1 ENS Live Breaking News

విశాఖలో సెప్టెంబరు నుంచి పరిపాలన..సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతా మని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ విశాఖ ఆమోదయోగ్యమైనదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగా ప్రకటిం చినట్టు గా పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడే ఉన్నామన్నారు. విశాఖ నుంచి పరిపాలన చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎంఓ లోని పరిపాలనా విభాగంలోని సీనియర్ ఐఏఎస్ లను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో కొన్ని భవనాలు సీఎం కార్యాల యం, క్యాంపు కార్యాలయం జిఏడి కి పనికొచ్చేలా సిద్ధం చేసినట్టు సమాచారం. గీతం యూనివర్శిటీకి దగ్గర్లో నిర్మాణం అవుతున్న భారీ కట్టడా లు కూడా ప్రభుత్వశాఖల కోసమే వినియోగించనున్నారని కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనలో వైఎస్సార్సీ పీ ఉత్తరాంధ్రా శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Tadepalli

2023-04-19 06:59:03

విజెఎఫ్ పాలకవర్గంలో ఎవరికి సొసైటీ రూల్స్ తెలుసు?!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కార్యవర్గం అంటే ఒక ఆదాయ వనరు అంటే తెలుసుగానీ..అదొక సొసైటీ/ట్రస్టు/సంఘం అని..అది (Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)లోబడే ఉందని, ఇదికూడా చట్ట పరిధిలోకే వస్తుందని, సొంతనిర్ణయాలు, కాలం చెల్లిపోయిన పాలవర్గం కార్యక్ర మాలు చట్టవ్యతిరేకమని ఎవరికైనా తెలుసా? నిజంగా విజెఎఫ్ బయిలా ప్రకారమే ప్రస్తుత పాలకవర్గం నడుచుకుంటే..కోర్టుకేసుల విషయం కేసుల నెపంతో 12ఏళ్లు గడిపే సిన కాలంలో సర్వసభ్య సమావేశం పెట్టి చెప్పాలని తెలీదా? లేదంటే భారత రాజ్యాంగం విజెఎఫ్ కి ఏమైనా అతీత శక్తులు, అవకాశాలు, మినహాయింపులు ఇచ్చిందా? ఎం తకాలమైనా ఇష్టం వచ్చినట్టు జనరల్ బాడీ సమావేశాలు, ఆడిట్ లెక్కలు తేల్చకుండా, సొసైటీని నిబంధనల ప్రకారం రెవిన్యువల్ చేయకుండా ప్రత్యేక అనుమతులు తె చ్చుకుందా..? కాస్త చెప్పండి బాబు ఇప్పటికైనా తెలుసుకుంటాం అంటున్నారు జర్నలిస్టులు.

Visakhapatnam

2023-04-17 17:47:54

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సెల్ ఫోన్ డౌన్ మొదలైంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీజేఏసి ఉద్యోగులు అసలైన నిరసన మొదలు పెట్టారు.. ఒకరోజంతా ఉద్యోగులు సెల్ ఫోన్ వాడకూడదు. మామూ లుగా ఉద్యోగులు పనిచేస్తేనే పనులు అంతంత మాత్రంగా పనిచేస్తాయి. అలాంటి ఒకరోజంతా ఉద్యోగులు వారి వారి సెల్ ఫోనులు వినియో గిం చకుండా నిరసన తెలియజేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే అది ఊహకే అందదు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజె న్సీ, Ens Live App, www.enslive.net లో ఇటీవలే ఉద్యోగుల వర్క్ టు రూల్ నిరసనలో సెల్ ఫోన్ లు కూడా పాల్గొంటాయని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అపుడు ఉద్యోగ సంఘాలు ఆవిషయాన్ని లైట్ తీసుకున్నాయి. కానీ ఇపుడు ఉద్యోగులు ఒక రోజు సెల్ ఫోన్ డౌన్ చేస్తున్నారని అమరావతి ఏపీజెఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించడంతో ఈఎన్ఎస్ ప్రచురించిన కథనం వాస్తవమేనని.. ఒక్కసారి ఉద్యో గులు రాష్ట్రవ్యాప్తంగా సెల్ డౌన్ చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Tadepalli

2023-04-11 03:22:32

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వెహికిల్స్కు 40జీ సిరీస్​

ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తు న్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్థానం లో కొత్త సిరీస్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.
 
ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చే సింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనా ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Amaravati

2023-04-06 06:23:30

ఆ ఉద్యోగుల ప్రమోషన్ డౌటు.. మరి చట్టబద్దత దారెటు

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటికీ ప్రమోషనల్ ఛాన ల్  ప్రభుత్వం విదివిధానాలు రూపొందిం చలేదు. కనీసం ఈశాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదు. కాకపోతే మంత్రివర్గ సమావేశంలో చట్ట బ ద్దతకి ఆమోదం మాత్రమే తెలిపారు. 19విభాగాల ఉద్యోగుల్లో ఇప్పటివరకూ కేవలం 5విభాగాల ఉద్యోగులకు మాత్రమే ప్రమోషనల్ ఛానల్ రూ పొందించారు. ఉదాహరణకు మహిళా పోలీసులను తీసుకుంటే మొదటి ప్రమోషన్ ఆరేళ్లు దాటగానే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తా రు. తరువాత ఐదేళ్లకు ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వరకూ వీరి పదోన్నతులున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు గ్రామ, వార్డు సచివాలయ శాఖకు అ సెంబ్లీలో చట్టబద్దత తీసుకురావాలి. దానికంటే ముందు మిగిలిన విభాగాల సిబ్బందికి, సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేయా లి.  అయితే వీరి సర్వీసు రెగ్యులరైన 6ఏళ్లా, లేదంటే విధుల్లోకి చేరిన ఆరేళ్లకు పదోన్నతిస్తారా అనేది క్లారిటీలేదు..!

Amaravati

2023-04-06 01:18:45

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు. ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు,  మామిడాకులు, మామిడికాయలు, ఆస్ట్రేలియా ఆరెంజ్, వాషింగ్టన్ ఆపిల్,  ద్రాక్ష, చిలకలు, తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయపుష్పాలు,  30 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌  శ్రీనివాసులు పర్యవేక్షణలో 3 రోజులపాటు 60  మంది అలంకరణ నిపుణులు, 30 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం పనిచేశారు.
 

Ontimitta

2023-04-05 15:39:01

ఎన్నికలకు ఇంకా ఏడాది..ఉద్యోగుల పదోన్నతి జాడేది..?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నది. నేటి వరకూ 75 ప్రభుత్వ శాఖల్లో పదోన్న తుల ఫైళ్లు మాత్రం ముందుకి కదలడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమకు పదోన్నతులు వస్తాయని ఎదురు చూసిన ఉద్యోగులు, అధి కారులకి కొంతమేర మాత్రమే న్యాయం జరిగింది. ఇంతా అత్యధిక ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు వారి పదోన్నతల కోసం తమ రాష్ట్ర కార్యాలయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటు అయిన తరువాత అన్నిశాఖల ఉద్యోగులకు పదోతన్నతులు కల్పించడం ద్వారా క్రిందిస్థాయి ఉద్యోగులు, అధికారుల ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలిసేది. కానీ ప్రభుత్వం ఉద్యోగుల పదో న్నతుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని..ఇంకో 6నెలల్లో తమకు పదోన్నతులు రాకపోతే, మళ్లీ వచ్చే ప్రభుత్వం వరకూ వేచి చూడా ల్సిందేనని..ఈలోగా ఎంతమంది ఉంటారో, మరెంత మంది సర్వీసులోనే కాలం చేస్తారో నని ఉద్యోగులు వాపోతున్నారు.

Tadepalli

2023-04-05 06:39:54

రిటైర్డ్ ఉద్యోగులకు 4వ తేదీవచ్చినా పెన్షన్లు పడలేదు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3.50లక్షలకు పైగా ఉన్న రైటర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4వ తేదీ వచ్చినా పెన్షన్లు పడేలేదు. మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకే ఆలస్యం అయ్యేది ఇపుడు పెన్షనర్లమైన మాకు కూడా ప్రభుత్వం పెన్షన్లు ఆలస్యంగానే వేస్తోందని అంటున్నారు పెన్షనర్లు. తమ సర్వీసు మొత్తం ప్రభుత్వంలోనే చేసినా..నేడు పెన్షన్లు ఎప్పుడు పడతాయాని ఎదురుచూసే రోజులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకరి దశలో కాస్త సేదతీరుదామంటే, ఒకటో తేదీన పడాల్సిన పెన్షన్లు ఎప్పుడు పడతాయాని రోజులు లెక్కించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

