1 ENS Live Breaking News

మళ్లీ చిక్కుల్లో పడనున్న సచివాలయ మహిళా పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసుల విభాగానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఆది నుంచి ఈ విభాగం ఉద్యోగులపై కోర్టు కేసులు పడుతూనే ఉన్నాయి. తాజాగా సచివాలయ మహిళా పోలీసులను సాధారణ పోలీసులు మాదిరిగా విధులకు పంపించడా న్ని..పరిగ ణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి ప్రభుత్వం నుంచి ఏజి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వారిని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్, బందోబస్తు డ్యూటీలు వేయడానికి సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. దానితో డిజిపి కార్యాలయం నుంచి వారికి పోలీసు విధులు అప్పగించకుండా ఆదేశాలిస్తామని కోర్టుకి విన్నవించింది. గతంలోనే వీరిని మహిళా పోలీసులుగా ఏవిధంగా నియమిస్తారనే అంశంపై ఉమ్మడి విశాఖజిల్లా నుంచి నిరుద్యోగ అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. దానిపై పూర్తిస్థాయి తీర్పు పూర్తవకుండానే మరో కేసు దాఖలవడం చర్చనీయాంశం అవుతోంది. ఒక్క మహిళా పోలీసుల విభాగంలోనే కోర్టు కేసులు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దానికి ప్రభుత్వం దగ్గర కూడా సాంకేతిక పరమైన సమాధానాలు లేకపోవడంతో ఆ కేసుల విషయంలో హోంశాఖ నెగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ ద్వారానే వీరికి నియామక ఉత్తర్వలు జారీచేశారు. తొలుత మహిళా సంరక్షణా కార్యదర్శిల పేరుతో నియామకాలు ఇచ్చిన ఏపి ప్రభుత్వం తరువాత వారి హోదాను మహిళా పోలీసుగా మార్చింది. వారికి సర్వీస్ రూల్స్ ని అమలు చేస్తూ ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేసింది. సీనియర్ మహిళా పోలిస్(హెడ్ కానిస్టేబుల్ హోదా) ఆ తరువాత ఏఎస్ఐ, ఎస్ఐ, ఆపై సిఐలుగా పదోన్నతులు వీరికి కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే వీరందరినీ దిశ పోలీస్ స్టేషన్లు, విధులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచించింది. ఆదిశగా ఒక్కో పోలీసు విధులను వీరికి కేటాయిస్తూ వచ్చింది. సరిగ్గా పోలీస్ స్టేషన్లలో విధులు, బందోబస్తులు, కోర్టు సమన్లు, నాటుసారా రవాణా సమాచారం ఇలా అన్నివిభాగాల్లోనూ వీరిని వినియోగించి నిజమైన పోలీసులుగా వీరిని పరిగించడంపై అభ్యంతరాలు వ్యక్తమై విషయం కోర్టులో కేసు వరకూ వెళ్లడంతొ.. పోలీసు విధులను వారికి అప్పగించమని ఏజి ద్వారా డిజిపి కార్యాలయం హైకోర్టుకి విన్నవించింది.

మరోప్రక్క వీరికోర్టు కేసుల నెపమో, లేదంటే ఉద్యోగులందరి సర్వీసులు రెగ్యులర్ కాలేదనే సాంకేతిక కారణమో తెలీదు కానీ గ్రామ, వార్డు సచివాలయ 
ఉద్యోగుల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వశాఖకు మంత్రివర్గ బేటీలో ఆమోదించి.. ఆపై అసెంబ్లీలో చట్టబద్దత కల్పించకుండా వదిలేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి సర్వీసు రూల్సును కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. రెండేళ్ల తరువాత రెగ్యులర్ చేస్తామ ని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత అదనంగా 9నెలలు వీరితో పనిచేయించింది. ఆ సమయంలో ఉద్యోగులు రెండు ఇంక్రిమెంట్లు, రెండు డిఏలు, ఆ 9 నెలలపాటు ఫుల్ పేస్కేలు, పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ను కూడా ఉద్యోగులు కోల్పోయారు. వీరు కోల్పోయిన ఇంక్రిమెంట్లు, డిఏలు, ఐఆర్ పై నేటికీ ఇదేశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రశ్నించడం లేదు. ఈ లెక్కన చూస్తే ఈ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత రాకపోతే వచ్చే ప్రభుత్వం మారితే వీరి ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. 

