శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటి సర్వేలో కరోనా వ్యాధి లక్షణాల వ్యక్తులను గుర్తించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. బలగ, ఆదివారం పేట వార్డు సచివాలయాల పరిధిలో సప్త వార ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ గురు వారం పరిశీలించారు. ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు గల ఏ ఒక్క వ్యక్తి ఉన్నా గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలన్నారు. 50 ఏళ్ళకు పైబడిన వయస్సుగల వారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారిని కూడా గుర్తించాలని సూచించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్మెంటు జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నమూనాల సేకరణ, పాజిటివ్ కేసుల వివరాలు, కంటైన్మెంటుజోన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు టి.వేణుగోపాల్, టి.వి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులలోని మెడికల్ షాపు ల్లో జనరిక్ మందులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో ని జనరిక్ మందుల షాపు ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఆర్పి ధరలు, రోగులకు ఇస్తున్న ధరలను పరిశీలించారు. ఈ మందులు 50 శాతం దాకా తక్కువ ధరకు వస్తున్నందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ కి చెందిన ఆసుపత్రుల్లోని అన్ని మెడికల్ షాపుల్లో ఈ మందు లే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జెఈవో బసంత్ కుమార్ ను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో కూడా వీటినే ఉపయోగించాలని అన్నారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలపై మందులు కొనుగోలు భారం పడకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే మందులు నాణ్యమైనవనే నమ్మకం ప్రజల్లో తీసుకురావాలన్నారు. జనరిక్ మందుల వాడకాన్ని మరింతగా పెంచాలన్నారు.
ప్రభుత్వం భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జిల్లా కలక్టరు తెలిపారు. గురువారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మద్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ పిర్యాదులు అందుతున్నాయని, వాటిని ఎట్టిపరిస్థితులలోను ఉపేక్షించకూడదన్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికార్లు గ్రామాలలో గల ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలు 22ఎ లో నమోదు చేయాలని తెలిపారు. మండల తహశీల్దార్లు సెప్టెంబరు 1 నుండి 10 వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణను గుర్తించినట్లయితే ఆక్రమణదారులపై తక్షణం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్లు ఫైల్ చేయాలని, కోర్టునకు సమర్పించిన పిదప అక్నాలడ్జ్మెంటు తీసుకొని, కలెక్టరు కార్యాలయంనకు అందజేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వార్తా పత్రికలలో వచ్చే నెగిటివ్ వార్తలు పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సదరు నివేదికలను జాయింటు కలెక్టరు కు పంపించాలన్నారు. పత్రికలలో వార్తకు రిజాయండరు జారీ చేయాలని అదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం.సి. కమీషనరు జి.సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎ.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, సూపరింటెండెంట్ ఎం .సూర్యకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరకంబాడి రోడ్డు నుంచి రేణిగుంట రోడ్డు కు అనుసంధానం కోసం మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ,జనచైతన్య లేఔట్ నుండి డి.బి.ఆర్. రోడ్డు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మాస్టర్ ప్లాన్ నిర్మాణం విషయమై సమగ్ర సర్వే జరిపి నివేదిక సమర్పించాలన్నారు. నగరపాలక సంస్థ శివార్లలో ఉన్న కాలనీలకు, రెండు ప్రధాన రహదారులను ఏర్పాటు చేయడం వలన లీలామహల్, ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహం దగ్గర రద్దీని తగ్గించేందుకు వీలవుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ మాస్టర్ ప్లాన్ కోసం కొంక చెన్నయ్య గుంట, రవీంద్ర నగర్ లకు సంబంధించిన ఫ్లాట్ యజమానులు, రైతులు సదరు సర్వే ను సంబంధిత రికార్డులతో మాస్టర్ ప్లాన్ రోడ్డు కు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం, మున్సిపల్ సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కరోనాను అరికట్టడంలో తమవంతు సాయం అందజేస్తామని లయ న్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు అన్నారు. సంస్థ ప్రతినిధులు గురువారం రూ.10లక్షల విలువ చేసే 3 హై ఫ్లో నేసల్ కాండీలా తెరఫీ ఆక్సిజన్ పరికరాలను కేజీహెచ్ కు విరాళంగా అందజేశారు. వీటిని కలెక్టర్ వినయ్ చంద్ సమక్షంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టీ విజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ వైద్య సేవలు విస్తరణలో మరింత అధునాతన పరికరాలు అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఇంచార్జి గవర్నర్ ఉషారాజు, ఫౌండేషన్ ఏపీ కౌన్సిల్ చైర్మన్ శ్రీనివాస రావు, మాజీ చైర్మన్లు ఏవీఆర్ ప్రసాద్, డీఎస్ఎస్వి వర్మ, ఐఎంఏ జిల్లా కో ఆర్డినేటర్ డా.