ప్రక్రుతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం మంత్రులు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణతో కలిసి అనంరం ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో ముంపుకు గురైన వ్యవసాయ పొలాలను పరిశీలించి, అక్కడి ఉన్న రైతుల మాట్లాడారు. అనంతరం గ్రామ సచివాలయం-1 వద్ద నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనౌైనా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏఒక్కరూ అదైర్య పడొద్దని, అధికారులు పంటనష్టాలను పరిశీలిస్తారని అందరినీ నష్టపరిహారం అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ , మాల కార్పొరేషన్ చైర్మన్ పి అమ్మాజీ, సబ్ కలెక్టర్ కౌశిక్ ఆర్డిఓ వసంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాలు కోనసీమ లంక గ్రామాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , ఎమ్మెల్సీ మాదవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేటుకురి సూర్యనారాయణ రాజు రెండు బ్రుందాలు ఏర్పాటై గ్రామాలను పర్యటించారు. ఈ సందర్భంగా సోము మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎత్తి చూపిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ముంపు ప్రాంత ప్రజలకోసం ఏ ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కాపర్ డాం ఎత్తు పెంచడం వల్లే లంక గ్రామాలకు పెద్ద ఎత్తున వరద నీరుచేరిందన్నారు. ఈ వరదల్లో తూర్పుగోదావరి జిల్లాలో దేవిపట్నం మండలం లో 23 లక్షల క్యూసెక్కుల నీరు అధికం గా చేరటం వల్ల గట్లు తెగిపడుతున్న ప్రభుత్వం విషయాన్ని ప్రభుత్వం దృష్టికితీసుకెలతానని స్థానికులకు హామీ ఇచ్చారు. ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ తరుపున తక్షణ సాయం 5వేలు అందే విధంగా చర్యలు చేపట్టాలకి ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.
విశాఖ మన్యం అరకులోయ లో తొలి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమశాఖ ప్రోజెక్టు మానిటరింగ్ యూనిట్ ఆధ్వర్యంలో రెంటల్ హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని అరుకు ఎంపీ జి.మాధవి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం ప్రారంభించారు. ఆధార్ నమోదు, చిరునామా మార్పు, ఫోటో,బయోమెట్రిక్ నమోదు, పేరు మొబైల్ ఈమెయిల్, ఆధారకార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో కి వచ్చాయి. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ అరకులోయ, పాడేరు, పెడబయలు చింతపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టీఎస్పీ నిధులతో డుంబ్రిగుడ మండలం సాగర , అరకులోయ మండలం చినలబడు పంచాయతీ రైతులకు మామిడి, నేరేడు, సీతాఫలం, కరివేపాకు, బెండ,ఉల్లి విత్తనాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రతేకాధికారి పి.హెచ్ ఓ జి.ప్రభాకరరావు, ఎంపిడివో జి.వి రాంబాబు, పి.ఎం.యూ.టి డబ్ల్యూ సి..పి.ఓ సంజాయ్ సిన్హా, ఇన్నోవేషన్ పీఓ అంజన, పి ఐ ఓ ఐటీడీఏ వెసివిల, స్పెషల్ కన్సల్టెంట్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పలువురు వైసీసీ నేతలు గోదావరి మధ్యలో పంటు నిలిచిపోవడంతో చిక్కుకుపోయారు. కోటిపల్లి నుంచి ఆయినవిల్లి మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు పలువురు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు పంటులో బయలుదేరారు. అయితే కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక...వీరవల్లి పాలెం మార్గమధ్యలో అకస్మాత్తుగా ఇంజిన్కు రిపేర్ అవడంతో పంటు నిలిచిపోయింది. బోటు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో పంటు అక్కడే నలిచిపోయింది. బోటులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరి కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటు రిపేరుకు ప్రయత్నిస్తున్నారు.
ఆదర్శ ప్రాయమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిజి డాక్టర్లు, హౌస్ సర్జన్లను కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ జెమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ భారీన పడిన వారికి అందుతు న్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లతో సమావేశం నిర్వహిస్తూ వైద్య వృత్తి గౌరవప్రదమైనదన్నారు. ఈ వృత్తిలో ప్రవేశించడం సేవానిరతికి సూచకమని కలెక్టర్ అ న్నారు. గొప్ప వృత్తిలో ఉన్నారని, మంచి సేవలు అందించాలని కోరారు. కరోనా సమయంలో సేవలను అందించడం చారిత్రాత్మకమని కలెక్టర్ చెప్పారు. ప్రతి వ్యక్తికి వైద్యాన్ని అందించి వారూ సంతోషంగా ఇం టికి చేరాలని తద్వారా వారి హృదయాలలో నిలుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ కృషి చేసి వైద్య సేవలను అందించి కరోనా నుండి సమాజాన్ని బయట పెట్టాలని ఆయన చెప్పారు. జిల్లాలో వైద్య సేవలు మ రింత మెరుగ్గా చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, వైద్యులు తమ సేవలను అందించాలని కోరారు. ఈ సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనదని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని కోరారు.
