1 ENS Live Breaking News

క్రైస్తవ సేవా సంస్థలకు ఆస్తి పన్ను రద్దు చేయండి

విశాఖపట్నంజిల్లా, నగరం పరిధిలోని క్రైస్తవ సేవా సంస్థలకు ఆస్తి పన్ను రద్దు చేయాలని డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల సంయుక్తంగా, ఆంధ్ర ప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీని అభ్యర్ధించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో కలిసి లాభాపేక్ష లేకుండా నడుపుతున్న క్రిస్టియన్ మైనారిటీ కి సంబంధించిన  చారిటీల సంస్థలకు ఆస్తి పన్ను తగ్గించాలన్నారు. అవకాశం ఉంటే పూర్తిగా మాఫీ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈమేరకు ప్రత్యకంగా వినతి పత్రాలను అందించారు. వారి వినతిపై చైర్మన్ జాన్ వెస్లీ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని జాన్ వెస్లీ చెప్పినట్లు ఆయా సంస్థలు మీడియాకి తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ జాన్ ప్రకాష్, ఫాదర్ సుధాకర్, ప్రిన్సిపల్ సిస్టర్ ప్రేమ, సిస్టర్ రెజీ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 14:24:07

14 నుంచి విష్ణు సహస్రనామ సోత్రాల పారాయణం

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఏకాదశి పర్వదినం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 4.30 గంటల నుండి 6.00 గంటల వరకూ విష్ణు సహస్రనామ స్తోత్రం,  లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈమేరకు ఆదివారం అన్నవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  వైదిక కమిటీ సూచనల ప్రకారం వీటిని నిర్వహిస్తుననట్టు పేర్కొన్నారు. ఆశక్తి కలిగిన భక్తులు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందుగా పీఆర్వో విభాగంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీఏటా మాదిరిగానే, ఈఏడాది కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం,  లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని దేవస్థాన అధికారులు కోరారు.

Annavaram

2023-06-11 13:18:34

జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్రకార్యదర్శి చిలకం మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోజు పవన కళ్యాణ్ స్వామవారిని దర్శించుకుని అన్నవరం నుంచే యాత్ర ప్రారంభిస్తారని.. ఈ కార్యక్రమానికి జనసే నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఇప్పటికే తమ అధినేత పర్యటన ఖరారు అయినందున జిల్లాతోపాటు, అన్ని నియోజకవర్గాలు, దారిపొడవునా ఉన్న గ్రామాల్లోని జనసేన కార్యకర్తలకు వర్తమానం పంపినట్టు తెలియజేశారు. యాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏఏ గ్రామాల మీదుగా వారాహి ప్రయాణిస్తుందో మొత్తం టూర్ షెడ్యూలు నియోజవకర్గాల వారీగా ప్రకటించారని పేర్కొన్నార. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ తమ్మయ్య బాబు అక్కల గాంధీ కరణం సుబ్రహ్మణ్యం  నల్ల రామకృష్ణ గాబు బండారు రామారావు మరియు జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Annavaram

2023-06-11 10:07:23

ప్రాథమిక దశలోనే మలేరియాను గుర్తించడం మేలు

దోమ కాటు ద్వారా  సోకే మలేరియాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక  మాసోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆడ అనాలసిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు కాలేయంలో వృద్ధి చెంది ఎర్ర రక్తకణాలను దెబ్బతీస్తాయని అన్నారు. చలి, జ్వరం, తల నొప్పి, కండరాల నొప్పి, చాతిలో నొప్పి, దగ్గు, చెమటలు, వాంతులు, విరేచనాలు ,నీరసంగా ఉండటం ,ఆయాసం మలేరియా లక్షణాలని అన్నారు. దీని నివారణకు గాను ఇంటి పరిసరాల్లో దోమలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమతెరలు వినియోగించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-06-11 07:17:58

సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటామ‌ని  ఉద్యోగు లు తెలిపారు. ఈ మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరు డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి (మెడికల్ అండ్ హెల్త్) ఉద్యోగులు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమని రెగ్యుల‌రైజ్ చేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి తమకు న్యాయం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. అవసరం వచ్చినప్పుడు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్.వి.వి. సత్యనారాయణ, ఎం. దుర్గాప్రసాద్, డి. ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Kovvur