భారతదేశం మొత్తం ఏపీవైపు తొంగిచూసే విధంగా కొత్తగా ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శాఖకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. నేటికీ సుమారు 19శాఖల సిబ్బందికి, జిల్లాకలెక్టర్లకు, జిల్లా, మండల అధికారులకు కూడా పూర్తిస్థాయిలో ఈశాఖపై అవగాహన రాలేదంటే..ఈశాఖపై ప్రభుత్వం ఏ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఇటీవల అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసిన డిఏని, సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడంపైనా ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇంక్రిమెంటు విషయంలో టార్గెట్లు పూర్తికాకపోతే మొదటి ఇంక్రిమెంట్ వేసేది లేదని జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఎందుకు ఇవ్వడం లేదంటే ఆ ఒక్కటీ అడగొద్దు అని జిల్లా అధికారులు సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అనుమానాల మధ్య మా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలినియని ఆయోమయ భయం తమను వెంటాడుతోందని ఉద్యోగులు భయాంతోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు కూడా 2024 ఎన్నికల్లో ప్రభావం చూపిచే అవకాశాలున్నాయిని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

Visakhapatnam

2023-07-21 04:40:37

ఈఎన్ఎస్ వార్తకు స్పందన..వెలువడిన ఆన్ లైన్ ఉత్తర్వులు

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు సంబంధించిన అంతర్ జిల్లాల బదిలీలపై హోంశాఖ స్పందించింది. గత నెలలో పూర్తికావాల్సిన బదిలీల ప్రక్రియన వాయిదా పడుతూ వచ్చింది. ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్తంగా మహిళా పోలీసుల బదిలీలకు ఎదురుచూపులే శీర్షికన వరుస కథనాలు ప్రచురించింది. దీనితో ఎట్టకేలకు ప్రభుత్వం హోంశాఖ ద్వారా జిఓఆర్టీనెంబరు 776 పేరిట ఉత్తర్వులు జారీచేస్తూ..బదిలీలుకోరుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్లో జాబితా విడుదల చేసింది. మరో రెండురోజుల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వీరికి బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలొచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ జాబితాలో పేర్లు ఉన్నవారు సంబంధింత నోడ్యూస్ సర్టిఫికేట్లు సిద్దం చేసుకోవాలని కూడా సూచించారు. 

Visakhapatnam

2023-07-20 15:27:09

సచివాలయ ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఎదురుచూపులే..?!

గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకి ప్రభుత్వం చేపడతామన్న పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) ప్రక్రియకు తేదీ ఖరారు చేయకపోవడంతో ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకున్నవారంతా ఉసూరుమంటూ వేచి చూడాల్సి వస్తోంది. ఈనెల 10 నుంచి 12 లోపు అన్ని రకాల బదిలీలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ విషయంలో ఎందుకనో వెనక్కి తగ్గింది. దీనితో ఉద్యోగులు నిరాశపడిపోయారు. చాలామంది ఇటీవల తేదీ ఖరారు చేసి జిల్లాలకు రమ్మని చెప్పిన తరువాత.. తూచ్ మళ్లీ మీకు బదిలీల తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో చాలమంది ఉద్యోగులు తిరిగి వారి ఉద్యోగ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కొందరు ఉద్యోగులు తేదీ ప్రకటించేస్తారని బ్రమపడి నాలుగైదు రోజులు సెలవులు వాడేసుకొని వెనక్కి వెళ్లకుండా ఉండిపోయారు. తీరా తేదీని ప్రకటించకపోవడంతో చేసేది ఏంలేక ఆదివారం సాయంత్రం పెట్టేబేడా సర్ధుకుని విధులకు వెళ్లిల్సిన దుస్తితి ఏర్పడింది. జిల్లాల పరిధిలోని బదిలీలను ఇచ్చిన సమయానికే పూర్తిచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఆలోచనలో పడింది. దీనితో ఆ ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడింది.