Amaravathi

2023-04-04 07:19:36

కొత్తజిల్లాల పాలనకు ఏడాది పూర్తి.. శాస్వత కార్యాలయమేది

ఆంధ్రప్రదేశ్ లో 13 కొత్త జిల్లాల పరిపాలనకు నేటితో ఏడాది పూర్తయింది. పరిధి తగ్గడంతో అధికారులకు ప్రజల సమస్యల పరిష్కారించడం సులవవుతుంది. వాటికితోడు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుతో ఇంటిముంగిటే సేవలు అందుతున్నాయి. కాకపోతే జిల్లా శాఖల్లో అధికారులు, సిబ్బంది చాలినంత లేపోవడంతో కాస్త వెనుకుబాటు తప్పితే కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అధికారులు చేరవవుతున్నారు. వాస్తవానికి ఏపీలో కొత్త జిల్లాలకు రాష్ట్ర గవర్నర్ అనుతి తప్పా, కేంద్రంలో రాష్ట్రపతి అనుమతి లేదు. దీనితో కేంద్రం ద్రుష్టిలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 13 జిల్లాలే. కేంద్రం ఏపీ విభజించిన కొత్త జిల్లాలకు అనుమతులు లభిస్తే నిధులు కూడా కొత్తజిల్లాలకు వస్తాయి. జిల్లాల విభజన వలన అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మార్గం సుగమం చేసింది. 75 ప్రభుత్వశాఖలను అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసినప్పటికీ, అద్దె కలెక్టరేట్లు.  జిల్లా కార్యాలయాలు తప్పితే పాత 13 జిల్లాల్లో మాత్రమే శాస్వత ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ఉన్నాయి.

Tadepalli

2023-04-04 04:16:25

సోషల్ మీడియాతోనే అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి

2024 ఎన్నికల్లో 175/175 గెలవడమే లక్ష్యం..ప్రతీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటాను..ఈ క్రమంలో ఎల్లోమీడియా చేసే అసత్యప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలి.. ఏ ఒక్కరినీ ఒదులుకోను అంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవ ర్గాల ఇన్చార్జిలకు దిశానిర్ధేశం చేయడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే లే దనే విషయాన్ని ఇండరైక్టుగా చెబుతూనే, వైఎస్సార్సీపీ మొత్తమంతా సోషల్ మీడియానే నమ్ముకోవాలన్నట్టు చెప్పడం ఇపుడు పరిశీలకుల ను సైతం ఆలోచనలో పడేలా చేసింది. అయితే గతంలో ఇదే స్ట్రాటజీ అమలు చేసిన టిడిపి ప్రభుత్వం ఇదే సోషల్ మీడియా ద్వారానే ప్రజ ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇపుడు వైఎస్సార్సీపీ కూడా అదే సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకి వె ళితే పరిస్థితులు, ఫలితాలు మరోలా ఉండే అవకాశం కూడా ఉందని పరిశీలకులు ప్రకటించేయడం ఇపుడు హాట్ టాపిక్..!

tadepalli

2023-04-04 03:44:16

మార్గదర్శిలో ముసలంతో మంచమెక్కిన రామోజీ

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో విచారణ జరిగే సమయానికి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, మార్గదర్శి కేసులో ఏ-1గా ఉన్న రామోజిరావుకి సుస్తీ చేసింది. దీనితో ఆయన మంచానికే పరిమితం అయ్యారు. విచారణకు రామోజి ఫిల్మ్ సిటీకి వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చిన సిఐడికి, రావొచ్చునని బదులు ఇచ్చిన ఆయన తనకు సుస్తీచేసిందని మళ్లీ సమాచారం పంపారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి కాకుండా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికే రావాలని సిఐడికి సమాచారం అందించారు. మార్గదర్శి ఎండి శైలజ కూడా అక్కడే వుంటున్నారని కూడా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్యపరీక్షలు చేయించుకోవడానికే ఇంటికి వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే బెడ్ పై పడుకొని ఉండగానే విచారణ చేయాలని కూడా సిఐడిని రామోజీరావు కోరిన మేరకు సిఐడి అధికారులు ఆ విధంగానే చేస్తున్నారట సిసి కెమెరాల పర్యవేక్షణలో.  విచారణ సమయానికి ఆయన మంచమెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Jubilee Hills

2023-04-03 13:32:25

ENS చెప్పిందే నిజమైంది ఆఎమ్మెల్యేల విషయంలో..!

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీలో ఆ40% ఎమ్మెల్యేలకు సీటుడౌటే అనే విషయాన్ని సరిగ్గా 6నెలల క్రితమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాన్ని ప్రచురించాం. ఆ వార్తనేడు నిజమైంది. నేరుగా సీఎం వైఎస్ జగన్ సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తాననే హెచ్చరిక జారీచేయడానికి సిద్దపడు తున్నారనే విషయం నేడు పార్టీలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. నియోజకవర్గాల్లో వారి స్వలాభం చూసుకుంటూ, గడపగడప కూ వైఎస్సా ర్సీపీ కార్యక్రమంలో పాల్గొన కుండా ఉన్నవారిని నేరుగా సీఎం గుర్తించే పనిచేశారు. ఇపుడు ఆసంఖ్య ఈఎన్ఎస్ చెప్పిన 40%లో 45మందిని మందలించే స్థాయికి వచ్చింది. ఆసంఖ్య పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈరోజు జరిగే సీఎం రివ్యూలో ఆవిషయం కూడా తేలిపోతుం ది. ఈఎన్ఎస్ అంటే మీడియానే కాదు..తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా అని మరోసారి రుజువైందని తెలియజేస్తున్నాం..!

