1 ENS Live Breaking News

ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరనున్నాయి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరే సమయం ఆశన్నమైనమైంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన  దగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ద్వారా ప్రత్యేక కధనాలను ఇదే విషయమై ప్రచురిస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రసూతి శెలవులు తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ గడువు కూడా పెంచుకుంటూ వచ్చింది. అదే విషయాన్ని పతాక స్థాయిలో ప్రచారం చేయడంతో, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో ఈసారి చలనం వచ్చింది. మంత్రివర్గ కమిటీలో ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాయి. దీనితో ఈ విషయాన్ని మంత్రవర్గ సమావేశంలో చర్చిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహిళా ఉద్యోగులకు ఇచ్చే 6నెలల ప్రసూతి శెలవులను అడ్డం పెట్టుకొని, నూతనంగా ఉద్యోగాల్లో చేరిన వారి ప్రొభేషన్ గడువు మరో ఆరు నెలలు పెంచడంతో వారి రెగ్యులర్ పేస్కేలు నష్టపోతున్నారని, అదే సమయంలో వారికి వచ్చే పదోన్నతులు కూడా మరో 6నెలలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో చైతన్యం తీసుకు వచ్చింది.

కొత్త పీఆర్సీ, బకాయి డిఏలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్ తదితర విషయాలపై మంత్రవర్గంతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు ప్రసూతి శెలువులు, సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచడం, కొన్ని చోట్ల, ఆరు నెలలు దాటిన తరువాత శెలవుల బిల్లులకి జిల్లా కార్యాలయాల చుట్టూ తిప్పే కంటే..శెలవులు ఇచ్చే సమయంలోనే జీతం మంజూరు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే శెలవులను సర్వీసు ప్రొభేషన్ కు లింకు పెట్టకూడదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనితో దిగివచ్చిన ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే మహిళా ఉద్యోగులకు ప్రసూతి కష్టాలు తీరిపోనున్నాయి. ప్రసూతి శెలవుల విషయం ప్రభుత్వం ద్రష్టికి వెళ్లడానికి  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ప్రత్యేక కథనాలు ఎంతో దోహదం చేశాయని, సదరు వార్తలు చూసిన ఉద్యోగులు విశాఖలోని న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేసిన ధన్యవాదములు తెలియజేశారు. 

ప్రభుత్వ ఉద్యోగులు, డిమాండ్లు విషయంలో ఆదినుంచి ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం ఆలోచించే విధంగా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా ens live app ద్వారా ప్రత్యేక కధనాల రూపంలో తెలియజేస్తుందని. అదే ఒరవడిని ఇకముందు కూడా కొనసాగించాలి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. వారి అభ్యర్ధనే కాకుండా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించిన విధంగా ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి వెంట ens live app ఉంటుందని కూడా ప్రకటిస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వ తాజా వార్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని వర్గాల మీడియాగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజా పక్షాన నిలిచి అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు అసలైన వారధిగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ఎప్పటికీ నిలిచే ఉంటుందని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణ చేయకపోతే ఏ ఒక్క కార్యక్రమం ముందుకి సాగదని ప్రభుత్వం గ్రహించాలి.. ఆదిశగా వారి న్యాయమపరమైన డిమాండ్లు పరిష్కరించాలి..అదేస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందాలి ఇదే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లక్ష్యం..!

Tadepalli

2023-06-06 03:17:25

బదిలీలకు 15522 మంది సచివాలయ ఉద్యోగుల దరఖాస్తు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని  15522 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో గ్రామ సచివాలయ  ఉద్యోగులు 12464 మంది కాగా, వార్డు సచివాలయ ఉద్యోగులు 3058 మంది. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 2476 మంది, స్పౌజ్ కోటా క్రింద 866, మ్యూచ్ వల్ బదిలీలు 1610 మంది ఉన్నారు. ఇక జిల్లాల్లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారు 13046 మంది ఉద్యోగులు కాగా, అదర్స్ లో 8788 మంది ఉన్నారు. అత్యధికంగా రూరల్ పంచాయతీల్లో గ్రేడ్6 కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు)1977 మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 453 మంది, అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక అవకాశం లేకపోయినా ఏడుగురు ఎనర్జీ అసిస్టెంట్లు కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కౌన్సిలింగ్ విధానం లేదా, ఉత్తర్వుల రూపంలో బదిలీలు చేపట్టనుంది.

