్పాటు చేసిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులే లక్ష్యంగా ఆ రంగంలో నిత్యం జరుగుతున్న చాలా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన నకిలీ వీసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో తగిన విచారణ చేయాలన్నారు. సదరు సంస్థ గుర్తింపు, జాబ్ ఆఫర్ లెటర్ క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. నైజీరియా, ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్నారన్నారు. వీటి పట్ల అందరూ ముందు జాగ్రత్త గా వుండాలన్నారు. ఈ మేరకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎన్బిఎం లా కళాశాల ప్రిన్సిపాల్ డి.వి.రమణ, అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-20 09:30:19

వలస కార్మికులకు అవసరమైన సహాయం అందిస్తాం..

తమిళనాడులోని కోయంబత్తూర్ లో మంగళవారం ప్రహరీగోడ కూలిన ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానిక కలెక్టర్ తో మాట్లాడి మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని కోరామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయిన అనంతరం బాడంగి మండలంలోని వారి స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు సంబంధిత భవన నిర్మాణ కాంట్రాక్టర్ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వలస కార్మిక కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ విరించారు. మ్రుతు కుటుంబాలకు సమాచారాన్ని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు చేరవేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

Vizianagaram

2023-07-05 05:30:35

జూలై 6న అప్పలాయగుంటలో పుష్పయాగం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ గురువారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 5న రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.40 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

Tirupati

2023-07-05 03:20:09

భారత స్వతంత్ర పోరాటం లో అల్లూరి మార్గదర్శి

భారత స్వాతంత్ర్య పోరాటానికి  అల్లూరి సీతారామరాజు ఒక మార్గదర్శిగా నిలిచారని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. అతి పిన్న వయసు లోనే దేశం కోసం త్యాగం చేసి స్వతంత్ర స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి వీరుల  గాధలను భావి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని  మంగళవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో   ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి జేసీ, డి.ఆర్.ఓ, అధికారులు  నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభ లో  జె.సి మాట్లాడుతూ  అల్లూరిలోని నాయకత్వ లక్షణాలను,   వారి త్యాగ స్ఫూర్తిని ,దేశ భక్తిని ఆదర్శంగా తీసుకోవాలని  తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఆకాంక్షించారు. డి.ఆర్.ఓ గణపతి రావు మాట్లాడుతూ ఏమీ  ఆశించకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుడు అల్లూరి అని అన్నారు. యువత నిస్వార్ధంగా ఆలోచించి దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మెప్మా పిడి సుధాకర్ అల్లూరి దేశ భక్తిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-04 06:42:25

విశాఖలో వైట్ రేషన్ కార్డు జర్నలిస్టులకు గుడ్ న్యూస్..

విశాఖపట్నం జిల్లాలో 2023-24 సంవత్సరంలకు అక్రిడిటేషన్ కార్డులు పొంది తెల్ల రేషన్ కార్డు కలిగిన పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు ( WJHS ) పొందుట కు చెల్లించవలసిన ప్రీమియం రూ.1250 /-  ను, జిల్లా కలెక్టర్,  విశాఖపట్టణం సి.ఎస్.ఆర్ నిధుల నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాత్రికేయులు ఈ దిగువ తెలిపిన డాక్యుమెంట్స్  జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయం, విశాఖపట్నంలో అందజేయవలసినదిగా కోరారు. రెన్యువల్ కొరకు జతపరచవలసిన ధృవపత్రాలు ( Already Having WJHS card):- 1)అప్లికేషన్ 2) పాత హెల్త్ కార్డు జెరాక్స్ కాపీ ( దరఖాస్తుదారుడు ) 3) తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ కాపీ  4) 2023-24 అక్రిడిటేషన్ కార్డు కాపీ. కాగా క్రొత్త హెల్త్ కార్డు కొరకు జత పరచవలసిన ధ్రువపత్రాలు
1) అప్లికేషన్ 2) తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ కాపీ  3) 2023-24 అక్రిడిటేషన్ కార్డు జెరాక్స్ కాపీ  4) ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ (కుటుంబ సభ్యులందరివి ) 5) ఫొటోస్ -2 ( కుటుంబ సభ్యులందరివి) 6) ఫ్యామిలి ఫోటో-1 జతపరిచిన ధృవపత్రాలు అన్ని స్కాన్ చేసి (ప్రతి ఫైల్ 50 kb కంటే తక్కువగా) wjhscards2023@gmail.
com కి  మెయిల్ చేయవలసినదిగా కోరారు. మరిన్ని వివరాలకు ఎం.కిషోర్ కుమార్-8008656504 - PRO, జి.లావణ్య 8143504193 - Jr.Asst. 
( తెల్ల రేషన్ కార్డు లేని వారు పాత పద్ధతిలో చలానా చెల్లించి ఆవివరాలు ఈ కార్యాలయానికి అందజేయాల్సి వుంటుంది.)

