1 ENS Live Breaking News

SPECIAL CLEANLINESS DRIVE CONCLUDES

The special cleanliness drive focusing hygienic environment in the Railway premises, Waltair Division of East Coast Railway conducted cleanliness drives from 10th August to 16th August2020. The week long Cleanliness drive concluded today leaving a message of committed efforts to achieve Swachh Bharat. A large number of Officers and Staff took part in cleanliness activities at Visakhapatnam, Vizianagaram, Srikakulam, Rayagada, Koraput, Jagdalpur etc stations, work places and colony areas. To create awareness among the travelling public leaflets were distributed and banners displayed at stations. Divisional Railway Manager  Chetan Kumar Shrivastava stressed the importance of the drive and said that such drives shall be organized regularly so that the goal of hygienic environment is achieved. He also underlined the need of public cooperation and active participation without which the mission of Swachh Rail-Swachh Bharat cannot be achieved. The Civil Defence, Scouts & Guides cadets also took active role in the cleanliness drive.

Visakhapatnam

2020-08-16 18:28:19

విశాఖ మన్యంలో మరో 46 మందికి కరోనా పాజిటివ్

విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటిడిఏ పరిధిలోని 11 మండలాల్లో 103 మందకి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా అందులో 46 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ చెప్పారు. ఆదివారం ఏజెన్సీ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించామన్నారు. నేటితో మొత్తం 3994 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఏజెన్సీలో 505 మంది పాజిటివ్ కేసులు ఉండగా,  అందులో ఇప్పటి వరకూ 242 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. ముగ్గురు కరోనాతో మ్రుతిచెందారన్నారు. 44 కంటైన్ మెంట్ జోన్లు కొనసాగుతున్నాయన్న ఆయన నేటి వరకూ 150 విటిఎం కిట్లు, ఆర్డీకే కిట్లు 2525 అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Paderu

2020-08-16 17:55:52

రక్తాన్ని దానం చేసేవారే నిజమైన హీరోలు...

ప్రముఖ సినినటుడు ,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా  రెండవ రోజు ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెండ్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ సమక్షంలో జిల్లాలోని మెగా ఫ్యామిలీ అభిమానులంతా కలిసి ఈ మెగా రక్తదాన శిభిరంలో పాల్గోని స్వచ్చంధంగా రక్తదానం చేసారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని మరింత ఉత్సాహంగా జీవించవచ్చన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రక్తం కొరత ఉందని ఈ నేపధ్యంలో యువజనులు, మహిళలు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. చిరంజీవి అభిమానులు స్వచ్చంధంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం రక్త దాతలకు పతకాలు , సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు ప్రతి ఏడాది మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా  రెండవ రోజు  మెగా ఫ్యామిలీ అభిమానులతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘాం అనేక సేవా కార్యక్రమాలు చేపడతున్నాయని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు వారి అభిమాన హీరో జన్మదిన వేడుకకు సమాజ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఇచ్చిన స్పూర్తితో చిరంజీవి కుటుంబం మీద ఉన్న అభిమానంతో గత మూడు దశాబ్దాలుగా మెగాస్టార్‌ చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య,  న్యూట్రిషనిస్ట్  నాగరాజు, రామ్ చరణ్ యువత అధ్యక్షుడు తైక్వాండో గౌతమ్, ఉపాధ్యక్షుడు నానిచరనిజం, కార్యదర్శి హరీష్ ఇతర సభ్యులు  మదీనా, తేజ, చైతన్య సాయి, సిద్దు,హరీష్ బిందు సాగర్, చంద్ర శేఖర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ ,తలాడ  శేఖర్ , వెంకీ గణ, హేము బ్రౌన్, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్, కార్తీక్ ,ఖాదర్ , దుర్గా చిత్తూరి,రమేష్ చంటి  వరుణ్ తేజ్ అభిమానులు సీర రుద్రరాజు, నాని  , పెయ్యల చంటి, అంబేద్కర్, ఖాదర్, సాయి, తదితరులు  పాల్గొన్నారు.

