భారదేశ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కొనసాగుతుందని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మంగళవారం నియోజకవర్గలో గెలుపొందిన సర్పంచ్ లతో కోటవురట్ల మండలం రామచంద్రా పురం శ్రీపతిరాజు పామ్ హౌస్ లో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం మొత్తం ఇపుడు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తుందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉందన్నారు. పేద ప్రజల అభివృద్ధికి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 108 సర్పంచ్ లకు గాను వైఎస్సార్సీపీ అభ్యర్ధులు 86 స్థానాలు గెలుచుకోవడం ఆనందంగా వుందన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించుకున్న మనం త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం వై ఎస్ జగన్ కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్ లను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నేతలు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులు, ఈధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలందరికి ఇల్లు నిర్మాణ పనుల్లో లబ్ధిదారుల సమస్యలను హౌసింగ్ అధికారులు గుర్తించి నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హౌసింగ్ అధికారులు ఆదేశించారు మంగళవారం సామర్లకోట మండలం జి. మేడపాడు, సామర్లకోట అర్బన్ కు సంబంధించిన పేదలందరికీ ఇల్లు నిర్మాణ పనులనుపరిశీలన, భూమి పూజ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గున్నారు.ముందుగా జి మేడపాడు గ్రామంలో 372 మంది లబ్ధిదారులకు కేటాయించిన లేఔట్ లో 6 ఇళ్ల నిర్మాణ పనులకు కలెక్టర్, హౌసింగ్ అధికారుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది అనంతరం సామర్లకోట అర్బన్ సంబంధించి 2258 లబ్ధిదారులకు కేటాయించిన పేదలందరికి ఇళ్ళులేఔట్ లో చేపట్టిన ఇళ్ళ నిర్మాణ పనులను, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి వాటర్ సప్లై ,కరెంటు , మెటీరియల్ స్టోరేజ్, సెక్కురిటీ, తదితర సమస్యలను నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు .హోసింగ్ నిర్మాణ సమస్యలను హౌసింగ్ అధికారులు నివేదిక తయారు చేస్తారని వాటిని సమావేశం చర్చించి పరిష్కరిస్తామని లబ్ధిదారులకు తెలిపారు. లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణానికి లక్ష 80 వేలు లబ్ధిదారులకు విడతలవారీగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ప్రతి ఒక్కరు ఇళ్ళునిర్మాణం చేపట్టాలని తెలిపారు. వాటర్ సప్లై, కరెంటు, పైప్ లైన్, తదితర అంశాలపై, మున్సిపల్ హౌసింగ్ ,పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టర్ చర్చించారు అనంతరం కలెక్టర్ ఇంటి నిర్మాణానికి నిల్వ ఉంచే సిమెంట్ తూరలను, దానికి అయ్యే ఖర్చు గురించి నిర్మాణం చేపట్టిన ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వీరేశ్వర ప్రసాద్, హౌసింగ్ ఇఇ బి. సుధాకర్ పట్నాయక్, డి.ఈ.ఈ. ఆర్.ఎస్.కె. రాజు, మున్సిపల్ కమిషనర్ శేషాద్రి హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు ,మున్సిపల్ డీఈ చదలవాడ రామారావు, టి పి ఎస్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకూ జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ, రిజిష్ట్రేషన్, మ్యాపింగ్, జియో ట్యాగింగ్ తదితర ప్రక్రియలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మహేష్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లోగా రిజిష్ట్రేషన్, మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని మండలాల్లో పురోగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి సాంకేతిక సహకారం కావాలన్నా అందిస్తామని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ నెలాఖరుకు పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు. వంద ఇళ్లు దాటిన లేఅవుట్లను జిల్లా స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులకు చూపించి, వారి సహలహాలను తీసుకోవాలని సూచించారు. 2016 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్ల స్థితిగతులపై నివేదికలను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్వి రమణమూర్తి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు కె.రామచంద్రరావు, కె.రాజ్కుమార్, హౌసింగ్ డిఇలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇంటింటికి బియ్యం పంపిణీ పధకం పక్కాగా అమలు చేయాలని పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీపై మంగళవారం అమరావతి నుంచి జాయింట్ కలెక్టర్లు , ఐటీడీఏ పి.ఓలు, రెవిన్యూ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ లో అలసత్వం వుండకుదన్నారు. సరుకులు పంపిణీపై వాహన ఆపరేటర్ లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ప్రతివాహనానికి సంబంధించిన ఆపరేటర్ హెల్పర్ లను నియమించుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలు ఆపరేటర్ లకు రూ.10 వేలు,హెల్పర్ కు రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఉదయం 7.30 గంటలనుంచి సరుకుల పంపిణీ చేపట్టాలని సూచించారు. వచ్చే నెలనుంచి నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని లబ్ధిదారులకు ముందుగా కూపన్లు పంపిణీ చేసి తరువాత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ 11 మండలాల్లో 144 మినీ వాహనాల ద్వారా పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ కె.లక్ష్మీ శివజ్యోతి. పౌర సరఫరాల డి.