1 ENS Live Breaking News

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి..

పార్వతీపురం డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఐటిడిఏ పీఓ, ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ సోమవారం బలిజి పేట, సీతానగరం మండలాల్లో బొబ్బిలి డి.ఎస్.పి మోహన రావు, సి. ఐ, ఎం.పి.డి. ఓ లు, తహశీల్దార్లుతో కలసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు, ముందుగా బలిజీ పేట మండలం అజ్జడ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు, ఆనంతరం సీతానగరం మండలం నిడగల్లు, పేదబోగిలి, బుర్జ గ్రామాలను పర్యటించారు. నేటికీ చేపడుతున్న పనుల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ  రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను ఆన్ని దశల్లోనూ తూచా తప్పక అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు, ఏదైనా పోలింగ్ కేంద్రం మార్పు చేయాల్సిన అవసరం ఉంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారని, ప్రతి వారు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని, బ్యాలెట్ బాక్స్ లను ముందుగా పరిశీలించు కావాలని సూచించారు. ప్రస్తుతం ఆర్.ఓ., ఎ.ఆర్.ఓ లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోందని, త్వరలో పి.ఓలు, ఎ.పి.ఓ.లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. డి.ఎస్.పి.తో మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.        ఈ పర్యటనలో ప్రాజెక్ట్ అధికారి పర్యటించిన గ్రామాలలో గ్రామ పెద్దలు, ప్రజలతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల  ప్రవర్తనా నియావళిని ప్రకారం గ్రామంలో ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు నడుచుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉపెక్షించేది లేదన్నారు.         ఈ సమీక్షా సమావేశానికి బొబ్బిలి డి.ఎస్.పి. మోహన రావు, సి.ఐ., బలిజిపేట, సీతానగరం మండలాల తహశీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, ఎస్.హెచ్. ఓ లు, వి.ఆర్. ఓ లు, పంచాయతీ సెక్రటరీలు హాజరయ్యారు.

Parvathipuram

2021-02-01 19:46:11

విద్యార్ధులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ..

విశాఖజిల్లా పాడేరు మండలం రాములుపుట్టు జిపిఎస్ ట్రైబల్ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సోమవారం ప్రభుత్వం మంజూరు చేసిన బ్యాగులు, పుస్తకాలను పాఠశాల ఉపాధ్యాయిని రాధ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని రాధ మాట్లాడుతూ పాఠశాల రీఓపెన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరు పిల్లలకు ఎడ్యుకేషన్ కిట్ కింద ఒక బ్యాగు, బట్టలు, పుస్తకాలు, నోట్సులు, బూట్లు అందరికీ ఇచ్చామన్నారు. అదేవిధంగా  తనవంతుగా సాయంగా పిల్లలందరికీ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు ఇచ్చినట్టు టీచర్ చెప్పారు. ఇంకా బడికి రానివారికోసం గ్రామంలో చాటింపు వేయించామని, ప్రతీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కబుర్లుకూడా పంపించామన్నారు. మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రభుత్వం అందించిన కిట్ లను అందజేయనున్నట్టు చెప్పారు. మధ్యాహాన్న భోజనం కూడా విద్యార్ధులకు టీచర్ రాధ దగ్గరుండి వడ్డించి, వారితో పాటు కలిసి భోజనం చేశారు. అనంతరం కొత్తగా నాడు-నేడులో పాఠశాలలు ఏ విధంగా అభివ్రుద్ధి చేశారో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లందరికీ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

పాడేరు

2021-02-01 19:38:53

గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న ఎంపీ..

గౌరీపరమేశ్వరుల దయతో కరోనా అంతరించిపోవాలేని ఎంపీ డాక్టర్ బి.సత్యవతి అన్నారు. శనివారం అనకాపల్లిలోని గవరపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా ఉత్సవ మూర్తులను ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీరాక సందర్భంగా నిర్వహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో గౌరీపరమేశ్వరుల సంబరాలు రాష్ట్రంలోనే పేరుగడించాయని, అలాంటి సంబరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించి ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీ పరిశీలించాలరు. ఈ కార్యక్రమంలో డా.విష్ణుముర్తి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2021-01-30 18:00:51

నందిగామలో పోలీసుల ప్లాగ్ సెర్చ్..