కరోనా వైరస్ ఉద్రుతి అధికంగావున్న సమయంలో రోటరీ క్లబ్ అందించే సహాయం మరువలేనిదని జీవిఎంసీ కమిషనర్ స్రిజన అన్నారు. సోమవారం రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ కెప్టెన్ ఆర్ఎస్ కాళీప్రసాద్ జీవిఎంసికి 400 హోమ్ క్వారంటైన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, విశాఖ జీవిఎంసి పరిధిలో సుమారు 1000 క్వారంటైన్ కిట్లు కావాల్సివుందన్నారు. రోటరీ ద్వారా అందిన కిట్టు 40శాతం రోగులకు సరిపోతాయని చెప్పారు. రోటరీ కెప్టెన్ మాట్లాడుతూ, రోటరీ ద్వారా ప్రతీఏటా ఏదోఒక సేవా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కరోనా సమయంలో రోగులకు ఉపయోగపడేవిధంగా హోమ్ క్వారంటైన్ కిట్లు అందజేయడం జరిగిందని వివరించారు. రాజున్న రోజుల్లో కూడా తమ సేవలు కొనసాగిస్తామని కమిషనర్ కి వివరించారు. కార్యక్రమంలో జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కెఎస్ఎల్జి శాస్త్రి, రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ కార్యదర్శి రోటేరియన్ విఠల్ ప్రసాద్,విశాఖపట్నం కెమిస్ట్స్ సొసైటీ అధ్యక్షుడు బగ్గం శ్రీనివాస రావు, వైజాగ్ వాలంటీర్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
విమ్స్ ఆసుపత్రిలో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన విమ్స్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్, ఇతర వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి పనితీరుపై సమీక్షించారు. వార్డులను సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా పరిశీలించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వసతులు ఆసుపత్రులలో సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందజేస్తున్న సేవలు, వసతులను మరింత మెరుగు పరచుకోవాలన్నారు. ఆసుపత్రిలో గల వసతులను, సేవలను పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని, అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంటు ఆరోగ్య పరిస్థితిని తక్షణం పరీక్షించి, చికిత్సను నిర్దారించాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి వి సుధాకర్, విమ్స్ డైరెక్టరు సత్యవరప్రసాద్, నోడల్ అధికారి ప్రత్యేక ఉప కలక్టరు సూర్యకళ, ఓ ఎస్ డి డా. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వి సత్య సాయి బాబా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఏపియూ డబ్ల్యూజె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారిగా తీసుకువచ్చిన ఆన్ లైన్ క్యాంపైన్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టి .స్వామి అయ్యప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు వి .సత్య సాయిబాబా గౌరవ సలహాదారులు కడలి వరప్రసాద్ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాత్రికేయులు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించారు .ఈ సమావేశంలో భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బోనం శ్రీనివాస్, కోశాధికారి జి సుధాకర్ కార్యవర్గ సభ్యులు తాళ్లూరీ జయకుమార్, హనుమంతరావు, ప్రసన్న కుమార్ ,ఆదిత్య, అయ్యప్ప , నిమ్మల అది ,క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణగా విద్యుత్ స్థంబాలు, స్టార్టర్ లు పూర్తిగా తడిసి ఉన్నాయని, వాటిని ఎవరూ పొరపాటున కూడా తాకి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు పిలునిచ్చారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు. ఇంట్లో కూడా విద్యుత్ ప్లగ్ లు పెట్టే సమయంలోనూ తడిచేతులతో తాకవద్దని చెప్పారు. అలాగే మీ ఇంటికి సంంధించిన సర్వీస్ వైర్లని కాని వాటితో వెలాడే ఇనుపతీగలను కానీ కరెంట్ స్తంభాలను,ఇనుప స్తంభాలను ముట్టుకొనే ప్రయత్నం చేయవద్దని కోరారు. దయచేసి విద్యుత్ షాక్ తో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలన్నా అయన ఏదైనా సమస్య వుంటే మా దృష్టికి తీసుకురావాలని పోలాకి కోరారు.
