విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యంనాయుడు ఆఖరిలో ప్రచారం అదరగొట్టాడు. గురువారం పాతూరులో యువత, మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించిన కేన్వాసింగ్ ఎంతో సరదా సరదాగా చేపట్టారు. మహిళా అభ్యర్ధులైతే ఓటర్లను చైతన్యపరచడానికి డాన్సులు చేస్తూ, సత్యంనాయుడిని గెలిపించాలని, గ్రామాన్ని మనమే అభివ్రుద్ధిచేసుకోవాలంటూ.. ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) మాట్లాడుతూ, గ్రామంలోని అన్ని వార్డుల్లో సమస్యలనూ తాను స్వయంగా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకోసం ఎవరూ ఎవరిని అర్ధించాల్సిన పనిలేదని, అర్హులైనవారందరికీ తానే దగ్గరుండి సంక్షేమ పథకాలు వచ్చేలా చేస్తానన్నారు. గ్రామం కోసం, గ్రామాభివ్రుద్ధికోసం వచ్చిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని జిల్లా మొత్తం తొంగిచూసేలా మార్చి చూపిస్తానన్నారు. పాతూరులోని పైవీధిలోని వీరభ్రహ్మేంద్రస్వామి, శ్రీక్రిష్ణుడి ఆలయాల అభివ్రుధ్దికి సహాయం చేస్తానన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన మంచినీరు, కమ్యూనిటీహాళ్లు అన్నింటినీ క్రమపద్దతిలో చేపడతానన్నారు. విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటుకి క్రుషిచేస్తానన్నారు. తద్వారా అక్కడ అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసి, పోటీపరీక్షలకు సిద్దమయ్యేవారికోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయిస్తానని యువతకి భరోసా కల్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), పందిరి శివ, పందిరి ఈశ్వరరావు, రాజు, దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక కుమారి, చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోనే క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని అభవ్రుద్ధి చేసే ఒకే ఒక్క నాయకుడు మన పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) మాత్రమే...ఉంగరం గుర్తుకి ఓటేయండి మన గ్రామ అభివ్రుద్ధికి మీ వంతు సహకారం అందించండి...సత్యంనాయుడు గుర్తు ఉంగరం... ఉంగరం గుర్తుకి ఓటేయండి మన ప్రియతమ నాయకుడు సత్యంనాయుడుని సర్పంచ్ గా గెలిపించండి.. అమ్మా మరిచి పోవద్దు మన గుర్తు ఉంగరం...అక్కా మన గుర్తు ఉంగరం..తమ్ముడూ మరిచిపోవద్దు మన గుర్తు ఉంగరం..సొంత పనులకోసం కాకుండా గ్రామాభివ్రుద్ధికి క్రుషిచేసే సత్యంనాయుడుని గెలిపించి గ్రామాభివ్రుద్ధిలో మీరూ భాగస్వామ్యం కండి. మీ అమూల్యమైన అతిపవిత్రమైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్ధన..
ఎన్నికల సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్ ) కేంద్ర, రిసెప్షన్ కేంద్రాలలో అన్ని సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు పూర్తిస్దాయిలో చేపట్టాలని సంబందిత అధికారులను స్దానిక సబ్ కలెక్టరు అనుపమ అంజలి ఆదేశించారు. బుధవారం ఆమె ఆలమూరు కడియం మండలాలలో పర్యటించి ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న రెండవ విడత స్దానిక సంస్దల ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలుసూచనలు ఆదేశాలు జారీచేసారు. ఈ కేంద్రాలు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి వారు నిర్వహించాల్సిన విధులు గూర్చి పూర్తిగా అవగాహన పెంపొందించాలన్నారు. ప్రస్తుత కోవిడ్-19 నేపధ్యంలో బౌతిక దూరాలు పాటించాలని, మాస్కుధారణ, శానిటైజేషన్లు తప్పక పాటించాలన్నారు. ఆదేవిధంగా పోలింగ్ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన ఫర్నీచరును ఏర్పాటుచేయాలని రిప్రెష్మెంటు బోజన వసతుల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ప్రదానంగా భద్రత పరమైన ఏర్పాట్లు అనగా నిరంతర విద్యుత్ సరఫరా , బారికేడింగు ఏర్పాట్లు