1 ENS Live Breaking News

సత్యదేవుని అన్నధాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం

అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్య అన్నదానం ట్రస్టుకి హైదరాబాదుకి చెందిన మల్లారెడ్డి, మధులతారెడ్డిలు రూ.లక్ష విరాళం అందించారు. ఈమేరకు గురువారం దేవస్థానంలోని సిబ్బందికి ఆమొత్తాన్ని అందజేసి పత్రాన్ని పొందారు. సెప్టెంబరు11న అనన్య పేరుతో అన్నదానం చేయాలని దాతలు అధికారులను కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలు అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-06-15 16:53:56

శ్రీ సత్యదేవుడిని దర్శించుకున్న జనసేన పవర్ కళ్యాణ్

జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని అంతరాలయ దర్శనం చేసుకొని పూజలు చేశారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించగా.. ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. నిన్నరాత్రే అన్నవరం కొండపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయమే స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆయన వెంట ముఖ్య నాయకులు కూడా దర్శనానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, జనసైనికులు భారీగా కొండపైకి చేరుకున్నారు. కాగా సాయంత్రం కొండ దిగువన స్వామివారి పాదాల మండపం వద్ద వారాహికి పూజలు చేసిన అనంతరం కత్తిపూడి బహిరంగ సభకు యాత్రగా పవన్ కళ్యాణ్ తరలి వెళతారు. దానికోసం సభాఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Annavaram

2023-06-14 07:51:13

జనసేన వారాహి యాత్ర 9నియోజకవర్గాలు..10 రోజులు

జనసేన అధికానేత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్న వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభమై 9 నియోజకవర్గాల్లో పదిరోజులు సాగి చివరికి భీమవరం చేరుకుంటుంది. తొలిరోజు సత్యదేవుని పాదాల చెంత పూజలు పూర్తిచేసుకొని మొదటి సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో బహిరంగ సభ జరుగుతుంది. తరువాత రూట్ మ్యాప్ వారీగా సమావేశాలు నిర్వహించుకుంటూ వారాహి యాత్ర సాగుతుంది. ఎన్నికలకు సుమారు ఎనిమిది నెలలు సమయం ఉండగా నే జనసేన పార్టీ చేపడుతున్న వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయవర్గాల్లో కాక నింపారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం చాలా కార్యక్రమాలకు ప్రారంభా లకు సెంటిమెంట్..అదే సెంటిమెంటును జనసేన కూడా వినియోగించుకొని ఈరోజు యాత్ర ప్రారంభిస్తున్నది. ఈ నేపథ్యంలో జనసైనికులు కూడా భారీ ఎత్తున అన్నవరం చేరుకుంటున్నారు. సాయంత్రం జరిగే సభలో ఏం మాట్లాడతారనేది ఇప్పటి నుంచే ఉత్కంఠగా మారింది..!

Annavaram

2023-06-14 07:25:58

బొజ్జన్నకొండ అభివృద్ధికి ఎంపీ, మంత్రలు మోకాలడ్డు

అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్న కొండ అభివృద్ధి కాకపోవడానికి ఎంపీ భీశెట్టి సత్యవతి, మంత్రి గుడివాడ అమర్నాథ్ లే కారణమని మాజీ ఎమ్మెల్యే, నియోజ కవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన బొజ్జకొండ దగ్గర నుంచి ఎంపీ, మంత్రులకు  సెల్ఫి ఛాలెంజ్ విసి రారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి అమర్నాథ్ కు పబ్లిసిటీ తప్పా అభివృద్ధి ఎలా చేయాలో తెలియదన్నారు.వైఎస్సీర్సీపికి ప్రెస్ మీట్లు పెట్టడానికే ఈ నాలుగేళ్లు సరిపోయిందని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో బొజ్జన్నకొండ అభివృద్ధి కి ఏడు కోట్లు మంజూరయ్యాయన్న ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివ్రుద్ధికి పర్యాటక ప్రాంతాలను అభివ్రుద్ధి చేయడానికి ఏం చేశారో చెప్పాలన్నారు. వీరంతా నియోజవకర్గంలో గెలిచి కార్యక్రమాలన్నీ విశాఖలో చేస్తే..ఓట్లేసిన ప్రజలకు ఏం మేలు చేయగలరని.. నాయకుండే ప్రజలకు అందుబాటులో ఉండి నియోజవకర్గాలను అభివ్రుధ్ధి చేసినవాడేనన్నారు.

