1 ENS Live Breaking News

గ్రామీణాభివ్రుద్ధిలో ఉన్నత్ భారత్ అభియాన్

అచ్చుతాపురం గ్రామీణాబివ్రుద్దిలో విద్యార్దులను భాగస్వామ్యం చేసేందుకు ఉన్నత్ భారత్ అభియాన్ దోహదపడుతుందని ఉన్నత్ భారత్ అభియాన్ ఆంద్రాయూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ పావని తెలిపారు. బుదవారం మండలంలోని తంతడి గ్రామం లో చేతివ్రుత్తిదారులతో ఆమె మాట్లాడారు. ప్రశాంతి పాలిటెక్నిక్, ఆంద్రయూనివర్సిటీ ఆద్వర్యం లో Clay Craft (Pottery) మేకింగ్ ఇన్నోవేషన్ హబ్ ఎట్ తంతడి విలేజ్ అనకాపల్లి జిల్లా అనే అంశం పై ఉన్నత్ భారత్ అభియాన్ భారత ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు.  గ్రామీణ కళలు, చేతి వ్రుత్తులను ప్రోత్సహించడానికి ఉన్నత్ భారత్ అభియాన్ పెద్దపీట వేస్తుందని, ప్రతి ఉన్నత విద్యాసంస్థ దీనిలో బాగస్వామ్యం అవ్వాలని ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి ఉన్నతవిద్యా సంస్థ అయిదు గ్రామాలని దత్తత తీసుకుంటే ఆయా గ్రామాలో చేతివ్రుత్తులను ప్రోత్సహించడానికి  నిధులు చేకూరతాయన్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావ్ ఎన్ఎస్ఎస్ అధికారిణి మాదవి, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

Acchutapuram

2023-06-07 13:32:08

భవన నిర్మాణాలు జాప్యంచేస్తే కఠిన చర్యలు

అంగన్వాడీ భవన నిర్మాణాలలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ హెచ్చరించారు. ఐటిడిఏ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ పరిధిలో అంగన్వాడీ భవన నిర్మాణాలు నాడు నేడు పనుల పురోగతిపై సిడిపిఓలు, సూపర్ వైజర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 128 కొత్త అంగన్వాడీ భవన నిర్మాణాలకు అనుమతులిచ్చి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసిందన్నారు. 2వ విడత రివాల్వింగ్ ఫండ్ జమచేశామని.. నేటికి గోతులు, గొయ్యిలు స్థాయిలోనే నిర్మాణపు పనులు ఉన్నాయన్నారు. 20 భవనాలు మాత్రమే రూఫ్ స్థాయి పనులు పూర్తి చేసారని అసంతృప్తి వ్యక్తం చేసారు. పాడేరు నియోజక వర్గంలో 15 అంగన్వాడీ కేంద్రాలు, అరకువ్యాలీ నియోజక వర్గంలో 30 అంగన్వాడీ కేంద్రాలు పునాదుల స్థాయిలో ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు సిడిపిఓలు , సూపర్ వైజర్లు బాధ్యత వహించ వలసి ఉంటుందన్నారు. 

11 మంది సిడిపి ఓలు, 62 మంది సూపర్ వైజర్లు ఉన్నారని అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను భవన నిర్మాణాల వేగంగా పూర్తి చేయడానికే ప్రభుత్వం నియమించిందని భవన నిర్మాణాలు నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లపైనే ఉందన్నారు. మహిళా పోలీసులు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రి కొనుగోలు చేయాలని స్పష్టం చేసారు. మన బడి నాడు నేడు పాఠశాలలకు సిమెంటు సరఫరా చేయడం జరిగిందని అవసరమైతే ఆయా పాఠశాలలను సిమెంటు తీసుకుని పనులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎన్. సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ డి.వి.ఆర్.ఎం.రాజు, 11 మండలాల సిడిపిఓలు, సూపరిండెంట్ జి.ఆర్.సి.హెచ్.మూర్తి, సూపర్ వైజర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2023-06-06 13:33:33