Tadepalli

2023-06-05 11:22:54

రైస్ కార్డు కోసం మరో అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రుప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డు కోసం అర్హులైన వారికోసం మరో అవకాశం కల్పించిందని సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఒక సర్క్యులర్ ద్వారా తెలి యజేశారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులను 26జిల్లాల కలెక్టర్లకు, జిల్లా సివిల్ సప్లై అధికారులకు పంపించారు. ఈ ఉత్తర్వు ద్వారా ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రైస్ కార్డు కోసం అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం రైస్ కార్డులు మంజూరు చేస్తా రు. రైస్ కార్డులో మార్పులు, చేర్పులు, ఒంటరి వ్యక్తులుగా వున్నవారు రైస్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని సమాచారం రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాల యాలతో పాటు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది దగ్గర అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వా రా సచివాలయాల్లో పెట్టుకోవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Amaravathi

2023-06-04 15:29:41

అన్నిమండలాల జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడేషన్లు

అక్రిడేషన్ల మంజూరులో జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని  సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకత్వ బృందం బుధవారం సమాచార శాఖ కమిషనర్ ను ప్రత్యేకంగా కలిసి చర్చలు జరిపింది. దీనిపై కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అన్ని మండలాల్లో పనిచేసే విలేకరులకు గతంలో లాగే అక్రిడేషన్ ఇవ్వటానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల డిపిఆర్ఓ లకు సమాచారం అధికారికంగా పంపిస్తామని తెలిపారు. సంబంధిత జర్నలిస్టులు డిపిఆర్ఓలను సంప్రదించి వారి సూచనలు మేరకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. చిన్న పత్రికలకు పాత జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా కొత్త జిల్లా కేంద్రానికి కూడా అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచార శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త జిల్లా కేంద్రానికి అదనంగా రెండు అక్రిడేషన్లు ఇవ్వటానికి కూడా పరిశీలన చేసి ఇచ్చే విధంగా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి కూడా పాల్గొన్నారు. సమాచార శాఖ కమిషనర్ ను  కలిసిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు కంచల జయరాజ్ ,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి శివ , ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు చావా రవి, అర్బన్ జిల్లా కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్  సభ్యులు నాగరాజు , తదితరులు సమాచార శాఖ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

Vijayawada

2023-05-17 15:16:49

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతుందిలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది బదిలీలకు పచ్చజెండా ఊపింది. దానికోసం ప్రత్యేకం జిఓనెంబరు-71ని ఫైనాన్స్ విభాగం విడుదలచేసింది. వాటితో పాటు 12 అనుబంధ జిఓలను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తాను పనిచేస్తున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం జరిగే బదిలీల్లో స్థాన చలనం కలగనుంది. ఉద్యోగుల బదిలీపై ఇప్పటికే ఉన్న నిషేదాన్ని  22-05-2023 నుండి 31-05-2023వరకు ప్రభుత్వం సడలించింది. దానికి అనుగుణంగా ఆయా శాఖల అధికారులు నిబంధనలను అనుసరించి బదిలీల ప్రక్రియన చేపట్టనున్నారు.  ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు ఆధారంగా   బదిలీలు జరిగే తీరు ఈ విధంగా ఉంటుంది. 

1. ప్రస్తుతం జరగబోయే బదిలీలు ఉద్యోగుల అభ్యర్థన మరియు పరిపాలనాపరమైనటువంటి (administrative grounds) కారణాలతో మాత్రమే ఉంటాయి.

2. ఏప్రిల్ 30 నాటికి ఒకే స్టేషన్లో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు మరియు ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీలు చేస్తారు.

