1 ENS Live Breaking News

సోషల్ మీడియాతోనే అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి

2024 ఎన్నికల్లో 175/175 గెలవడమే లక్ష్యం..ప్రతీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటాను..ఈ క్రమంలో ఎల్లోమీడియా చేసే అసత్యప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలి.. ఏ ఒక్కరినీ ఒదులుకోను అంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవ ర్గాల ఇన్చార్జిలకు దిశానిర్ధేశం చేయడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే లే దనే విషయాన్ని ఇండరైక్టుగా చెబుతూనే, వైఎస్సార్సీపీ మొత్తమంతా సోషల్ మీడియానే నమ్ముకోవాలన్నట్టు చెప్పడం ఇపుడు పరిశీలకుల ను సైతం ఆలోచనలో పడేలా చేసింది. అయితే గతంలో ఇదే స్ట్రాటజీ అమలు చేసిన టిడిపి ప్రభుత్వం ఇదే సోషల్ మీడియా ద్వారానే ప్రజ ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇపుడు వైఎస్సార్సీపీ కూడా అదే సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకి వె ళితే పరిస్థితులు, ఫలితాలు మరోలా ఉండే అవకాశం కూడా ఉందని పరిశీలకులు ప్రకటించేయడం ఇపుడు హాట్ టాపిక్..!

tadepalli

2023-04-04 03:44:16

మార్గదర్శిలో ముసలంతో మంచమెక్కిన రామోజీ

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో విచారణ జరిగే సమయానికి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, మార్గదర్శి కేసులో ఏ-1గా ఉన్న రామోజిరావుకి సుస్తీ చేసింది. దీనితో ఆయన మంచానికే పరిమితం అయ్యారు. విచారణకు రామోజి ఫిల్మ్ సిటీకి వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చిన సిఐడికి, రావొచ్చునని బదులు ఇచ్చిన ఆయన తనకు సుస్తీచేసిందని మళ్లీ సమాచారం పంపారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి కాకుండా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికే రావాలని సిఐడికి సమాచారం అందించారు. మార్గదర్శి ఎండి శైలజ కూడా అక్కడే వుంటున్నారని కూడా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్యపరీక్షలు చేయించుకోవడానికే ఇంటికి వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే బెడ్ పై పడుకొని ఉండగానే విచారణ చేయాలని కూడా సిఐడిని రామోజీరావు కోరిన మేరకు సిఐడి అధికారులు ఆ విధంగానే చేస్తున్నారట సిసి కెమెరాల పర్యవేక్షణలో.  విచారణ సమయానికి ఆయన మంచమెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Jubilee Hills

2023-04-03 13:32:25

ENS చెప్పిందే నిజమైంది ఆఎమ్మెల్యేల విషయంలో..!

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీలో ఆ40% ఎమ్మెల్యేలకు సీటుడౌటే అనే విషయాన్ని సరిగ్గా 6నెలల క్రితమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాన్ని ప్రచురించాం. ఆ వార్తనేడు నిజమైంది. నేరుగా సీఎం వైఎస్ జగన్ సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తాననే హెచ్చరిక జారీచేయడానికి సిద్దపడు తున్నారనే విషయం నేడు పార్టీలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. నియోజకవర్గాల్లో వారి స్వలాభం చూసుకుంటూ, గడపగడప కూ వైఎస్సా ర్సీపీ కార్యక్రమంలో పాల్గొన కుండా ఉన్నవారిని నేరుగా సీఎం గుర్తించే పనిచేశారు. ఇపుడు ఆసంఖ్య ఈఎన్ఎస్ చెప్పిన 40%లో 45మందిని మందలించే స్థాయికి వచ్చింది. ఆసంఖ్య పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈరోజు జరిగే సీఎం రివ్యూలో ఆవిషయం కూడా తేలిపోతుం ది. ఈఎన్ఎస్ అంటే మీడియానే కాదు..తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా అని మరోసారి రుజువైందని తెలియజేస్తున్నాం..!

