1 ENS Live Breaking News

పరిశ్రమలు స్థాపించాలంటే ఆ అనుమతులు తప్పనిసరి

కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత ప్రారంభించే  పరిశ్రమలలో  భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రారంభించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు.  పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు మాక్ డ్రిల్   నిర్వహించాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని  వాటి పర్యవేక్షణకు గాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలక్టరు  తెలిపారు.     ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తరువాత  పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ  సూచించిన  సిఫార్సుల మేరకు జిల్లాలో  కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వలు జారీ చేసిందన్నారు. ఈ కమిటీ లో చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ (ఎ అండ్ డబ్ల్యు),  డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆప్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్,  రీజనల్ ఆఫీసర్, ఎపిపిసిబి.  డిప్యూటి  ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్,   జిల్లా అగ్నిమాపక అదికారి     మెంబర్లు గాను,  జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ,  మెంబర్ కన్వీనర్ గా ఉంటారని తెలిపారు.   ఆయా పరిశ్రమలు తాము పాటించవలసిన చట్టాలు, నియమాల ప్రకారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదికను సమర్పించాలి. ఈ కమిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిశ్రమలలో  భద్రతా ప్రమాణాలు, ఎన్విరాన్ మెంటల్ ప్రమాణాలు  పరిశీలించాలని తెలిపారు.   మొదటి విడతగా  కెమికల్, కెమికల్ నిల్వ, తయారీ, పేలుడు పదార్దాల తయారీ, పెట్రోలియం పరిశ్రమలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలలో    తనిఖీలు నిర్వహించి నెలవారీగా  నివేదికలు అందజేస్తాయని తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల సమయంలో  తక్షణ స్పందన నిమిత్తం  పరిశ్రమల యాజమాన్యం, కార్మికయూనియన్లు,  టెక్నికల్ నిపుణులు, హెల్త్ డిపార్టుమెంటు, తక్షణ స్పందన బృందాలతో  జిల్లా స్థాయి సంక్షోభ నివారణ గ్రూపు ఏర్పాటుచేసి  దానికి జిల్లా కమిటీ నేతృత్వం వహిస్తుందన్నారు. ఈ కమిటీ  ముఖ్య విషయాలను జిల్లా కలెక్టరు దృష్టికి ఎప్పటి కప్పుడు తీసుకువస్తుందని,  అదే విధంగా పరిశ్రమల భదత్రపై  ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుందని జిల్లా కలెక్టరు తెలిపారు.    

Visakhapatnam

2020-08-12 18:16:11

సచివాలయ నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు

గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల హెచ్చరించారు. బుధవారం తాహశీల్దారులు, ఇంజనీరింగ్ అధికారులతో మన బడి నాడు నేడు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, ఉపాధిహామీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరకువేలీ మండలం లోతేరు సచివాలయం భవన నిర్మాణం ప్రారంభించలేదని తాహశీల్దారిని, ఆర్ ఐ, వి ఆర్ ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే సోమవారం నాటికి పనులు ప్రారంభించక పోతే చార్జిమెమో జారీ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నాడు నేడు పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులు 33 శాతం పురోగతి సాధించారని ఈనెల 17 తేదీ నాటికి 66 శాతం ప్రగతి సాధించాలన్నారు. ఇసుక, సిమ్మెంటు సమస్యలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల పనులు రూఫ్ స్దాయికి రావాలని, ఎలక్ట్రికల్ పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహా పధకం పనులపై సమీక్షిస్తూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులు 70 వేల కుటుంబాలు ఉన్నాయని వారందరికి 150 రోజులు పని కల్పించాలని స్పష్టం చేసారు. రూ.350 కోట్ల ఉపాధిహామీ పనులు చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, రూ.197 కోట్ల పనులు మాత్రమే చేసారని నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని అన్నారు. కాఫీ తోటల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కె వి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, కాఫీ ఎడి రాధాకృష్ట, ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఎపిడి సి.హెచ్. లచ్చన్న, గిరిజన సంక్షేమశాఖ డి. ఇ అనుదీప్ , ఎటిడబ్ల్యూ ఓ రజని తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-12 15:41:33

అన్నవరం దేవస్థానంలో 50 మందికి కరోనా పాజిటివ్..