Srikakulam

2020-08-16 17:45:28

కోవిడ్19 విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అధికారులు సస్పెన్షన్ ..

కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించే వారిని జిల్లా యంత్రాగం తీవ్రంగా పరిగణిస్తోంది. వీరఘట్టాం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం -2 లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల విధులు నిర్వహించాల్సిన ఇంజనీరింగు సహాయకుడు జి.వెంకటేష్ విధులకు హాజరు కానందున సస్పెన్షన్ చేయగా, తనకు అప్పగించిన పంచాయతీల క్లష్టర్లలో విధులకు హాజరు కాని  క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి, బిటివాడ వెటర్నరీ  అసిస్టెంట్ సర్జన్ పి.చైతన్య శంకర్ ను  సస్పెన్షన్ చేసారు. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ అయిన ఇద్దిరితోపాటు క్లష్టర్ సర్వేలియన్స్ అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) జి.పైడితల్లి సక్రమంగా పర్యవేక్షక విధులు నిర్వహించని కారణంగాను., ఇఓ పి.ఆర్.డి, పంచాయతీ కార్యదర్శి మరియు సచివాలయం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి పి.రాజ్ కుమార్ తమకు కేటాయించిన క్లష్టర్లలో సర్వేలియన్స్ పనులలో పర్యవేక్షణలో లోపం కారణంగా షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ విధులకు నియమించిన అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు. కోవిడ్ విధులను బాధ్యతతో, విద్యుక్త ధర్మంతో నిర్వహించి ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ విధులను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండటం విచారకరమని ఆయన అన్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసామని, అవి విధిగా రేయింబవల్ళు పనిచేయాల్సిందేనని  శ్రీనివాసులు తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తత అవసరమని పేర్కొంటూ ప్రతి ఇంటిలో ఫీవర్ సర్వే జరగాల్సిందేనని, కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశించారు. ఆసుపత్రిలో కనీసం వారం రోజుల పాటు చికిత్స పొందే పరిస్ధితి ఉండాలని చెప్పారు. ఇళ్ళలో చివరి క్షణాల వరకు కరోనా లక్షణాల వ్యక్తులు ఉంటే అందుకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులదే బాధ్యత అని స్పష్టం చేసారు. ప్రజలు కూడా తమకు లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వాలంటీరుకు, సచివాలయంలో ఏర్పాటు చేసిన  కంట్రోలు రూమ్ కు తెలియజేసి సహాయం పొందాలని కోరారు. కరోనా వివక్ష ఉంటుందనే ఆలోచనతో ప్రాణాల మీదకు తెచ్చుకోరాదని ఆయన పిలుపునిచ్చారు. వివక్ష చూపే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు చిన్నవిగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం వలన కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా ఇంటికి చేరవచ్చని సూచించారు. అధికారులు, సిబ్బంది ఇచ్చిన సూచనలు ప్రజలు పాటించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అన్నారు.

Srikakulam

2020-08-16 17:35:23

కొత్తగాజువాకలో ఘనంగా సత్తెమ్మతల్లి జాతర..

కొత్త గాజువాక రాజీవ్ మార్గ్ లో వేంచేసియున్న శ్రీ సత్తమ్మతల్లి అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.సత్తమ్మతల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 65 వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులంతా కరోనా వైరస్ సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూనే అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం అమ్మవారి చరిత్రను తెలిపే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఉత్సవ పర్యవేక్షకులు మద్దాల అప్పారావు,సూరిశెట్టి శివ, శరగడం కోటి, హరనాధ్,సత్తిబాబు, నర్సింగరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Gajuwaka

