1 ENS Live Breaking News

టీడీపీ విజయంతోనే యువతకు న్యాయం.. గంటా రవితేజ

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, అప్పుడే యువతకు తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని ఆ పార్టీ యువనేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు, మరో మాజీ మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ అన్నారు.. యువగళం పాదయాత్రలో భాగమై.. అనంతరం నెల్లూరులో నారా లోకేష్‌తో రవితేజ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ యువతకు అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందన్నారు.. నిరుద్యోగ సమస్యకు చెక్‌ చెప్పి.. ఉద్యోగావకాశాలు పెరగాలంటే అదొక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీయేనని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో యువతకు అధిక సీట్లు కేటాయించే అవకాశముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. తగిన ఉద్యోగావకాశాలు కరువై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువత కృషి చేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. యువతీయువకులంతా సంఘటితంగా టీడీపీకి మద్దతు పలికి.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించాలని విజ్ఞప్తి చేశారు.

nellore

2023-07-03 09:36:56

గిరి ప్రదక్షిణలో భక్తులకు ఆర్యవైశ్యుల ఫలహార వితరణ..

సింహాచలం వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సీతమ్మధార మెయిన్ రోడ్ హెచ్. బి.కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద గల బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా భక్తులకు ఇడ్లీ, టమాటా బాత్, తీపి బూంది పలహారాలను అందించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి నిర్విరామంగా అందజేశారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఈ శిబిరంలో సేవ చేస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులను గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు బలవర్ధకమైన ఫలహారం అందిస్తున్నందుకు అభినందించి కొంతసేపు భక్తులకు ఫలహార పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నల్లూరి నూకరాజు. కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిఏటా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ భక్తులకు ఫలహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.  కార్యక్రమ చైర్మన్ పూసర్ల సుధీర్ మాట్లాడుతూ, సంఘం సభ్యులు స్వచ్ఛంద విరాళ రూపంలో అందించిన పచారీ సరుకులు, నగదు  మొత్తంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు విరించారు. అంతకుముందు ఈ పలహార వితర కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాదులు ఎం.కే. శ్రీనివాస్, ఎం.ఎస్. వెంకటేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గ్రంధి దుర్గాప్రసాద్, కన్యకాపరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షుడు విన్నకోట రామమూర్తి, సభ్యులు దుర్గా సోమేశ్వరరావు వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు, సుగ్గు శివకుమార్, కె.వి. రమణయ్య, పూసర్ల సంజీవరావు, కంకటాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-03 06:31:09

గిరిప్రదక్షిణలో తాగునీరు, పారిశుద్ధ్యంపైనే ప్రత్యేక దృష్టి

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని జివిఎంసి కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ  పేర్కొన్నారు. ఆదివారం ఆయన గిరి ప్రదక్షిణ మార్గంలో లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని, ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలూ సహకరించాలన్నారు. భక్తులు సులువుగా ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకునేలా పోలీస్‌ శాఖ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుండడంతో పలు ప్రాంతాల్లో 20 డ్రోన్ల ద్వారా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా దృశ్యాలన్నీ జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానమవుతాయి. దీంతో ఎక్కడెక్కడ ఏఏ లోటుపాట్లున్నాయి, వాటిని అధిగమించడం ఎలా అనే విషయమై పలువురికి సూచనలిచ్చారు. ప్రదక్షిణ ముగిసేంత వరకు కమాండ్‌ కంట్రోల్‌లో సిబ్బంది ఉంటారని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్‌ ఆదేశించారు. సాయంత్రానికే లైటింగ్‌ సిద్ధం కావాలని, కొన్ని చోట్ల కొత్తగా రోడ్లేయడంతో వాటి పిక్కలు భక్తుల కాళ్లకు తగలకుండా క్రషర్ బూడిద వేయాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్  డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజనీరు రవి కృష్ణంరాజు, పట్టణ ప్రణాళిక అధికారి సునీత, మంచి నీటి సరఫరా విభాగ ఎస్‌ఈ వేణుగోపాల్‌, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌, ఆయా ప్రాంతాల జోన్ల కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-02 16:04:58