2023-06-10 16:47:01

ఇంగ్లీషు భాషతో పాటు భావం కూడా ముఖ్యం

భాషతో పాటు భావం ముఖ్యం అని  లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ అన్నారు. అమెరికన్ ఇంగ్లీష్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ నిలవొచ్చునని ఆయన పేర్కొన్నారు.  మాతృభాషతోనూ ద బెస్ట్ గ నిలవొచ్చునని అభిప్రాయపడ్డారు. -లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ తొ నగరంలోని 36 ఏళ్లుగ నడుస్తున్న తన్మయి క్రియేటివ్స్ సాంస్కృతిక సంస్థ ప్రత్యేకం అమెరికన్ ఇంగ్లీషుభాష శైలికి సంబంధించి శిక్షణ 2వ రోజు చేపట్టారు. ఈ సందర్భంగ భాషతో పాటు భావం ముఖ్యం అని చెప్పారు.  ఇంగ్లీష్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ మాతృభాషలోనూ అత్యుత్తమంగ నిలవొచ్చు నన్నారు. అమెరికన్ ఇంగ్లీష్ శైలి, భాష ఉచ్ఛారణ, రాయడంలోనూ మాట్లాడడం లొ ఉండే వ్యత్యాసం తదితర అంశాలను ప్రస్థావించారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన తరుణంలో ఆంగ్ల భాష మరీ ముఖ్యంగ అమెరికన్ శైళి అవసరం ఎంతో ఉందని అన్నారు.

  36 ఏళ్లుగ నడుస్తున్న సాంస్కృతిక సంస్థ తన్మయి క్రియేటివ్స్ శనివారం ద్వారకా నగర్ పౌరగ్రంధాలయంలొ రెండు రోజుల అమెరికన్ ఇంగ్లీష్ శైలిలో ఉచిత శిక్షణ కార్యక్ర మం  2వ రోజు కార్యక్రమంలొ  అమెరికన్ ఇంగ్లీష్ ప్ధాధాన్యత వివరించి ప్రాక్టికల్ గ అమెరికన్ ఇంగ్లీష్ కు సంబంధించిన కొన్ని పదాల వాడకం తీరుతెన్నులు విశ్లేషించారు. తన్మయి క్రియేటివ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అక్షరసారధి బిఎస్ చంద్రశేఖర్ స్వాగత ఉపన్యాసం చేసిన కార్యక్రమంలొ సీనియర్ క్రీడా జర్నలిస్టు, పర్వతారోహకులు నాగనబోయిన నాగేశ్వరరావు, తన్మయి క్రియేటివ్స్ కార్యదర్శి సీహెచ్వి సత్యనారాయణ, కొణతాల రాజు, గ్రంధి సతీష్ కుమార్, ఉప్పాడ రఘు,  ఆధ్యాత్మిక వేత్త ఎంవి రాజశేఖర్ లు   మాట్లాడారు. కార్యక్రమ సమన్వయకర్త బాదంగీర్ సాయి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషకు అమెరికన్ వాడుక భాషతో కూడినసోదాహరణ అంశాల సహితం జీవన్ కుమార్ పేర్కొనడం ప్రశంసనీయం అన్నారు.  సీనియర్ జర్నలిస్టు, లెగ్జిగ్రాఫర్ గ జీవన్ కుమార్ ప్రసంగం వంటి కార్యక్రమాలు  భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను కూడా అందజేశారు. డి.సి.డిజిటల్స్ సునీల్, సనపల రూపేష్ కుమార్, వియ్యపు రామకృష్ణ, యస్.దుర్గారావు తదితరులు నిర్వహణలో సహకరించారు.

Visakhapatnam

2023-06-10 16:03:59

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తొలిప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తానని బొబ్బిలి ఎంపీ డిఓ పి.రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని గ్రామ పంచాయతీలు, సచివా లయాలను సందర్శిస్తానని చెప్పారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలంలోని గ్రామాలు, సచివా లయాల పరిధిలోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు క్రుషి చేస్తానని అన్నారు. ప్రజలు గ్రామ సచివాలయాల ద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్ర మంతో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఎంపీడీఓని కలిసి పరిచియం చేసుకున్నారు. 

Bobbili

2023-06-09 07:06:26

ఎమ్మెల్యే పర్వతను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీడీఓ

శంఖవరంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ జి.శివరామక్రిష్ణయ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఎంపీపీ పర్వత రాజబాబును కూడా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మండలాన్ని అభివ్రుద్ధి పధంలో నడిపించాలనే ఎమ్మెల్యే సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకి వెళతానన్నారు. దశలవారీగా మండలంలోని అన్ని పంచాయతీలు, గ్రామసచివాలయాలను సందర్శించి అక్కడ ప్రధాన సమస్యల పరిష్కరించడానికి క్రుషిచేస్తానని అన్నారు. మంచి వాతావరణం కలిగిన ప్రాంతానికి పదోన్నతి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు  సిబ్బందితో కార్యాచరణ రూపొందిస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటాననని చెప్పిన ఎంపీడిఓ ప్రజలు ఎప్పు డైనా తనను కలవడానికి నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి రావొచ్చునన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది సేవల్లో ఎక్కడ లోపాలు ఉన్నా తనకు తెలియజే వచ్చు న న్నారు.