2020-08-16 16:43:58

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీఒక్కరికీ సాయపడుతుంది..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీ నిరుపేదకు బాసటగా నిలుస్తుందని విశాఖ ఎంపీ ఎవీవీ సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆసుపత్రుల్లో అనారోగ్యాల నిమిత్తం చేరి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి  ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కలను  విశాఖ లా సన్స్ బే కాలనీ పార్టీ ఆఫీస్ లో రూ. 2.52 లక్షలవిలువైన  చెక్ లను ఆరుగురు లబ్ధిదారులకు అందజేశారు .   రేసపువానిపాలానికి చెందిన పూసర్ల వెంకటేశ్వరరావు  కి రూ.1లక్ష, వినాయక నగర్ కి చెందిన ఉప్పాడ రమణమ్మ కి రూ.55 వేలు, రాజీవ్ నగర్ కి చెందిన మల్లూరి నారాయణ రావు కి రూ.40 వేలు ,ఎంవీపీ కాలనీ కి చెందిన కొర్రా ప్రభావతి  కి  రూ.25 వేలు ,పండా వీధికి చెందిన నాయన ఉపేంద్ర కి  రూ.17 వేలు , గాజువాక కి చెందిన  పైడి మాదాన్స్ నివాస్ కి రూ. 15 వేలు చెక్ లను అందజేశారు. ఈ సందర్భంగా  చెక్ గ్రహీతలు ఎంవీవీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. తమని ఈ కష్టకాలంలో ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

Visakhapatnam

2020-08-16 16:36:40

జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయలి

జాతీయ నులుపురుగుల దినోత్సవం (డీ వార్మింగు డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య తెలిపారు.  జాతీయ నులి పురుగుల దినోత్సవంలో భాగంగా కార్యక్రమాన్ని  17వ తేదీ నుండి 20 వ తేదీ  వరకు నాలుగు రోజులు జరుపుటకు ప్రభుత్వం నిర్థయించిందన్నారు. జిల్లాలో 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు డీ వార్మింగ్ మాత్రలు (ఆల్చెండజోల్ 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల వరకు అర (1/2) మాత్ర,,  2 నుండి 19 సంవత్సరాల వయస్సులోపు ఉన్న బాలబాలికలకు అంగన్ వాడి కార్యకర్త, ఆశా, ఎ.ఎన్.ఎమ్ ద్వారా గ్రామములో బాల బాలికలు అందరికి ఈ మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్ధతిలో కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత మరియు మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతీ ఒక్క బాల బాలికలకు ఒక మాత్ర (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఆశాకార్యకర్త, ఏ. ఎస్.ఎమ్ తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్ వాడీ కార్యకర్తల సమన్వయంతో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు గ్లౌసు ధరిస్తూ సానిటైజర్ రాసుకుంటూ, తల్లిదండ్రులు సమక్షంలో దగ్గర వుండి మాత్రలు తినిపించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 1 నుండి 2 సంవత్సరా వయస్సు గల బాలబాలికలు 52,398 మంది, 3 నుండి 5 సం.ల వయస్సు గల బాలబాలికలు 92,193 మంది, 6 నుండి 10 సం.ల వయస్సు గల బాలబాలికలు 1,93,565 మంది, 11 నుండి 19 సం.ల వయస్సు గల బాలబాలికలు 2,53,240 మంది వెరశి 5,91,397 మంది ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. మాత్రలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల పర్యవేక్షణలో అన్ని ఉప కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఆశాకార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు,  స్వచ్చంద సేవా సంఘాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలో పి.హెచ్.సి వైద్యాధికారి, ఎం.పి.డి.ఒ, ఎం.ఇ.ఒ, సి.డి.పి.ఒ, సి.ఆర్.పి. పర్యవేక్షణ  చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలు వేసుకొనడం వలన ఏ విధమైన ఔషద దుష్పరిణామాలు ఉండవని, ఒకవేళ ఔషద దుష్పరిణామాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పి. హెచ్.సి. వైద్యాధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా సమన్వయ అధికారిగా, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమము ప్రోగ్రాం ఆఫీసర్స్, జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.

Srikakulam

2020-08-16 14:48:04

ఆర్కె మీనాను ఘనంగా సత్కరించిన వంశీక్రిష్ఱశ్రీనివాస్..