అందరికీ బదిలీల చేసిన ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాల్లో ఉన్న డిఎల్డిడీఓలకు, జిల్లాశాఖల అధికారులకు సమాచారం లేకపోవడం వారు కూడా చేతులెత్తేస్తున్నారు.. ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే అందరికీ ఒకేసారి తెలుస్తుంది కదా అంటూ ఉద్యోగులపై చిరాకు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల బదిలీల ప్రక్రియ జరిగిపోయినా..స్థాన చలనం కదిలిన సచివలయం నుంచి బదిలీ జరిగిన సచివాలయంలో చేరేందుకు వీలు లేకుండా వారం రోజుల పాటు ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. ఇదంతా 19 ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంగానే చెబుతున్నారు. పోనీ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరిగినందున కనీసం ఆన్ లైన్ కౌన్సిలింగ్ సైతం చేపకట్టకపోవడం వెనుక ఆంతర్యం ఉద్యోగులకు అంతుపట్టడం లేదు.. అసలు తాము దరఖాస్తు చేసుకున్న ప్రదేశాలకు బదిలీలు చేస్తారో..చేయరోననే ఆందోళనను ఉద్యోగులు వ్యక్తం చేయడం విశేషం. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా కాకుండా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు మాత్రమే వీరి ఉద్యోగాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి నేటి వరకూ అంతా కాస్త తేడాగానే చేస్తున్నది ప్రభుత్వం. దీనితో సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా తాము లేమనే బావన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొననసాగితే 2024 ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Amaravathi

2023-06-26 03:03:37

బాబ్బాబు.. మా సచివాలయాల్లో ఈ సేవలన్నీ అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక.. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఏపీవైపు తొంగిచూసేలా చేసిన ఏకైక ప్రభుత్వ శాఖ..గ్రామ, వార్డు సచివాలయశాఖ.. రాష్ట్రంలో ఈ ప్రభుత్వశాఖ వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా..ఒక్కో సచివాలయంలో ఎంత మంది ఉద్యోగులుంటారు..ఏ శాఖ సిబ్బంది ఉంటారు..ఏఏ రకాల సేవలు అందింస్తారో ఎవరికీ తెలీదు.. వీరూ ప్రజలకు తెలియజెప్పలేదు.. కాదు కాదు..వారికి కేటాయించిన డ్యూటీ చార్ట్ ఏంటో ఈ శాఖ ఉద్యోగులకే తెలీదు.. అందుకే ఇన్నేళ్లు దాటుతున్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేసే సేవలు తెలియకపోవడంతో  ఉచితంగా కొన్ని రోజులు సేవలు అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికోసం ప్రత్యేకంగా నెలరోజులు ప్రత్యేక ప్రచారానికి ఈరోజునుంచే తెరలేపింది. రాష్ట్రంలోగ్రామ, వార్డు సచివాలయశాఖలో 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు 1.35 లక్షల మంది ఉద్యోగులు..వీరంతా ఒకేసారి వారి ప్రభుత్వశాఖలకు సంబంధించిన సేవలపై గ్రామాల్లోని పెద్దలకు, ప్రచారం చేస్తే ఎప్పుడో ఇక్కడి సేవలపై అవగాహన వచ్చేది. కానీ అలాచేయకపోవడంతో ప్రభుత్వమే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి బాబ్బాబు అంటూ పూనుకోవాల్సి ఇపుడు ప్రచారం చేయాల్సి వస్తోంది.