పిన్సింగ్ మరుగుదోడ్లు త్రాగునీరు, కౌంటింగ్ సామాగ్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్లు సదుపాయం తప్పక కల్పించాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బందిని ఆయా గ్రామపంచాయితీలలో విధులు నిర్వహించుటకు తగు రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలమూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాట్లును చెముడులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లును ఆమె పరిశీలించారు. ఆలమూరు మండలంలో 18 గ్రామపంచా యితీలకుగాను ఒక గ్రామపంచాయితీ ఏకగ్రీవం అయ్యిందన్నారు. 208 వార్డుమెంబర్లకుగాను 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయన్నారు. మిగిలిన 198 వార్డు మెంబర్లు, అదేవిధంగా మిగిలిన 17 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కొన్ని గ్రామపంచాయితీలు ఏకగ్రీవం అయ్యినందున రూట్లు కాని జోన్లు కాని అవసరమైన మార్పులు చేసి వెంటనే సంబందిత అధికారులకు తెలియపర్చాలన్నారు జోనల్, రూటు అధికారులు వెంటనే విధులలో చేరి గ్రామాలలో పర్యటించి ఏర్పాట్లన్నిటిని సమీక్షించుకోవాలన్నారు. ఆ ప్రాంతంలోఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తులుగాని అనుమానితులనుగాని ఉంటే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో చివరి గంటలో అనగా మధ్యాహ్నాం 2,30 గంటల నుంచి 3.30 గంటలవరకు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా సరఫరా కాబడిన వ్యక్తిగత పరిరక్షణ కిట్లు (పిపిఇ) ధరింపజేసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిపోర్టు చేసిన అధికారులు ఎవరైన సహాయం కొరితే రిజర్వులో ఉన్న అధికారులను అవసరార్దం వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పక్రియలో అధికారులు సిబ్బంది ప్రణాళికాయుతంగా నిబంధనల ప్రకారం విధులను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. ఓటరు నిర్బయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఉదయం 6.30 గంటనుంచి మధ్యాహ్నాం 3.30 గంటలవరకు పోలింగ్ ఉంటుందన్నారు.పారదర్శకత కొరకు అతిసమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మపరిశీలకు సమక్షములో వీడియోచిత్రకరణ, వెట్కాస్టింగ్తోపాలింగ్ నిర్వహించాలన్నారు. కడియం ఎంపిడిఓ కార్యాలయం, పోట్టిలంక, దామిరెడ్డిపల్లిలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పూర్తి భద్రతా చర్యల నడుమ కౌంటింగ్ నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ జె సత్యనారాయణ, ఎపిడిఒలు మహేశ్వరరావు, జెఎఝాన్షీతాహిసిల్దార్లు జి.భీమారావు, జి.లక్ష్మీపతి, సురేంద్రరెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా శివాజీ మీకు గుర్తుందా.. ఆ సినిమాలోని డైలాగులే క్రిష్ణదేవిపేట(పాతూరు) ఎన్నికల బరి ప్రచారంలో యువత సత్యంనాయుడుకి వినియోగిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు తరువాత ఏడు..పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అంటూ ఓటర్లను ఆలోచింప చేస్తున్నారు. ఊరిపై పేద ప్రజలను పథకాలకోసం మభ్యపెట్టి దండుకునే అభ్యర్ధి మాకొద్దు..గ్రామాన్ని సొంత నిధులతోనైనా అభివ్రుద్ధి చేసే సరైన నాయకుడే మాకు ముద్దు.. అంటూ యువత తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పుణ్యమాని అల్లూరి సీతారామరాజు చరిత్రను కూడా ఇంటింటికీ తెలియజేస్తూ..తన పోరాటం ప్రజలను పీడిస్తున్న సమస్యలపైనే వుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సత్యంనాయుడు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని పాతూరు ప్రజలకు తాను అండగా ఉంటానని ఎవరూ ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని చెబుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.