విశాఖనగర పోలీస్ కమీషనర్ ఆర్కేమీనా విశాఖ నుంచి డీజీపీ ఆఫీసుకు బదిలీ అయిన సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఘనంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పోలీస్ కమీషనర్ గా విశాఖ నగరాన్ని శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.  కరోనావంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు,సిబ్బందికీ అన్నివిధాలుగా  అందించిన సేవలకు విశాఖవాసులు ఎంతగానో మిమ్మల్ని గుర్తుంచుకుంటారని అన్నారు. ఆర్కేమీనాలాంటి నిజాయితీ, నిబద్దత కలిగిన ఆఫీసర్లు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వ్యక్తి విశాఖ సిపిగా పనిచేసిన కాలంలో అందించిన సేవలు ఎనలేనివన్నారు. మీనా రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వంశీ ఆకాంక్షించారు. అనంతరం ప్రజాసంఘాలు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కూడా వంశీ పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-08-16 14:39:02

గింజర్తి-బొర్రంపేట రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి, గింజర్తి మీదుగా బొర్రంపేట వెళ్లే రహదారి మధ్యలో కొండచరియలు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై మట్టిపూర్తిగా నానిపోయి పెద్ద పెద్ద బండరాళ్లు రాహదారిపై పడుతున్నాయి. దీంతో ఈ రూటులో వెళ్లేవాహన చోదకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు బండరాళ్లు తమపై పడతాయోనని ఆందోలన చెందుతున్నారు. ఈ ప్రాంతీయులు కొండచరిలు విరిగి పడిన విషయాన్ని మీడియాకి ఫోటోలు తీసి పంపించారు. అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క పరిస్థితిని వీడియోలు తీసి సచివాలయ వీఆర్వో ద్వార మండల రెవిన్యూ అధికారులకు తెలియజేశారు. రోడ్డు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Borrampeta

2020-08-16 13:48:19

పోసమ్మ మెడను తాకిన గోదారి వరదనీరు..

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పొసమ్మగండి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీరు అమ్మవారి మెడను తాకింది. మూడు గంటల పాటు వరదనీరు అమ్మవారివిగ్రహం పీక వరకూ చేరుతూనే ప్రవహించింది. అంతేకాకుండా దేవిపట్నం, పూడిపల్లి గ్రామాల్లోకి కూడా నీరు ప్రవేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్నవారిని పడవల సహాయంలో బయటకు తీసుకు వస్తున్నారు. గోదావరి ఉద్రుతి వరనీరు గ్రామాల్లోకి రావడంతో లోతట్టు ప్రాంతాల వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు దేవీపట్నం మండలం తొయ్యూరు వద్ద జూనియర్ కళాశాలలో కూడా వరదనీరు చేరింది. గ్రామంలోని చేరిన నీరు మోకాలు పై వరకూ రావడం విశేషం.

devipatnam

2020-08-16 13:15:56

ఫిట్ ఇండియా యూత్ క్లబ్ తో సంపూర్ణ ఆరోగ్యం..కొప్పల

భారత యువత ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్రంలో మోదీ సర్కారు ఫిట్ ఇండియా యూత్ క్లబ్ లను ఏర్పాటు చేయడం హర్షనీయమని బీజేపీ సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫిట్ ఇండియా యూత్ క్లబ్ కార్యక్రమం ద్వారా యువత రోజుకు గంటపాటు ఫిట్ నెస్ కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. వీటని నిర్వహించేందుకు యువజన సర్వీసులశాఖ, నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా 75 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వీరి సంక్ష కోటి వరకూ పెంచి  ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటైనా ఫిట్ ఇండియాని కార్యకర్తలు,  ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లాలని కేంద్ర యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజీజూ కోరిన విషయాన్ని రామ్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Visakhapatnam