టీఆర్ఎస్ నేత కారుతో సహా వాగులో గల్లంతు అయిన ఘటనపై మంత్రి కేటిఆర్ స్పదించారు. సిద్ధిపేట కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు గమనించి ముగ్గురిని బయటకు తీసినప్పటికీ కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్... ఈరోజు ఉదయాన్నే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 20 నుండి 26 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఎం ఆలిండియా కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం విశాఖలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ 16 డిమాండ్లతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ సదర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండొవ సారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని కారుచౌకగా కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ప్రజలందరూ కరోనా వైరస్తో ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవల్సింది పోయి వారిపై తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలందరికీ నెలకి రూ. 7,500/-లు ఆరు నెలల పాలు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం, ఆహార వస్తువులు ఇవ్వాలన్నారు. లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీ పధకాన్ని 200 రోజులు పని కల్పించాలని, పట్టణాలు కూడా ఉపాధి హామీని అమలు చేయాలని, కార్మిక చట్టాలు రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలని, కార్పొరేట్ హాస్పటల్స్ దోపిడీని అరికట్టాలని, అసంఘటిత రంగ కార్మికులైన భవన నిర్మాణం, ఆటో, తోపుడుబండ్లు, కాంట్రాక్టు, దినసరివేతన కార్మికులందరికీ పనులు కల్పించాలని, రైతులకు హానిచేసే 3 ఆర్డినెన్స్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26 వరకు విశాఖలో అన్ని సచివాలయాలు, వార్డు, మండల కార్యాలయాలు వద్ద నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో మూడో ప్రమాదహెచ్చరిక జారీచేయడంతో ఇటు రాజమహేంద్రవరంలో కూడా గోదారమ్మ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. రైలు కం రోడ్డు వంతెనకు కేవలం 15 అడుగుల మేర మాత్రమే ఖాళీవున్నట్టుగా వరద ప్రవహాం వస్తోంది. ఈ రాత్రికి మరింతగా వరదనీరు వచ్చే అవకాశాలున్నాయి అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నదిలోకి ఇతర పాయల నుంచి కూడా వరద నీరువచ్చి చేరుతుండటంతో గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. మరోవైపు గోదావరి లంక ప్రాంతాల వారిని, లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాకినాడ కలెక్టరేట్ తోపాటు, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి రెవిన్యూ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొచ్చినా తక్షణమే సహాయక చర్యలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఎన్డీ ఆర్ఎఫ్ బ్రుందాలను కూడా సిద్దం చేశారు. పరిస్థితిపై కలెక్టర్ మురళీధర రెడ్డి ఎప్పటికప్పుడు రెవిన్యూ అధికారులతో మాట్లాడుతున్నారు.
The special cleanliness drive focusing hygienic environment in the Railway premises, Waltair Division of East Coast Railway conducted cleanliness drives from 10th August to 16th August2020. The week long Cleanliness drive concluded today leaving a message of committed efforts to achieve Swachh Bharat. A large number of Officers and Staff took part in cleanliness activities at Visakhapatnam, Vizianagaram, Srikakulam, Rayagada, Koraput, Jagdalpur etc stations, work places and colony areas. To create awareness among the travelling public leaflets were distributed and banners displayed at stations. Divisional Railway Manager Chetan Kumar Shrivastava stressed the importance of the drive and said that such drives shall be organized regularly so that the goal of hygienic environment is achieved. He also underlined the need of public cooperation and active participation without which the mission of Swachh Rail-Swachh Bharat cannot be achieved. The Civil Defence, Scouts & Guides cadets also took active role in the cleanliness drive.
విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఐటిడిఏ పరిధిలోని 11 మండలాల్లో 103 మందకి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా అందులో 46 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ చెప్పారు. ఆదివారం ఏజెన్సీ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించామన్నారు. నేటితో మొత్తం 3994 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఏజెన్సీలో 505 మంది పాజిటివ్ కేసులు ఉండగా, అందులో ఇప్పటి వరకూ 242 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. ముగ్గురు కరోనాతో మ్రుతిచెందారన్నారు. 44 కంటైన్ మెంట్ జోన్లు కొనసాగుతున్నాయన్న ఆయన నేటి వరకూ 150 విటిఎం కిట్లు, ఆర్డీకే కిట్లు 2525 అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ప్రముఖ సినినటుడు ,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెండ్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో, శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ సమక్షంలో జిల్లాలోని మెగా ఫ్యామిలీ అభిమానులంతా కలిసి ఈ మెగా రక్తదాన శిభిరంలో పాల్గోని స్వచ్చంధంగా రక్తదానం చేసారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని మరింత ఉత్సాహంగా జీవించవచ్చన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రక్తం కొరత ఉందని ఈ నేపధ్యంలో యువజనులు, మహిళలు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. చిరంజీవి అభిమానులు స్వచ్చంధంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
అనంతరం రక్త దాతలకు పతకాలు , సర్టిఫికెట్లను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు ప్రతి ఏడాది మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా రెండవ రోజు మెగా ఫ్యామిలీ అభిమానులతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘాం అనేక సేవా కార్యక్రమాలు చేపడతున్నాయని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు వారి అభిమాన హీరో జన్మదిన వేడుకకు సమాజ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఇచ్చిన స్పూర్తితో చిరంజీవి కుటుంబం మీద ఉన్న అభిమానంతో గత మూడు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, న్యూట్రిషనిస్ట్ నాగరాజు, రామ్ చరణ్ యువత అధ్యక్షుడు తైక్వాండో గౌతమ్, ఉపాధ్యక్షుడు నానిచరనిజం, కార్యదర్శి హరీష్ ఇతర సభ్యులు మదీనా, తేజ, చైతన్య సాయి, సిద్దు,హరీష్ బిందు సాగర్, చంద్ర శేఖర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ ,తలాడ శేఖర్ , వెంకీ గణ, హేము బ్రౌన్, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్, కార్తీక్ ,ఖాదర్ , దుర్గా చిత్తూరి,రమేష్ చంటి వరుణ్ తేజ్ అభిమానులు సీర రుద్రరాజు, నాని , పెయ్యల చంటి, అంబేద్కర్, ఖాదర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.