ఎటువంటి ఘర్షణలకు పాల్పడకుండా, ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జరగాలని నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. క్రిష్ణాజిల్లా కంచికచర్ల మండలం లోని బుధవారం రాత్రి నందిగామ, మొగులూరు, చెవిటికల్లు,  గని అత్కూరు, పరిటాల, గొట్టుముక్కల గ్రామాల్లో ఫ్లాగ్ సేర్చ్ (పోలీస్ కవాతు)  నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ వచ్చే నెలలో గ్రామపంచాయతీ  ఎన్నికలు జరుగుతున్నందున, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎటువంటి ఘర్షణలకు  పాల్పడవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో వెనక నుండి ప్రజలను ప్రోత్సహిస్తూ ఘర్షణలకు పాల్పడే వ్యక్తులు ఉంటారని హెచ్చరించారు. అల్లర్లు చేయాలనుకునేవారిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్న ఆయన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగాలని, పోలీసు వారికి సహకరించాలని, సమస్యాత్మక మైన గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండలంలోని పరిటాల గ్రామానికి  ప్రత్యేకంగా ఒక ఎస్సైని  కేటాయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై రంగనాథ్, ఎస్ ఐ 2  లక్ష్మి, ఎస్ఐ ఏసుబాబు, చందర్లపాడు ఎస్ ఐ ఏసోబు, వీరులపాడు ఎస్ ఐ మణికుమార్, మొబైల్ పార్టీ ఎస్ఐ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Nandigama

2021-01-27 21:45:38

జిరాయితీగా చూపి..రికార్డులు తారుమారుచేసి..