మాదక ద్రవ్యాలతో వచ్చే అనర్ధాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్ధులు పాఠశాల స్థాయి నుంచే మాదక ద్రవ్యాలతో వచ్చే అనర్ధాలు, నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూలులో ఏర్పాటు చేసిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని ఏవిధంగా నాశనం చేస్తాయో, వాటి భారిన పడితే జీవితంలో ఎంత నష్టపోతామనే విషయాలను సిఐ విపులంగా తెలియజేశారు. ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా గంజాయి, నాటుసారా రవాణాను నియంత్రిస్తున్నదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదంటే..14500కి ఫోన్ చేయాలన్నారు. ఎస్ఐ అజయ్ బాబు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

 గంజాయి, కొకైన్, మత్తుఇంజక్షన్లు, బ్రౌన్ షుగర్ వంటి వాటిపైనా వాటి వలన జరిగే అనర్ధాలపైనా విద్యార్ధులు అవగాహన పెంచుకోవడం ద్వారా మరింత మందికి తెలియజేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్తు పదార్ధాల వినియోగాన్ని నియంత్రించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్.కళాంజలి, గౌతమి, నాగమణిలు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల్లోని రాకాలను చిత్రాల ద్వారా వివరించి, వాటి వలన జరిగే నష్టాలతో తల్లిదండ్రులు ఏవిధంగా బాధపడతారనే అంశాలను తెలియజేశారు. ఇతర మహిళాపోలీసులు రమ్య, చిన్నారి, నీలిమ, స్వర్ణలత తదితరులు వివిధ మాదక ద్రవ్యాలు, వాటివలన కలిగే నష్టాలను, వాటికి సంబంధించిన గోడపత్రికలతో విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కిరోన్, కోటేశ్వర్రావు, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-06-22 09:32:22

“మత్తు” మహమ్మారిని పారద్రోలండి - ఎస్ఐ జె.సురేష్

యువతను మత్తులో ముంచేత్తుతూ, వారి భవితకు పరిణమిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ  జె.సురేష్ అన్నారు. ఈనెల 26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శనివారం పురుషోత్తపురం, హెచ్.పీ కాలనీలోని కంఫర్ట్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగ ణంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన నివాసితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖపట్నం డ్రగ్ వినియోగంలో, రవాణాలో ప్రముఖంగా విచారకరమన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో మార్పును ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వారి గమనాన్ని మనం నిర్దేశించగలమన్నారు. డ్రగ్ వ్యాపారులు యువతను టార్గెట్ చేసుకుని తమ వ్యాపారం విస్తృతం చేసుకునే విధానాన్ని వివరించారు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలిగొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు అన్నారు. ఆరోగ్యానికి హానికరమైన డ్రగ్స్ వాడినా, అమ్మినా చట్టపరంగా నేరమన్నారు. ఈ  నేరగాళ్ళ భరతం పట్టేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.14 500 ఫోన్ ద్వారా వారి ఉనికిని తమకు తెలియపరచాలన్నారు. సచివాలయంలో పోలీస్ విధులు నిర్వహిస్తున్న రత్నం, ప్రసన్న మాట్లాడుతూ  ఆన్ లైన్ మోసాలకు గురవుతున్న నగర ప్రజలు, బోగస్ ఫైనాన్స్ సంస్థల పట్ల అప్రమత్తం కావాలని సూచించారు. కంఫర్ట్ హోమ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వివి రమణమూర్తి, ఎంఎస్ శ్రీనివాసు, కేడిఆర్ రెడ్డి, ఏవి నాగభూషణరావు, వి ఉమామహేశ్వరరావు, బిటి రావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Pendurthi

2023-06-17 17:03:07

విద్యను పొందడం పిల్లల ప్రాథమిక హక్కు..

బడి ఈడు పిల్లలు, కౌమారదశలో ఉన్న వారందరికీ విద్యను పొందడం ప్రాథమిక హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  పేదరికం తదితర కారణాలవల్ల పిల్లలు విద్యకు, అభ్యాసానికి దూరంగా ఉంటున్నారని అన్నారు.  సెకండరీ  స్థాయిలో బడి మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని అన్నారు. బడికి పోని  వారు లేదా బడికి వెళ్లి మధ్యలో మానేసిన వారు కూడా బడిలో చేరాలన్నారు. పిల్లలు బడి బయట ఉండకుండా విద్యాబుద్ధులు నేర్చుకునేటట్టు చూడటం తల్లిదండ్రుల బాధ్యత అని వెంకటరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మొదటి ఆస్తి వారి చదువేనని సూచించారు. చదువు విషయంలో ప్రతీ తల్లిదండ్రులు పూర్తిగా చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-06-17 08:09:20