అన్నవరం, శ్రీ సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో 650 మంది సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా  50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వారంతా  హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇంకనూ దేవస్థానంలో  పనిచేయు సిబ్బందికి 200 పైగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు.  దేవస్థానంలో కేసులు అధికంగా ఉన్నందున స్వామివారి దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి స్వామివారికి ఏకాంతముగా సేవలు చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. హోమ్ క్వారంటైన్ లో వైద్యసేవలు పొందే వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందులు వాడుతూ, బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఈఓ కోరారు.

Annavaram

2020-08-12 13:47:53

ఆశాలకు వైఎస్సార్ చేయూత అమలు చేయాల్సిందే..

ఆశాలకు వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూత పథకానికి అనర్హులను చేయడం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోవడం దారుణమని ఆశా వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ఎస్‌.అరుణ, విశాఖ నగర అధ్యక్షరాలు వి.మేరీ ఆరోపించారు. అందరి మహిళలు మాదిరిగానే ఆశ లకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.  పై ఈ రోజు జగదాంబ జంక్షన్‌ ‌వద్ద గల సిఐటియు కార్యాలయం ఆవరణలో ఆశ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, సు ర్ఘకాలం పోరాడిన తరువాత ఆశాలకు 10 వేల రూపాయల జీతం పెంచిన ప్రభుత్వం, జీతం పెరిగిందనే నేపంతో నేడు మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూత పథకానికి అనర్హులుగా చేయడం అన్యాయమని అన్నారు.  ఈ పథకం ఆశాలకు ఎంతో అవసరమన్న వీరు ఆశాలలో అత్యధిక మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు.  వీరిలో ఎక్కువ మంది వంటరి మహిళలుగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారని కూడా తెలియజేశారు.  అత్యంత పేదరికంలో మగ్గుతూ 14 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే పారితోషికానికి కట్టుబడి వైద్య రంగంలో క్రింది స్థాయిలో పనిచేశారు. జగన్‌ అన్న వచ్చిన తరువాత 10 వేలు రూపాయలు వేతనాన్ని నిర్ణయించారు. వై.ఎస్‌.ఆర్‌. ‌చేయూతతో పాటు అనేక చోట్ల రేషన్‌కార్డులు, పించన్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలుపుదల చేయడాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతంలో పేదలకు 12 వేలు లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, ఆశాలకు 10 వేలు పారితోషికం వస్తున్నా మ పథకాలకు అనర్హులను చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆశాలకు వైఎస్‌ఆర్‌ ‌చేయూత, ఇతర సంక్షేమ పథకాలన్నీ ఆశాలకు వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ఆశాలను ఆదుకోవాలని ఆశలు కోరారు.

Visakhapatnam

2020-08-12 13:32:31

ముందు మీరేంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద,పార్టీ నాయకులు మీద విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి. కాంతారావు అన్నారు. మంగళవారం  వైయస్సార్ విద్యా విభాగం అధ్యక్షుడు  బి. మోహన్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితులకు హోం మంత్రి పదవి ఇవ్వడం ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం డిప్యూటీ సీఎం పదవి దళిత వర్గానికి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  దళితులపై చూపిస్తున్న అభిమానాన్ని వెలగపూడి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక  తెలుగుదేశం పార్టీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు.  రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ని ఉద్దేశించి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు  ప్రణవ్ గోపాల్ నోటికొచ్చినట్లు స్థాయిని మరచి మాట్లాడటం హేయమైన చర్య అన్నారు.  గతంలో దిష్టిబొమ్మ దహనం చేయడానికి వచ్చినప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నా నీకు దేహశుద్ధి జరిగిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కరోనాకు భయపడి హైదరాబాదులో తల దోచుకున్నారని కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ట్రస్ట్ పెట్టి 25 సంవత్సరాల యువకుడిలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు నీషేక్, కె.ప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-11 23:07:34

నేతలను తయారుచేసిన మహానేతను కోల్పోయాం..