3. ఒక ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఆ స్టేషన్లో పనిచేసిన కాలం మొత్తాన్ని పరిగణించబడుతుంది. స్టేషన్ అనగా నగరం,పట్టణం, గ్రామం  అవుతుంది అంతేగాని కార్యాలయము లేదా సంస్థ కాదు. అయితే, స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ కోసం, స్టేషన్ అంటే జోన్‌లోని కార్యాలయం అని అర్థం, ఎందుకంటే వారి అన్ని కార్యాలయాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఉన్నాయి.

4. ప్రస్తుతం జరగబోవు బదిలీలకు దిగువ తెలిపిన అంశాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.  40% లేదా అంతకన్నా ఎక్కువ Disability ఉన్న ఉద్యోగులు... 

 5.కారుణ్య నియామకం ద్వారా నియమించబడిన వితంతు ఉద్యోగులు  భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయి ఉండాలి.

6.ఉద్యోగుల పిల్లలు ఎవరైతే మానసిక స్థితి బాగోదు  (Mentally Challenged) వారికి వారు చూపిస్తున్న ఆసుపత్రి దగ్గరలో ఉద్యోగులు గాని ఉద్యోగుల యొక్క భర్త లేదా భార్య గాని వారి పిల్లలు గాని లేదా తల్లిదండ్రులు గాని.. లేదా వారిపై ఆధారపడి ఉన్నవారు గానీ క్యాన్సరు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, నరాలకు సంబంధించిన ఆపరేషన్, కిడ్నీ మార్పిడి అయినవారికి మెడికల్ సదుపాయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ.  

7. ITDA ప్రాంతాలలో పోస్టింగ్ కోసం..  50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు. ఐటిడిఎ పరిధిలో ఇంతకు ముందు పని చేయని ఉద్యోగులు మైదాన ప్రాంతంలోని సర్వీసు నిడివిని బట్టి చేస్తారు.

8.ITDA ప్రాంతాలతో పాటు, బదిలీలలో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్న ఇంటీరియర్ ప్లేసెస్ మరియు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు.
 
1) బదిలీలపై సడలింపు 22 మే 2023 నుండి 31 "మే 2023 వరకు అమలులోకి వస్తుంది.

2.ఫిర్యాదులు/ ఆరోపణలకు అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా బదిలీ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహిస్తారు. ఈ మార్గదర్శకాల యొక్క ఏదైనా ఉల్లంఘన తీవ్రంగా పరిగణించబడతారు.

3. ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థలను కలిగి ఉన్న కింది విభాగాలు, పై మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా తమ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను రూపొందించవచ్చు. వాటిలో ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు, 

   1) వాణిజ్య పన్నులు 
   2)ప్రొహిబిషన్ & ఎక్సైజ్  
   3)స్టాంపులు & రిజిస్ట్రేషన్ 
   4)రవాణా శాఖ, మరియు 
    5)వ్యవసాయ శాఖ. వారు కూడా 31-మే- 2023 నాటికి ప్రక్రియను పూర్తి చెయ్యాలి.

4.విద్యా శాఖలు అనగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య మరియు సంక్షేమ శాఖల క్రింద పనిచేస్తున్న విద్యా శాఖలు పై బదిలీ మార్గదర్శకాల నుండి మినహాయించబడ్డాయి.మరియు వారు ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో తమ శాఖలకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవచ్చు. 

6. సర్క్యులర్ మెమో నెం. GAD01- SWOSERA/ 27/2019- SW, GA (సర్వీసెస్ వెల్ఫేర్) డిపార్ట్‌మెంట్, dt.15.06.2022లో జారీ చేయబడిన గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ అసోసియేషన్‌ల ఆఫీస్ బేరర్‌ల బదిలీలపై స్టాండింగ్ సూచనలు వర్తిస్తాయి.

7. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు  బదిలీ కోసం నిర్దిష్ట అభ్యర్థన చేసినప్పుడు మాత్రమే బదిలీ చేయబడుతుంది.  లేని పక్షంలో వారికి ఈ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వడమైనది. వీలైనంత వరకు, స్పష్టమైన ఖాళీ లభ్యతకు లోబడి ఈ కేటగిరీల ఉద్యోగులను వారికి నచ్చిన ప్రదేశంలో పోస్ట్ చేయవచ్చు.

