1 ENS Live Breaking News

జూన్30 నుండి శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి  జూలై 2వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6  నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా  దోషాలు జరిగినా,  ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూన్ 30న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 1న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 2న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

Tirupati

2023-06-28 05:59:58

వైజాగ్ లో రాజకీయం..హైదరాబాదులో వ్యాపారం..!

విశాఖలో కిడ్నాప్ కి గురైన నాకుటుంబం విషయంలో మీడియాచేసిన రాద్దాంతానికి తీవ్రమనస్థాపం చెంది తన వ్యాపారాన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విశాఖలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రజలకు సేవచేయడానికి రాజకీయాల్లో ఉంటానని.. ప్రస్తుతం చేపట్టిన నిర్మాణాలు పూర్తయితే కొత్తవి ఏవీ ఇక్కడ చేపట్టనని అన్నారు. కేవలం డబ్బుకోసమే తన కుటుంబం, ఆడిటర్ జివి కిడ్నాప్ జరిగిందన్న ఆయన ప్రభుత్వం నుంచి తనకు సహకారం లేదని వస్తున్న వదంతులు నిజం లేదన్నారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ న్నారు. కానీ లేనిది ఏదో జరిగిపోతున్నట్టు వక్రీకరించి రాయడం తనను ఎంతో బాధకలిగించిందన్నారు. ఎవరైనా కుటుంబసభ్యులకు కిడ్నాప్ కి గురైతే ఎంతగా అల్లాడిపోతారో ఆ బాధ అనుభవించిన తనకు తెలుసునన్నారు. నాకు రౌడీ షీటర్ హేమంత్ కు ఎలాంటి లావాదేవీలు లేవని..కావాలంటే తన ఐదేళ్ల కాల్ డేటాకూడా చెక్ చేసుకోవాలన్నారు. బీజేపి నాయకులు జరిగిన సంఘటనపై సిబిఐ విచారణ చేయాలని అడుగుతున్నారని..తానే ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని..అవసరమైతే సిబిఐకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ కిడ్నాప్ విషయంలో మొత్తం ర.1.75కోట్లు తన కుటుంబాన్ని బెదిరించి తీసుకున్నారన్నారు. దానిని రికవరీ చేశారని చెప్పారు. తనకుటుంబాన్నిమాత్రం తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని..దానిపై అధికారం ఉంటే కాల్చిపడేస్తానని జనసేన పవన్ కళ్యాణ్ అన్నమాట తనకి నచ్చిందని అన్నారు. నాడు చంద్రబాబునాయుడుపైనా అలిపిరిలో మావోయిస్టులు మందుపాతర పెట్టి పేల్చేసిన సంఘటన గుర్తుచేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కిడ్నాప్ లు, హత్యలూ జరుగుతూనే ఉంటాయని..దానిని ప్రభుత్వాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే ఉంటాయన్నారు. ఉన్నది ఉన్నట్టు మీడియారాయాలిగానీ ఏదో జరిగిపోతందన్నట్టు వక్రీకరించి రాయకుడదని..తన కుటుంబం కిడ్నాప్ జరిగిన తరువాత వచ్చిన వివిధ మీడియా కధనాలను ఎంపీ చూపించారు. 