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో మంది నాయకులను తయారు చేసిన రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజు మరణించడం చాలా విచారకరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు  బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో కెల్ల జంక్షన్ వద్ద ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, వైకాపా రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాంబశివరాజుఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు.  దివంగత నేత సాంబశివరాజు ఫోటోకు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతోమందిని పార్టీల నాయకులుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది నేతలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించిన కురువృద్ధులు సాంబశివరాజులేని లోటు తీరనిది ఆయన కన్నీరుమున్నీరయ్యారు.  సహకార బ్యాంకు మాజీ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో బడి గుడి నీరు సాగునీరు తాగునీరు ఆస్పత్రులు రోడ్లు తదితర వాటిని పూర్తి చేసిన ఘనుడు సాంబశివుడు అని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా కొనియాడారు. జిల్లా వైయస్సార్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రేగానశ్రీనివాసురావు మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన మహనీయుడు ఆయన అన్నారు.  ఉత్తరాంధ్ర విద్యార్థి సేనఅధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ,,ఈ ప్రాంతంలో రాజకీయ గురువుగా సాంబశివ రాజుని కొలుస్తారని ఆయన అన్నారు. మహనీయుడు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి పార్టీ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.   ఆయన  కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మండల వైయస్ఆర్ పార్టీ నాయకులు పల్లి.కృష్ణ , మంత్రి వెంకటరమణ , అట్టాడ లక్ష్మీనాయుడు నాయుడు చందక బంగారు నాయుడు, రమణ గిడిజల శ్రీను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రాజు, తెట్టింగి మాజీ సర్పంచ్ జమ్ము స్వామినాయుడు, సంఛాన రమేష్ సుంకరినారాయణరావు తెట్టంగి, రాగోలు, గుజ్జంగివలస, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Gurla

2020-08-11 21:33:03

ఇళ్ల పట్లాల కోసం డబ్బులు వసూలు చేస్తే ఉద్యోగం కట్

జగనన్న ఇళ్ళ స్థలాల ఎంపిక ప్రక్రియలో ఎవరైనా చేతివాటాన్ని చూపితే సహించేది లేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలం కోసం ఎంపికైన లబ్దిదారులు 21 రూపాయలు మాత్రమే చెల్లించి వార్డు సిబ్బంది నుండి రశీదు పొందాలన్న ఆమె అదనంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే జీఎంసీ కాల్ సెంటర్ 0863-2345103 / 104 / 105 నెంబర్లలో పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలని చెప్పారు. గుంటూరు నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిథిలో 62,025 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు మంజూరైనట్లు తెలిపారు.  డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిస్తే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

Guntur

2020-08-11 21:18:25

కెజిహెచ్ లోఉద్యోగాలకు ఆగస్టు 14 నుంచి కౌన్సిలింగ్

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో పారామెడికల్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టు జాబితాను కెజిహెచ్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు సూపరింటెండెంట్ డా.పివి.సుధాకర్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్ధులు వారి మెరిట్ జాబితాను  http://www.kghvisakhapatnam.org లో చూసుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు 12వ తేది నుంచి 13వ తేది సాయంత్రం 5 గంటలకు మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్ధులకు ఈనెల 14 నుంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ కి వచ్చే అభ్యర్ధులు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాటికి సంబంధించిన జెరాక్సు కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటోలను రెడీచేసుకోవాలని ఆయన వివరించారు.

Visakhapatnam

2020-08-11 19:48:28

మెడికల్ కిట్ల వ్యవహరాంలో మెడికల్ ఆఫీసర్ సస్పెన్షన్..

ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించి కలెక్టర్ కు నివేధించడంతో మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మరో హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేశారు. కోవిడ్ కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలకి కలెక్టర్ ఆదేశించడంతో.. జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టుడిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనతో ఎంఎన్ఓ బాషాకి లింకులున్నట్టు గుర్తించడంతో బాషా ప్రస్తుతం పరారీలో ఉన్నారు..