Amaravathi

2023-04-03 05:08:29

ENSచెప్పినట్టే.. 26జిల్లాల్లో జిల్లాఅక్రిడిటేషన్ కమిటీలు

ఆంధ్రప్రదేశ్ లో నూనత జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయకపోతే కొత్త జిల్లాల కలెక్టర్ల పరువు పోతుందని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ enslive,న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలలో నూతన జిల్లాల్లో ఉత్తుత్తి కలెక్టర్లు శీర్షికిన వార్తను ప్ర చురిచింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం. ఇపుడు రాష్ట్ర కమిషనర్ కార్యాలయంతోపాటు 26 జిల్లాల్లోనూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలను ని యమిస్తున్నట్టు ప్రకటించింది.  ఏపీలోని కొత్తజిల్లాలకు రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ ఆమోదంతోనే గెజిట్లు వెలువడ్డాయికానీ కేంద్ర ప్రభుత్వం ద్రు ష్టిలో ఇంకా 13జిల్లాలే. ఈకొత్తజిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం ఇంకా రాలేదు. అంతేకాదు ఆర్ఎన్ఐ వెబ్ సైట్ లోనూ 13జిల్లాలుగానే ఉంది. కొత్త గాఏర్పడిన 13జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం జిల్లాకలెక్టర్లు, జెసిలను నియమించిన ప్రభుత్వం ఇక అన్ని కార్యకలాపాలను జిల్లాల వారీగానే చేపట్టి నిర్వహించనుందని అక్రిడిటేషన్ల కమిటీల కోసం ఇచ్చిన జిఓ-38లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది..!

Amaravathi

2023-04-02 03:46:29

అధికారికంగా సెలవులు.. అయినా ఇంటినుంచే విధులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అత్యవసరం, ముఖ్యమైన పను ల కోసం సెలవులు పెట్టుకున్నా..ప్రభుత్వశాఖలు నిర్వహించే టెలీ కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సులో ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తోంది. దీ నితో తమకి సెలవులు పెట్టినా, విధినిర్వహణలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ తంలో ఎన్నడూ లేనివిధంగా ఉదయం 8గంటలకే జూమ్ కాన్ఫరెన్సులు, రాత్రి 8గంటల వరకూ జిల్లా కార్యాలయాలు, మండలకార్యాలయా ల్లో పనులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోవడం, పనులు పేరుకుపోవడంతో సొంత ప నులు, కార్యక్రమాల్లో పాల్గొనే తీరిక కూడా దొరకడంలేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవులు పెట్టినా ఇంటినుంచే పనిచేయాల్సి వస్తుందని..ఇకమేము సెలువులు తీసుకొని ఉపయోగమేమిటో చెప్పాలంటున్నారు.

Amaravathi

2023-04-01 02:10:37

YSRCP థీమ్ వైనాట్ 175/175 But ఈసారి 4 అవుట్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీ వైనాట్ 175/175 థీమ్ తో ముందుకి వెళ్లాలనుకుంటే అపుడే 4గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే ఔట్ అయిపోయారు. మరో పక్క పక్కాగా గెలుస్తామనుకున్న 4 ఎమ్మెల్సీలు కూడా టిడిపి వసం అయిపోయాయి. దీనితో ఇపుడు వైనాట్ 175/ 175 అనే థీమ్ కాస్తా తింక్ 175/175 స్లో అండ్ స్టడీ అనే ఆలోచనలోకి వచ్చేశారని చమత్కరిస్తున్నారు పరిశీలకులు. టిడిపి తన రాజకీయచతు రతను ప్రదర్శిస్తే రానున్నరోజుల్లో మరింతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశాలూ కూడా లేకపోలేదని చెబుతు న్నా రు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పొందిన వారంతా పక్కాగా పార్టీకే మద్దతు పలి కే అవకాశం కూడా లేకపోలేదని. పోతే గీతే  ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, గిరిజనులు మా త్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు తప్పితే.. మిగిలిన వారంతా వైఎస్సార్సీపికి అనుకూలమే అంటున్నారు.

Amaravathi

2023-03-31 01:38:32

ఏపీలో గిరిజనులు YSRCPకి దూరమవుతున్నారా..?!

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ఆదివాలసీలు వైఎస్సార్సీపికి దూరమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార వై ఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్టీల జాబితాలోకి బోయ, వాల్మీకిలను చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే దీనికి కారణంగా చె బుతున్నారు. ఏపిలోని 26 జిల్లాల్లో గిరిజనులు 75లక్షల మందికిపైనే ఉన్నారు. వీరంతా ఒక్కసారి తిరగబడేసరికి గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సైతం పత్తాలేకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం కారణంగా మార్చిన 31న ఉమ్మడి విశాఖజిల్లా, విభజన అల్లూరి జిల్లావ్యాప్తంగా బంద్ కి కూడా గిరిజన సంఘం పిలుపునిచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం  ప్రభుత్వం ఎక్కడా తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. కాగా గిరిజనుల ప్రధాన ఓటు బ్యాంకుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈవిషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించకపోవడంతో వీరినికూడా గిరిజనులంతా గిరిజన ద్రోహులుగానే చూస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.