రఘురామక్రిష్ణం రాజు ఒక గజ్జికుక్క..కార్పోటర్ మూర్తియాదవ్ పిచ్చికుక్క..
ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ఒక గజ్జికుక్క అని..ఆఫ్ట్రాల్ కార్పోరేటర్ మూర్తియాదవ్ ఒక పిచ్చకుక్క అని మండిపడ్డారు. నియోజకవర్గానికే వెళ్లని వాడు ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేస్తూ కుక్కలా మొరుగుతూ ఉంటాడని అన్నారు. తాను విశాఖ విడిచిపోతే వీళ్లకి ఏం ఆనందమో తనకు తెలియడంలేదని తానేమీ ఎవరి ఆస్తులూదోచుకోలే దని..వేల నిర్మాణాలు చేసిన తనపై ఒక్క పోలీస్ కేసు కూడా లేదన్నారు. మీడియాలో తన నిర్మాణాలు చేస్తున్న ప్రదేశంలో బాంబు పేళుళ్లు అంటూ వార్తలు రాశారని..కొండలను తవ్వే సమయంలో అదొక చిన్న భాగమన్నారు. ఇక్కడ తన ప్రాజెక్టుకి రాయితీసే అనుమతులు 45రోజులు గడిచినా రాలేదన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన కుటుంబం కిడ్నాప్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కట్టుకదా అని మాట్లాడి..తరువాత తనను పరామర్శించడానికి తన కార్యాలయానికి వస్తానంటే సున్నితంగా తిరస్కరించానని అన్నారు. ఒకపార్లమెంటు సభ్యుడి కుటుంబం కిడ్నాప్ అయితే విశాఖసిపి రెండుగంటల్లో కిడ్నాపర్లను పట్టుకున్నారని అన్నారు. తాను ఆ బాధలో వుంటే మీడియా వక్రీకరించి రాసిన రాతలు..మరికొందరు దానిని రాజకీయం చేయడం తగదన్నారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు రాసిన వార్తలను ప్రదర్శించారు. కిడ్నాపర్లు హేమంత్ పై 13 కేసులున్నాయని, రౌడీ షీట్ కూడా ఉందని, రాజేష్ పై 45 కేసులున్నాయని ఆ వివవారాలను మీడియాకి తెలియజేశారు. తన కుటుంబానికి జరిగినట్టు మరెవరికీ జరగకూడదని అంటూనే ఈకిడ్నాప్ వెనుక ఎవరూ లేరని కేవలం డబ్బుకోసమే జరిగిందని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో కొన్ని టివి ఛానళ్లు ప్రసారం చేసిన వార్తలను కూడా ప్రస్తావించడంతో మీడియా వేసిన ఎదురు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండానే జరిగిన చెప్పలానే ఈ ప్రెస్ పెట్టానని చెప్పిలేచిపోయారు..!

Visakhapatnam

2023-06-21 09:37:03

విశాఖ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గా రాజారెడ్డి

విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ గా ఎస్.రాజారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ప్రస్తుతం డైరెక్టర్ గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్ రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముంబై ఐఐటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి 1995 లో ఎయిర్పోర్ట్ అథారిటీలో జాయిన్ అయ్యానని అన్నారు. గతంలో 2009 నుండి 2015 వరకు విశాఖ విమానాశ్రయంలో విధులు నిర్వహించారని, హుధూద్ సమయంలో నాలుగు రోజుల్లోనే విమాన రాకపోకలను పునరుద్ధరించామని గుర్తుచేశారు. అనంతరం విశాఖ నుంచి బదిలీపై వెళ్లి మహారాష్ట్ర, చెన్నై, ఢిల్లీలో పనిచేశా నన్నా రు. ఢిల్లీ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చానని,  ప్రస్తుతం విమానాశ్రయంలో చేపట్టవలసిన పలు అంశాలను శ్రీనివాసరావు వివరించారని తెలిపారు. గతంలో చేసిన అనుభ వంతో ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి,  ప్రణాళిక బద్ధంగా విశాఖ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Visakhapatnam

2023-06-16 15:54:23

భారత రాష్ట్రపతికి రూ.10 చెల్లించి శుభాకాంక్షలు చెప్పండి

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టినరోజు సందర్భంగా తపాలాశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ-పోస్టు ద్వారా రూ.10 చెల్లించి ఎవరైనా నేరుగా భారత రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. విశాఖపట్నం పోస్టల్ డివిజన్, పౌరులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తపాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రజలను వారి ఆదర్శ వ్యక్తులకు చేరువ చేయడమే లక్ష్యంగా తపాల శాఖ ఇ పోస్ట్ మెసేజ్ల ద్వార ఈ అవకాశాన్ని కల్పిస్తుందని తపాలశాఖ పేర్కొంది. ఆశక్తి గలవారు వారి ఈ నెల 20 తేదిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జన్మదిన సందర్భంగా ప్రజలు తపాల శాఖ లోని ఈ-పోస్టు ద్వారా తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజే యవ చ్చునని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఈ నెల 18వ తేది వరకు విశాఖపట్నం డివిజన్ లోని అన్ని పోస్ట్ ఆఫీసులో వినియోగించు కోవచ్చునని పోస్టల శాఖ పేర్కొంది. 