శివాజీ పార్కు పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన

విశాఖ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వైయస్సార్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం  మూడవ జోన్ 17వ వార్డు పరిధిలోని శివాజీ పార్కు  పునరాభివృద్ధి పనులకు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ గేదెల లావణ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ఎన్నో ఏళ్లగా అభివృద్ధికి  నోచుకొని ఉన్న శివాజీ పార్కును సుమారు రూ. 153.30 లక్షల వ్యయంతో పునరాభివృద్ధి   పనులకు శంకుస్థాపన చేశామని, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆడుకునే సామగ్రి, బెంచీలు,  మరుగుదొడ్లు, గ్రీనరీ, తాగునీటి సదుపాయం, వ్యాయామ పరికరాలు ఏర్పాటు లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పార్కు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు గేదెల నాగరాజు, కార్పొరేటర్ నెక్కల లక్ష్మి సురేష్, పర్యవేక్ష ఇంజనీర్ సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-17 07:38:36

నగరవాసుల ఆహ్లాదానికి పార్కులు ఎంతో అవసరం

ఆహ్లాదానికి పార్కులు ఎంతో ఉపయోగపడతాయని  నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 3వ జోన్ 19వ వార్డు ఎంవిపి సెక్టార్ 2లో జీవీఎంసీ సాధారణ నిధుల నుండి సుమారు రూ.95 లక్షల వ్యయంతో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా అభివృద్ధి  చేసేందుకు తూర్పు నియోజకవర్గం అక్రమాని విజయనిర్మలతో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఆహ్లాదానికి నగరంలో పార్కులు అవసరమని, పార్కులో అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఎంపీపీ సెక్టార్ 2 లో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేసామన్నారు. రెయిన్బో ఆకారంలో వాకింగ్ ట్రాక్ను వినూత్నంగా ఏర్పాటు చేయడంతో పాటు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ ఆహ్లాదం కల్పించేందుకు గ్రీనరీ, వ్యాయామ పరికరాలు, మరుగుదొడ్లు, తాగునీరు,  విద్యుత్తు, సందర్శికులు కూర్చునేందుకు బెంచీలు, రక్షణ గోడ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమానివిజయనిర్మల మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రతి వార్డుకు ఒకటి లేదా రెండు పార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డును  ఒక మోడల్ వార్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షణ ఇంజనీరు సత్యనారాయణ రాజు, జోన్ల కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-17 07:33:11

ఉత్సాహంగా గడప గడపకూ మన ప్రభుత్వం

గొలుగొండ మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహాంగా సాగుతుంది. శనివారం మండలంలోని పాతమల్లంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నిరుపేదల పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మనదేన్నారు. ముందుగా బుడ్డడపాడు , చంద్రయ్య పాలెం, కొత్త పాలెం,హుకుంపేట, నిమ్మగెడ్డ, పాత మల్లంపేట గ్రామాల్లో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ పధకాలు ఏ విధంగా అందుతున్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో గొలుగొండ ఎంపిపి మణికుమారి, జెడ్పీటిసి సుర్ల గిరిబాబు, పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పలువురు సర్పంచులు, ఎంపీటిసిలు,నాయకులు కార్యకర్తలు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Golugonda

2023-06-17 07:22:44

ప్రధాని పాలనలో సుభిక్షంగా దూసుకుపోతున్న దేశం

ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశం సుభిక్షంగా శరవేగంగా దూసుకుపోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి  అన్నారు. శుక్రవారం విశాఖ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడారు. దేశంలో 12 కోట్ల మందికి తాగు నీటి సదుపాయం కల్పించారని చెప్పారు. పీఎం మోడీ వల్లనే జీడీపీ వృద్ధి రేట్ గణనీయంగా పెరిగి ప్రతీ రోజూ 37 కిలో మీటర్లు  రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ కారణంగా పెట్రోల్ ఆదా పెరిగిందని వివరించారు. భారతీయ రైల్వేకి గతంలో ఎన్నడూ లేనంత బడ్జెట్ కేటాయించారని తెలిపారు. రూ.10లక్షల కోట్లు బడ్జెట్ రైల్వే కి ఇచ్చారని ఇంత భారీ మొత్తం బడ్జెట్ గతంలో ఎన్నడూ లేదన్నారు. విదేశీ మారక ద్రవ్యం కూడా భారీ ఎత్తున ఆర్జించారని గుర్తు చేశారు. పీఎం అవాస్ యోజన లో భాగంగా 3.5 కోట్ల ఇళ్లను గత 9ఏళ్ళ లో కట్టించారని చెప్పారు. రైతులకు ఫర్టిలైజర్ సబ్సిడీ తో ప్రోత్సహిస్తున్నారని, మంచిగా పాలన అందిస్తూన్న మోడీని అంతా ఆదర్శం గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే డిజిటలైజేషన్  ద్వారా మనం మరింత పురోగతి సాధించామని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-16 16:20:07

