వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)కు ప్రతీనెలా రావాల్సిన ఆదాయాన్ని ఒక పథకం ప్రకారం అనధికార కాలం చెల్లిన కమిటీ నిర్వీర్యం చేసేసింది. మనం తప్పా ఏ ఇతర కార్యవర్గం విజెఎఫ్ కి ఎంపిక అయినా వారికి ఒక్కపైసా కూడా విజెఎఫ్ నార్లభవన్ నుంచి ఆదాయం రాకుండా చేయాలని ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకొని ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టేసింది. అదీ సంఘం కోశాధికారి ప్రమేయం లేకుండా నేరుగా ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, కార్యదర్శి ముగ్గూరు కలిసే ఈ వ్యవరాన్ని నడిపించారు. ఈ మాట అంటున్నది విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సభ్యులు కాదు. నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులు, గదులు అద్దెకు తీసుకున్న నిర్వహాకులు చెప్పిన మాటలు, వారు విజెఎఫ్ తో కుదుర్చుకున్న ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి. అసలు సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆమోదం లేకుండా అత్యంత తక్కువ ధరకు నార్లవెంకటేశ్వర భవన్ లోని షాపులను అద్దెకు ఇచ్చేసి.. మొత్తం అద్దెను నాలుగేళ్ల ముందుగానే తీసేసుకున్నారు. ఇలా చేస్తే రానున్న రోజుల్లో ఏ కమిటి విజెఎఫ్ కి వచ్చినా ఒక్కపైసా ఆదాయం కూడా రాదు. అదే జరిగితే పాత కాలం చెల్లిన కార్యవర్గమే చాలా బాగా పనిచేసిందనే ప్రచారం అడ్డదారిలో కొట్టేయవచ్చు. పైగా ఇప్పుడు అవకాశం లేకపోయినా తర్వాత అయినా మళ్లీ అవకాశం చేజిక్కించుకోవచ్చు అనేది మాస్టర్ ప్లాన్. అందుకే ఆదాయ, వ్యయాలు, కర్చులు, అగ్రిమెంట్లు విషయాలను కూడా చిట్టా పద్దుల్లో సక్రమంగా చూపించలేదు. సేవ్ విజెఎఫ్ సభ్యులు నిజనిర్ధాణ చేయడం కోసం రంగంలోకి దిగిన సమయంలో ఈ అక్రమాలు బయట పడ్డాయి. వాస్తవానికి ప్రెస్ క్లబ్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా, బైలాను తుంగలోకి తొక్కి, సొసైటీ యాక్టుని అస్సలు అమలు చేయకుండా ఈ అనధికార కార్యవర్గం చేసిన అవినీతి, అక్రమాలు, ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా వీరిని ప్రశ్నించడానికి కొందరు తప్పా మరెవరూ ముందుకి రాకపోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ సొసైటీయాక్టు, విజెఎఫ్ బైలా ప్రకారం ప్రతీ ఆదాయానికి, ఖర్చులకు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చే అకౌంట్స్ లో కోశాధికారి లెక్కలు పక్కాగా ఆధారాలతో సహా చూపించాలి. కానీ ఆదాయాలను, వ్యయాలను భారీ వ్యత్సాసాలతో చూపించిన అనధికార కార్యవర్గం అక్రమాలు నార్లవెంకటేశ్వర భవన్ సాక్షిగా బయటపడ్డాయి. 2012 నుంచి లైవ్ ఉన్న కార్యవర్గం 2015 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనధికారికంగానే 2023 వరకూ కొనసాగుతూ వచ్చింది. కోర్టుకేసుల విషయంలో మోసం, విజెఎఫ్ ఆధాయాలు సమర్పించడంలో మోసం, కనిపించని ఖర్చులకు లెక్కలు చూపించడంలో మోసం, లక్షలు ఖర్చుచేసి స్టార్ హోటళ్లలో గదులు తీయడానికి చేసిన ఖర్చులు మోసం.. ఇలా అడుగడుగునా అనధికార కాలం చెల్లిన కమిటీ మోసం చేస్తూనే వచ్చింది. ఇంకా నార్లవెంకటేశ్వర భవన్ పైని హోర్డింగ్స్ నిర్వహాకులతో చేసుకున్న ఒప్పందాలు బయటకొస్తే వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో బయటకు వస్తుంది. ఇంత జరుగుతున్నా..అనధికార కార్యవర్గంలోని సభ్యులు మేము ఏం తప్పు చేశాం..మాపై విశాఖలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మోసగాళ్లలా 420 కేసులు పెట్టారని నేటికీ ప్రచారం చేస్తుండటం విశేషం. కళ్లకి కట్టినట్టుగా అనధికార కార్యవర్గం నిబంధనలను పక్కపెట్టి మరీ ఇంతటి దురాగతాలకు పాల్పడిన తరువాత కూడా సభ్యులు ఈ రకంగా మాట్లాడటం, ఒక్కొక్కటి అక్రమాలు బయటకు వస్తున్న వేళ.. కార్యవర్గంలోని ఇతర సభ్యులకు కూడా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. విచిత్రం ఏంటంటే ఎక్కడైనా చిన్న మొత్తంలో అక్రమాలు, అవినీతి, మోసాలు జరిగితే పతాక శీర్షిక వార్తలు రాసే విశాఖలోని జర్నలిస్టులు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉంటూ, రూ.