Visakhapatnam

2023-06-16 09:59:10

శ్రీకాకుళంలో302 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

శ్రీకాకుళం జిల్లాలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో విధులు నిర్వహించుచున్న 302 మంది జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్ మొదటి జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్  శ్రీకేష్ లాఠకర్ ఆమోదించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మన్ డి ఎం ఎ సి, అధ్యక్ష తన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల  సంబంధించిన  విషయాలను  చర్చించించారు.  ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసిన జర్నలిస్టులు ప్రభుత్వ జారీ చేసిన జిఓ నంబర్ 38ను అమలు చేయాలన్నారు. ధరఖాస్తు చేసుకొని సదరు ధరఖాస్తులను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలని అన్నారు. నిబంధనలను అనుసరించి ధరఖాస్తులు చూసి మంజూరు చేయాలని తెలిపారు. డిపిఆర్ఓ కె.బాలమాన్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆన్ లైన్ లో వచ్చిన ధరఖాస్తులను  అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ల మంజూరుకు పరిగణనలోకి తీసుకున్నట్లు కమిటీకీ వివరించారు. 

అనంతరం జిల్లాలో నూతనంగా  ఏర్పాటు కాబడిన కమిటీ సభ్యులు  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మెన్ కు పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు  కె.వేణుగోపాలరావు, కె. శివశంకర్, ఎన్.ఈశ్వరరావు, ఎస్. జోగినాయుడు, కె. జయ శంకర్, ఆర్టీసీ డిపో మేనేజర్, కె.ఆర్.యస్. శర్మ, వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రకాషరావు, కార్మిక శాఖ, కన్వీనర్, డిఐపిఆర్ఓ ఎస్వీ రమణ, డివిజనల్ పౌర సంబంధాల అధికారి నత్తల రాజు, పి.ఆర్.ఓ ఆర్.ఆర్ మూర్తి, ఎఇలు పుణ్యవతి, అప్పలనాయుడు, ఎవిఎస్ జివి రవి కుమార్, ఫోటో గ్రాఫర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-06-16 09:34:17

గ్రామ స‌చివాల‌యాల్లో ప్రత్యేక సేవలు జిల్లా క‌లెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జ‌గ‌న‌న్న శాశ్వత భూహ‌క్కు-భూ ర‌క్ష కార్యక్రమం కింద ఇప్పటి వ‌ర‌కు కాకినాడ జిల్లాలో రీస‌ర్వే పూర్తయిన 11 మండ‌లాల్లోని 121 గ్రామాల‌కు సంబంధించి భూయ‌జ‌మానులు, ప‌ట్టాదారులు, రైతుల‌కు వివిధ సేవ‌ల‌ను గ్రామ స‌చివాల‌యాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ల్యాండ్ పార్సిల్ నంబ‌ర్ ఆధారంగా ప‌ట్టాదారు ఆధార్ సీడింగ్, మ్యుటేష‌న్ బై క‌రెక్ష‌న్‌, ఆటోమేటిక్ ప‌ట్టాదార్ పాస్‌బుక్ ఆర్డ‌రింగ్‌, స‌బ్ డివిజ‌న్‌, ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ స‌ర్వీసులు గ్రామ స‌చివాల‌యాల్లో అందుబాటులో ఉంటాయ‌న్నారు. భూ య‌జ‌మానులు/రైతులు త‌మ‌కు కావాల్సిన స‌ర్వీసు కోసం స‌చివాల‌య డిజిట‌ల్ అసిస్టెంట్ ద్వారా ఏపీసేవా పోర్ట‌ల్‌లో త‌గిన రుసుము చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ఈ అవకాశాన్ని రీ సర్వే పూర్తయిన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Kakinada

2023-06-16 09:20:34

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు షురూ..!

విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు షురూ అయ్యాయి. ఉమ్మడి విశాఖజిల్లా యూనిట్(అనకాపల్లి, అల్లూరి పాడేరు) గానే ఈ బదిలీల ప్రక్రియ సాగుతున్నది. దీనితో 2కొత్త జిల్లాల సిబ్బంది కూడా విశాఖలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ బదిలీల ప్రక్రియ ఈనెల 20వరకూ కొనసాగనున్నది. ఇప్పటికే కొత్త ఇక్కడ పనిచేసి కొత్త జిల్లాలకు వెళ్లిన వారు కూడా అధికంగానే దరాఖాస్తులు చేసుకున్నారు. మరో వైపు ఫారెన్ డిప్యుటేషన్ పై వెళ్లిన సిబ్బంది కూడా తిరిగి జిల్లాకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున సిబ్బంది బదిలీలకు దరఖాస్తుచేసుకోవడంతో విభాగాలుగా వారీగా ప్రక్రియను చేపట్టారు అధికారులు. తొలిరోజు మూడు కేడర్ల సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ఇలా అన్ని కేడర్లలోని సిబ్బందికి ఈసాధారణ బదిలీలు జరగనున్నాయి. చాలామంది కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు అన్నిదారులను వినియోగించుకుంటున్నారు. రోడ్ పాయింట్ పీహెచ్సీల ఖాళీలను కొన్నింటిని కావాలనే బ్లాక్ చేసినట్టు తెలిసింది.

Visakhapatnam

2023-06-16 06:24:55

సచివాలయ ఉద్యోగులకు అర్థరాత్రి వరకూ బదిలీలు..!

ఉమ్మడి విశాఖజిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి వరకూ బదిలీల ప్రక్రియ కొనసాగింది. చాలా వరకూ చేసుకున్న దరఖాస్తులను అనుసరించి బదిలీలు చేపట్టారు. మొత్తం ఐదు విభాగాల్లోని ఉద్యోగులకు ఈ బదిలీలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు(డిసేబిలిటీ)కలిగిన వారు 14 మంది దరఖాస్తుచేసుకుంటే 14మందికీ చేపట్టారు.మెడికల్ గ్రౌండ్స్ క్రింద 48 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 20మందికే బదిలీలు చేశారు. సింగిల్ ఉమెన్ కేటగిరీలో 21 దరఖాస్తులు రాగా ఐదుగురికి, స్పౌజ్ కోటా క్రింద 61 దరఖాస్తులు రాగా31 మందికి, ఎంఆర్ కేటగిరీ కింద ముగ్గురు దరఖాస్తు చేసుకుంటే ముగ్గురికి మ్యూచ్ వల్ క్రింద42 మంది దరఖాస్తు చేసుకుంటే 42 మందికీ బదిలీలు చేపట్టారు. ఆయావిభాగాలకు చెందిన జిల్లా అధికారులు ఈ కౌన్సిలింగ్ కు హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తిచేశారు. కాగా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రింద దరఖాస్తుచేసుకున్నవారికి ప్రభుత్వం త్వరలోనే తేదిని ప్రకటించనుంది. 

vizag

2023-06-16 02:52:52

ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి..జివిఎంసీ మేయర్

ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె 2వ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ, బాలాజీ నగర్, శ్రీకాంత్ నగర్, పెదగదిలి జంక్షన్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మతో కలిసి పర్యటించి వార్డులోని సమస్యలపై మేయర్ కమిషనర్ తో చర్చించారు. ముఖ్యంగా ఆరిలోవ కళ్యాణమండపం పునర్ధర్మ పనులు వేగవంతం చేయాలని, ఆరిలోవ జంక్షన్ అభివృద్ధి, ఆరిలోవ ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించి వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్మించి తిరిగి వారికే ఇవ్వాలని, కేర్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేయడం, బీటీ రోడ్డు నిర్మించవలసి ఉందని మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ స్పందిస్తూ పనులు అంచలంచలుగా అభివృద్ధి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, డిడిహెచ్ దామోదరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఏఎంఓ హెచ్ కిషోర్, ఏఈ అప్పాజీ పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-14 08:14:47