విశాఖజిల్లా ఎస్.రాయవరం మండంలోని దేవాదాయశాఖకు చెందిన భూములను కాజేయాలని చేస్తున్న ప్రయత్నంపై దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు కాలుపెట్టి తప్పుడు ధ్రువపత్రాలతో ఏకంగా 9.20 ఎకరాలు కొట్టేద్దామని చేసిన ప్రయత్నానికి  విచారణ అనే అడ్డుకట్ట వేశారు. వివరాలు తెలుసుకుంటే ఎస్.రాయవరం మండంలోని లింగరాజుపాలెం రెవిన్యూ సర్వే నెంబరు 238లో 9.20 ఎకరాల భూమి ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ(దేవాదాయశాఖ)కె చెందిన భూమిగా ఫైనల్ గెజిట్2015(22ఏ) కూడా ఇనాం మెట్టు భూమిగానే రెవిన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. కానీ రెవిన్యూ రికార్డులు అడంగల్ 1బి ప్రకారం ఈ భూమి సర్వే నెంబరు 238లో ఆ మొత్తం భూమి జిరాయితీ మాగాణిగా ఖాతా నెంబరు7777గా పట్టాదారు క్రయంగా చూపిస్తోంది. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ రెవిన్యూ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీనిపై సమాచార హక్కుచట్టం క్రింద కూడా దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. దీంతో వెంటనే రికార్డులతో సహా రంగంలోకి దిగిన దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కావాలని రెవిన్యు అధికారులను ఆదేశించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. ప్రభుత్వ లెక్కలు, దేవాదాయశాఖ అధికారుల రికార్డుల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నా, మండలంలోని రెవిన్యూ రికార్డులు మాత్రం పూర్తిగా తేడాగా ఉన్నాయి. వాస్తవానికి ఏ భూమికైనా సబ్ డివిజన్ చేసి, భూమి యొక్క హక్కు దారులుగానీ, భూమిని అనుభవిస్తున్నవారు సొంత రికార్డులతో బదలాయించినపుడు మాత్రమే క్రయం రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయి. అలాకాకుండా ఏకంగా సుమారుగా పది ఎకరాల భూమిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి కాస్తా అధికారులు ఏకంగా బౌండరీలు వేయడానికి సిద్దం చేయడం ఇపుడు ఆశక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ భూమిపక్కనే ఉన్న భూమి 1.78 ఎకరాల భూమిని సేకరించిన విషయానికి సంబంధించి ఇప్పటికే పేదల ఇంటి స్థలాల కోసం రూ.38 లక్షలు చెల్లించినట్టుగా  ప్రచారం జరుగుతుంది. రెవిన్యూ, దేవాదాయశాఖలోని వారు కలిసే ఈ భూ మాయ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో సుమారు రూ.కోటి రూపాయలు చేతులు మారినట్టు సమాచారం అందుతుంది. ఈ తంతుపై దేవాదాయశాఖ భూమికి సంబంధించి తక్షణమే పాసుపుస్తకం ఇవ్వాలని, మండల రెవిన్యూ అధికారులకు దేవాదాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో తప్పుడు రికార్డుల విషయంలో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనని రెవిన్యూ వర్గాల్లో ఆందోలన మొదలైంది. దేవాదాయశాఖకు చెందిన భూమి కొలతలు వేసే సమయంలో అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిన్నాయి. క్రయం జరిగినట్టుగా ఉన్న రికార్డుల్లోని వ్యక్తి భూమిని కొలిచే సమయంలో ఆ స్థలంలోకి వస్తే ఆ సమయంలో రెవిన్యూ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు కలిసి చేసిన ఈ భూమాయ అసలు విషయాలు ఆధారాలతో సహా బయటకు వచ్చే అవకాశం వుంది. దానికి కారణం దేవాదాయశాఖ వద్ద పూర్తిస్ధాయి ఆధారాలుండటమే. దీనితో ఎస్.రాయవరం మండలంలో జరుగుతున్న భూమాయపై ఇటు జిల్లా కలెక్టర్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 9.20 ఎకరాల భూమాయ విషయం కొలతల్లో తేలితే భూమి మొత్తం దేవాదాయశాఖదని తేలితే ఎస్.రాయవరం మండంలోని ఏ తహశీల్దార్ ఉన్నపుడు రికార్డులు తారుమారు అయ్యాయో కూడా బయటకు వస్తుంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు కోరినట్టుగా అసలు మండల రెవిన్యూ అధికారులు ఆ భూమిని కొలుస్తారా, రికార్డులు బటకు తీస్తారా, ఏ ప్రైవేటు వ్యక్తికి క్రయం అయినట్టు రికార్డులు తయారు చేశారో అవి బయటకు వస్తాయా? మరో వైపు రిజిస్ట్రార్ కార్యాలయంలో సంపాదించిన ఆర్టీఐ సమాచారం ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి తమశాఖకు చెందిన భూమిని ఆధారాలతో సహా తాము స్వాధీనం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ భూమి రికార్డులను టేంపరింగ్ చేసి, అడంగల్ లో పేర్లు మార్పుచేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించి కేసులు నమోదు చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ భూమాయపై ఏంజరుతుందనేది వేచిచూడాలి..!

ఎస్.రాయవరం,

2021-01-27 17:28:26

స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే..

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం గణతంత్ర వేడుకలకు వీక్షించడానికి వచ్చిన  స్వాతంత్ర్య సమరయోధులు 99 ఏళ్ల  కన్నెగంటి సీతారామయ్యకి ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి హుటాహుటిన అంబులెన్సులో తానే స్వయంగా ఎక్కించి గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సీతారామయ్యగారికు తానే  వైద్యం కూడా అందించారు. సకాలంలో వైద్యం అందించడంతో సీతారామయ్య ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. ఎమ్మెల్యేగానే కాకుండా డాక్టర్‌గా వెంటనే స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపడటంతో ఎమ్మెల్యే శ్రీదేవికి అభినందనలు వెల్లువెత్తాయి. ఒక వైద్యురాలు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక నిండు ప్రాణం, అందునా గణతంత్ర దినోత్సవం రోజున స్వాతంత్ర్య సమరయోధుని ప్రాణం నలబెట్టిన నిజమైన భారతీయురాలిగా కీర్తి గడించారు ఎమ్మెల్యే శ్రీదేవి.

Guntur

2021-01-26 13:29:14

త్యాగధనుల సేవలను స్పూర్తిగా తీసుకోవాలి..

తరతరాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అణిచివేత, వివక్ష లను రూపుమాపు తూ పౌరులంతా సమానంగా ఎదిగే ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన  పెద్దలను గుర్తుచేసుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నర్సీపట్నం  సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య తెలిపారు.  మంగళవారం 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి,  పోలీస్  గౌరవ వందనాన్ని స్వీకరించారు.      ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల  త్యాగాల ఫలితం వారు మనకు కల్పించిన ప్రాథమిక హక్కులు సమానత్వం, లౌకికతత్వం ,ఐకమత్యంలకు  కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలన్నారు. భారతదేశం సర్వసత్తాక , సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య , గణతంత్ర రాజ్యంగా  1950 జనవరి 26న అవతరించిందన్నారు. ఈ రోజున భారత ప్రజలు అందరూ సంపూర్ణ స్వేచ్ఛ, న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కు గా పొందడం జరిగిందన్నారు.  ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానన్నారు.                       .....          ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత.      నర్సీపట్నం డివిజన్ పరిధిలో గల పది మండల కార్యాలయాల లో పనిచేస్తున్న 12 మంది  సిబ్బంది ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలను సబ్ కలెక్టర్ మౌర్య అందించారు. జిల్లా స్ధాయిలో 4గురు సిబ్బంది విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వీకరించనున్నారు.         గణతంత్ర దినోత్సవ వేడుకలలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది, నర్సీపట్నం పోలీస్ కార్యాలయపు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, మండల తాసిల్దార్ జయ, ఇతర అధికారులు సిబ్బంది పాఠశాలల విద్యార్థినులు హాజరయ్యారు.

Narsipatnam

2021-01-26 12:54:34

ఇంటింటికీ సరుకులపై పంపిణీపై శిక్షణ..

గ్రామాల్లో ఇంటింటికి సరఫరా చేసే నిత్యావసర సరుకులు డీలర్‌ నుంచి వ్యాన్‌ ద్వారా తరలించి తెల్లకార్డు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని డివిజనల్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి పి.శ్రీనివాసరావు వాలంటీర్లు, డిఆర్‌డిపో డీలర్లను ఆదేశించారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో సివిల్‌ సప్లయ్‌ డిటి ఆధ్వర్యంలో  డీలర్లు,వాలంటీర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెల్లరేషన్‌కార్డు నెంబర్‌,డిపో నెంబర్‌ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్‌ మిషన్‌లో ఏ విధంగా నమోదు చేయాలి,వేలి ముద్రల స్వీకరణ తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి వాలంటీర్‌ 50 కార్డులకు ఈ నిత్యవసర సరుకులు అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. మండలంలో ఉన్న 56డిపోలకు 11 మినిసప్లయ్‌ వ్యాన్లు ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్నారు.గ్రామాల్లో కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా డీలర్లు,వాలంటీర్లు పనిచేయాలన్నారు. ఎటువంటి ఫిర్యాదులోచ్చినా, అవకతవకలకు పాల్పడినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదని సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Koyyuru

2021-01-25 22:10:33

ఉత్తమ సహాయ ఎన్నికల అధికారిగా తిరుమలరావు..

విశాఖ జిల్లాలో అరకు డివిజన్‌కు సంబంధించి అసిస్టెంట్‌ ఎలక్రోరోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా కొయ్యూరు మండల తహాశీల్దార్‌ సిహెచ్‌.తిరుమలరావు ఎంపికైయ్యారు.దీనిలో భాగంగా విశాఖ నగరంలోని సిరిపురం విఎంఆర్‌డిఎ చిల్ర్డన్‌ థియేటర్‌లో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి,జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన చేతుల మీదుగా తిరుమలరావు అవార్డ్‌ అందుకున్నారు. 2020 ఓటర్ జాబితాల సవరణ లో మెరుగ్గా సేవలను నిర్వహించి నందుకు  అవార్డ్ దక్కింది. అయితే మండల తహశీల్దార్‌కు లభించిన ఈ అవార్డ్‌ పట్ల మండలంలోని రెవెన్యూ సిబ్బంది, గ్రామ విఆర్‌వోలు,ఇతరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Koyyuru

2021-01-25 22:06:19

శారదా పీఠాధిపతి సేవలో రాష్ట్ర మంత్రి..