7న గంటందొర వర్ధంతికి కృష్ణదేవిపేట తరలిరండి..పడాల

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పితూరి సేనాధిపతి గాం గంటం దొర 99 వ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో ఉన్న గంటం దొర పవిత్రమైన ఆయన సమాధి వద్ద నివాళులర్పించడానికి గిరిజనులు తరలి రావాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు క్రిష్ణదేవిపేటలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజను లందరూ తలోక చోట కార్యక్రమాన్ని నిర్వహించడం కాకుండా గిరిజనులందరూ పవిత్రమైన గంటం దొర సమాధి వద్దే జరపాలని ఆ విధంగా గిరిజనుల ఐక్యతను చాటాలని పడాల విజ్ఞప్తిచేశారు. అలాగే గిరిజనేతరులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు గంటం దొర 99 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన కోరారు. ఆ రోజు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గంటం దొర సమాధి వద్ద కార్యక్రమం నిర్వహించి ఆయ నకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు అల్లూరి యువజన సంఘానికి సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని పడాల వీరభద్రరావు తెలిపారు.


Krishnadevipeta

2023-06-05 09:05:46

పద్మశాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్న సభ్యుల పెండింగ్ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్ప ర్సన్ జి.విజయలక్ష్మి హామీ ఇచ్చారు. ఆదివారం విశాఖలోని నాయుడుతోటలో ఏపి పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ద్వితీయ వార్షికోత్సవ సమావేశాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పద్మశాలి కులానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త అత్యంత ప్రాధాన్యత కల్పించాలని, చేనేత కార్మికులను కూడా ఆదుకోవడంలో అన్ని విదాల ముందంజలో ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారా నికి సీఎంతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రాష్ట్ర ఆప్కో సంస్థ చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ, పద్మశాలి ఉద్యోగులంతా ఒక అసోసియే షన్ గా ఏర్పడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.

 రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి.వెంకట శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సమావేశంలో పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల సంఘం పెద్దలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ జి.రంగజనార్ధన్, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవీ.నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి కెవి.సత్యనారాయణ, కోశాధికారి టీ.చంద్రశేఖర్ విశాఖ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ మురళి, సెక్రటరీ పి.సత్యానంద్, వైస్ ప్రెసిడెంట్ ఆకుల విశ్వేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నీలం జోగరాజు, కార్యదర్శి చుక్కల కరుణాకర్, సభ్యులు పందిరి శ్రీనివాసరావు, పసగడుగుల మల్లిబాబు, ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి కుల సంఘం పెద్దలు తెడ్డు వెంకటేశ్వరరావు, రామ్ కుమార్ తో పాటు జీవీఎంసీ ఏపీఆర్ఓ నాగేశ్వరరావు, పలువురు ఉద్యోగులు, కుల పెద్దలు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ రమ్య, శ్రీ లిఖిత చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. పలు ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులతో పాటు పదవ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులతో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

2023-06-04 16:33:38

మర్రిపాలెంలో ఫుట్ పాత్ అక్రమణాల తొలగింపు

పాదాచారులకు అంతరాయం కలిగిస్తూ ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ మేరకు కంచరపాలెం మెట్టునుండి ఊర్వశి జంక్షన్ వరకు ఉన్నా  ఫుట్ పాత్ లు అలాగే కంచరపాలెం రైతు బజార్ రోడ్డు జాతీయ రహదారిపై తాటిచెట్ల పాలెం నుండి బర్మా క్యాంపు వరకు సర్వీసు రోడ్ లో ఉన్న ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని శుక్రవారం కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పాదాచారులు వాహనదారులు వెళ్లేందుకు వీలు లేకుండా ఈ రోడ్లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ సీ.ఐ మళ్ళ అప్పారావు దృష్టికి తీసుకురావడంతో ఎ.స్సై పాపారావు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుతో కలిసి ఈ డ్రైవ్ చేపట్టినట్టు సీ.ఐ తెలిపారు. ఇలా అక్రమాలు చేయడంతో పాదాచారులు, వాహన దారులు, అటుగా వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, పలు ప్రమాదాలకు దారి తీసే విధంగా ఉండటం వల్ల ఖాళీ చేయించినట్టు ఆయన తెలిపారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించామని తెలిపారు.