అనకాపల్లి జిల్లాలో160 మందికి ప్రెస్ అక్రిడిటేషన్లు

అనకాపల్లి జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహించుచున్న 160  మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రతిపాదనలను ఆమోదించామని జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్  రవి పట్టన్ శెట్టి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంబంధించిన  విషయాలను చర్చించామన్నారు. అక్రిడిటేడ్ జర్నలిస్టులకు వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని  వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్,  జిల్లా కో ఆర్డినేటర్ డా.రాజేష్ ను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేయని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్.38, తేదీ 30-3-2023 ననుసరించి ధరఖాస్తు చేసుకొని సదరు ధరఖాస్తులను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు. 
అంతకు ముందు జిల్లాలో నూతనంగా  ఏర్పాటైన కమిటీ సభ్యులు  జిల్లా కలెక్టర్ ను పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు  కె.చంద్రరావు, వి.లోవరాజు, కె.చంద్రశేఖర్, యస్ కె.చాంద్ బాష, టి.రమేష్, కార్మిక శాఖ, ఆర్.టి.సి, రైల్వే, హౌసింగ్ అధికారులు, కన్వీనర్, మెంబరు కె.ఇంద్రవతి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-13 13:21:17

కాకినాడలో ప్రతీ మంగళవారం డయల్ యువర్ ఎస్పీ

ప్రజలకు సత్వరమే న్యాయం అందించాలనే లక్ష్యంతో  కాకినాడ జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ “ డయల్ యువర్ ఎస్పి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఆ విషయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా ఫోనుచేసి ఎస్పికి  తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కలుగుతుంది.  ప్రతి మంగళవారం ఉదయం 11 నుంచి 12 గం.ల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలు 0884- 2371744 అనే నెంబరుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఫిర్యాదుపై నేరుగా అధికారులతో అక్కడ నుండే ఫోన్ కాల్ లో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు, బెదిరింపలు తదితర సమస్యలపై బాధితులు డయల్ యువర్ ఎస్పి కార్యక్రమంలో ఫిర్యాదుచేయవచ్చనన్నారు.  ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్ కోరారు. ఈ పాత్రికేయ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ పి.శ్రీనివాస్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్  సిహెచ్.రామ కోటేశ్వరరావు, ఐ.టి. కోర్ ఇన్స్పెక్టర్  పి.శ్రీనివాసరావు, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరుడు, ఐ.టి. కోర్ ఎస్.ఐ.  డి.రామక్రిష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-06-13 07:40:00

ఏఎస్ఆర్ జిల్లాలో 2565.81 ఎకరాల భూమి పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిరుపేదలకు భూముల పంపిణీ సంబంధించిన అసైన్మెంట్ కమిటీసమావేశం మంగళవారం జరిగింది. కమిటీ చైర్మన్, ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో జూoమీటింగ్ ద్వారా మంత్రి అమర్నాథ్ అధికారులు, అనధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో పాడేరు, అరకు,రంపచోడవరం ఎమ్మెల్యేలు కే భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణుడు, ధనలక్ష్మి ఎమ్మెల్సీలు, కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, చింతూరు సబ్ కలెక్టర్ సూరజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్స్వాల్ తదితరులు పాల్గొన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 550 మంది లబ్ధిదారులకు 777.45 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది.అలాగే పాడేరు నియోజకవర్గం సంబంధించి 561 మంది లబ్ధిదారులకు 499.53 ఎకరాల భూ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. 

రంపచోడవరం నియోజకవర్గంలో 560 మంది లబ్ధిదారులకు 1288.83 ఎకరాల భూమినిపంపిణీ చేయాలని సమావేశం నిర్ణయించింది. మొత్తం మీద ఈ జిల్లాలో 1671 మంది లబ్ధిదారులకు 2565.81 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలుమాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో అర్హత కలిగిన వారు ఇంకా మిగిలి ఉన్నారని వారికి కూడా తగిన న్యాయం చేయాలని మంత్రి అమర్నాధుని కోరగా అటువంటి వారిని గుర్తించి రెండవ జాబితాలో చేర్చాలనిఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూములకు సంబంధించిన పత్రాలు లబ్ధిదారులకు అందజేయన్నామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