విశాఖలోని శ్రీ శారద పీరాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు త్తంశెట్టి శ్రీనివాసరావు  కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈమేరకు పెందుర్తిలోని శారదా పీఠానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీఠంలో కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి పూజలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పీఠాధిపతి స్వామి . ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి, కుమారుడు శివ నందీశ్, కుమారై లక్ష్మీ ప్రియాంక, అల్లుడు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పీఠంలోని సిబ్బంది మంత్రి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

Pendurthi

2021-01-23 20:54:17

దక్షిణంలో అభివ్రుద్ధికి ప్రతిపాదనలు..

విశాఖలోని దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జివిఎంసీ కమిషనర్ ను కోరారు. శనివారం ఈ మేరకు కమిషనర్ ను కలిసి రూ.700 కోట్లతో ప్రతిపాదనలను కమిషనర్ ను కలసి ఆమె చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దక్షిణ నియోజిక వర్గం అభివృద్ది కొరకు సదరు ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంతవరకు మంజూరు చేస్తానని ఎం.ఎల్.ఎకు కమిషనర్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పాడైన రోడ్లు, కాలువలు, గెడ్డల మరమత్తులు, కమ్యునిటీ హాలు నిర్మాణం, మంచినీటి వ్యవస్థ నిర్వహణ, ప్రహరీ గోడలు నిర్మాణం మొదలైన పనుల ప్రతిపాదనలు పరిశీలించి, తగు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత నగరం, కె.జి.హెచ్., రంగి రీజు వీధి, రెల్లి వీధి, కొబ్బరితోట  తదితర ప్రాంతాల్లో ప్రతీ రోజూ రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసరును ఆదేశించారు. దక్షిణ నియోజిక వర్గంలో వివిధ ప్రాంతాలో ఉన్న స్మశాన వాటికలు, దోభీఖానాలు నిర్మాణం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, నెహ్రూ బజార్ ఆధునీకరణ పనులు, జగదాంబ నుండి పాత పోస్టాఫీసు వరకు 60 అడుగుల రోడ్డును విస్తరించే పనులు, హ్యాకర్స్ జోన్స్ ఏర్పాటుకు పెట్టిన ప్రతిపాదనలు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, యు.సి.డి.(పి.డి) వై. శ్రీనివాస రావు, పర్యవేక్షక ఇంజినీరు శ్యామ్సన్ రాజు, మూడవ జోనల్ కమిషనర్ ఫణిరాం, రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, నాల్గవ జోనల్ కమిషనర్ సింహాచలం, ఏ.సి.పి. అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-01-23 20:25:44

టూరిజం స్పాట్ గా విశాఖ మ్యూజియం..

విశాఖ మ్యూజియం టూరిజం స్పాట్ గా సందర్శకులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం వలన మూతపడిన విశాఖ మ్యూజియంను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శనివారం  తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంను సందర్శించిన పర్యాటకులతో ముచ్చటించారు. కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలన కానందున, పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులను ధరించి, మ్యూజియంను సందర్శించాలని కోరారు. మ్యూజియంను తిరిగి ప్రారంభమైన రోజున సందర్శించిన పిల్లలకు స్వాగతిస్తూ, తీపి మిఠాయిలను పంచారు. మ్యూజియం మరింత అభివృద్ధి చేయడానికి నూతన ప్రతిపాదనలతో ముందుకు రావాలని మ్యూజియం క్యూరేటర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం క్యూరేటర్ బి. సన్యాసి నాయుడు, మ్యూజియం సిబ్బంది, సందర్శకులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-01-23 19:38:13

ప్రజలకు సకాలంలో సేవలందించాలి..