గోవిందరాజులు, సెక్రటరీ డా.ఫణీందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాలలో గల ఖాళీల భర్తీకి సెప్టెంబరు 20 నుండి 26 తేదీవరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. పరిక్షలకు సుమారు లక్షాయాబది వేల మంది హాజరగుచున్నారని, పరీక్షల నిర్వహణకు 8 క్లస్టర్లుగా విభజించి, 330 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేసారు. ఈ సంధర్బంగా అధికారులకు కలెక్టరు పలు సూచనలు చేసారు. పరీక్షలకు కావలసిన ట్రంకు బాక్సులు, ఇతర మెటీరియల్ వెంటనే సమకూర్చుకోవాలన్నారు. సెప్టెంబరు 1 తేదీకి కావలసిన మెటీరియల్ తెప్పించుకోవాలని తెలిపారు. స్ట్రాంగు రూం లేఅవుట్ తీసుకోవాలని, మెటీరియల్ పంపిణీలో గందరగోలం లేకుండా చూసుకోవాలన్నారు. శాటిలైట్ స్ట్రాంగ్ రూం లకు 18వ తేదీనే మెటీరియల్ పంపించాలని సూచించారు. పరీక్షరోజున స్ట్రాంగ్ రూం నుండి మెటీరియల్ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరే విధంగా రూట్ మ్యాప్, ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉండదని, దానిని బట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన వాహనాలు సమకూర్చు కోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకొనే శాఖలన్నిటిని సమన్వయం చేసుకొని పరీక్షల నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణపై ఇతర శాఖలతో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం .సి . కమీషనరు జి. సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎన్.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈవో నాగార్జునసాగర్ జిల్లా పంచాయతీ అధికారి, ఆంధ్రా యూనివర్శిటీ, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎమ్.ఆర్ పల్లి వైకుంఠపురం ఆర్చి వద్ద శాశ్వత కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ గిరీష ఆదేశించారు. గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి, జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరుగుతున్న పనుల్లో ఎక్కడ తేడా వచ్చినా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కోవిడ్ 19( కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడం కోసం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ని తాత్కాలికంగా ముయించామన్నారు. నగర ప్రజలకి ఆయా వార్డుల్లో అందుబాటులో కోసం తాత్కాలికంగా 9 ప్రదేశాల్లో తాత్కాలిక కూరగాయలు మార్కెట్ ఏర్పాటుచేశామని వివరించారు. ఎంఆర్ పల్లి వాసుల కోసం కొత్తగా వైకుంఠపురం ఆర్చి వద్ద సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మార్కెట్ లో 36 షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్ఈ చంద్రశేఖర్, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2021 కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మేరకు డివిజను అధికారులు, తహశీల్దార్లు, ఇ.ఆర్.ఒ., ఎ.ఇ.ఆర్.ఒ. లతో జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, 2021 సంవత్సరానికి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు ప్రకారం ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. జనవరి 2021 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారి నమోదు, మరణించిన వారి పేర్లు తొలగింపు, కార్యక్రమం చేపట్టాలన్నారు. ఓటరు ఫోటో క్లియర్ గా ఉన్నది లేనిది పరిశీలించాలన్నారు. ఒకే పేరుతో ఎక్కువ కార్డులు ఉంటే మొదట జారీ చేసిన కార్డు ఉంచి మిగిలిన కార్డులు తొలగించాలన్నారు. అదే విధంగా ఒకే నంబరుతో వేరువేరు వ్యక్తులకు కార్డులు జారీ అయితే మొదట జారీ చేసిన వ్యక్తికి ఉంచి మిగిలిన వారికి కొత్త కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోలింగు బూతుకు 1500 ఓటర్ల ప్రకారం సర్దుబాటు చేయాలన్నారు. అవసరమైన చోట కొత్త పోలింగు కేంద్రాలు గుర్తించాలన్నారు. పాడయిన పోలింగు కేంద్రాల స్థానంలో కొత్త పోలింగు కేంద్రాలు ఏర్పాటుకు నిబంధనల ప్రకారం నడచుకోవాలన్నారు. కొత్త పోలింగు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, అభ్యంతరాలు, మార్పులకు సంబంధించి డిశంబరు 15 వరకు వివిధ దశలలో జనవరి 5, 2021 వరకు పరిష్కరించి, జనవరి 15, 2021 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్దం చేయాలని తెలిపారు.