Amaravati

2023-03-30 03:34:08

ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు 3 ISO సర్టిఫికెట్లు

శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు 3విభాగాల్లో ఐ ఎస్ వో సర్టిఫికెట్లు లభించాయి. టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం ఈవో ఎవి ధర్మారెడ్డి నుంచి కళాశాల ప్రిన్సిపల్ డా.మురళీకృష్ణ అందుకున్నారు. ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యుత్ పొదుపు చేసినందుకు, కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. అలాగే  కళాశాల.నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు మరో సర్టిఫికెట్ లభించాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.సుందరం,  ఐఎస్ వో ప్రతినిధులు  శివయ్య, మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా  శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు గాను ఐ ఎస్ వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్ ఈవో నుంచిసర్టిఫికెట్ అందుకున్నారు.            

Tirupati

2023-03-29 12:03:31

3.59లక్షల CPSఉద్యోగులు YSRCPమాట నమ్ముతారా

ఆంధ్రప్రదేశ్ లోని 3.59 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు అధికార వైఎస్సార్సీపీ మాట నమ్ముతారా అంటే.. చచ్చినా నమ్మేది లేదని తెగేసి చె బుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్సీపీ మరో ఏడాదిలో అధికారం మొత్తం పూర్తవు తు న్నా ఇంకా చర్చల పేరుతోనే కాలయాపన చేస్తోందని సిపిఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను అ మలు చేయాలని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ప్రభుత్వం ఎక్కడా వీరి గోడు పట్టించుకోలేదు. దీనితో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు తో నే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా సిపిఎస్ ఉద్యోగులు అపుడే సామాజిక మాద్యమాల ద్వారా ఏకమై వారి కుటుంబాల్లో ని ఓట్ల(సరారి ఒక్కో కుటుంబంలో 4 ఓట్లు)ను పడకుండా చేసుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. తమ కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 4ఓట్లు లెక్కేసి నా 359,000x4=1,436,000(14.36లక్షలు) ఓట్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Amaravathi

2023-03-29 01:57:03

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

ఏప్రిల్ నెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ని జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు ఎపిపిఎస్సి ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ మూడు నుంచి 9 వ తేధీ వరకు చేపడతామని పేర్కొంది. 2022  సివిల్స్ ఫేజ్ - 3 ఇంటర్వ్యూలు ఏప్రియల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేశామని ఎపిపిఎస్సి వివరణ ఇచ్చింది. అయితే యుపిఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎపి నుంచి హాజరవుతున్న దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్ధులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సమయం తీసుకున్నామని పేర్కొంది.  ఇప్పటికే ఇంటర్వ్యూల షెడ్యూల్  యుపిఎస్సీ విడుదల చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూల కారణంగా మెయిన్స్ ని జూన్ లో నిర్వ హించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి గ్రూప్-1 మెయిన్స్ కి సమయం కావాలని అభ్యర్ధు లు ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్ధుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Amaravathi

2023-03-28 15:36:21

ఆంధ్రప్రదేశ్ లో 3.50లక్షల రిటైర్డ్ ఉద్యోగులు ఏపార్టీవైపు

ఏపీలో 3.50లక్షల మంది పెన్షర్లు(రిటైర్డ్ ఉద్యోగులు) 2024 ఎన్నికలలో ఏరాజకీయపార్టీని బలపరుస్తారనే చర్చ ఇపుడు రాష్ట్రంలో హాట్ హాట్ గా నడుస్తుంది. ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత, ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ అధికారులు 70, 80ఏళ్ల వయస్సులో కూడా లైనులో నిలుచొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశారు. పైగా వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చిన తరువాత క్వాంటమ్ పెన్షను వయ స్సుని 70 నుంచి 100ఏళ్లకు పెంచేసింది. అంటే 100ఏళ్లు రిటైర్డ్ ఉద్యోగులు బ్రతికుంటేనే వారికి క్వాంటమ్ పెన్షన్ వస్తుందని తేల్చి చెప్పే సిం ది. పెండింగ్ డిఏలు కూడా ఇవ్వకుండా కాటికి కాలుచాచే వయస్సులో ప్రభుత్వం తమను ఇంత దారుణంగా వేధించడం తామంతా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని చెబుతున్నారు వీరంతా. పెన్షనరుగా మాత్రం వైఎస్సార్సీపీ పార్టీని బలపరిచమని తెగేసి చెబుతున్నారు. అంటే ఒక్కో ఇంట్లో 4 ఓట్లు లెక్కేసినా.. 350,000x4=1,400,000(14లక్షలు) ఓట్లు వైఎస్సార్సీపికి పోయినట్టేనని చాల స్పష్టంగా అర్ధమవుతుంది..!

Amaravati

2023-03-28 11:52:30

ఆంధ్రప్రదేశ్ లో44వేల మంది జర్నలిస్టులు ఏపార్టీ వైపు..?!