గ‌్రామ స‌చివాల‌యాల‌కు వివిధ సేవ‌ల నిమిత్తం వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలో ప‌రిష్క‌రించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. గంట్యాడ మండ‌లం ల‌ఖిదాం, వ‌సంత గ్రామాల్లో గ్రామ స‌చివాల‌యాల‌ను బుధ‌వారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌చివాల‌య నిర్వ‌హ‌ణ, రికార్డుల నిర్వ‌హ‌ణ‌ను, సంక్షేమ ప‌థ‌కాల పోస్ట‌ర్లు, ఆ ప‌థ‌కాల‌కు అర్హ‌త‌, ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అర్హ‌త‌ల వివ‌రాల‌తో కూడిన అంశాల‌ను ప్ర‌దర్శించిన‌దీ లేనిదీ ప‌రిశీలించారు. స‌చివాల‌యానికి వ‌చ్చిన విన‌తుల‌ను ఎంత వ్య‌వ‌ధిలో ప‌రిష్క‌రించిందీ తెలుసుకున్నారు. స‌చివాల‌య సిబ్బంది ఏయే ర‌కాల విధులు  నిర్వ‌హిస్తున్న‌దీ తెలుసుకున్నారు. అనంత‌రం సిబ్బందితో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామ స‌చివాల‌యాల‌ను ప‌టిష్టం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని, గ్రామీణ ప్ర‌జ‌ల‌కు వీటిద్వారా అత్యుత్త‌మ సేవ‌లు స‌కాలంలో అందించాల‌ని సూచించారు. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ఫిబ్ర‌వ‌రి 1 నుండి చేప‌డుతున్నందున అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌న్నారు. గంట్యాడ ఎం.పి.డి.ఓ. నిర్మలాదేవి కూడా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు.

Gantyada

2021-01-20 20:27:13

సీఎం చొరవతో కొత్తగా గ్రామాల ఏర్పాటు..

నిరుపేదలకు సొంతింటి సమకూర్చి ఒక కొత్త గ్రామంగా ఏర్పాటు చేస్తున్నఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. బుధవారం విజయపురం మండలం గొల్లకండిగ లో వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ళపట్టాలు పంపిణీ చేపట్టి  కొత్త ఇళ్ళ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో నిరుపేదలకు ఇళ్లు, ఇంటి పట్టాలు పంపిణీ చేయలేదన్నారు. ప్రజాప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. అనంతరం బూచివానెత్తం 29( గొల్లకండిగ-21, ఆమగుంట-08,  సామిరెడ్డి కండిగ-11, కొత్తూరు వెంకటాపురం-31, ఎం.అగరం-03, పోతులరాజు కండిగ-02 మొత్తం 76 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, రామకృష్ణంరాజు, రాజగోపాల్, గుణశేఖర్ రెడ్డి, జిల్లు, శివరాజు, బాలాజి, శేఖర్, ప్రతాప్, చంద్రయ్య, కుప్పయ్య, శేఖర్ రాజు, రత్నం, కిషోర్ హౌసింగ్ డి.ఇ శంకరప్ప, ఎమ్మార్వో కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vijayapuram

2021-01-20 17:53:07

సొంతింటి కల నేరవేర్చేది సీఎం జగన్ మాత్రమే..

ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేదల సొంతింటి కల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తీర్చాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివారావు అన్నారు. బుధవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మజ్జివలసలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మజ్జివలస,లక్ష్మీపురం ,సింగన్న బంధ, మజ్జిపేట సంబంధించి 415 లక్షలతో నిర్మిస్తున్న 231 గృహాల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, త్వరలోనే ఈ ప్రాంతాలన్నీ వై యస్ ఆర్ జగనన్న కాలనీలుగా రూపాంతం చెందబోతున్నాయన్నారు. అనంతరం కాలనీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. మజ్జివలస గ్రామంలో మూడు కోట్ల 86 లక్షల 90 వేలకు సంక్షేమ పథకాలు, రెండు కోట్ల 10 లక్షల పైగా రూపాయలతో అభివృద్ధి  పనులు చేపట్టామన్నారు.  లక్ష్మీ పురం, సింగనబంద, మజ్జి పేటలో సంక్షేమపథకాలకు దాదాపుగా 16 కోట్లకు పైగా చేపట్టామన్నారు.  అభివృద్ధి పనుల కోసం దాదాపుగా మూడు కోట్ల కేటాయించినట్టు వివరించారు. ఎవరూ భూములను అమ్ముకోవద్దన్న మంత్రి విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని దీంతో మరింత అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఇల్లు కట్టించి ఆయా ప్రాంతాల్లో కావాల్సిన ఇల్లు, రోడ్లు, నీటి సదుపాయం, విద్యుత్ , ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bheemili

2021-01-20 17:42:52