Sankhavaram

2023-06-08 15:05:10

శంఖవరం ఎంపీడీఓగా జి.శివరామక్రిష్ణయ్య

కాకినాడ జిల్లా శంఖవరం మండల పరిషత్ డెవలెప్ మెంట్ అధికారిగా జి.శివరామక్రిష్ణయ్య నియమితులయ్యారు. ఈయన మామిడికుదురులో ఈఓపీఆర్డీగా విధులు నిర్వహించేవారు. పదోన్నతిపై శంఖవరం ఎంపిడీఓగా వచ్చారు. ఈరోజు ఆయన విధుల్లోకి చేరారు. శివరామక్రిష్ణయ్య విధినిర్వహణలో ముక్కుసూటి అధికారిగా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారనే మంచిపేరు ఈయనకు ఉంది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. పలువురు సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది కూడా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని సచివాలయాలు పర్యటిస్తానని చెప్పారు.

Sankhavaram

2023-06-08 14:20:41

దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

వాల్తేరు రైల్వే డివిజనల్ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ విజయ్ కుమార్ పై దౌర్జన్యానికి పాల్పడి కుల ధూషణకు దిగిన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని విప్ల వ దళిత సంఘ నేతలు డిమాండ్ చేశారు. గురువారం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, కుల ధూషణలకు పాల్పడిన డాక్ట ర్ కాశీపతి, మహేష్ కుమార్, లక్ష్మణరావులను తక్షణమే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. గత మాసం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్ర మా లు చేపట్టినా వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. అందుకే భవిష్యత్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేప ట్టేం దు కు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. వాల్తేరు రైల్వే అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితుల అక్రమ బదిలీలను వెం టనే ఉపసంహరించి వారికి గతంలో పనిచేసే చోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు కొల్లాబత్తుల వెంగళరావుతో పాటు జిల్లా, నగర నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-08 11:12:49

క్రైమ్ రేట్ తగ్గించేందు తనవంతు కృషి చేస్తా

క్రైమ్ రేట్ తగ్గించేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై వి.వెంకటేశ్వర రావు తెలిపారు. డీసీఆర్బి లో విధులు నిర్వహిస్తూ వన్ టౌన్ ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతూ ఉంటుందని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు పరిశీలించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రజలతో మమేకమై, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పారు.

Srikakulam

2023-06-08 07:55:40

బొబ్బిలి ఎంపీడిఓగా పి.రవికుమార్ నియామకం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిషత్ డెవలెప్ మెంట్ అధికారిగా పి.రవికుమార్ నియమితులయ్యారు. ఈయన అనకాపల్లి జిల్లా మునగపాక ఎంపీడీఓ కార్యాల యంలో అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించేవారు. పదోన్నతిపై బొబ్బలి ఎంపిడీఓగా వచ్చారు. ఈరోజు ఆయన విధుల్లోకి చేరనున్నారు. రవికుమార్ విధినిర్వహణలో ముక్కుసూటి అధికారిగా అనకాపల్లి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారనే మంచిపేరు ఈయనకు ఉంది.

Bobbili

2023-06-08 07:26:09

10న ‘నరాల వ్యాధుల నివారణ`చికిత్స’ పై సదస్సు

అనకాపల్లి శ్రీ గౌరీ గ్రంథాలయం 80 వార్షికోత్సవం సందర్భంగా ‘నరాల వ్యాధుల నివారణ చికిత్స’ (Prevention and Treatment of Neurological Diseases) అం శంపై శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఈ నెల 10వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు సదస్సు జరుగుతుందని  గ్రంథాలయ కార్యదర్శి  కాండ్రేగుల వెంకటరమణ ఒక ప్రకట నలో తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా అంతర్జాతీయ న్యూరో సర్జరీ నిపుణులు, ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన బెంగుళూరులోని కేంద్ర ప్రభుత్వ నిమ్‌హేన్స్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సస్‌) ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగం పూర్వపు ప్రధాన అధిపతి డా.ఎం.భాస్కరరావు హాజరవుతారు. నరాల వ్యాధుల నివారణ`చికిత్స, మందుల ద్వారా తగ్గని పిట్స్‌ వ్యాధి (Epilepsy Surgery), మతిమరుపు, బ్రెయిన్‌ టూమర్‌ (మెదడులో కణితులు), పక్షవాతం ఇంకా మెద డుకు సంబంధించిన వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సదస్సులో చర్చిస్తారని పేర్కొన్నారు. సదస్సుకు యువతీయువకులు, విద్యార్ధులు, వైద్యులు, స్వచ్ఛం ద సంస్ధల ప్రతినిధులంతా  హాజరు కావాలని ఆయన కోరారు