8. ఏదైనా ఉద్యోగి పై పెండింగ్‌లో ఉన్న అభియోగాలు/ ఏసీబీ/ విజిలెన్స్ కేసులు ఉన్న యెడల వారి అభ్యర్థనలు బదిలీ కోసం పరిగణించబడవు. 

9. బదిలీలపై నిషేధం 01.06.2023 నుండి అమలులోకి వస్తుంది.

Tadepalli

2023-05-17 14:58:13

ENS ఎఫెక్ట్.. ట్రాన్స్ ఫర్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపింది. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారు, ఐదేళ్లుగా ఒకే చోట ఉన్నవారిని బదిలీలు చేస్తామని పేర్కొంది. అయితే ఈబదిలీలకు సంబంధించి ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రత్యేక జీఓలు విడుదల కాను న్నాయి. ఈనెల 22 నుంచి 31వరకూ బదిలీల ప్రక్రియ సాగనుంది. ప్రభుత్వశాఖల వారీగా ఇచ్చే బదిలీల జీఓల్లో విధి విధానాలు ప్రకటించ నున్నారు. చాలాకాలం నుంచి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్ వరుస కధనాలు ప్రచు రిస్తూ వస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలపై కూడా చట్టబద్ధత అడ్డు వస్తుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. దీనితో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సచివాలయ సిబ్బంది విషయంలోనూ ప్రత్యేకంగా బదిలీలకు సంబంధించిన నిబంధ నలు తయారు చేయాలని సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డరెక్టర్లను ఆదేశించారు. అన్నీరూట్లు క్లియరై ఈనెల 22నుంచి బదిలీలు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tadepalli

2023-05-17 11:29:26

జగనన్నకు చెబుదాంపై ప్రభుత్వం వినూత్న పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వినూత్న రీతిలో పర్యవేక్షణ చేపట్టింది. ఇప్పటి వరకూ స్పందనలో వచ్చిన ఆర్జీలను ఆన్ లైన్ చేసిన అధికార యంత్రాంగం ఇపుడు సమస్య పరిష్కారం అయిన తరువాత సదరు కుటుంబం యొ క్క వివరాలు, సమస్య ఏ శాఖకు చెందినదో తెలియజేస్తూ ఆన్ లైన్ లో ఫోటోతో సహా అప్ లోడ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం గ్రామాల్లో గ్రామస చివాలయ సిబ్బందితోనూ, పట్టణాల్లో వార్డుు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎన్ని కుటుంబాలకు లబ్ది చేకూరిందనే విషయాలను ఒక ప్రత్యేక గణన చేపడుతున్నారు.  అంతే కాకుండా ఐవీఆర్ ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించి ఆ డేటాను సచివాలయాలకు ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పంపిస్తు న్నారు. ఒకేసారి సచివాలయాల్లోని ఏ తరహా ప్రభుత్వసేవలు అందుతున్నాయి.. సిబ్బందికి నేరుగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమం కూడా జరిగిపోతున్నది. ఇప్పటి వరకూ పంచాయతీ అన్నా, సచివాలయం అన్నా కార్యదర్శిలు మాత్రమే ప్రజలకు కనిపించేవారు. జగనన్న కు చెబుదాం కార్యక్రమంతో మొత్తం సచివాలయాల్లోని 19శాఖల సిబ్బంది కూడా ప్రజలకు చేరువ అవుతున్నారు.