Visakhapatnam

2023-05-20 08:50:01

కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే లక్ష్యం

మహా విశాఖ నగరంలోని పారిశుద్ధ కార్మికులను ఆర్థికంగా బలోపతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం  5వ జోన్ తాటిచెట్లపాలెంలోని ఎం ఎస్ ఎఫ్ 5 లో నేషనల్ సేఫ్టీ సపాయికర్మాచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నమస్తే స్కీం ద్వారా పారిశుద్ధ కార్మికులకు జెసిబి లు, సెప్టిక్ ట్యాంకు వాహనాలను నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మలు అందించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,  పారిశుద్ధ్య కార్మికులను ఆర్థికంగా బలోపతo చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐదవ జోన్లో రెండు జెసిబి లు, ఒక సెప్టిక్ ట్యాంకును నమస్తే స్కీం ద్వారా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్సిడీపై అందించడం జరిగిందని తెలిపారు.  జోనల్ పరిధిలో ఒక్కొక్క వాహనానికి ఐదుగురు పారిశుద్ధ కార్మికులు గ్రూపుగా ఏర్పడి నిర్వహిస్తారని, ఈ వాహనాల్ని జీవీఎంసీ ప్రధాన గెడ్డలను శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.

 ఈ సబ్సిడీని ఏడు సంవత్సరాల పాటు జీవీఎంసీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా దళారులు కాంట్రాక్టర్లకు లబ్ధి  చేకూరకుండా నేరుగా పారిశుద్ధ కార్మికుడికే లబ్ధి పొందవచ్చని తద్వారా వారిని ఆర్థికంగా బలోపతo చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించారని ఆయన పరిపాలన త్వరలోనే ఇక్కడ నుండి కొనసాగుతుందని తద్వారా విశాఖ నగరం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే  జీవీఎంసీ పరిధిలో అన్ని జోన్ల కార్యాలయాలకు ఇటువంటి వాహనాలు సమకూర్చడం జరుగుతుందని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదరపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, ఏ ఎం ఓ హెచ్ రాజేష్, కార్యనిర్వహణ ఇంజనీర్ శ్రీనివాస్, విశాఖ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్ సుదీర్, సానిటరీ సూపర్వైజర్ జనార్ధన్, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-17 07:56:59

శ్రీసత్యదేవ నిత్యన్నదాన ట్రస్టుకి రూ.100116 విరాళం

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి విజయనవాడకికి చెందిన  పొట్లా వెంకటేశ్వర్రావు దంపతులు, రూ.100116 లు విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తం చెక్కును దేవాలయ సిబ్బం దికి గురువారం ఆలయ సిబ్బందికి అందజేశారు. వినాయక చవితి వెళ్లిన రెండవ రోజు పొట్టా కొత్త లక్ష్మీ కుమారి పేరుపూ అన్నదానం చేయాలని కోరారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ సిబ్బందికి దాతలకు ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-05-17 07:50:23

మరిడమ్మ అమ్మవారి చీరకు వెండి విరాళమివ్వండి

కాకినాడ జిల్లా,అన్నవరం గ్రామంలోని(రైల్వే స్టేషన్ రోడ్డు) గ్రామ దేవత గా పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారికి త యారుచేయించే వెండి జెరీ చీరకు భక్తులు విరాళాలు ఇవ్వడానికి ముందుకి రావాలని ఆలయ కమిటీ నిర్వహాకులు బండారు రమణ కోరారు.  శ్రీఅమ్మవారికి ప్రతి సం వత్సరం వార్షిక జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తల్లికి తయారు చేయించే ఈ వెండి చీర తయారీకి భక్తులు వారి శక్తి మేరకు పాల వెండి దానం చేయాలన్నారు. సదరు  చీర తయారు నిమిత్తం సుమారు 40 కిలోల వెండి అవసరం అవుతుందని. అన్నవరం గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న  శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మ వారికి అన్నవరం గ్రామ ఆడపడుచులు ప్రతి ఇంటికి 1లేక 2 తులముల పాల వెండిని విరాళంగా ఇవ్వడానికి ముందుకి రావాలని  శ్రీఅమ్మ వారికి సమర్పించే వెండి చీర తయారులో భాగస్వాములు అయి శ్రీ అమ్మవారి క్పప కుపాత్రలు కావాలని కోరారు. వివరాలకు ఆలయంలో సంప్రదించాలన్నారు.