ఉంగరం గుర్తుకి ఓటువేస్తే మన గ్రామానికి మహర్ధశ తీసుకు వస్తానని క్రిష్ణదేవీపేటకు(పాతూరు) పంచాయతీ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) అన్నారు. మంగళవారం పాతూరు గ్రామంలోని అన్నివీధులు తిరుగుతూ ఓటర్లును నేరుగా కలిసి ఓట్లను అభ్యర్ధించారు. భారీ అభిమానుల సందోహం మధ్య ప్రచారం చాలా ఉత్సాహం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యంనాయుడు మాట్లాడుతూ, అందరివాడుగా, మీకుటుంబ సభ్యునిగా భావించి ఈ ఎన్నికల్లో తనకు పట్టం కట్టాలని, ప్రతీ ఓటరు ఉంగరం గుర్తుకే ఓటువేయాలని కోరారు. తనను గెలిపిస్తే అన్ని వార్డులను అభివ్రుద్ధిచేసి చూపిస్తానని, ఇప్పటికే వార్డులన్నీ తిరిగి ప్రధాన సమస్యలన్నీ ప్రత్యేకంగా ఒక పుస్తకంపై రాసుకున్నానని ప్రధానత్య కలిగిన సమస్యలను పరిష్కరించి గ్రామస్తులందరికీ సేవచేసుకుంటానని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వంలో గ్రామాన్ని అందరం కలిసి అభివ్రుద్ధి చేసుకోవాలంటే దానికి ఒక్కటే మార్గమని, తనను సర్పంచ్ ని చేస్తే అభివ్రుద్ధి ఎలావుంటుందో చేసి చూపిస్తానని ప్రజలను చైతన్య పరిచారు. పందిరి అప్పారావు తర్వాత ఆయన వారసుడిగా పాతూరు గ్రామానికి సేవచేసే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రజలు, ఓటర్లు అంతా కల్పించాలన్నారు. కేవలం మీకు సేవచేయాలనే లక్ష్యంతోనే లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానని, నన్న మీరంతా ఆదరించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటికే మహిళలు, యువత తమ మద్దతుని తెలియజేశారన్నారు. మిగిలిన వారు కూడా తనను దీవించాలని సత్యంనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.
మన్యం వీరుడు, విప్లవజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సాక్షిగా క్రిష్ణదేవీపేట(పాతూరు) సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుతో ప్రజల్లోకి ప్రచారానికి వెళుతున్నానని పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) చెప్పారు. మంగళవారం గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేటలో తన సర్పంచ్ గుర్తుని అల్లూరి విగ్రహం వద్ద ఉంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో అరాచక బ్రిటీషుపాలనను ఎదిరించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి రచ్చబండ పంచాయతీ పాలనకు అల్లూరి సీతారామరాజు క్రిష్ణదేవీపేట గ్రామం నుంచే శ్రీకారాం చుట్టారని..ఆ మహనీయుని స్పూర్తితో గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించి.. గ్రామాన్ని అభివ్రుద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో తాను సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డానని అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన గ్రామంలో పుట్టిన తెలుగు బిడ్డగా మీ అందరి సహకారం కోరుతూ, నా సర్పంచ్ అభ్యర్ధి ఉంగరం గుర్తుతో ప్రచారం నిర్వహిస్తున్నానని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తనకు ఉందని, అదే నమ్మకంతో ముందుకి సాగుతున్నట్టు చెప్పారు. తాను ఇచ్చే అన్ని హామీలకు కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పూర్తితో సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడిన తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మంజూరు చేసే లక్ష్యంతోనే గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. దాని ద్వారా అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటే పథకాలు ఖచ్చితంగా వచ్చితీరుతాయని భరోసా ఇచ్చారు. పాతూరు గ్రామ ప్రజల కష్టానికే కాకుండా అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానని, మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంచి.. ఉంగరం గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని సత్యన్నాయుడు ఓటర్లను అభ్యర్ధించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.
విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ సర్పంచ్ ఎన్నిక బరిలో వున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యన్నాయుడు(మాజీ సర్పంచ్ అప్పారావు తనయుడు పందిరి సత్యన్నారాయణ) తన పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని వినూత్న రీతిలో చేస్తున్నారు. ఎవరైనా ఓట్లు అభ్యర్ధించడానికి వెళ్లినపుడు తనుకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పడం రివాజు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న గ్రామసచివాలయాల సర్వీసులపై ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పిస్తున్నారు. దీనితో జిల్లాలోనే సరికొత్త పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరతీసిన యువ సర్పంచ్ అభ్యర్ధిగా సత్యన్నాయుడికి గుర్తింపు ఏర్పడింది. ప్రభుత్వం ఏఏ సంక్షేమ పథకాలు ఎవరెవరికి మంజూరు చేస్తుంది? దానికోసం గ్రామసచివాలయంలో ఏ ప్రభుత్వ శాఖ సిబ్బంది ఎవరికి ఏవిధంగా సహాయం చేస్తారు? అర్హులైన వారికి సంక్షేమ పథకాలు రాకపోతే ఎవరిని సంప్రదించాలి? ఏవిధంగా దరఖాస్తుచేసుకోవాలి? చాలా మందిలో పథకం పోతుందనే భయాన్ని ఎలా పోగొట్టాలో? ఆవిధంగా ప్రజలను చైతన్య పరుస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు..! అంతేకాకుండా తన ప్రచారంలో పూర్తిగా ఏ ఇంటికి వెళ్లినా ముందు వారి సమస్యలు, వారి వీధిలో వున్న ప్రధాన ఇబ్బందులను అడిగిన తరువాత, వారికి భరోసా ఇస్తూ తనని గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ వారికి నమ్మకాన్ని కల్పిస్తున్నారు. అక్కడికక్కడే ఒక వ్యక్తి ద్వారా వార్డులోని ప్రధాన సమస్యలు ఒక పుస్తకంపై రాసుకుంటూ తన ప్రచారం, ప్రధాన సమస్యలను గుర్తిస్తూ ముందుకి సాగుతున్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామవాలంటీర్లు వచ్చినా కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు అందలేదనే విషయాన్ని ప్రజలు ప్రచారంలో భాగంగా సత్యన్నాయుడు ద్రుష్టికి తీసుకు రావడంతో ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించుకొని.. సంక్షేమ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఎవరిని సంప్రదించాలో కూడా చెబుతున్నారు. మీకు తెలియకపోతే మీ తరపున తాను ప్రభుత్వకార్యాలయాలకు తిరిగి సమస్య పరిష్కారానికి క్రుషిచేస్తానంటూ ప్రజలకు ఒక పెద్ద నమ్మకాన్ని కలిగిస్తున్నారు. సత్యన్నాయుడు సర్పంచ్ ఎన్నికల ప్రచారం పుణ్యమాని చాలా మందికి సచివాలయంలో ప్రభుత్వం అందించే సేవలు విషయం తెలుసుకోవడానికి వీలుపడింది. సచివాలయంలో 14 ప్రభుత్వశాఖల ద్వారా ఏఏ సేవలు పొందాలో కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు సత్యన్నాయుడు. ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఎవరో రాస్తే రావడం కాదు దరఖాస్తు చేస్తే ప్రతీ అర్హుడైన నిరుపేదకు పథకం ప్రభుత్వం మంజూరు చేస్తుందనే చాలా విషయాలు గ్రామస్తులు తెలుసుకునే అవకాశం రావడం కూడా విశేషం. త్వరలోనే రైతులు కష్టాలు తీరునున్నాయని, గ్రామంలోనే మంచి ప్రాధమిక వైద్యం కూడా ప్రభుత్వమే అందించే ఏర్పాటుచేస్తుందని, ఎవరూ దేనికోసమో ఎవరికోసమో, ఏ పథకమో రాదనికానీ, ఆగిపోతుందని గానీ భయపడాల్సిన పనిలేదని అందరినీ ఉత్సాహ పరుస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సత్యన్నాయుడు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.
అవును మీరు చదువుతున్నది నిజమే పాతూరు(క్రిష్ణదేవిపేట)కి పంచాయతీ పండుగొచ్చింది..అభివ్రుద్ధికి ఆమడ దూరంలో మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరు సలిపిన పోరాటాల పురిటిగడ్డ క్రిష్ణదేవీపేటకు నాటి వైభవం మళ్లీ వచ్చినట్టే కనిపిస్తుంది. 2021 పంచాయతీ ఎన్నికల బరిలో పోటీలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నారాయుడు) తన అనుచరులు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్య మహిళలతో జరుపుతున్న ఎలక్షన్ కేన్వాసింగ్ అచ్చుగుద్దినట్టు పాతూరుకి మరోసారి సంక్రాంతి పండుగ తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా జనంతో గడప గడపకూ జరుపుతున్న ఎన్నికల ప్రచారం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అన్నయ్య బాగున్నావా, తమ్ముడూ ఎలా ఉన్నావ్, అక్కా నేను మీ అందరికోసం వచ్చాను, అత్తా నన్ను మీ చల్లని చేతులతో దీవించాలి, మామ్మ నీ కష్టాలు తీరిపోయినట్టే నీ మనవడు వచ్చాడు, మీ ఏ పనికోసం ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదు, అన్ని పనులూ నేనే దగ్గరుండి చూసుకుంటాను, మీకు జీవితాంతం సేవచేసుకోవడానికే వచ్చాను అంటూ అందరినీ పేరుపేరునా కుటుంబ సభ్యుడిలా పలుకరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న తీరు గ్రామంలో ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. పంచాయతీ పోలీంగ్ కి దగ్గర పడుతుండటంతో అన్ని వర్గాల వారిని ముఖ్యంగా మహిళలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్న తీరుకి మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్నడూ లేని విధంగా క్రిష్ణదేవీపేట పంచాయతీ ఎన్నికల బరిలో నలుగురు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్ధులుగా నిలబడినా, అందరినోటా కాబోయే సర్పంచ్ పందిరి సత్యన్నాయుడే