ప్రతీజిల్లాలోనూ సోమవారం వచ్చే ఫిర్యాదుల జాబితా మొత్తం 75 ప్రభుత్వశాఖల ద్వారా మండలాలకు, అక్కడి నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళుతుంది. ఫిర్యాదు ఆధారంగా సమస్య పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వశాఖల పైనే ఉంటుంది. ఫిర్యాదు అందిన దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ సదరు జిల్లాశాఖ అధికారి బాధ్యత వహించాల్సి వుంటుంది. సమస్య పరిష్కారం కాగానే సచివాలయ సిబ్బంది ఆ వివరాలు, ఫోటోను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు కూడా ప్రజలకు నేరుగా తెలిసే అవకాశం ఏర్పడింది. సచివాలయాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి సిబ్బంది ప్రజలతో మమేకం అయ్యేలా ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అవి బుట్టదాఖలే అయ్యాయి. కానీ జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో మాత్రం రాష్ట్రంలోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమాలరు 1.25లక్షల పైచిలుకు సిబ్బంది ఇపుడు ప్రజల వద్దకే నేరుగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాశాఖల అధికారులు కూడా ఇదే పనిపై దృష్టిసారించాల్సి వుంటోంది. దానికితోడు జిల్లా కలెక్టర్లు స్పందన కార్యక్రమంలో ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తుండటంతో ప్రజల వద్దకు ఈ కార్యక్రమం సత్వరమే వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రజల నుంచి అర్జీలు కూడా కలెక్టరేట్లకే వెళుతుండటంతో మండలాలు, సచివాలయాల్లో దరఖాస్తులు రావడం లేదు. జిల్లాశాఖల నుంచి తప్పితే, నేరుగా ప్రజలు సచివాలయాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సైతం అమలు చేయలేకపోతున్నారు. వాస్తవానికి గ్రామస్థాయి సమస్యలు సచివాలయాల్లోనూ, మండలస్థాయి సమస్యలు మండల కేంద్రాల్లోనూ, జిల్లా స్థాయిలో సమస్యలు కలెక్టరేట్లలోనూ దరఖాస్తులు చేసుకునేవిధంగా ప్రభుత్వం కార్యాచరణ చేసినా, నేరుగా ప్రజలందరూ కలెక్టరేట్లనే ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ అనతి కాలంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమం  ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నేరుగా ప్రజలతో మమేకం కావడానికి ప్రత్యేక వేదికలా మారింది. ఇదే పద్దతి కొనసాగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారానికి నోచుకుంటాయి..!

Tadepalli

2023-05-17 04:04:52

ఆ 9 మండలాల ప్రజలు జర జాగ్రత్తండీ బాబు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈరోజు 9 మండలాల్లో తీవ్రవడగా ల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 48°Cల వరకు ఉష్ణోగ్రతలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-48°Cల వరకు ఉష్ణోగ్రతలు,  ఇక విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C-44°Cల వరకు ఉష్ణోగ్రతలు, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tadepalli

2023-05-16 06:02:07

ముందు ఉద్యోగులకు బదిలీలు.. ఆపై సచివాలయ శాఖకు చట్టబద్దత

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఈశాఖ చట్టబద్ధత కంటే.. బదిలీలు చేపట్టి తర్వాత అసెంబ్లీ సమా వేశాల్లో చట్టబద్దత తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కేవలం 10నెలలు మాత్రమే ఉండ టంతో ఈలోగా ఇతర 75శాఖల ఉద్యోగులు, అధికారులతోపాటు, సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టిన తరువాత చట్టబద్ధతకు కార్య రూపం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. దానికోసం కూడా విధి విధానాలు రూపొందించాలని ఇప్పటికే జిఏడి నుంచి సచివా లయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లోని 1.25 లక్షలకు పైచిలుకు ఉద్యోగులకు(ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి) బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ బదిలీల ప్రక్రియలో ఇతర శాఖల్లోని సబార్డినేట్ సర్వీసు రూల్సు పాటించి జిల్లాలోపల బదిలీలు, అంతర్ జిల్లాలు, స్పౌజ్ కోటా, మ్యూచ్ వల్, ఎగ్జిస్టింగ్ వేకేన్సీ, హెల్త్ ఇష్యూస్ వారీగా బదిలీలు చేపడతారా వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తారా అనే విషయంలో మా త్రం స్పష్టత రాలేదు.  కాకపోతేకే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనలనే సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని మాత్రం ప్రాధమిక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది.

