1 ENS Live Breaking News

డాక్టర్ పురుషోత్తం మ్రుతి తీరని లోటు..మంత్రి అవంతి

విశాఖ నగరంలోని  దస్పల్లా హిల్స్ లో డాక్టర్ పురుషోత్తం కుటుంబ సభ్యులను  పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు , ఏఎంసి ప్రిన్సిపాల్,  కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డా..సుధాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, డా..పురుషోత్తం మృతి చాలా బాధాకరమని, ఆయన సమాజానికి ఎంతో సేవచేశారన్నారు. కరోనా వారియర్ గా సేవలందిస్తూ మృతి చెందడం అందరినీ కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కోవిధ్ సమయంలో వైద్యులు దేవుళ్ళుతో సమానమని, కరోనా సేవలు అందిస్తున్న వైద్యులకు ఎంత సహాయం చేసిన తక్కువే నన్నారు. డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు సహాయం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. కోవిడ్ సేవలు అందిస్తున్న వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రత భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆ మేరకు పురుషోత్తం కుటుంబానికి రూ.50 లక్షల సహాయాన్ని కూడా అందిస్తారని మంత్రి వెల్లడించారు.

Visakhapatnam

2020-08-27 15:58:10

ఆలోచింపజేసిన దేవిశ్రీ 3రాజధానుల ఆటపాట...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని సమర్ధిస్తూ, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజాగాయకుడు దేవిశ్రీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటపాట నిర్వహించారు. గురువారం ఆంధ్రాయూనివర్శిటీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు రాజధానులపై దేవిశ్రీ పాడిన పాట అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న మూడు రాజధానుల వలన నిరుద్యోగ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు, ఉత్తరాంధ్రాపూర్తిస్థాయిలో అభివ్రుద్ధి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  కార్యక్రమానికి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇ రమణారెడ్డి, బర్ల మంగరాజు, త్రినాద్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి,  షరీఫ్, నాగరాజు , పోలారావు వీరకుమార్, అప్పలనాయుడు, విజయ్, అప్పలరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2020-08-27 15:33:05

పనులు ప్రారంభించకపోతే డిపాజిట్లు కోల్పోతారు..కమిషనర్

మహా విశాఖ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు డిపాజిట్లు కోల్పోవలసి వస్తుందని జీవిఎంసీ కమిషనర్ డా.స్రిజన హెచ్చరించారు. ఐదు జోన్ల పరిధిలో రూ. 53260.19 లక్షలు ఎస్టిమేట్ లు తయారయ్యాయని ఆమె చెప్పారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 7నెలలు గడిచినా చాలా పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. 25శాతం కంటే తక్కువగా పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ అలాంటి వారిపై ఐదేళ్లు అనర్హత వేటు వేస్తామన్నారు. సుమారు 169 పనులకు సంబంధించి 5 జోన్లలలో టెండర్లు రద్దు చేసి మరోసారి పిలవడానికి కూడా నోటీసులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్టు పనులు పొంది పనులు ప్రారంభించని వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సిఈని ఆదేశించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లతో దగ్గరుండి పనులు నాణ్యతగా చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే నన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-26 19:37:25

సచివాలయ నియామక పరీక్షలకు సిద్ధం కావాలి..కమిషనర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకం కోసం సెప్టెంబర్ 20 నుంచి చేపట్టబోయే పరీక్షలకు అధికారులు సంసిద్ధం కావాలని జి.వి.యం.సి కమిషనర్ డాక్టర్ జి .సృజన అన్నారు. బుధవారం ఈ నియామక పరీక్షల పై పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గ్రామ/ వార్డు సచివాలయం నియామక పరీక్షలకు  క్లస్టర్ ఆఫీసర్లను, రూట్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని, విశాఖపట్నంలో 163 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఈ సంవత్సరం నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్త/అవగాహన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని, 6 అడుగుల బౌతిక దూరం ప్రతి ఒక్కరూ పాటించే టట్లు  వారికి అవగాహన పరచాలన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలలో కోవిడ్ లక్షణాలు కనిపించిన అభ్యర్థులను గుర్తించి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి అక్కడే వారికి వ్రాత పరీక్ష నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