Anakapalle

2023-06-13 14:03:11

బీసీల ఆశయసాధన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

బిసిల భవిష్యత్తు కు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ తోనే నని బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళ సురేంద్ర అన్నారు. అనకాపల్లిలోని గవరపాలెం టిడిపి  కార్యాల యంలో మంగళవారం బిసి గళం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిలకు ఆదరణ పథకం, సబ్సిడీ తో కూడుకున్న రుణాలే కాకుండా రాజ్యాంగ పదవులు అప్పజెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుదే నన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బిసిలు అణచివేతకు గురవుతున్నారన్నారు. తమ ఓట్లతో గద్దె నెక్కిన జగన్మోహన్రెడ్డి బిసి లను పూర్తిగా విస్మరించారన్నారు. ఏదేమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తేనే బిసిలకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సురేంద్ర అన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు తిప్పన అప్పారావు, దాడి జగన్, ఎండకుర్తి అప్పలరాజు, వానపల్లి కోటేశ్వరరావు, నర్సింగరావు, శ్యాంసుందర్, వేగి కృష్ణ, పెంటకోట శ్రీనివాస్, కొణతాల నూకునాయుడు, మల్ల సూరిబాబు,పీలా రమణారావు, చదరం శివ అప్పారావు, దొడ్డి రాము, సిలపరశెట్టి శ్రీను, మద్దాల భాస్కరరావు, శరగడం  శాంతారామ్, ఆళ్ల జగదీ, కాండ్రేగుల రాజు, పెతకం శెట్టి వెంకట్రావు, కొణతాల వర, కర్రీ మహాలక్ష్మి నాయుడు, పెంటకోట వరప్రసాద్, భాను చంద్ర, నంద్యాల గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-13 13:52:30

జెవికె కిట్లు ప్రతి ఒక్క విద్యార్థికి అందజేయాలి

పాఠశాలలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం పంపించేసిన జెవికె కిట్లను అదే విధంగా ఉపాధ్యాయులు చూడాలని డుంబ్రీగుడ ఎంఈఓ ఎం.రామచంద్రరావు సూచించారు. మంగళవారం మండలంలోని బిల్లా పుట్టు ఎలిమెంటరీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిరుపేద గిరి విద్యార్థులు ఎలిమెంటరీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చదవడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమం చేపడుతుందన్నారు. వీటిని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందే విధంగా చూసుకుని వారంతా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్ధులకు సమయానికి భోజనం అందించా లన్నారు. మరుగుదొడ్లు, మంచినీరు సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. పాఠశాల పరిశరాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని..పిల్లలకు ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ను వర్క్ బుక్ ఆధారంగా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dumbriguda