Anakapalle

2023-06-08 05:41:13

12 న ఆంధ్రా శబరిమల 12 వ వార్షికోత్సవం

శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీ శివారు సిద్దివారిపాలెం గిరిజన గ్రామంలో వెలసిన ఆంధ్రా శబరిమల దేవస్థానం 12వ వార్షికోత్సవాన్ని ఈనెల 12న నిర్వ హించ నున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, గురుస్వామి, శంఖవరం గడ్డ ఆర్యవైశ్యవంశ ముద్దుబిడ్డ కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు నేతృత్వంలో వార్షికోత్సవ వేడు కలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తజన వైభవోపేతంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం స్వామి సన్నిధిలో వేకువజామున 5 గంటల నుండి హెూమాలు, యజ్ఞాలు, క్రతువులను వేద పండితులు నిర్వహిస్తారు. 7 గంటలకు ఉషోదయ పూజ అనంతరం 9 గంటలకు స్వామికి ప్రత్యేకాభిషేకాలను నిర్వహిస్తారు. 11 గంటలకు స్వామిని 18 మెట్ల మీదుగా ఊరేగిస్తారు. ఆలయ ఆవరణలోని కోనేరులో 11.15 గంటలకు స్వామికి చక్రస్నానం, 11.30 గంటలకు  స్వామి వారికి వెండి బిం దెలతో గంగోత్రి స్నానం నిర్వహిస్తారు. 12గంటలకు నవ కలశాభిషేకం గావించి, 12.30 గంటలకు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం 1 గంటకు ఆలయ ఆవరణలో భక్తజన సందోహానికి మహా అన్నదాన చేస్తారు. స్వామి ఆశీర్వచనం అందించడంతో నాటి ఆలయ వార్షికోత్సవ వేడుకలు పూర్తవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి మీడియాకు వెల్లడించారు.

Sankhavaram

2023-06-07 15:40:32

మెటల్ రోడ్ల నిర్మాణాలకు రూ.50లక్షల అంచనా బడ్జెట్

అనకాపల్లి మార్కెట్ యార్డు పరిధిలోని పలు అభివ్రుద్ధి పనులకు పలు తీర్మాణాలు ఆమోదించి పరిపాలన అనుమతుల కోసం పంపనట్టు  పలకా యశోద రవి పేర్కొన్నా రు. అనకాపల్లిలో బుధవారం మార్కెట్ కమిటీలో సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమోదించిన తీర్మానాలను కమిటీ సభ్యులు వివరించారు. మార్కెట్ యార్డ్ తూర్పు భాగంలో కాంపౌండ్ వాల్ మెయింటెనెన్స్ కోసం రూ.10 లక్షల బడ్జెట్ మంజూరు కోసం వ్యవసాయ కమిషనర్ కు పంపామన్నారు. అనకాపల్లి, కశింకోట మం డలాల్లో గ్రామాల్లో అవసరం మేరకు మెటల్ రోడ్లకి రూ.2 లక్షల వంతున 20 గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు వేయడానికి అంచనాల బడ్జెట్ మంజూరు కోసం కూడా తీర్మానం చేశా మన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి డి.శకుంతల, కమిటీ ఉపాధ్యక్షులు కరక సోమినాయుడు, మెంబర్లు నీటిపల్లి లక్ష్మి, మరిపల్లిశోభ, బొబ్బిలి శ్యామ ల, ఈగల నూకరత్నం, దాడి తులసి కుమారి, బొడ్డు అచ్చిరాజు, పిట్ట అప్పలరాజు, తెరపల్లి నాగ సంతోష్ కుమార్, దాడి  కృష్ణ, ఒమ్మి మధుబాబు, కొణతాల విజయ్ కుమారి, గుండా రమేష్ గుప్తా, గొంతిన శివ, ఏడి అగ్రికల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-07 13:54:16