Visakhapatnam

2020-08-26 19:24:34

కరోనాను రూపుమాలంటూ వినాయకునికి పూజలు..వంశీ

కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ విశాఖ నగర్ అధ్యక్షులు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవకోటి విఘ్నాలు తీర్చే గణపతి, కరోనా వైరస్ ను నియత్రిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ను పూర్తిగా రూపుమాపాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రజలంతా స్వచ్చందంగా కరోనా నియంత్రణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా ఇతర సమయాల్లో బయటకు రాకూడదన్నారు. చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్త చూడాలన్న వంశీ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వైద్యఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించాలన్నారు.

Visakhapatnam

2020-08-26 18:59:01

ప్రజాసమస్య వేదికలుగా సచివాలయాలు నిలవాలి..మంత్రి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ  శిల్పరామంలో  సచివాలయం, వార్డ్ సిబ్బంది వాలింటర్స్   తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ముందుగా మదర్ థెరిస్సా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంతరం సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ,  దేశంలోని ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యల సత్వర పరిష్కరంకోసం సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు  చేశారని చెప్పారు.  ప్రభుత్వ పధకాలను వాలింటర్స్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు.  వాలంటీర్లు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే చేరేందుకు వారధులుగా పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతనంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు. ఆయన పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే తక్షణమే చర్యలు తీసుకుంటామని,  లంచం తీసుకోవటం లంచం ఇవ్వటం నేరమేనని చెప్పే,  'దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వాలింటర్స్, సచివాలయం సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బంది  , వార్డ్ వాలింటర్స్  సమస్యలు  తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో అధికారులు పంచాయతీ కార్యదర్శి లు, వాలింటర్స్, నాయకులు పాల్గొన్నారు.

Madhurawada

2020-08-26 18:44:19

అభివ్రుద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి...మంత్రి

విశాఖ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీతమ్మధార  క్యాంప్ కార్యాలయంలో ఆయన  వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, రోడ్లు భవనాలు, విద్యుత్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా జిల్లాలో, భీమిలీ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి   తెలుసుకున్నారు. నియోజకవర్గ పర్యటన సమయంలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను గూర్చి చర్చించారు.  విద్యుత్ సమస్యలు రాకుండా కొత్తగా ఆనందపురం మండలంలో 6, భీమిలీ మండలంలో 4, పద్మనాభం మండలంలో 11 వరకు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియచేసారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి, విద్యుత్ సమస్యలు  పై తక్షణ చర్యలు  చేపట్టాలన్నారు. 

Visakhapatnam

2020-08-26 18:10:17

రెవిన్యూ సేవలు పూర్తిస్థాయిలో అందేలా పనిచేయాలి..

విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని సీతమ్మధార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రెవిన్యూ సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిలా చూడాలని డీఆర్వోకి సూచించారు. ప్రజలు రెవిన్యూ పనుల విషయమై ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీదేనని, ఈ విషయంలో అన్ని మండలాల తహశీల్దార్లను సమన్వయ పరిచి జిల్లాకి మంచి పేరుతీసుకు వచ్చేలా విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో అందే సేవలను మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రజలకు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో మంత్రికి వివరించారు.