2020-08-16 10:51:49

బొలిశెట్టి గోవిందరావు అక్రమ ఆస్తులపై విచారణ చేయాలి..సోమిరెడ్డి రాజు

స్వాతంత్య్రం సాధించుకోవడం కోసం నాటి మహనీయులు ఆస్తులు దేశం కోసం వదులుకుంటే.. నేటి మన నాయకులు తాను తన బంధువుల పేరున బినామీగా వందల ఎకరాలు భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం మన దుర దుష్టకరమని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రోజు ఆవేన వ్యక్తం చేశారు. ఎస్.రాయవరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎంపిటిసి మాత్రమే అయిన బొలిశెట్టి గోవిందరావు, తన అత్త, మామ ఇద్దరు బావమరుదులు పేరున భూములు బినామీగా కొని విజయనగరముకు చెందిన భార్య కుటుంబసభ్యుల చేతిలో బందీ అయ్యాడన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. అంతేకాకుండా కాకినాడలో తన అక్క పేరున, తన స్నేహితుడు దాసరి దొంగబాబు, లాక్కోజు ఆదిమూర్తి, మరి కొందరి పేరున బినామీగా అక్రమ సంపాదనతో ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. విచిత్రంగా ఎస్.రాయవరం గ్రామంలో సెంటు భూమి, ఇళ్ళుకాని లేవు. ఇక్కడ రాజకీయనాయకుని ముసుగులో అక్రమంగా సంపాదించి ఇతర ప్రాంతాలలో కొంటున్నాడని చెప్పారు. ఇవి కాక ఇంకా ఉన్న ఇతర ఆస్తులను ఎవరికైనా తెలిసి ఉంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమకు తెలియజేయాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కూడా రాజు వివరించారు.

Yalamanchili

2020-08-15 21:29:03

మత్తుమందులకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలి..మంత్రి

మత్తు పదార్ధాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా  ఆయన జిల్లా కలెక్టర్ , సిపిలతో కలిసి  పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణ అనంతరం  మాదక ద్రవ్యాల నిషేధం, మత్తుపదార్థాల బానిసలైన వారికి విముక్తి కలిగించడం పై పోస్టర్లను విడుదల చేశారు.  వ్యసన విముక్త భారత్  ప్రచార కమిటీ (నాష్ ముక్త్ భారత్)  రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా మత్తునుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినాయోగం చేసుకోవాలన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సీతామహాలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-15 21:19:41

త్యాగధనులను సేవలు మరువరానివి

 74 వ  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా  సమాచార,  పౌర సంబంధాల శాఖ  కార్యాలయంలో  ఉప సంచాలకులు  వి. మణిరామ్  జెండా ఎగురవేసి  వందనం సమర్పించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  దేశ స్వాతంత్రం కొరకు ఎoతో  మంది నాయకులు, ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను  ఎల్లప్పుడు  గుర్తుంచుకోవాలని,  వారిని స్ఫూర్తి గా తీసుకోని దేశ అబివృద్ధి కి కష్టపడి పనిచేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో పి. ఆర్. ఒ.  వెంకటరాజ్ గౌడ్, అదనపు పి. ఆర్. ఒ. సాయి బాబా  ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-08-15 21:17:33

లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి..కలెక్టర్

విశాఖపట్నం  జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు,  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్   హెచ్చరించారు.   ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులు,సిబ్బంది స్థానికంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు.  ఇందుకు గాను జిల్లా కలెక్టరేట్ నందు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో, తహసిల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. విశాఖపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08912590102 ఆర్టీవో విశాఖపట్నం 8790310433 ; ఆర్డిఓ అనకాపల్లి: 8143631525;  8790879433;. సబ్ కలెక్టర్ నర్సీపట్నం : 8247899530; 7675977897; ఆర్ డి ఓ పాడేరు : 08935-250228; 8333817955; 9494670039; 8331821499.ఇదే విధంగా ప్రతి  తహసిల్దారు కార్యాలయాలలోకూడా కంట్రోల్  రూం లు ఏర్పాటు చేయ బడతాయని తెలిపారు.

Visakhapatnam

2020-08-15 21:11:24