vizag

2023-07-03 08:51:09

రేపు విశాఖలో జగనన్నకు చెబుదాం(స్పందన) రద్దు

విశాఖజిల్లా కలెక్టరేట్ లో 3న సోమవారం జగనన్నకు చెబుదాం ( స్పందన ) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింహా చలం గిరి ప్రదక్షణ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ లో పొల్గొన నున్నందన, అధికారులు అందరూ ఏర్పాట్లలో ఉన్నందున జగనన్నకు చెబుదాం కార్యక్రమా న్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి  రావద్దని ఆయన కోరారు. తిరిగి జూన్10నుంచి జగనన్నకు చెబుదాం( స్పందన ) యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Visakhapatnam

2023-07-02 15:58:33

సింహాద్రి నాధుని గిరి ప్రదక్షిణకు అడ్డు తగిలిన వరుణుడు

సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు వరుణుడు అడ్డు తగిలాడు. ప్రదక్షిణ ప్రారంభం అయిన కొద్ది గంటలకే విశాఖలో వర్షం పడటంతో స్వామివారి ప్రదక్షిణకు ఆటంకం వాటిల్లింది. 32 కిలోమీటర్లు పాటు సాగే ఈయాత్రను విజయవంతం చేసేందుకు ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు దారి పొడవునా సీతల పానియాలు, ప్రసాదాలు, మం చినీరు, మజ్జిగ అన్నీ ఏర్పాటు చేశాయి. ఇటు జివిఎంసి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ను, మొబైల్ మరుగుదొడ్లను కూడా పెట్టింది. అంతా సజావుగా సాగుతుంద నుకునే లో పు వరుణుడి ప్రతాపానికి భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందులోనూ ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా వుంది. వర్షం కారణంగా భక్తుల ప్రదక్షిణకు ఆటం కం ఏర్పడింది. అప్పటికే కొందరు చమటలతో నడుస్తుండటం, మరికొందరు తడుస్తూనే యాత్రను కొనసాగించాల్సి వచ్చింది. అయితే కురుస్తున్న వర్షంతోపాటు ఉరుము లు, మెరుపులు భక్తులను అసహనానికి గురిచేశాయి.

Simhachalam

2023-07-02 14:46:52

PMSY ప‌థ‌కంతో మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి

ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద‌యోజ‌న ప‌థ‌కం ద్వారా మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాల‌ని ఎమ్మెల్యే క‌డుబండి శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. అర్థ‌నాపాలెం క్యాంపు కార్యాల‌యం విజ‌య‌గ‌న‌రం మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు ఎన్‌.నిర్మ‌ల‌కుమారి, రాష్ట్ర కొప్పుల‌వెల‌మ కార్పోరేష‌న్ చైర్మ‌న్ నాయుడు బాబుల‌తో క‌లిసి పీఎంఎస్‌వై ప‌థ‌కంలో మంజూరైన 2 చేప‌ల ర‌వాణా వాహ‌నాల‌(లైవ్ ఫిష్ ట్రాన్స్ పోర్ట్ వెహిక‌ల్‌) ను మ‌త్స్య‌కారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌నరెడ్డి పిఎంఎస్‌వై ప‌థ‌కాన్ని పూర్తిస్థాయిలో ల‌బ్దిదారుల‌కు చేర్చ‌డంలోనూ, ప‌థ‌కం అమ‌లు చేయ‌డంలోనూ ప్ర‌త్యేకంగ ద్రుష్టిసారించి నిర్వ‌హ‌ణ చేప‌డుతున్నార‌ని అన్నారు.  ఫిష‌రీష్ డిడి నిర్మ‌ల‌కుమారి మాట్లాడుతూ,  పిఎంఎస్ వై ప‌థ‌కంలో యూనిట్ ధ‌ర రూ.20 ల‌క్ష‌లు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు 60శాతం, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వారికి 40శాతం రాయితీతో అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం ఎస్సీకేట‌రిగికి ఒక‌టి, జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి అంద‌జేశామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో మ‌త్స్య‌శాఖ అభివ్రుద్ధి కారి సిహెచ్ సంతోష్ కుమార్‌, పిఏసిఎస్ చైర్మ‌న్ జి.శివ‌, ఎల్‌.కోట ఎంపిపి  జి.శ్రీనివాస‌రావు, వేపాడ మండ‌ల‌పాల‌పార్టీ అద్య‌క్షులు ఎం.జ‌గ‌న్నాధం, కొత్త‌వ‌ల‌స జెఏసి ఇన్చార్జి బి.వెంక‌ట‌రావు, కొట్టాంసేనాప‌తి చంద‌ర్రావు, టి.శివాజీ, జి.గ‌ణేష్‌, సిహెచ్పి భీష్మ‌, సంత‌పాలెం ఎంపిటిసి వి.ర‌మ‌ణ‌,  డి.ర‌మ‌ణ‌, అప్ప‌న్న‌దొర‌పాలెం స‌ర్పంచ్ రాముల‌మ్మ‌, పి.వెంక‌టేష్‌, జ‌గ్గ‌న్న‌దొర‌, సోంబాబు, పెద‌బాబు, ఎస్‌.కోట త‌లారి అనంత‌, ఎ.ర‌మేష్‌, జి.రామానాయుడు, సిహెచ్‌.క్రిష్ణ నారాయ‌ణ‌మూర్తి మాష్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-06-30 06:24:32