2023-06-13 13:47:13

అంగన్వాడి విద్యను చిన్నారులకు చేరువ చేయాలి

అంగన్వాడి కేంద్రంల్లో ఫోర్ డెవలప్మెంట్ కార్నర్స్ ఏర్పాటుచేసి విద్యను చిన్నారులకు చేరువ చేయాలని ఐసిడిఎస్ మర్రిపాలెం ప్రాజెక్టు అడిషనల్ సిడిపిఓ శ్రీలత అన్నారు. మంగళవారం విశాఖలోని ఆర్.అండ్.బి జంక్షన్ ఐసిడిఎస్ కార్యాలయంలో "జనాభాగిదారి" కార్యక్రమం ద్వారా చేపడపడుతున్న కార్యక్రమాల ద్వారా అంగన్వాడీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ, పిల్లల తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను అంగన్వాడి కేంద్రానికి ఆహ్వానించి, అంగన్వాడి ద్వారా చేస్తున్న ఫ్రీ-స్కూల్ కార్యక్రమాలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది లనే విషయాలను తెలియజేయాలన్నారు. అంతముందు కార్యకర్తలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సెక్టార్ సూపర్వైజర్లు జే.టి.ఎన్ జ్యోతి, వి.ఇందిరా, బి.కుమారి, సుందరి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-13 13:42:26

వైఎస్సార్సీపీ మోసాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన సందర్భంగా ఆదివారం విశాఖ లో నిర్వహించిన సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టమైన రాష్ట్ర రాజకీయాల పై మాట్లాడారని దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని రాజ్య సభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం రాత్రులు పగలు తేడా లేకుండా కరెంటు కోతలు విధిస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందేలా ప్రభుత్వం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ,  జాతీయ నాయకులకు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడి సమస్యల పై మాట్లాడే హక్కు ఉంటుందని ఈ క్రమం లొనే ఆదివారం అమిత్ షా సభ 4 ఏళ్ల తర్వాత విశాఖలో నిర్వహించామని ఈ సభ కు 40 వేల మంది ప్రజలు హాజరై విజయవంతం చేసారన్నారు. 

ఇక ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే గడిచిన 9 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 15 జాతీయ విద్య సంస్థలను నెలకొల్పమన్నారు. ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి గతంలో 9 ఏళ్ల లో చేసిన అభివృద్ధిని వివరిస్తామని అంతేకాకుండా జాతీయ రహదారుల 4000 కిలోమీటర్ల నుండి 9000 కిలోమీటర్లకు అభివృద్ధి చేసి 3 లక్షల కోట్లు వెచ్చించడం జరిగిందని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో రాష్ట్ర మంత్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

 బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో భూ కుంభ కోణాలు తీవ్రంగా పెరిగాయని రెండుసార్లు   సిట్ ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయకుండా భూకబ్జాదారులను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కాపాడుతుందని రానున్న ఎన్నికల్లో ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి బయటపెడతామని అన్నారు.  నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తూ బిజెపి ప్రభుత్వం ఏనాడూ వైఎస్ఆర్సీపీకి అండగా లేదని బిజెపి అండ్ తమకు ఉందని వైయస్సార్సీపి మరియు జగన్మోహన్ రెడ్డి భ్రమ పడుతున్నారని అని వ్యాఖ్యానించారు అదేవిధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులకు సంక్షేమ పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని కిసాన్ సమాన్ పేరుతో రైతులకు ప్రతి ఏటా ఆరువేల రూపాయలు కేంద్రం ఇస్తుంటే దానిని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం పథకం కింద చలామణి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.  ఈ నెల 10వ తారీఖున రాజకీయ వేట మొదలైందని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన పై ఉక్కు పాదం మోపి ఏవిధంగా బిజెపి ముందుకు వెళుతుందని రాష్ట్రంలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ప్రముఖ ఐటీ అసోసియేషన్కు ప్రతినిధిగా ఉన్నానని విశాఖకు ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదని ఐటీ కంపెనీలు తీసుకొస్తామని పేరుతో రాష్ట్ర ప్రజలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాద్ మోసం చేస్తున్నారన్నారు.