ప్రజలకు అవగాహన జరుగుతుందిలా..
రాష్ట్రంలో జూన్ 24 నుంచి నెల రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్  ద్వారా సుమారు 745 సేవలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తారు. ఈప్రచారం జరుగుతున్న సమయంలో 11 రకాల సేవలు(ఆధార్, కుల, ఆదాయ, నివాసం, జనన, మరణ, ఓబిసి తదితర) ఉచితంగానే ఇస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు, డ్వాక్రా సంఘాలకు, తెలిసేలా ప్రచారం చేపడతారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ద్రువీకరణ పత్రాలు కావాలంటే సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి వుంటుంది. అయితే అక్కడ ఏ తరహా సేవలు అందిస్తారనే విషయంలో నేటివరకూ పూర్తిస్థాయి అవగాహన ప్రజలకు లేదు. దీనితో ఇపుడు ఆ సేవలపై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక నాయకుల సహకారంతో ప్రజల్లోకి తీసుకెళతారు. అలా చేయడం ద్వారా గ్రామం లేదా వార్డులోని సచివాలయాల దగ్గరకే ఏ అవసరం వచ్చినా వెళ్లాలనే అవగాహన ప్రజలకు కల్పిస్తారు.

రాష్ట్ర, జిల్లా, మండల అధికారుల వైఫల్యమే..
అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లా, మండల శాఖ అధికారుల వైఫల్యం వలనే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన, చైతన్యం రాకుండా పోయాయనడాకి 19శాఖల్లో వారిలో వారికి సమాచార లోపమనే చెప్పాలి. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి బెదిరించి విధులు చేపట్టేలా చేయడం తప్పితే ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సక్రమంగా ఒక్క ప్రభుత్వశాఖ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టే సమయంలో కూడా సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పలేదు. ఇక్కడ ఉద్యోగులకు సర్వీస్ ప్రొభేషన్ ఖరారు అయ్యేంత వరకూ రాష్ట్ర అధికారి, జిల్లా కలెక్టర్, మండల అధికారులు వరుసుగా వీరందరినీ భయపెట్టే పనులు చేయించడం వలనే సిబ్బంది కావాలనే సచివాలయాల్లో అందే సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లలేదనే విషయం మీడియా ద్వారా చాలాసార్లు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీచేస్తే పంచాయతీరాజ్ కి పడేది కాదు..విద్యాశాఖ అమలు చేసే ఆదేశాలు ఇంజనీరింగ్ శాఖకు నచ్చేది కాదు..ఇలా ఏ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా మండలాల్లో ఎంపీడీఓలు వాటిని అమలు పరిచేవారు కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు రెగ్యులర్ కావాల్సి వుందనే బెదిరింపులూ వచ్చేవి. వెరసీ మూడేళ్లు దాటిపోతున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సేవలు ప్రజల్లోకి వెళ్లలేదు..

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినా ప్రజలందరూ అన్ని రకాల సేవల కోసం మీ సేవా కేంద్రాలనే ఆశ్రయించేవారు. ముఖ్యంగా రెవిన్యూశాఖకు సంబంధించిన అన్ని పనులూ అక్కడే జరిగేవి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మీసేవా కేంద్రాలకు వెళ్లిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల ద్వారా అన్ని రకాల సర్వీసులు అందించే ఏర్పాటు ప్రభుత్వశాఖల వారీగా చేసి ఉంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగేది. అంతేకాకుండా అపుడు మీసేవాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా..సచివాలయాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా ఉండటం వనలన కూడా అందరూ మీసేవ కే ఎక్కువ మొగ్గు చూపేవారు. అంతేకాకుండా మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులకు సిబ్బంది కూడా ముందుకెళ్లి పనులు చేసేవారు. దానిని గుర్తించిన ప్రభుత్వం మీసేవాల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ పత్రాలనే వివిధ రకాల ద్రువీకరణల కోసం వినియోగించడం మొదలు పెట్టిన తరువాత మీసేవ, సచివాలయాలకు మధ్య వ్యత్యాసం అందరికీ తెలిసింది. ప్రస్తుతం చేసే ప్రచారంతో మరింత మందికి తెలిసే అవకాశం వుంటుంది.