Visakhapatnam

2020-08-26 18:09:14

సాయినారు బాధితులకు చెక్కులు పంపిణీ..మంత్రి

విశాఖజిల్లా పరవాడ సాయినారు లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో  జూన్ నెలలో జరిగిన  విషవాయువు లీక్ సంఘటనలో భాదితులకు చెక్కులను బుధవారం సితమ్మధార  క్యాంపు కార్యాలయంలో  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కంపెనీలు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయినారు లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తూ విషవాయువు లీక్ ఘటనలో  నాగేంద్ర రావి మృతి చెందగా  ప్రభుత్వం ఎక్స్ గ్రేషియోను ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.50 లక్షలు ప్రకటించారు. దానికి సంబంధించి మృతుని భార్య విజయలక్ష్మి కి రూ.35 లక్షల చెక్కును తల్లిదండ్రులకు రూ.15 లక్షలు చెక్కును అందజేశారు.ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకరికి ఇంతకుముందే ఎక్సగ్రేషియో సంబందించిన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి.కిషోర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-26 17:59:22

‌బౌధ కట్టడాల రక్షణ ఉద్యమానికి సిపిఎం మద్దతు..

చారిత్రాత్మక బౌధ కట్టడాల తొట్లకొండపై రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానికి గ్రేహౌండ్‌ ఆఫీసు, గవర్నర్‌, ‌ముఖ్యమంత్రి గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలకు 300 ఎకరాలు కేటాయించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపిఎం జిల్లా కార్యదర్శి డా.బి.గంగారామ్ అన్నారు. బుధవారం బుద్దిస్ట్ ‌మాన్యుమెంట్స్ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో బౌధరామాలు రక్షణకు చేస్తున్న పోరాటంలో వామపక్షాలుగా సిపిఎం పార్టీ మద్దతిచ్చి పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్‌.‌నరసింగరావు సైతం కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా  బుద్ధిస్ట్ ‌మాన్యుమెంట్స్ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ కన్వీనర్‌ ‌కొత్తపల్లి వెంకటరమణ, కో కన్వీనర్‌ ఎం ‌మల్లయ్యరాజు మాట్లాడుతూ, సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తొట్లకొండ గత 30 ఏళ్లుగా అనేక అక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటిని పరిరక్షించుకోవడానికి అనేక ఉద్యమాలు చేసిన నేపధ్యంలో ఈ అక్రమాలను నిలువరించగలిగామన్నారు. 

Jagadamba Junction

2020-08-26 17:49:58

రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలి...

శ్రీకాకుళం జిల్లాలోని రైతాంగానికి ఎట్టిపరిస్థితిల్లోనూ యూరియా కొరత ఉండరాదని   జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులకు స్పష్టం చేసారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులు  పుష్కలంగా ఉన్నాయని, ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్ సమన్వయంతో పనిచేసి జిల్లాలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ బంగ్లాలో రైతాంగానికి యూరియా, విత్తనాలు సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో 23,059 మెట్రిక్ టన్నుల ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఇంకా అదనంగా కావలసిన యూరియాను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత వ్యవసాయ , మార్కెఫెడ్ శాఖల అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రోజు విడిచి రోజు యూరియా నిల్వలు రప్పిస్తున్నామని, నాలుగు మండలాలను ఒక యూనిట్ గా  విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారని, జిల్లాలో ఆగష్టు మాసాంతానికి 18,000 టన్నుల యూరియా అవసరం ఉందని,  ప్రస్తుతానికి 11,698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా                    ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు రానున్నట్లు తెలిపారు. యూరియా తో పాటు డిఎపి 6,400 టన్నులు, ఎంవోపి 2,133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3,488 టన్నులు, ఎస్ ఎస్ పి 1,659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా రైతాంగం వినియోగిస్తున్న ఎరువుల అంచనా ప్రకారం దానిని పరిగణలోకి తీసుకొని లక్ష్యాన్ని నిర్ధేశించామని తెలిపారు. 7,500 మెట్రిక్ టన్నుల ఐపిఎల్ ,వెయ్యి టన్నుల స్పీక్,  వెయ్యి టన్నుల కోరమండల్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, అక్రమంగా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కు  వివరించారు. జిల్లాలో రైతాంగానికి సక్రమంగా వాటిని పంపిణీ అయ్యేలా చూడాలని, ఏ ఒక్క రైతు నష్టపోరాదని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, డి.సి.సి.బి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, ఆత్మా పథక సంచాలకులు కె.కృష్ణారావు, క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-08-26 17:27:08