టీలు చంద్రశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మారిక వలస లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రతిభా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఖర్గపూర్ ఐ ఐ టిలో మైనింగ్ విభాగంలో సీటు సాధించిన గిరిజన విధ్యార్దిని సందడి నీరజకు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సోమవారం ఆయన కార్యాలయంలో ల్యాప్ టాప్ను బహూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్దులు ఉన్నతమైన స్దానాలను అధిరోహించాలన్నారు. ఐ ఐ టి సీటు సాధించిన గిరిపుత్రికను ఆయన అభినందించారు. మైనింగ్ ఇంజనీరింగ్కు మంచి డిమాండ్ ఉందని ఉన్నతమై ఉద్యోగాలు వస్తాయన్నారు. మైనింగ్ విభాగానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కవన్నారు. బాగా చదువుకుని మన్యానికి మంచిపేరు తీసుకుని రావాలని సూచించారు. పెదబయలు మండలం పరదానపుట్టు గ్రామానికి చెందిన నీరజ ఐ ఐటి సీటు సాధించడం గిరిజన విద్యార్దులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. విజయకుమార్, గురుకుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు విజయఢంకా మోగించారంటూ సర్పంచ్ అభ్యర్ధులను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. సోమవారం భీమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సాధించిన సర్పంచ్ లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వానికి, పార్టీకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టారన్నారు. 15 స్థానాలకి స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం గొప్పవిషయమన్నారు. ఈవిషయంలో నాయకులు, కార్యకర్తలు చేసిన క్రుషి మరువలేనిదన్నారు. చాలా చోట్ల టిడిపికి అభ్యర్ధులే లేరన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభ్యర్ధులపై ప్రజలకున్న నమ్మకమే ఈ గెలుపునకు కారణమని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ లు కార్యకర్తలతో కలిసి డప్పు వాయిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి నేరుగా సర్పంచ్ అభర్ధులను అభినందిస్తూ చైతన్య పరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో కూడా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అన్నవరం గ్రామ పంచాయతీని తూర్పుగోదావరి జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా అభివ్రుద్ధి చేస్తామని గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం ఎస్వీఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నవరం నూతన సర్పంచ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సత్యదేవుని ఆశీస్సులతో ప్రజలకు సేవచేసుకునే అవకాశం దక్కిందన్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడంతోపాటు, ప్రజలకు చేరువగా ఉండి సేవచేసుకుంటానని అన్నారు. గ్రామ సర్పంచ్ గా పాలన చెయ్యాలనే చిరకాలవాంఛను అన్నవరం ప్రజలు నెరవేర్చార్నారు. జర్నలిస్టులు కూడా గ్రామాభివ్రుద్ధికి మంచి సూచనలు, సలహాలు అందించాలన్నారు. సర్పంచ్ ని కలిసిన వారిలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శి యాళ్ల శివ, సత్తి బాలకృష్ణమూర్తి తదితరులు వున్నారు.
విశాఖ జిల్లాలో 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి వినయ్ చంద్ వెల్లడించారు. 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆనందపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆనందపురం, వెల్లంకి పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం డివిజన్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ దశ కూడా ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ లో పాల్గొన్నారన్నారు. రానున్న 5 సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అభ్యర్థి ని ఎన్నుకొనేందుకు చక్కని అవకాశమని వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. పెద్ద వయసు గల ఓటర్లను ఆశా కార్యకర్తలు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. ఉదయం 6.30 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 6 మండలాల్లో 68 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో వీడియో గ్రఫీ తీయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, మెడికల్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ ఎ. లవరాజు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెనుకొండ మండలం మావటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించాలని, భోజనాన్ని సకాలంలో అందించాలని, వారికి దిండ్లు, రగ్గులు, మ్యాట్ అందించాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్వో బుచ్చిబాబు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని గిరిజన రైతులకు భూములు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేపట్టారని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి శనివారం తన పర్యటనలో జియ్యమ్మ వలస, కురుపాం, కొమరాడ మండలాల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీపై నేటికి చేపట్టిన పనులు పై ఆరా తీశారు. జియ్యమ్మ వలస మండలంలో 2314, కురుపాం మండలంలో 8644, కొమరాడ మండలంలో 3165 మంది లబ్ధిదారులకు సంబందించి గిరి భూమి వెబ్సైట్ లో చేపడుతున్న ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరి భూమి వెబ్సైట్ లో చేపడుతున్న ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే ఆధార్ నెంబర్, తండ్రి పేరు తదితర వివరాలు ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కురుపాం, కొమరాడ తహసీల్దార్లు, జియ్యమ్మ వలస డిప్యూటీ తహశీల్దార్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విధులకు గైర్జాజరైన గ్రామ సిచివాలయం సిబ్బందిపై ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు . వంతాడపల్లి గ్రామ సచివాలయాన్ని ప్రాజెక్టు అధికారి శని వారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు పరిశీలించి నలుగురు సిబ్బంది విధులకు హాజరు కాలేదని గుర్తించి పంచాయతీ కార్యదర్శులు ఎం. హైందవి, ఎన్.మత్స్యరాజు, సర్వేయర్ సిటిబి ఎస్ ఎన్ అప్పరాజు, మహిళాపోలీస్ కె.జయశ్రీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసారు. గ్రామ సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సచివాలయంలోనే పౌర సేవలన్ని ప్రజలకు అందించాలన్నారు. అనంతరం మినీ వ్యాన్లో ఇంటింటికి పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్నితనిఖీ చేసారు. బియ్యం పంపిణీలో కచ్చితమై తూకం ఉండాలన్నారు. సకాలంలో పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామస్తులతో మాట్లాడి అటవీ హక్కుపత్రాలు అందరికి అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం గిరిజనులను స్పందన ఆరా తీసారు. ఇంటికి తెచ్చి బియ్యం పంపిణీ చేయడం పై లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేసారు. అందరూ దోమ తెరలు వినియోగించాలని ప్రాజెక్టు అధికారి సూచించారు.
అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నాల్గవ విడత లో ఎన్నికలు నిర్వహించనున్న పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ ను సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పెనుగొండ, సోమందేపల్లి ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నాల్గవ విడత పోలింగ్ పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివారం జరుగనుందని, ఇందుకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ ను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది అందరూ వారికి అందించిన బ్యాలెట్ బాక్సులను మరోసారి పరిశీలించాలని, అన్ని రకాల మెటీరియల్ అందిందా లేదా అన్నది చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్స్, ఇతర మెటీరియల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిశాంతి, సబ్ కలెక్టర్ పెనుగొండ, తహశీల్దార్, పెనుగొండ, సోమందేపల్లి ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ విడత పోలింగ్ పాడేరు ఏజెన్సీ లో ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి.వినయ్ చంద్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులో పర్యటించి వంట్లమామిడి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో 237 గ్రామ పంచాయితీలలో పోలింగ్ జరిగిందన్నారు. మహిళలు, వృద్దులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. 2014 కంటే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఏజెన్సీ పరిధిలో 69.28 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పారు. ఓట్లు లెక్కింపు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. పోలింగ్ సిబ్బందికి రవాణా సౌకర్యాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఏజెన్సీలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటి, డా. ఎస్. వెంకటేశ్వర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో బుధవారం ఉదయం 10 గంటలకు ఏజెన్సీ పరిధి లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి 30 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల జిల్లా పరిశీలకులు హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం మారేడుమిల్లిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు సిబ్బంది సకాలంలో విధులకు హాజరై ఉదయం 6:30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని మొదటి గంటలో పోలింగ్ శాతం కొంతమేరకు తక్కువ గా ఉన్నప్పటికీ 10 గంటల కు 30 శాతంగా నమోదైనట్లు ఆయన తెలిపారు.రాబోయే మూడున్నర గంటల్లో 70 లేదా 80 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.పోలీసులు మారుమూల గిరిజన తండాలు గ్రామంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహణ జరుగుతోందని ఆయన వెల్లడించారు మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని సుమారు నాలుగు గంటలకు ఫలితాలు రావచ్చునని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆయన తెలిపారు.ఆయన తొలుత మండల పరిధిలోని పుల్లంగి,బోదు లూరు,కుట్ర వాడ, మారేడుమిల్లి,దేవరపల్లి గ్రామ పంచాయతీల్లో పోలింగ్ సరళిని పరిశీలించి పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నాయా? అని పోలీసు సిబ్బందిని పోలింగ్ ఏజెంట్ లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలే దని వారు ఆయనకు తెలియజేశారు.
గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు)ని బుధవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ సత్యంనాయుడిని స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి రమణ హెచ్ఎం, ఎల్.ఆదిలక్ష్మి, ఎస్.శ్రీనివాసరావు, ఎస్.రాణి, ఎం.సద్గుణ తదితరులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులను హెచ్ఎం పివిరమణ సర్పంచ్ సత్యంనాయుడుకి పరిచియం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యంనాయుడు మాట్లాడుతూ, క్రిష్ణదేవి పేట పాఠశాల మండలంలోనే మంచి పాఠశాలగా పేరుతెచ్చుకునే విధంగా విద్యాభోదన చేపట్టాలని ఉపాద్యాయులను కోరారు. సుమారు పదేళ్ల తరువాత మళ్లీ క్రిష్ణదేవిపేటకు యువ సర్పంచ ఎన్నిక కావడం అభినందనీయమని, తమ సహాయ సహకారాలు కార్యవర్గానికి అందిస్తామని, అదే సమయంలో పాఠశాల అభివ్రద్ధికి కూడా సహకరించాలని ఉపాధ్యాయులు సర్పంచ్ ను కోరారు. కార్యక్రమంలో మద్యాహ్న భోజన పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.