Kakinada

2020-08-11 14:54:39

శ్రీక్రిష్ణ పరమాత్ముడు కృపతోనే జీవకోటి మనుగడ..గంట్ల

శ్రీక్రిష్ణ పరమాత్ముడు కృపతోనే జీవకోటి మనుగడ సాధ్యపడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖలోని సాగర్ నగర్ ఇస్కాన్ దేవాలయంలో మంగళవారం శ్రీ కృష్ణుడి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా గంట్ల సతీసమేతంగా క్రిష్ణభగవానుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, మానవ సమాజం మనుగడ శ్రీక్రిష్ణుడి లీలతోనే నడుస్తుందన్నారు. కరోనావైరస్ నుంచి కాపాడాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు స్వామిని  పూజించి క్రిష్ణుడి క్రుపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎంవీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-11 14:15:59

కానిస్టేబుల్ సాహసంతో నిలిచిన యువకుడి ప్రాణం...

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకిన యువకుడిని  హెడ్ కానిస్టేబుల్ (కోర్టు కానిస్టేబుల్ ) జి ప్రభాకర్ రావు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకుంటే.. అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ రావులపాలెం వైపునుండి జొన్నాడ వైపు వస్తుండగా ప్రాత బ్రిడ్జి నుంచి గోదావరిలోకి పడి పోతుండగా  కొత్త బ్రిడ్జి పై రావులపాలెం వైపు వెళ్ళుతున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరరావు గమనించారు. వెంటనే లారీని ఆపి తాడుతీసుకొని కొత్త బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకున్న యువకుడు రమేష్ ను స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. హెడ్ కానిస్టేబుల్ చేసిన సాహసానికి స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.ఈ  విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎస్ శివ ప్రసాద్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా యువకుడు  గోదావరిలో పడిన సంఘటన పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి .

Aalamuru

2020-08-11 14:07:44

ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారుల జాబితా గిరిభూమిలో ..

జిల్లా స్దాయి కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అటవీ హక్కపత్రాల జాబితాను గిరి భూమి వెబ్ సైట్‌లో నమాదు చేయాలని సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా.వేంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐటిడి ఏ కార్యాలయం నుంచి 11 మండలాల తాహశీల్దారులు, మండల అభివృధ్ది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి ఎల్ సి సమావేశంలో 34 వేల క్లైములకు ఆమోదము పొందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండు ఎకరాలు భూమి ఉండాలని ఆదేశించారని చెప్పారు. ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈనెల 9 జరగాల్సిన పట్టాలు పంపిణీ వాయిదా వేసారన్నారు. ఎవరికైన రెండు ఎకరాల కంటే తక్కవ ఉంటే సర్వే చేసి రెండు ఎకరాలు భూమి కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వకూడదన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులను తాహశీల్దార్ కార్యాలయాలకు పంపించి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఆన్‌లైన్ లో నమోదు చేయించాలని ఎంపిడి ఓను ఆదేశించారు. ప్రతీ మండలంలో కనీసం 2500 మంది లబ్దిదారులున్నారని, హుకుంపేట మండలంలో అత్యధికంగా 6300 మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులున్నారన్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతా, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్, ఆధార్ సంఖ్య సక్రమంగా గిరిభూమిలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. తాహశీల్దారులు, ఎంపిడి ఓల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

2020-08-10 21:02:37

ఉత్తరాంధ్రాకు అన్యాయం చేయడానికే రాజధాని అడ్డంకి..

రాజధాని విషయం పై మాట్లాడే అర్హత మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కు లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. సోమవారం నర్సీపట్నంలో  మీడియాకి విడుదల చేసిన వీడియోలో కీలక అంశాలపై మాట్లాడారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమరావతి ని పూర్తి చేయలేదన్నారు. ఆ విషయం మర్చిపోయి నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి  కి వస్తున్నా ప్రజాదరణను చూసి వార్వలేక ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు ఉత్తరాంధ్రా అభివ్రుద్ధి చెందడటం టిడిపికి ఇష్టం లేకే మూడు రాజధానుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి ఏ స్థాయిలో గొంతు చించుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజకీయ ఆటల్లో ఓడిపోయి మనస్సును చంపుకున్న అయ్యన్నపాత్రుడు ఇప్పటికైనా పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు...