లక్షల కోట్ల మేర అవినీతి జరిగినా కనీసం సోకాల్డ్ జర్నలిస్టులు స్పందించకపోవడం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారికంగా విశాఖ జల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున జిల్లా ఆడిట్ అధికారితో విజెఎఫ్ ఆదాయ, వ్యయాలపై లెక్కలు వేయించిన సమయంలో బయటపడిన లక్షల రూపాయల తేడాపైనా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు తప్పా మరెవరూ జరిగిన మోసాలపై ఒక్కడబుల్ కాలమ్ వార్త రాసిన పాపన పోలేదు. ఒక రకంగా చూస్తే..ఈ విధానం కూడా అనధికార కాలం చెల్లిన కమిటీ బాగా కలిసొచ్చింది. విశేషం ఏంటంటే కోశాధికారి ప్రమేయం లేకుండా చాలా వ్యవహారాలు కేవలం ముగ్గురు మూకుమ్మడిగా.. అడ్డదారిన..అడ్డగోలుగా కధనడిపించేశారు. దానికి ఇపుడు ప్రభుత్వ నిబంధనలు, విజెఎఫ్ బైలా ప్రకారం కూడా కోశాధికారే బొక్కల్లోని లెక్కలు బయట పెట్టాలి..లేదంటే దానిని తానే బాధ్యత వహించాల్సి వుంటుంది. ప్రధాన పత్రికలు, ఛానళ్లు, అందులోని జర్నలిస్టులు విజెఎఫ్ లో జరిగిన వ్యవహారాలను బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేయకపోవడంతో అటు అధికారులు కూడా నమ్మే పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, మోసాలు వార్తల రూపంలో సోకాల్డ్ జర్నలిస్టులు, అనధికార కార్యవర్గానికి కొమ్ముకాసే వారు బయట పెట్టకపోయినా.. జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో జిల్లా కలెక్టర్ ఫైవ్ మెన్ కమిటీ తో అధికారికంగా బయట పెట్టారు.
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మోసాన్ని పక్కన పెట్టి... ఇపుడు నేరుగా ఎన్నికలు పెట్టేస్తే అందులో గెలిచేసి గతంలో చేసిన తప్పులు, మోసాలు, అక్రమాలు మాఫీ చేయాలన్నది కాలం చెల్లిన కార్యవర్గం, వారికి అనుకూలంగా వున్న సభ్యుల వ్యూహంగా కనిపిస్తున్నది. దానికి అనుగుణంగానే జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి జరిగిన మోసాలు, అక్రమాలు, అవినీతిపై విచారణ చేయడం కంటే.. ఎన్నికలు పెట్టేయడానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. అదే వ్యవహారం కాలంచెల్లిన కమిటీకి కూడా బాగా కలిసివస్తున్నది. గోడమీద పిల్లివాటంగా వ్యవహరించే కొందరు జర్నలిస్టులు వారి స్వప్రయోజనాల కోసం ఎన్నికలు ఎంత త్వరగాపెట్టేస్తే అంతే త్వరగా జరిగిన మోసాలన్నీ కప్పిపుచ్చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మెజార్టీ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొందరు ప్రధాన మీడియాలోని జర్నలిస్టులు ఎక్కడ విజెఎఫ్ విషయంలో తలదూరిస్తే ఎక్కడ ఫిర్యాదుల బెదిరింపుల భారిన పడాల్సి భయపడుతున్నారు. ఇప్పటికే ప్రశ్నించిన కొన్ని ప్రధాన పత్రికలు, ఇంగ్లీషు పత్రికలు, టివి ఛానళ్ల రిపోర్టర్లపై ఫిర్యాదులు వెళ్లడంతో వారంతా సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ కారణాలతో కూడా కొందరు జర్నలిస్టులు విజెఎఫ్ అక్రమాలు బయట పెట్టే అవకాశం లేకుండా పోతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఫిర్యాదులు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా...ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అవినీతి, అక్రమాలు, మోసాలను ఎవరూ కప్పిపుచ్చే పరిస్థితి అయితే కనిపించడంలేదు. ఇప్పటికైనా సోకాల్డ్ జర్నలిస్టులు తెరపైకి వచ్చి ప్రశ్నించకపోతే వారి యొక్క శచ్చీలతకు అర్ధం లేకుండా పోతుంది. చూడాలి.. ఇంకెప్పుడు ఈ తేడా అనధికార కార్యవర్గం చేసిన వ్యవహారాలను ఎవరు దైర్యంగా ముందుకి వచ్చి ప్రశ్నిస్తారనేది..!