అంటూ అనిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పాతూరు గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా చర్చనీయాంశం అవుతోంది. ఎవరికి వారు ప్రచారం చేపడుతున్నా, సత్యన్నాయుడు చేస్తున్న ప్రచారంలో కొత్తదనం కనిపిస్తుండటంతో గ్రామస్తులందరూ ఈయనికి బ్రహ్మరధం పడుతున్నారు. ప్రధానంగా దుంపలపూడి సహదేవుడు అండ్ కో చేస్తున్న సహకారం హైలేట్ గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మాజీ ఉప సంచాలకులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, ఆర్ఎంపీ బుజ్జీ, పదివార్డులకు చెందిన వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీరామ శోభాయాత్ర విశాఖలోని తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర - అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా బీజేవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్రను ప్రారంభించారు..ఈ సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాటూరి రవీంద్ర మాట్లాడుతూ, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీరామునికి ఆలయం నిర్మించుకునే భాగ్యం మనకి దక్కినందుకు గర్వపడాలన్నారు. వేలాదిమంది భక్తుల ఆధ్వర్యంలో కొనసాగిన శోభాయాత్ర కొత్త వెంకోజిపాలెం పెట్రోల్ బంక్,ఎంవీపీ క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు,టీటీడీ సర్కిల్ నుంచి ఇసుకతోట సిగ్నల్ మీదుగా జాతీయరహదారి చేరుకొని అక్కడి శ్రీకృష్ణ ఆలయం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సభ్యులు, శ్రీరామ భక్తులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవీపేట(పాతూరు) పంచాయతీకి సర్పంచ్ బరిలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు) ప్రచారంలో దూసుకుపోతున్నాడు. పాతూరు గ్రామంలో నిర్వహిస్తున్న కేన్వాసింగ్ కి గ్రామస్తుల నుంచి విశేషంగా స్పందన లభిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాతూరు గ్రామంలో ప్రతీ ఓటరును సత్యన్నాయుడు పలుకరిస్తూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. తనని సర్పంచ్ గా గెలిపిస్తే ఎవరూ ఏ పనికోసం, సంక్షేమ పథకాల కోసం ఎక్కడికీ వెళ్లకుండా తానే అన్నీ అయి చూసుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు. ప్రజాసేవకోసం పంచాయతీకార్యాలయంతోపాటు తన ఇంటిదగ్గర మరో కార్యాలయం ఏర్పాటు చేసి మరీ ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తానని బరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి సచివాలయ స్పందన, మండల కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమాల ద్వారా అర్జీలు పెట్టి అర్హులైన వారందరికీ పథకాలు, రేషన్ కార్డులు వచ్చేలా చేస్తున్నానని ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామపరిధిలోనే అందించే ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. పాతూరు గ్రామాన్ని జిల్లాలోనే ఒక మంచి అభివ్రుద్ధి చెందిన గ్రామంగా తీర్చదిద్దడానికి ప్రతీ ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి గ్రామాభివ్రుద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే తన ఇంటి వద్ద ప్రత్యేక కార్యాలయంల ఏర్పాటు చేశానని దాని ద్వారా సేవలు పొందవచ్చునని ఓటర్లకు చెబుతున్నారు. ఎవరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని బాధపడవద్దని.. అందరికీ సమసన్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొదించి దానిని అమలు చేయడానికే తాను సర్పంచ్ అభ్యర్ధిగా మీ ముందుకి వచ్చానని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. అన్నివర్గాల వారికి సమ న్యాయం చేసేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్ధులను 10 వార్డుల్లో నిలబెట్టామని వారే వార్డులోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకు వస్తారని, ఆ వెంటనే తాను పరిష్కరించి మీ అందరికీ సేవచేసుకుంటానని చెబుతున్నారు. ఎన్నికల్లో అంతా మాటలు చెబుతారని కానీ తాను గ్రామం రూపు రేఖలు మార్చి చూపించడానికే లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకొని మీకు సేవలు చేయడానికే వచ్చానని తెలియజేస్తున్నారు. గ్రామంలో రాజకీయం చేయడానికి తాను ఈసారి సర్పంచ్ గా నిలబడటం లేదని, కేవలం గ్రామాభివ్రుద్ధే లక్ష్యం చేసుకొని మీ అందరి సహకారం ఆశీర్వాదం కోరుతున్నానని ఓటర్లను అభ్యర్ధిస్తూ ముందుకి సాగుతున్నారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు పందిరి వెంకటరమణ(బుజ్జి), అన్ని వార్డుల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.