వాస్తవానికి ప్రభుత్వంలో ఏదైనా ఒక  శాఖను కొత్తగా ఏర్పాటు చేసినపుడు అసెంబ్లీ సభ్యుల ఆమోదంతో ఎలాగైతే చేస్తారో..అదే అసెంబ్లీ సాక్షిగా దానికి చట్టబద్ధత కూడా తీసుకు వస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ముందుది వెనుక, వెనుకది ముందు అన్నట్టుగా ఒక్కో ప్రక్రియ ఒక్కోసారి చేపట్టడంతో ఉద్యోగులు సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఈశాఖలో పనిచేసే 19శాఖల సిబ్బందికి చాలా వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. కొన్నిశాఖల సిబ్బందికి వాటిని ఏర్పాటు చేసినా.. మహిళాపోలీసు విభాగంలో ఇంకా కోర్టు కేసులు నలుగుతున్నాయి. వీరికి సాధారణ పోలీసులు మాదిరిగా యూనిఫాం ఇచ్చే విషయంతో  కూడా పోలీసుశాఖ ఇంకానిర్ణయం తీసుకోలేదు. దానికి కూడా ఇంకా స్పష్టత రావాల్సి వుంది. పేరుకి వీరు హోంశాఖ ఉద్యోగులు అయినప్పటికీ, సచివాలయాల్లో మాత్రం అధికంగా ఐసిడిఎస్, రెవిన్యూశాఖకు చెందిన బిఎల్వో లాంటి విధులు చేస్తున్నారు. ఈ తరుణంలో జిఏడి నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా వీరికి బదిలీలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూస్తున్నారని సమాచారం. ఆ విధంగా ఒక్కసారి విధివిధానాలు రూపొందిస్తే మూడు దఫాలుగా జరిగిన ఈ నియామకాల్లో విధుల్లో చేరిక వారికి కూడా బదిలీలకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని గ్రామీణ శాఖలకు చెందిన సిబ్బంది ఉండటంతో వారిని వార్డు సచివాలయాలకు బదిలీ చేసే అవకాశం లేదని కొందరు.. ఒకేశాఖ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంటే అక్కడి కూడా ఖాళీలను బట్టీ చేస్తారని మరికొంత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అర్భన్ ప్రాంతాల్లో పోలీస్, హెల్త్, ఇంజనీరింగ్, వెల్ఫేర్, సర్వేయర్, వీఆర్వో, పశుసంవర్ధక, ఇంజనీరింగ్, ఫిషరీష్ శాఖలకు సంబంధించిన స్పష్టత రావాల్సి వుంది. మిగిలిన శాఖలైన అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీ కల్చర్, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లు వార్డు సచివాలయాల్లో పనిచేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ కారణాలు కూడా సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల గ్రూపుల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం బదిలీలు చేపడుతుందని స్పష్టత ఇచ్చితన తరువాత చాలా మంది వారి వారి సొంత జిల్లాలకు వెళ్లడానికి మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ కోసం పెద్ద ఎత్తు శోధనలు మొదలు పెట్టారు. ఎవరికుండే పరిచయాలను, రాజకీయనాయకులతో పలుకుబడి, అధికారులను ప్రశన్నం చేసుకొని తొలిసారిగా జరిగే బదిలీల్లోనే ఉన్న ప్రాంతం నుంచి కదిలిపోవాలనే బలంగా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాఖలో ఆదినుంచి ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. 19శాఖలకు చెందిన ప్రిన్స్ పల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఇటు జిల్లా కలెక్టర్లతో పరస్పర సహకారం, సమన్వయం లేకుండానే ఇంత కాలం నెట్టుకొచ్చేశారు. మరోవైపు గ్రామసచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు వారే మిగిలిన సిబ్బందికి జీతాలు ఇస్తున్నట్టుగా తెగ ఫీలపైపోయి వారి మాతృశాఖల విధులు నిర్వర్తించే సమయంలో ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు.  ముఖ్యంగా వారి ఇబ్బందులు తాళలేక ప్రభుత్వం కల్పించనున్న ఈ బదిలీల్లో వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ విషయంలో వీరికి సంఘాలు ఉన్నప్పటికీ విధానపరమైన అంశాలను లేవనెత్తకుండా కేవలం ప్రభుత్వానికి విధేయత ప్రదర్శించే కార్యక్రమం మాత్రమే చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న శాఖపరమైన విధినిర్వహణ విషయంలో అటు ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి నుంచి, ఆయాశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా జిల్లా కలెక్టర్లకు సైతం సమన్వయాన్ని చేయలేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయినా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా తమకు అన్ని జిఓలు, పదోన్నతులు, బదిలీలు జరుగతాయా లేదా అనే అనుమానం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జరిగే బదిలీల ప్రక్రియలో ఒక్కో విషయం ఒక్కోసారి వైరల్ అవుతోంది. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాటి నిబంధనలు పాటించి, ఈ శాఖకు చట్టబద్ధత కల్పిస్తుందనేది..!