Narsipatnam

2020-08-10 21:01:35

కోవిడ్ నుంచి కోలుకున్న 295 మంది డిశ్చార్జ్..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నుంచి  కోలుకుంటూ ఆనందంగా ఇంటి బాటపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో కోలుకుని ఆరోగ్యంగా ఉన్న 29 5 మందిని ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలు, హోమ్ ఐసోలేషన్ ల నుండి డిశ్చార్జు చేసారు. డిశ్చార్జు అవుతూ ఇంటికి వెళుతున్న వారు ఆనందంతో ఉన్నారు. ఆసుప త్రుల్లో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉంచారని, వైద్య సేవలు అందుతున్నాయని వారు పేర్కొంటున్నారు. సకాలంలో లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, ఆలస్యం చేయకుండా వెంటనే ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చేర్చడం జరుగుతోంది. మానసికి ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ చికిత్స అందించడంతోపాటు పౌష్టికాహారం అందించడం తదితర చర్యల వలన త్వరగా కోలుకునే పరిస్ధితి ఏర్పడింది. ఇంటింటి సర్వే చేయడమే కాకుండా ప్రతి సచివాలయాల్లో కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తంచి వెంటనే ఆసుపత్రిలో చేర్పంచే చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికి సాధారణ జ్వరంగా భావించి ఇంటి వద్ద ఉండటం లేదా కోవిడ్ వివక్షకు గురి అవుతామని భావించి సమాచారం ఇచ్చే పరిస్ధితి ఉండేది కాదు. తద్వారా చివరి క్షణాల్లో ఆసుపత్రికి రావడం పూర్తి స్ధాయిలో చికిత్స అందించే స్ధితి లేకపోవడంతో మరణాలు సంభవిస్తుండటాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ జె నివాస్ సచివాలయాల్లో రేయింబవళ్ళు పనిచేసే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఎటువంటి ఆలస్యం జరగకుండా కేసుల వివరాలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఇటువంటి ఏర్పాట్ల వలన ప్రాథమిక స్దాయిలోనే చికిత్స అందించడం వలన కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 11,441 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా అందులో 6,769 మంది కోలుకుని ఇళ్ళకు చేరారు. ప్రస్తుతం జిల్లాలో చికిత్స పొందుతున్న 4,548 మందిలో 2,679 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 1165 మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నారు. కేవలం 704 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల్లో 1854 బెడ్లు ఉన్న సంగతి విదితమే. కోవిడ్ లక్షణాలు ఉంటూ అంబులెన్సు అవసరం అయ్యే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లకు సమాచారం అందించవచ్చును. వారితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ కు గాని,  జిల్లా కంట్రోల్ రూమ్ కు కూడా 08942 240605, 08942 240607 ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేయవచ్చును. కరోనా లక్షణాలు ఉంటే తెలియజేయాలని దండోరా ద్వారా, ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.

Srikakulam

2020-08-10 18:43:21

జీవిఎంసీ డయల్ యువర్ కమిషనర్ కి 17 ఫిర్యాదులు

జి.వి.ఎం.సి.లో సోమవారం నిర్వహించిన  డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17 ఫోన్ కాల్స్ వచ్చాయని ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు చెప్పారు.  టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుండి ఈ కార్యక్రమం  నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03,    2వ జోనుకు సంబందించి 03,  3వ జోనుకు సంబందించి 02, 4వ జోనుకు సంబందించి 01,  5వ జోనుకు సంబందించి 01, 6వ జోనుకు సంబందించి 06, అనకాపల్లి జోనుకు సంబందించి 01, మొత్తము 17 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు.  ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులతో పాటూ, స్పందన కార్యక్రమాలలో స్వీకరించిన ఫిర్యాదులు, మున్సిపల్ పరిపాలన శాఖ వెబ్ సైట్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ డా. జి. సృజన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి, వి. సన్యాసి రావు,               సి.సి.పి. విద్యుల్లత, డి.సి.ఆర్. ఫణిరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు

Visakhapatnam

2020-08-10 18:21:32