మాతా శిశు మరణాలు సంభవించడానికి వీల్లేదు

శ్రీకాకుళం జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పి.హెచ్.సి, సి.హెచ్.సి వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు వివిధ కారణాలతో సంభవించిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ అరాతీశారు. మాతా, శిశు మరణాలకు గల కారణాలను సబ్ కమిటీ ద్వారా అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు మరణాల్లో వైద్యుల నిర్లక్ష్యం లేనప్పటికీ, ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని స్పష్టం చేశారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సమయపాలన పాటించడం లేదని, ఆదివారం మరియు సెలవు దినాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. వైద్యులు తమకు కేటాయించిన విధులకు తప్పక హాజరుకావాలని, అలాగే సాయంత్రం 4గం.ల వరకు విధుల్లో ఖచ్చితంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరైన, సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు.

జిల్లాలో మాతా శిశు మరణాల నివారణ, ఇతర అంశాలపై వైద్యాధికారులు, పి.హెచ్.సి,సి.హెచ్.సి వైద్యులు మరియు సిబ్బందితో జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు వైద్యులు అంకిత భావంతో పనిచేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో ఉండరాదని హితవు పలికారు. మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని, ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని హితవు పలికారు. హైరిస్క్ కేసులను ముందుగా గుర్తించి సాధ్యమైనంత మేరకు ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నించాలని ఆయన చెప్పారు. తల్లిపాల ఆవశ్యకత పట్ల తల్లులకు వివరించాలని, ఈ విషయంలో ఏ.ఎన్.ఎంలు పూర్తిస్థాయిలో  అవగాహన కల్పించాలన్నారు. పి.హెచ్. సిలోని వైద్యాధికారుల ద్వారా ఏ.ఎన్ ఎం, ఆశావర్కర్లు మూడు మాసాలు పాటు అవగాహన కల్పించాలని సూచించారు.

 అలాగే పి.హెచ్.సి స్థాయిలో ప్రతి వారం సమావేశాలు ఏర్పాటుచేసి తల్లిపాలు ఆవశ్యకత పట్ల చైతన్య పరచాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి.మీనాక్షి, జిల్లా మాస్ మీడియాధికారి పి.వెంకట రమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి ఎస్.కుమార్,ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.లక్ష్మీ తులసి,రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గైనికాలజిస్ట్ డా.పార్వతి, పి.హెచ్.సిలకు చెందిన వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2023-06-16 15:58:50

సభాపతిని కలిసిన ఆర్అండ్ బి ఎస్ఈ జగన్నాధం

 ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో రహదారులు,ప్రభుత్వ  భవన నిర్మాణాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం సూచించారు. అధునాతన వస్తు సామాగ్రి,టెక్నాలజీ వినియోగించడం ద్వారా రహదారుల నిర్మాణాలు, భవనాల నిర్మాణాలు ఎక్కువ కాలం మన్నికలో ఉండటం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం రహదారుల భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐ వి ఎస్ జగన్నాథం శుక్రవారం సభాపతి ని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ రహదారులు తో పాటు, వంతెనలు,భవనాలు నిర్మాణాల పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. పనులపై పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా నాణ్యత ప్రమాణాలు సాధ్యమన్నారు.

తన నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న బలసల రేవు వారధి నిర్మాణం, శ్రీకాకుళం నుండి ఆముదాలవలస వరకు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం, పురుషోత్తపురంలో గల సి  హెచ్ సి భవనాలు తో పోటు, రహదారుల భవనాల శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రహదారులు నిర్మాణాలు.. జాతీయ రహదారులు నిర్మాణానికి ఏ మాత్రం తీసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు నెట్వర్క్ విస్తరణలో ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. రోడ్ల విస్తరణ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ముఖ్య పట్టణాలకు అనుసంధానం చేయడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగవుతుందన్నారు.ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.అవసరమయ్యే చోట్ల పనులు గుర్తించడం, డి పి ఆర్ లు పూర్తిచేసుకుని అనుమతులు పొంది జరుగుతున్న రహదారుల పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా చూడాలన్నారు.