Tadepalli

2023-05-16 02:03:48

మే 6దాటినా ఇంకా పెన్షన్ల కోసం ఎదురుచూపులే

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ కోసం ప్రతీనెలా ఎదురుచూసే పరిస్థితే దాపురిస్తోంది. మే నెల 6వ తేదీ నాటికి కూడా వారి అకౌంట్ లో పెన్షన్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రిటైర్డ్ ఉద్యోగులు వారి పెన్షన్ పైనే బ్రతుకుతు న్నారు. మరికొందరు పెన్షన్ పై హౌసింగ్ లోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. వాటికి ప్రతీనెలా 5వతేదీ నాటికే ఈఎంఐలు కట్టాల్సి వుంది. దీనితో ప్రతీనెలా 5దాటిన తరువాత పెన్షన్లు పడటంతో ఈఎంఐకి ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు బౌన్స్ అయ్యి వాటికి పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తమను పెన్షన్ల కోసం ఎదురు చూసేలా చేస్తోం దని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోపక్క మరికొంత మంది పెన్షనర్లు కుటుంబాలు లేక ఒంటరిగా జీవిస్తుండటంతో వచ్చిన పెన్షను పైనే ఆధార పడాల్సి వస్తున్నది. అలాంటి వారు ప్రతీ నెలా పెన్షను వచ్చేంత వరకూ వేచిచూడకుండా ముందస్తుగా అప్పులు చేసుకొని, వాటి కి వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తున్నది. ఈవిధానం కొనసాగితే ప్రభుత్వంపై పెన్షనర్ల తిరుగుబాటు తప్పేటట్టు లేదు.

Amaravati

2023-05-05 05:16:58

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల విషయంలో ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది.  వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్స్, పదోన్నతులు, బదిలీల అంశాలే పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. కాకపోతే ఈ శాఖకు ప్రభుత్వం ఇంకా చట్టబద్దత కల్పించలేదనే విషయాన్నిఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ యాప్ Ens Live, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా  ప్రత్యేక కథనం ప్రచురిచింది. దీనితో విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వెంటనే ఆదిశగా చర్యలు చేపట్టింది.  ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ప్రత్యేక కార్యదర్శిలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారు, ఇంకా పూర్తికాని వారు, జిల్లా పరిధిలోని బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని విధివిధానాలు, నిబంధనలను రూపొందించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 15వేల 4  గ్రామ, వార్డు సచివాలయాల్లో  1.25 లక్షల మంది ఉద్యోగులు 19 ప్రభుత్వ శాఖలకు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. వీరంతా మూడు దశల్లో  అంటే రెందు దఫాలుగా నోటిఫికేషన్లు, మరికొందరు కారుణ్య నియామకాల ద్వారా విధుల్లోకి చేరారు. వీరిలో నోటిఫికేషన్ల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులందరి సర్వీసులు ప్రొభేషన్లు ఖరారు అయ్యాయి. కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇంకా ప్రొభేషన్ ఖరారు కావాల్సి ఉన్నది. కాగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అసెంబ్లీలో చట్టబద్దత తీసుకురావడానికి కేబినెట్ లో నిర్ణయించింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.  ఈ క్రమంలో ఉద్యోగులంతా విధుల్లోకి చేరి మూడేళ్లు దాటిపోవడంతో ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా వీరికి కూడా బదిలీలు చేపట్టాలని ఉద్యోగు సంఘాల అభ్యర్ధన మేరకు అంగీకారం చెప్పింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్సుని గ్రామ, వార్డు సచివాలయశాఖకు కూడా అమలు చేయాలి. కాకపోతే కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ సైతం ప్రకటించారు.

ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులు మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఆన్ లైన్ విధానంలోనే ఆప్షన్లు ఏర్పాటుచేసి బదిలీలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దానికోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా రూపొందించనున్నారు. అక్కడే ఆప్షన్లు, స్థానిక బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు, సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఒకలా, ఇంకా పూర్తికాని వారికి ఒకలా చేసే విధంగా నిబంధనలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియ మొత్తం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోగా.. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న 19 ప్రభుత్వశాఖలకు చెందిన కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిల నుంచి ఆయా ప్రభుత్వశాఖల సర్వీస్ రూల్స్ ను కూడా తెప్పించి క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. ఈ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాలంటే ముందు ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా విధివిధానాలు రూపొందించిన తరువాత ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే తీపి కబురు బదిలీల ప్రత్యేక జీఓ ద్వారానే చెప్పే అవకాశం ఉంది...!

Tadepalli

2023-04-28 03:15:21

మే 4న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 4న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Tirumala

2023-04-27 11:26:34

ఆన్ లైన్ రిజర్వేషన్ లో అన్నవరం వసతి గదులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం వసతి సౌకర్యాల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఈ మేరకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ మీడియాకి  ఒక ప్రకటన జారీచేశారు. ప్రస్తుతం వివిధ కాటేజీలలో అందుబాటులో ఉ న్న వసతి, గదులు 50% కోటాను ఆన్ లైన్ లో ఈనెల 26 నుంచే అందుబాటులో ఉంచారు(దీని నుంచి ఎస్ఆర్సీ, ఎస్న్సీని మినహాయిం చా రు).  ఇప్పటివరకూ అన్నవరం దేవస్థానంలో కాటేజీల బుకింగ్ ఒక ప్రహసనంలా ఉండేది. కొత్తగా దేవదాయశాఖలో కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.సత్యన్నారాయణ బాధ్యతలు తీసుకున్న తరువాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అన్నవ రంలోని గదుల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఇక నుంచి భక్తులు  www.aptemples.ap.gov.in ద్వారా 50% వసతిని నేరుగా రిజర్వేషన్ ఆన్ లై న్ లో చేసేకోవచ్చు. తద్వారా దళారీ వ్యవస్థకు చాలా వరకూ అడ్డకట్ట వేసినట్టు కూడా అయ్యింది.

Annavaram

2023-04-26 08:57:16

జిల్లాశాఖల తరువాతే సచివాలయ ఉద్యోగుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 75 శాఖల్లోని జిల్లా అధికారులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తరువాతనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిఏడిలోని అధికారులు ఆయాశాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈనెలాఖరులేదా వచ్చే నెల మొదటి వారంలో జిల్లాఅధికారుల బదిలీల తరువాత మిగిలిన ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా అన్ని ప్రభుత్వశాఖల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టభద్దత ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈకారణంగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల నిబంధనలు అమలు చేయాలా..? లేదంటే ప్రత్యేకంగా వీరి కోసం నిబంధనలు రూపొందించాలా అనే విషయాన్ని సచివాలయశాఖ ప్రత్యేక కార్యదర్శి ముఖ్యమంత్రి దృష్టికి, జిఏడి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే సచి వాలయ ఉద్యోగుల బదిలీలకు  విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయంటున్నారు రాష్ట్ర అధికారులు.!

Tadepalli

2023-04-26 04:57:16

ఏపీ ఉద్యోగులకు మరో 46 రకాల వైద్యసేవలు

ఆంధ్రప్రదేశ్ లోని  ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉ‍ద్యోగుల హెల్త్‌ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్‌ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ జీఓఎంఎస్ నెంబరు 49ని విడుదల చేసింది. ఇక ప్రతీ ఉద్యోగుల హెల్త్ కార్డులను ఏటా రెన్యువల్‌ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్‌(సర్జికల్ అంకాలజీ-10,  మెడికల్ అంకాలజీ -32, రేడియేషన్ అంకాలజీ-4) చికిత్సలు అందేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా అందులో వివరించింది. కాగా,  రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు ఆదేశించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Tadepalli

2023-04-19 14:07:31