ఉద్యోగులు తలచుకుంటే వారం రోజులు చాలు..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 1.35 లక్షల మంది ఉద్యోగులు ఒక్కసార తలుచుకుంటే..వారి ప్రభుత్వశాఖల వారీగా అందించే సేవలను ప్రచారం చేయడం మొదలు పెడితే ప్రజలందరికీ ఒకేసారి అవగాహన వస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే వారంరోజులు సరిపోతుంది. తద్వరా ఇంటి ముంగిటే సచివాలయ సేవలు అందుతున్నాయనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, Ens Live యాప్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఈశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రచారం చేస్తే మరింత త్వరగా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ అవుతయాని వరుస కథనాల ద్వారా తెలియజేసింది. అయితే శంఖంలో పోస్తేనే తీర్ధం అయినట్టుగా.. ప్రభుత్వానికి సచివాలయాల్లో అందించే సేవలపై ప్రత్యేకంగా ప్రచారం చేయాలనే ఆలోచన రావడానికి మూడేళ్లు దాటిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఒక పక్కా ప్రణాళికతో సేవలపై ప్రజలకు అవగాహన పెంచడంతోపాటు,  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో కంప్యూటర్ల సంఖ్య కూడా పెంచితే మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. లేదంటే అన్నిశాఖల భారం ఒక్క డిజిటల్ అసిస్టెంట్ పైనే ప్రస్తుతం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది తేలాల్సి వుంది..!

Amaravathi

2023-06-24 07:03:36

APCPSEAతో వాస్తవాలను తెలియజేసే సిపిఎస్ ఉద్యోగి మేలుకో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి.. ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రచారాలను, సంబురాలను ఉద్రుతం చేస్తున్న వేళ..ఆం ధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వాస్తవాలను అందరికీ తెలియజేసే పనిలో పడింది. అసలు సిపిఎస్ రద్దుచేసి ప్రభుత్వం మనం దాచుకున్న డబ్బుని మనకే ఇస్తుందంటూ ఒక వాస్తవాన్ని తెలియజేసే చైతన్యకార్యక్రమాలకు తెరలేపింది. ఇపుడు ఆ మెసేజు, అవగాహన రాష్ట్రంలోని సుమారు 3.50 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ను ఆలోచింప జేస్తున్నది. ఈ క్రమంలోనే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ ద్వారా ప్రభుత్వం అంతకంటే గొప్పగా ఇస్తామని చేస్తున్న ప్రచారంలో నిజమెంతో తెలియజేస్తుంది. ఆ విషయాలను సిపిఎస్ ఉద్యోగులతోపాటు పాఠకులు కూడా తెలుసుకుంటారనే ఆలోచనతో సోషల్ మీడియాలో తారా స్థాయిలో జరుగుతున్న ఆచర్చను మీ ముందుకి తీసుకు వస్తున్నా్ం. ఈ లెక్కలు చూసిన వారు ఎవరైనా కిమ్మనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో.. అవేంటో మీరూ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి.. !

ప్రతీ నెల కట్ చేసిన (బేసిక్+డి.ఎ. పై) 10% అమౌంట్ అంటే.... నెలకు సుమారు రూ.6,000/-  చొప్పున 33 సంవత్సరాల సర్వీస్ అంటే సంవత్సరానికి ₹72,000/- చొప్పున 33 సంవత్సరాల సర్వీసుకు మొత్తంమీద  రూ.23,76,000/-  ఉద్యోగుల జీతం నుండి కట్ అవుతుంది. దీనికి వడ్డీ తక్కువలో తక్కువగా సుమారు రూ. 6,24,000/- అనుకుంటే .... మన పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఒక  సిపిఎస్ ఉద్యోగి నుండి రూ.30,00,000/- లకు పైబడిన అమౌంట్ ఉంటుంది. ఈ  అమౌంట్ ఏమోవుతుందో తెలిసిన వారు చెప్పగలరు. ఇక ఆ రూ.30,00,000బ్యాంకులో జమ చేస్తే నెలకు సుమారు ఎంత వడ్డీ రావచ్చునో అంచనా వేస్తే....ప్రభుత్వం మనకు 50% పింఛను ఎలా ఇస్తానంటుందో తెలుస్తుంది. 