Amadalavalasa

2023-06-16 09:41:32

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతవారణం పార్కులతోనే..

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 8వ జోన్ 95వ వార్డు పరిధిలోని సుజాతనగర్ లో పబ్లిక్ పార్క్ ఆధునీకరణ పనులకు పెందుర్తి శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజ్, వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేముడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వార్డులో పార్కుల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని, అందులో భాగంగా జీవీఎంసీ జనరల్ నిధుల నుండి రూ. 82.20 లక్షల వ్యయంతో పబ్లిక్ పార్క్ ను అభివృద్ధి పరిచేందుకు శంకుస్థాపన చేస్తామన్నారు. పిల్లలు యువకులు వృద్దులు అందరికీ ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆడుకునేందుకు సామగ్రి, జిమ్, షటిల్ కోర్ట్, మరుగుదొడ్లు, వాచ్మెన్ గది లాంటి మౌలిక వసతులు పార్కులో ఏర్పాటు చేశామన్నారు.

 కాలుష్య నియంత్రణకు పార్కులు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి వార్డులో ఇటువంటి పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గం లో జీవీఎంసీ నిధులతో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఎమ్మెల్యే నిధులతో పెందుర్తి నియోజకవర్గాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ మల్లయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Pendurthi

2023-06-16 09:25:28

రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం చేయూత

 రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం చేయూతను అందించడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఏర్పాటుచేసిన కాంటక్ ఎక్స్పో-2023ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ తరువాత ఇప్పుడిప్పుడే నిర్మాణం పుంజుకుంటుందని అందుకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విశాఖ దేశంలోని 8 వ అతిపెద్ద నగరంగా, జనాభా పరంగా పదవ నగరంగా, 9వ సంపదమంతమైన నగరంగా ఖ్యాతిని అర్జించిందన్నారు. ఈ నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. దేశంలో ప్రముఖ నగరాలు అభివృద్ధిలో బిల్డ ర్స్ అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉందని, విశాఖ అభివృద్ధికి కూడా బిల్డర్స్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. నిర్మాణ రంగంలో రానున్న 2 సంవత్సరాలలో 1.2 ట్రిలియన్ డాలర్లు వెచ్చించనున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇందులో 250 సెక్టర్లు ముడిపడి ఉన్నాయన్నారు.

 నిర్మాణరంగంలో సాంకేతికత ట్రాన్స్ఫార్మింగ్ అవుతోందని 2000 కోట్లు పెట్టుబడితో నిర్మాణం చేపడుతున్న ఒక సంస్థ కేవలం 600 మంది కార్మికులను మాత్రమే వినియోగించుకుంది అంటే సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ లేబర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు 192 స్కిల్ హబ్బులను ఏర్పాటు చేశామని అమర్నాథ్ వెల్లడించారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను వీలైనంత త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎఐ చైర్మన్ కే వెంకటేశ్వర్లు, బి ఏ ఐ ఏపీ చైర్మన్ బి. రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-06-16 08:34:49

వార్డులో మౌలిక వసతులు కల్పనే జగనన్న ప్రభుత్వ లక్ష్యం

జివిఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతల కల్పనే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె 8వ జోన్ 90వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్, కాకాని నగర్, విమాననగర్ తదితర ప్రాంతాలలో సుమారు రూ.45.48 లక్షలతో సిసి రోడ్లు, సిసి  కాలువల నిర్మాణానికి పశ్చిమ నియోజకవర్గం సమన్యకర్త ఆడారి ఆనంద్, వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని జీవీఎంసీ పరిధిలో ప్రతి వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. వార్డు కార్పొరేటర్ విన్నపం మేరకు 90 వార్డులో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, లక్ష్మీ నగర్ లో రూ. 17.2 0 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణానికి, కాకానినగర్ లో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి, విమాన నగర్ లో రూ. 18.28 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే రానున్న రోజుల్లో వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్యనిర్వహణ ఇంజనీర్ సంతోషి కుమారి, సహాయ ఇంజనీరు, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-16 07:15:20