విశాఖజిల్లాలో వేగంగా ఓటర్ల నమోదు..జిల్లా కలెక్టర్

విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం అమరావతి  నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న సహాయ ఎలక్టోరల్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  మాట్లాడుతూ, జనవరి15 నాటికి  ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి  చర్యలు తీసుకోవాలని ఎన్నికల   అధికారులను ఆదేశించారు.   ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల దరఖాస్తులను జనవరి5 నాటికి పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ని బూత్ స్థాయి అధికారులుగా నియమించాలన్నారు. నియోజకవర్గ ఇ.ఆర్.ఓ లు లేనిచోట సీనియర్ అధికారులను ఇ.ఆర్.ఓ లుగా  నియమించాలన్నారు.రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలన్నారు.   ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు నమోదయ్యెందుకు   సెప్టెంబర్28,29 తేదీలు, నవంబర్ 12,13 తేదీల్లో  స్పెషల్ క్యాంపన్ డేస్ గా  విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.  రాష్ట్రంలో యువతకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, నియోజకవర్గాల ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-25 19:21:47

విశాఖజిల్లాలో వేగంగా ఓటర్ల నమోదు..జిల్లా కలెక్టర్

విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం అమరావతి  నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న సహాయ ఎలక్టోరల్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  మాట్లాడుతూ, జనవరి15 నాటికి  ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి  చర్యలు తీసుకోవాలని ఎన్నికల   అధికారులను ఆదేశించారు.   ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల దరఖాస్తులను జనవరి5 నాటికి పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ని బూత్ స్థాయి అధికారులుగా నియమించాలన్నారు. నియోజకవర్గ ఇ.ఆర్.ఓ లు లేనిచోట సీనియర్ అధికారులను ఇ.ఆర్.ఓ లుగా  నియమించాలన్నారు.రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలన్నారు.   ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు నమోదయ్యెందుకు   సెప్టెంబర్28,29 తేదీలు, నవంబర్ 12,13 తేదీల్లో  స్పెషల్ క్యాంపన్ డేస్ గా  విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.  రాష్ట్రంలో యువతకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, నియోజకవర్గాల ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-25 19:21:42

ఆ అధికారులు కక్షగట్టి రూ.215 కోట్లు పెనాల్టీ వేశారు..

రాజకీయంగా కక్షగట్టి లక్షల్లో గ్రానైట్ వ్యాపారం చేసేవారిని ప్రభుత్వ అధికారులు రూ.215 కోట్ల రూపాయాలు పెనాల్టీ కట్టమనడం ఎంతవరకూ సమంసజమని ఎంఎస్పీ గ్రానైట్ అధినేత పళనివేల్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టెక్కలి నియోజకవర్గంలో లింగాలవలస గ్రామంలో గ్రానైట్ క్వారీ విజిలెన్స్ ఎస్పీ పనసా రెడ్డి ఆధ్వర్యంలో 2019 డిసెంబరులో  తనిఖీ నిర్వహించారు3 రోజులపాటు నిర్వహించిన సర్వేలో కేవలం 26క్యూబిక్ మీటర్ల వరకు పెనాల్టీ వేశారన్నారు. దీంతో  తాము హైకోర్టుకి వెళితే అక్కడ తమకు న్యాయం జరిగి1400 క్యూబిక్ మీటర్లకే పెనాల్టీ వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. తరువాత హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఇద్దరు అధికారులు కక్షగట్టి ఈరోజు కూడా సర్వేచేసి ఇపక్కక్వారీలన్నింటికి కలిపి ఒక్కరినే పెనాల్టీ కట్టాలని వేధించడం బావ్యంకాదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుపుతారని కుటుంబాలకు ఆదుకుంటారని కోరుతున్నామని ఎం ఎస్ పి గ్రానైట్ అధినేత పళని వేల్ తెలిపారు.

2020-08-25 18:56:29