 అంతేకాకుండా మీడియా సంస్థలపై దాడి దాడికి పూనుకున్నారని కొన్నింటికి మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. మార్గదర్శిపై ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోయినా కక్ష సాధింపు చర్యలకు దిగారని రామోజీరావు మరియు, శైలజలను మానసికంగా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు చెల్లించలేక అమర్ రాజా కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందని  రాష్ట్రం ఒక పక్క అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే జగన్ మోహన్ రెడ్డి అపర కుబేరుడు అవుతున్నాడని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి ధానేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-13 08:35:19

శ్రీకన్యకా పరమేశ్వరీ ఆలయంలో గోశాల ప్రారంభం

భారతీయ సంస్క్రుతిలో గోశాలను కూడా ఆలయంగానే చూస్తారని..అలాంటి గోశాల అమ్మవారి ఆలయంలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆలయ అధ్యక్షులు బిళ్లపాటి కృష్ణకుమార్ అన్నారు. అనకాపల్లి గాంధీ మార్కెట్ సమీపంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోశాలను సోమవారం కమిటీ సభ్యులు ప్రారంభించారు. తొలుత గోశాలలో గోమాతను ప్రవేశింపజేసి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలు పొంగించి, లక్ష్మీ గణపతి హోమాలు, పూజలు జరిపారు. ఆలయ మండపంలో మహిళలు లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తదనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోపూజ చేసుకు భక్తులు ఆలయానికి తరలి రావాలని ఈ సందర్భంగా కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్ప ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-12 12:37:19

సీఎం జగన్ విద్యకు పెద్దపీట వేసి అభివ్రుద్ధిచేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి విద్యకు పెద్దపీట వేసి కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేస్తున్నారని వైఎస్సార్సీపీ సిఇసి నాయకులు పైలశ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పరవాడలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, వసతి దీవెనపథకాల ద్వారా  సీఎం పేద పిల్లల విద్యోన్నతికి పాటుపడుతున్నారన్నారు. అందులో భాగంగానే విద్యార్థుల కోసం మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం జగనన్న విద్య కానుకను నిర్విరామంగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు,  పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు చిన్నారవు, తదితరులు పాల్గొన్నారు.

Paravada

2023-06-12 12:31:03

జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 14న చేపట్టనున్న వారాహి యాత్రను జయప్రదం చేయాలని యలమంచిలి యాత్ర ఇన్చార్జి కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షులు బం డ్రెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్ పిలుపునిచ్చారు. ఎలమంచిలి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజ య్ కుమార్ అధ్యక్షతన జనసైనికులతో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుండి ప్రారంభం అవుతుందని.. అదే రోజు కత్తిపూడి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ యొక్క బహిరంగ సభకు నియోజకవర్గంలో గల జనసైని కులు వీర మహిళలు అత్యధికంగా తరలిరావాలని కోరారు. అనంతరం వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈసమావేశంలో జనపరెడ్డి శ్రీనివా సరావు, బైలపూడి శ్రీరామదాసు, లాలం చందు, పప్పల నూకన్న దొర, పైల రాము నాయుడు, కాళ్ళ చంద్రమోహన్, చొప్ప శ్రీను, పొట్నూరి శివశంకర్, బొద్ధపు శ్రీనివాస రావు, లాలం సోమనాయుడు, పవన్ విజయ్, నియోజవర్గపు జనసేన నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యలమంచిలి

2023-06-12 12:06:22

జనసేన వారాహి యాత్రను జయప్రదం చేయండి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను జయప్రదం చేయాలని అరకు పార్లమెంట్ ఇంచార్జ్, నర్సీపట్నం వారాహి యాత్ర సమన్వయకర్త వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. సోమవారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో గొలుగొండలో వారాహి రధయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సంక్షేమం పేరుతో సంక్షోభం వైపు అడుగులేస్తున్న ప్రభుత్వ విధానాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ప్రత్యర్థులపై పారాటయాత్ర అన్నారు. ఈ యాత్రను నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు జయప్రదం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ. అధికారంలోకి రావడానికి అందరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ, సలాదుల ప్రసాద్, ఎస్సీ సెల్ బోయిన చిరంజీవి, కోన నారాయణరావు, వాసం వెంకటేష్, వూడి చక్రవర్తి, కేడీపేట ఉప సర్పంచ్ దుంపలపుడు సహదేవుడు లింగంపేట ఉపసర్పంచ్ లంకసత్యనారాయణ నాతవరం మండలం నాయకులు వెంకటరమణ, పాలుపర్తి సూరిబాబు, బంగారు నాయుడు జన సైనికులు  పాల్గొన్నారు.