Amaravathi

2023-04-03 05:08:29

ENSచెప్పినట్టే.. 26జిల్లాల్లో జిల్లాఅక్రిడిటేషన్ కమిటీలు

ఆంధ్రప్రదేశ్ లో నూనత జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయకపోతే కొత్త జిల్లాల కలెక్టర్ల పరువు పోతుందని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ enslive,న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలలో నూతన జిల్లాల్లో ఉత్తుత్తి కలెక్టర్లు శీర్షికిన వార్తను ప్ర చురిచింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం. ఇపుడు రాష్ట్ర కమిషనర్ కార్యాలయంతోపాటు 26 జిల్లాల్లోనూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలను ని యమిస్తున్నట్టు ప్రకటించింది.  ఏపీలోని కొత్తజిల్లాలకు రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ ఆమోదంతోనే గెజిట్లు వెలువడ్డాయికానీ కేంద్ర ప్రభుత్వం ద్రు ష్టిలో ఇంకా 13జిల్లాలే. ఈకొత్తజిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం ఇంకా రాలేదు. అంతేకాదు ఆర్ఎన్ఐ వెబ్ సైట్ లోనూ 13జిల్లాలుగానే ఉంది. కొత్త గాఏర్పడిన 13జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం జిల్లాకలెక్టర్లు, జెసిలను నియమించిన ప్రభుత్వం ఇక అన్ని కార్యకలాపాలను జిల్లాల వారీగానే చేపట్టి నిర్వహించనుందని అక్రిడిటేషన్ల కమిటీల కోసం ఇచ్చిన జిఓ-38లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది..!

Amaravathi

2023-04-02 03:46:29

అధికారికంగా సెలవులు.. అయినా ఇంటినుంచే విధులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అత్యవసరం, ముఖ్యమైన పను ల కోసం సెలవులు పెట్టుకున్నా..ప్రభుత్వశాఖలు నిర్వహించే టెలీ కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సులో ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తోంది. దీ నితో తమకి సెలవులు పెట్టినా, విధినిర్వహణలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ తంలో ఎన్నడూ లేనివిధంగా ఉదయం 8గంటలకే జూమ్ కాన్ఫరెన్సులు, రాత్రి 8గంటల వరకూ జిల్లా కార్యాలయాలు, మండలకార్యాలయా ల్లో పనులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోవడం, పనులు పేరుకుపోవడంతో సొంత ప నులు, కార్యక్రమాల్లో పాల్గొనే తీరిక కూడా దొరకడంలేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవులు పెట్టినా ఇంటినుంచే పనిచేయాల్సి వస్తుందని..ఇకమేము సెలువులు తీసుకొని ఉపయోగమేమిటో చెప్పాలంటున్నారు.

Amaravathi

2023-04-01 02:10:37

YSRCP థీమ్ వైనాట్ 175/175 But ఈసారి 4 అవుట్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీ వైనాట్ 175/175 థీమ్ తో ముందుకి వెళ్లాలనుకుంటే అపుడే 4గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే ఔట్ అయిపోయారు. మరో పక్క పక్కాగా గెలుస్తామనుకున్న 4 ఎమ్మెల్సీలు కూడా టిడిపి వసం అయిపోయాయి. దీనితో ఇపుడు వైనాట్ 175/ 175 అనే థీమ్ కాస్తా తింక్ 175/175 స్లో అండ్ స్టడీ అనే ఆలోచనలోకి వచ్చేశారని చమత్కరిస్తున్నారు పరిశీలకులు. టిడిపి తన రాజకీయచతు రతను ప్రదర్శిస్తే రానున్నరోజుల్లో మరింతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశాలూ కూడా లేకపోలేదని చెబుతు న్నా రు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పొందిన వారంతా పక్కాగా పార్టీకే మద్దతు పలి కే అవకాశం కూడా లేకపోలేదని. పోతే గీతే  ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, గిరిజనులు మా త్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు తప్పితే.. మిగిలిన వారంతా వైఎస్సార్సీపికి అనుకూలమే అంటున్నారు.

Amaravathi

2023-03-31 01:38:32