Visakhapatnam

2023-06-13 07:18:37

జిల్లాలో విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేయాలి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి స్వచ్చందంగా యువత ముందుకురావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, లయన్స్ బ్లడ్ సెంటర్, న్యూ శ్రీకాకుళం బ్లడ్ సెంటర్,జెమ్స్ బ్లడ్ సెంటర్, పలాసలోని ప్రాణదాత బ్లడ్ సెంటర్, రాజాం జిఎంఆర్ కేర్ బ్లడ్ సెంటర్ సౌజన్యంతో రక్తదాన కార్యక్రమం ఈ నెల 14,15వ తేదీల్లో నిర్వహించ బడతాయని చెప్పారు. రెవిన్యూ డివిజన్ స్థాయిలో జరిగే ఈ రక్తదాన కార్యక్రమం జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం రోజున శ్రీకాకుళంలో గల ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వెనుకనున్న యువ శిక్షణ కేంద్రంలో, పలాస సామాజిక ఆరోగ్య కేంద్రం లోనూ, 15న టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలు నిర్వహించబడ నున్నట్లు కలెక్టర్ వివరించారు. 

కావున ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు, వివిధ సంఘాలు, పెద్దసంఖ్యలో యువత పాల్గొని విరివిగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒకరి రక్తదానం వలన ఇరువురి ప్రాణాలను కాపాడవచ్చని గుర్తుచేశారు. జిల్లాలో రోగులకు సరిపడా రక్తనిల్వలు లేవని, కావున ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకువచ్చి రక్తదానం చేయాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా జిల్లాలోని యువత ముందుకురావాలని, ఒకసారి రక్తదానం చేసినప్పటికీ ప్రతి ఆరు మాసాలకు రక్తదానం చేయవచ్చని సూచించారు. ఆరోగ్య వంతులైన యువత ప్రతి ఆరు మాసాలకు ఒకసారి రక్తదానం చేయడం వలన మరింత ఆరోగ్య వంతులుగా, నూతన ఉత్తేజంతో ఉంటారని చెప్పారు.

Srikakulam

2023-06-12 12:51:56

టీడీపీ ట్రాప్ లో బీజేపీ -టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందని, చెప్పుడు మాటలు వింటే ఆ పార్టీకే నష్టమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  సోమవారం  విశాఖ రైల్వే స్టేషన్ దరి జ్ఞానాపురం ఎర్నిమాంబ దేవాలయం పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తాజాగా ఏపీ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణమన్నారు. చిత్తశుద్ధితో నడుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందన్నారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెబితే వినాలని ఏపి ప్రజలు చూస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాటైన చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని విశాఖ వాసులను అడగడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెస్ట్ ఇన్ ఛార్జి ఆడారి ఆనందకుమార్, కార్పోరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-12 12:21:19

ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు హాజరైన కమిషనర్ కు పలువురు వినతులు అందచేశారు. మంచినీరు, పారిశుద్యం, ఇంటిపన్ను మార్పు వంటి  తదితర అంశాలపై 16 మంది అర్జీలరు అందచేశారు. ఇంటి పన్ను వెయ్యడం లేదని సింహాచల్ నగర్ కి చెందిన ఏ స్వప్న,  ఏవి అప్పారావు రోడ్ నందు బాబానగర్ 6వ వీధి నివాసులు స్పిరిట్ హౌస్ కిచెన్ గది నుంచి కాలుష్యం,  డి జే శబ్ద కాలుష్యం పై పరిష్కారం కోసం ఐ. కిషోర్ కుమార్ తదితరులు, గాదాలమ్మ నగర్ వాసులు డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం, భారీ వాహనాలు వలన ఇబ్బందుల పై పలువురు అపార్ట్మెంట్ వాసులు అర్జి అందచేశారు. ఈ కార్యక్రమంలో  అదనపు కమీషనర్ పియం సత్యవేణి, సిటీ ప్లానర్ జె. సూరజ్ కుమార్, ఇతర మునిసిపల్ అధికారులు  పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-06-12 12:13:22