ఆంధ్రప్రదేశ్ లో 44వేల మంది జర్నలిస్టులు,ఆ కుటుంబాలు ఏపార్టీకి వైపు ఉంటారనేది ఇపుడు రాష్ట్రంలో జోరుగా చర్చనడుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరు వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులు తప్పితే ఇతర ఏ పథకాలూ జర్నలిస్టులకు వర్తించలేదు. కొన్నిచోట్ల మాత్రం ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లస్థలాలు వచ్చాయి. జర్న లిస్టుకి ముఖ్యమైన గుర్తింపైన ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా జిఓ‌-142 మోకాలడ్డింది. 4గేళ్లు పూర్తైన తరువాత ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వం  జర్నలిస్టుల మీడియా అక్రిడి టేషన్ కార్డుల జారీకి సవరణలు చేయడానికి కేబినెట్ అంగీకరించిందని, ఆపై వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల ఇస్తామని ప్రకటించా రు. కానీ ఇపుడు రాష్ట్రంలోని 4.98 కోట్లు ఉన్న ఓటర్లలో జర్నలిస్టు కుటుంబాల ఓట్లు(భార్య, భర్త, ఇద్దరు పిల్లలు) సగటున 4ఓట్లు లెక్కన చూసుకుంటే మొత్తం 176,00 0 వేల ఓట్లు 2024లో జరిగే ఎన్నికల్లో ఎవరికి పడతాయనే చర్చ రాష్ట్రంలో వైరల్ అవుతోంది..!?

Amaravati

2023-03-26 07:44:35

సామాజికవర్గాలుగా విడిపోతున్న ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వారి సామాజిక వర్గ సంఘాలుగా విడిపోతున్నారు. న్యాయమైన సమస్యలు, డి మాండ్లపై ఏకాతాటిపైకి వస్తామన్న వీరంతా విభజించు..పాలించు అనే మంత్రానికి ముగ్దులైపోతున్నారు. దీనితో ఉద్యోగసంఘాలు కాస్త కులసంఘాలుగా మారిపోతున్నా యి. అనుకున్న లక్ష్యాన్ని నేతలు నీరుగార్చడానికి సులువుని వీళ్లే సులువులన్నీ ఇచ్చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం రుజువైందని..లేదంటే లక్ష్యానికి చేరువవుతున్న సమయంతో ఎవరో నేతల బెదిరింపులకు, తాయిలాలకు ఎందుకు మడమతిప్పారని విడిపోయిన ఉద్యోగ సంఘాల వాళ్ల లో వాళ్లే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రస్తుతం ఈఅంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఉద్యోగ సంఘాల తీరు ప్రతీఒక్కరినీ ఆలోచింపజేస్తున్నది. కులం లేదు, మతం లేదు అన్నవారే ముఖ్యనేతలుగా మారిపోతుండటం విశేషం..!?

Amaravathi

2023-03-24 03:14:54

అధ్యక్షా అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్సీపీకి శ్రుంగభంగం

అధ్యక్షా అసెంబ్లీ సాక్షిగా అధికారపార్టీ వైఎస్సార్సీపీకి శ్రుంగభంగం ఎదురైంది. ఎమ్మెల్యేల కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ23 ఓట్లుతో గెలుపొందారు. పక్కాగా ఈ ఎమ్మెల్సీ సీటుమాదేనని చెప్పుకొని రొమ్మువిరుచుకున్న వైఎస్సార్సీపీ ఈమె విజయంతో ఒక్కసారిగా డీలాపడిపోయింది. అయితే విప్ జారీచేయడం క్రాస్ ఓటింగ్ కి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏదిఏమైనా వైఎస్సార్సీపీ కంచుకోట అనుకున్న అసెంబ్లీసాక్షిగా అధికారపార్టీకి టిడిపి ఎమ్మెల్సీ గెలుపు ద్వారా బీటలువారడం చర్చనీయాంశం అవుతోంది.

Tadepalli

2023-03-23 13:28:28

YSRCP v/s TDP ఎవరి మైండ్ గేమ్ ఫలిస్తోందో..?

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అన్ని రాజకీయపార్టీల చూపు అసెంబ్లీపైనే ఉంది. ఈ ఎన్నిక ఉదయం 8నుంచి సాయంత్రం4 వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..సాయంత్రం 5నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. మెజార్టీ వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీచేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామంటోంది టీడీపీ.. అయితే ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న ధీమాలో ఉంది వైఎస్సార్సీపి. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. ఎవరి టెన్షన్ కూడా వాళ్లనే వెంటాడుతోంది.. ఎందుకంటే.. ఈ పోటీల్లో గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చేయబోతున్నాయి..ఎవరిమైండ్ గేమ్ ఫలిస్తుందో చూడాలి..?!

Amaravathi

2023-03-23 05:42:33