విశాఖ నగరంలోని దస్పల్లా హిల్స్ లో డాక్టర్ పురుషోత్తం కుటుంబ సభ్యులను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , ఏఎంసి ప్రిన్సిపాల్, కేజీహెచ్ పర్యవేక్షక అధికారి డా..సుధాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, డా..పురుషోత్తం మృతి చాలా బాధాకరమని, ఆయన సమాజానికి ఎంతో సేవచేశారన్నారు. కరోనా వారియర్ గా సేవలందిస్తూ మృతి చెందడం అందరినీ కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కోవిధ్ సమయంలో వైద్యులు దేవుళ్ళుతో సమానమని, కరోనా సేవలు అందిస్తున్న వైద్యులకు ఎంత సహాయం చేసిన తక్కువే నన్నారు. డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు సహాయం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు. కోవిడ్ సేవలు అందిస్తున్న వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రత భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆ మేరకు పురుషోత్తం కుటుంబానికి రూ.50 లక్షల సహాయాన్ని కూడా అందిస్తారని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని సమర్ధిస్తూ, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజాగాయకుడు దేవిశ్రీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటపాట నిర్వహించారు. గురువారం ఆంధ్రాయూనివర్శిటీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడు రాజధానులపై దేవిశ్రీ పాడిన పాట అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న మూడు రాజధానుల వలన నిరుద్యోగ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు, ఉత్తరాంధ్రాపూర్తిస్థాయిలో అభివ్రుద్ధి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇ రమణారెడ్డి, బర్ల మంగరాజు, త్రినాద్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, షరీఫ్, నాగరాజు , పోలారావు వీరకుమార్, అప్పలనాయుడు, విజయ్, అప్పలరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.
మహా విశాఖ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు డిపాజిట్లు కోల్పోవలసి వస్తుందని జీవిఎంసీ కమిషనర్ డా.స్రిజన హెచ్చరించారు. ఐదు జోన్ల పరిధిలో రూ. 53260.19 లక్షలు ఎస్టిమేట్ లు తయారయ్యాయని ఆమె చెప్పారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 7నెలలు గడిచినా చాలా పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. 25శాతం కంటే తక్కువగా పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ అలాంటి వారిపై ఐదేళ్లు అనర్హత వేటు వేస్తామన్నారు. సుమారు 169 పనులకు సంబంధించి 5 జోన్లలలో టెండర్లు రద్దు చేసి మరోసారి పిలవడానికి కూడా నోటీసులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్టు పనులు పొంది పనులు ప్రారంభించని వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని సిఈని ఆదేశించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లతో దగ్గరుండి పనులు నాణ్యతగా చేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే నన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకం కోసం సెప్టెంబర్ 20 నుంచి చేపట్టబోయే పరీక్షలకు అధికారులు సంసిద్ధం కావాలని జి.వి.యం.సి కమిషనర్ డాక్టర్ జి .సృజన అన్నారు. బుధవారం ఈ నియామక పరీక్షల పై పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గ్రామ/ వార్డు సచివాలయం నియామక పరీక్షలకు క్లస్టర్ ఆఫీసర్లను, రూట్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని, విశాఖపట్నంలో 163 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఈ సంవత్సరం నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్త/అవగాహన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని, 6 అడుగుల బౌతిక దూరం ప్రతి ఒక్కరూ పాటించే టట్లు వారికి అవగాహన పరచాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలలో కోవిడ్ లక్షణాలు కనిపించిన అభ్యర్థులను గుర్తించి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి అక్కడే వారికి వ్రాత పరీక్ష నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ విశాఖ నగర్ అధ్యక్షులు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవకోటి విఘ్నాలు తీర్చే గణపతి, కరోనా వైరస్ ను నియత్రిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ను పూర్తిగా రూపుమాపాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రజలంతా స్వచ్చందంగా కరోనా నియంత్రణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా ఇతర సమయాల్లో బయటకు రాకూడదన్నారు. చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్త చూడాలన్న వంశీ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వైద్యఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించాలన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ శిల్పరామంలో సచివాలయం, వార్డ్ సిబ్బంది వాలింటర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ముందుగా మదర్ థెరిస్సా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలోని ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యల సత్వర పరిష్కరంకోసం సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వ పధకాలను వాలింటర్స్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. వాలంటీర్లు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే చేరేందుకు వారధులుగా పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతనంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు. ఆయన పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే తక్షణమే చర్యలు తీసుకుంటామని, లంచం తీసుకోవటం లంచం ఇవ్వటం నేరమేనని చెప్పే, 'దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వాలింటర్స్, సచివాలయం సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బంది , వార్డ్ వాలింటర్స్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పంచాయతీ కార్యదర్శి లు, వాలింటర్స్, నాయకులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, రోడ్లు భవనాలు, విద్యుత్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా జిల్లాలో, భీమిలీ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పర్యటన సమయంలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను గూర్చి చర్చించారు. విద్యుత్ సమస్యలు రాకుండా కొత్తగా ఆనందపురం మండలంలో 6, భీమిలీ మండలంలో 4, పద్మనాభం మండలంలో 11 వరకు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియచేసారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి, విద్యుత్ సమస్యలు పై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.