Golugonda

2023-06-12 07:56:05

1990 బ్యాచ్ క్రిష్ణదేవిపేట పూర్వ విద్యార్ధుల దాత్రుత్వం

వాళ్లంతా ఏఎల్ పురం జిల్లా పరిషత్ హైస్కూలులో 1990-91 బ్యాచ్ 10వ తరగతిలోని పూర్వవిద్యార్ధులు ఏడాది క్రితం అంతా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకు న్నారు. ఆ తరువాత ప్రతీ ఏడాది ఏదోఒక ప్రాంతంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని వారి వారి శుభకార్యాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారా మరాజు పాడేరు జిల్లా, చింతపల్లి మండలం లంబసింగి పర్యాటక ప్రాంతంలో మళ్లీ ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. ఎంతో సరదాగా గడిపారు. కలవడం సరదాగానే అయినా వారి సహచర విద్యార్ధులు కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారికి తమవంతు సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. వారితో కలిసి చదవుకున్న స్నేహితుల్లో ఒకరికి పక్షవాతం రావడంతో స్నేహితుడికి రూ.4వేలు.. ప్రమాదంలో చేయి విరిగిపోయిన మరో స్నేహితుడికి రూ.2వేలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందించారు. గత ఏడాది ఇదే బ్యాచ్ లోని స్నేహితురాలి ఇల్లు కాలిపోవడంతో ఆమెకు రూ.30వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఇలా ఒకరికి ఒకరు మేమున్నామంటూ భరోసా ఇచ్చుకుని ముందుకి సాగుతున్నారు.ఈనాటి కార్యక్రమంలో సుమారు 50మంది పూర్వవిద్యార్ధులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకూ అక్కడే ఉండి సరదాగా గడిపారు. ఈ ఆత్మీక కలయికకు పైల చంద్రశేఖర్, బెన్నయ్యనాయుడు, భాస్కర్రావు సంధాన కర్తలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Lambasingi

2023-06-11 15:36:08

సియం జగన్ చిత్రపటానికి లెక్చిరర్ల పాలాభిషేకం

ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో సీఎం. జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తారువాలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు సమక్షంలో సీఎం.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందుకు సహకరించిన ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోను అమలు చేస్తున్న   ముఖ్యమంత్రి జగన్ గారికి తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, అప్పారావు, పార్థసారథి, రామకోటి, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, రమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-11 15:09:36

స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ జాయింట్ సెక్రెటరీ పర్యటన

స్వచ్ఛ భారత్ అర్బన్ జాయింట్ కార్యదర్శి రూపామిశ్ర ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాపులుప్పాడులోని జిందాల్ విద్యుత్ కేంద్రాన్ని, బయోమైనింగ్, ఘన వ్యర్ధాల విభజనతో పాటు ఋషికొండ, వైయస్సార్ వ్యూ పాయింట్, బీచ్ రోడ్ లోని వైఎంసిఏ వద్ద ఆధునికరించిన మోడ్రన్ మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె హోటల్  ర్యాడిసన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏ అంశాలు, ఏ ఏ పనులు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్బన్ జాయింట్ సెక్రెటరీకి వివరించారు. ముఖ్యంగా ఘన వ్యర్ధాల విభజన, సేంద్రియ ఎరువు తయారీ, మెరుగైన పారిశుధ్యం, భూగర్భ మురుగనీటి వ్యవస్థ, నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన, కాలుష్యం నియంత్రణ, బహిరంగ మలమూత్ర విసర్జనతో పాటు సామూహిక మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించడం తదితర అంశాలపై చర్చించిన అనంతరం ఆమె కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 15:02:23