Annavaram

2023-05-16 09:14:22

150కార్ల ర్యాలీతో టిడిపి ఇన్చార్జిగా రంగ ప్రవేశం..తగ్గేదెలే

తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకర్గంలో కొత్త ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కార్ల ర్యాలీతో ప్రత్తిపాడు ఇన్చార్జిగా వరపుల రాజా సత్యప్రభ అన్నవరంలో చేసిన ఎంట్రీ తగ్గెదే లే అన్నట్టుగా సాగింది. వరుపుల రాజా హఠాత్మరణం తరువాత ఆమె భార్య సత్యప్రభ నియోజకవర్గ పగ్గాలు చేపట్టారు. వస్తూ వస్తూనే తొలిసారి అన్నవరం వచ్చి సభ నిర్వహించారు. నాడు వరపులకు  వచ్చిన అభిమానం కంటే నేడు ఆమె భార్యకు ప్రజలు, టిడిపి కార్యకర్తలు,నాయకుల నుంచి వచ్చిన అభిమానం, అండదండలు అందరినీ ఆలోచింపజేశాయి. పెద శంకర్ల పూడి నుంచి బయలు దేరిన అభిమానుల కాన్వాయ్.. లంపకలోవ,ఉత్తర కంచి, ఒమ్మంగి, శరభ వరం, గజ్జనపూడి, వెంకట నగరం, కొంతంగి  కొత్తూరు, యు.జె.పురం,నెల్లిపూడి, కత్తిపూడి, సీతయ్యమ్మ పేట, గ్రామాల మీదుగా అన్నవరం  చేరుకుంది. అక్కడ సత్యదేవుని పాదాల మండపం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. సత్యప్రభకు అభిమానులు, కార్యకర్తలు అడుగడునా బ్రహ్మరధం పట్టారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ తొలిరోజు కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలను, నాయకులను కలుసుకున్నారు. అనంతరం తొలిపావాంచ వద్ద సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. వరుపుల రాజాపై చూపించిన ప్రేమ, అభిమానాలు, తనపైనా చూపించి మీ తోబుట్టువుకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

2023-05-15 15:16:42

రాజన్న మన మధ్యలేరంటూనే కన్నీటి పర్యంతం

కట్టుకున్న భర్త దూరమైన వెంటనే రాజకీయపగ్గాలు చేపట్టడమంటే అంత ఆషామాషీ కాదు..ఎంతో గుండై ధైర్యం, పార్టీ అండ, కార్యకర్తల సహకారం ఉంటే తప్పా కుదర దు. అయినప్పటికీ తాళికట్టిన భర్త జీవితం నుంచి శాస్వతంగా కనుమరుగైన విషయాన్ని దిగమింగి ప్రజల్లోకి రావడం కూడా ప్రత్యేకంగానే చూడాలి. ఎల్లప్పుడూ భర్తచాటు భార్యగా ఉన్న వరుపుల రాజాసత్యప్రభ ఆయన హాఠాత్మరణం తరువాత ప్రత్తిపాడు నియోజవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజలతో మమేకం అయి తిరుగుతున్నారు. సోమవారం అన్నవరం వచ్చిన ఆమె నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా పాదయాత్ర చేసి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో వరుపులను తలచుకొని నడిరోడ్డుపైనే కన్నీటి పర్యంతం అయ్యారు. కష్టకాలంలో నావెంట ఉన్న ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుంటానని, రాజా లేని లోటుని ప్రతీ కార్యకర్తకు, నాయకుడి వెంట నిలబడి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. తనను దీవించాలని, రాజాపై చూపిన అభిమానం తనపైనా చూపాలని కోరారు. రాజా పేరు వినపడిన ప్రతీ క్షణం ఆయన తన కళ్లముందే ఉంటారని, ఆయనే తనను ఈ విధంగా మీముందు నిలబెట్టారంటూ చేసిన ప్రశంగం అందరినీ ఆలోచింపజేసింది. భర్తను తలచుకుంటూ, చేసిన ప్రసంగం సభికులను, కార్యకర్తల హృదయాలు ద్రవించేలా చేసింది.

ఆరునెలల వరకూ బయటకు రాకూడదనుకున్నా కానీ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రజలను దూరంగా ఉండలేక అంతటి బాధను దిగమింగుకొని మీ మధ్యకు వచ్చానని.. తనను మీ తోబుట్టువుగా అనుకొని సహకరించాలన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రాజా అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, ఈసారి ఆయన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అత్యధిక మెజార్టీతో రాజానే గెలిపించాననుకొని తనకు పట్టం కట్టాలని కోరారు. నియోజవవర్గంలోని ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని, పనిచేసిన ప్రతీ కార్యకర్తను, నాయకులను పేరు పేరుగా గుర్తించుకుంటానని హామీ ఇచ్చారు. సత్యప్రభ మాట్లాడుతున్నంతసేపూ రాజా అమర్ రహే..సత్యప్రభ నాయకత్వం వర్ధిల్లాలి, అధికారంలోకి వచ్చేది టిడిపినే అనే వాఖ్యాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2023-05-15 15:03:06

జగన్ రెడ్డి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాలి..

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి దుష్టపరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వరు పుల రాజాసత్యప్రభ పిలుపునిచ్చారు. సోమవారం అన్నవరంలో నారాలోకేష్ యువగళం కార్యక్రమానికి సంఘీభావంగా ఆమె గ్రామంలో పాద యాత్ర నిర్వహించారు. అంతకు ముందు తొలిపావంచా వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు తీరడంతోపాటు, రాష్ట్రం శుభిక్షంగా వుంటుందన్నారు. వరపుల రాజామన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానంటూ కన్నీటి పర్యంతం అయ్యా రు. కష్టకాలంలో నావెనుక నిలబడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.. వరపుల రాజా మాదిరిగానే తాను కూడా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని, నియోజకవర్గ ప్రజలు తనను మంచి మనసుతో దీవించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


Annavaram

2023-05-15 14:30:12

చాన్నాళ్లకు ఆరిలోవ రిజర్వ్ ఫారెస్టు రోడ్డుకు మహర్ధశ

గొలుగొండ మండల ప్రజల దశాబ్దాలకల, దీర్ఘకాలిక ఆరిలోవ రోడ్డు సమస్యకు శాస్వత పరిష్కారం లభించనుంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ రూపుదిద్దుకోబోతున్నది. 7 దశాబ్దాలుగా ఎందరో ప్రజా ప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళుతున్నా, గొలుగొండ మండల పరిధిలోని ,ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న, 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ మాత్రం చేపట్ట లేకపోయారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన, పెట్ల ఉమా శంకర్ గణేష్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చొరవతో తొలి అడుగు వేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ వెల్లడించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో  రెవెన్యూ, అటవీ, రోడ్లు భవనాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి సత్వరమే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.  ఈ సమావేశంలో ఆర్డిఓ  హెచ్ వి జయరాం, డీఎఫ్ఓ రాజారావు,  రేంజర్ లక్ష్మి నర్సు , గోలుగొండ తాసిల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.


Golugonda

2023-05-15 09:42:24

చాన్నాళ్లకు ఆరిలోవ రిజర్వ్ ఫారెస్టు రోడ్డుకు మహర్ధశ

గొలుగొండ మండల ప్రజల దశాబ్దాలకల, దీర్ఘకాలిక ఆరిలోవ రోడ్డు సమస్యకు శాస్వత పరిష్కారం లభించనుంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ రూపుదిద్దుకోబోతున్నది. 7 దశాబ్దాలుగా ఎందరో ప్రజా ప్రతినిధులు, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళుతున్నా, గొలుగొండ మండల పరిధిలోని ,ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న, 3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ మాత్రం చేపట్ట లేకపోయారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికైన, పెట్ల ఉమా శంకర్ గణేష్ రోడ్డు విస్తరణ పనులకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చొరవతో తొలి అడుగు వేయబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డు విస్తరణకు మార్కింగ్ ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ వెల్లడించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో  రెవెన్యూ, అటవీ, రోడ్లు భవనాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి సత్వరమే పూర్తిచేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.  ఈ సమావేశంలో ఆర్డిఓ  హెచ్ వి జయరాం, డీఎఫ్ఓ రాజారావు,  రేంజర్ లక్ష్మి నర్సు , గోలుగొండ తాసిల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.


Golugonda

2023-05-15 09:42:24

అన్నవరం ప్రసాదం కౌంటర్ లో ఫోన్ పే ఏర్పాటుచేయాలి

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ప్రసాదం కౌంటర్లలలో కొండపైనా, కొండదిగువన పాదాల మండపం వద్ద యూపీఐ, ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎక్కువ మంది స్వామివారి పాదాల మండపం, హైవేపే పై ఉన్న స్వామివారి రూప ఆలయం వద్ద ఫోన్ పే కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రసాదం అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయని చెబుతున్నారు. భక్తులు ప్రసాదాలు కొన్న నగదును నేరుగా ఖాతాలోకి దేవస్థానం అధికారులు ప్రతీరోజూ సాయంత్రం రెండు పర్యాయాలు  జమచేస్తుంటరాని, యూపీఐ పేమెంట్ల ద్వారా ప్రసాదం అమ్మకాలు చేపడితే..నేరుగా ఆ మొత్తం దేవస్థానం బ్యాంకు ఖాతాల్లోకే చేరి సమయం కూడా కలిసివస్తుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 60శాతం మంది భక్తులు యూపీఐ విధానం ద్వారా పేమెంట్లు చేస్తున్నందున.. ప్రసాదం కౌంటర్ల దగ్గర ఫోన్ పే, గుగూల్ పే, పేటిఎం తదితర యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ స్కారన్లు ఏర్పాటు చేయడం ద్వారా త్వరగా ప్రసాదాలు కొనుగోలు చేసుకునేందుకు కూడా వీలు పడుతుందని, ఈ విషయంలో ఈఓ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.




Annavaram

2023-05-12 06:55:04

గొప్ప సిద్ధాంతకర్త కారల్ మార్క్స్..

ఆర్థిక అసమానతలు లేని స్వేచ్ఛపూరితమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని కోరుకున్న సిద్ధాంతకర్త కారల్  మార్క్స్ అని గ్రంథాలయ విశ్రాం తి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1818   మే 5న జర్మనీలో జన్మించిన కారల్ మార్క్స్ శ్రామికులకు మార్గద ర్శకుడు అని అన్నారు. పెట్టుబడి దారి నాగరికతలో కనీసం తిండి దొరకక బాధలు పడుతున్న ప్రజానీకానికి ఆయన సిద్ధాంతం ఒక ఆశాజ్యోతి వంటిదని అన్నారు.  ఆర్థిక అంశాలు, సామాజిక జీవనానికి సంబంధించిన ఇతర విషయాలను ఆయన చెప్పినంత  షూటిగా మరెవరు చెప్ప లేదని అన్నారు. ఆయన జీవితమంతా సమాజంలో నెలకొన్న వర్గ వైరుధ్యం, పెట్టుబడి దారి విధానం, సంపద యొక్క అసమాన పంపిణీకి వ్యతిరేకంగా సాగిందని అన్నారు. ఈ విషయాలపై ఆయన పలు రచనలు చేశారని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-05-05 07:58:22