 చిన్న మనవి..
 మనం ప్రతీ నెల సిపిఎస్ డిడక్షన్ కింద లెక్కించిన రూ.6000/- అంచనా మాత్రమే సర్వీసు మొత్తం ఈ అమౌంట్ పెరుగుతూ పోతుంది. అంటే పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఉద్యోగి అమౌంట్ రూ.30,00,000/- లకు పైబడే ఉంటుంది.


ముఖ్య గమనిక:- 
1) జిపిఎస్ అమలైతే ప్రభుత్వం నెలనెలా కట్టే తన మేచింగ్ గ్రాంట్ 10% ఆపేస్తుంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ కాదు. 2) ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ఈ పదకం వల్ల ఉద్యోగులకు లాభం లేదు. ఎందుకంటే ఈ రోజున జీవన ప్రమాణాల ప్రకారం 62 సంవత్సరాలకు పదవీవిరమణ చేసిన ఉద్యోగి సుమారు 10 లేదా 15 సంవత్సరాలకు మించి జీవించరు. కావున ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బులు తీసుకున్న ప్రభుత్వమే లాభపడుతుంది తప్ప ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు నిట్ట నిలువునా మోసపోతారు

 
కొసమెరుపు... జిపిఎస్  పేరుతో ఇచ్చే పెన్షన్ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ప్రభుత్వానికి మంచి రాజకీయ ప్రచారం. మాత్రం జరుగుతుందని ఆ ప్రచారంలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగి ఇన్నేళ్లు సర్వీసు చేసినందుకు ప్రయోజనం వుంటుంది తప్పితే.. జిపిఎస్ వలన తాము దాచుకున్న డబ్బు తమకే ప్రభుత్వం ఇస్తూ..తమకోసం చాలా మంచిగా ఆలోచిస్తుందన్నట్టుగా రంగులు పులుముకుంటుందని కూడా ఈప్రచారకులు చైతన్యం తీసుకు వస్తున్నారు. మరో పక్క గత్యంతరం లేక ప్రభుత్వం అమలు చేస్తానన్న జిపిఎస్ ను స్వాగతిస్తున్నామని చెబుతున్న ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సిపిఎస్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక ఎదురవుతుంది. సిపిఎస్ రద్దు అంశం ముగిసిపోయిందని ప్రభుత్వం చెబుతున్నా.. సిపిఎస్ ఉద్యోగులు మాత్రం దానిని వదలడం లేదు. చూడాలి ఈ జిపిఎస్ ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది..!

Amaravathi

2023-06-23 02:13:40

Ens Live వార్తకు స్పందన..సచివాలయ ఉద్యోగులకు ఆర్డర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూ స్ వెబ్ సైట్ www.enslive.net ప్రచురించిన ‘సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ సరే..నియామక ఉత్తర్వులేవి’ వార్తపై అధికారులు స్పందించారు. వెనువెంటనే కౌన్సి లింగ్ అయిన అభ్యర్ధులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీచేశారు. ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేశారు.  మరోవైపు పట్టణ పురపాలకశాఖ రాష్ట్ర అధికారులు కూడా కౌన్సిలింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్ధుల వివరాలను ఆన్ లైన్ చేసి..ఆ జాబితాను అధికా రికంగా విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల సమయంలో కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే అదేరోజు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. లేదంటే జాబితా ప్రకటించి, సదరు కార్యాలయాలకు ఉత్తర్వులు చేరవేస్తారు. కానీ సచివాలయ ఉద్యోగుల విషయంలో చెప్పిన సమయానికి కౌన్సిలింగ్ నిర్వహించకపోగా.. ఆలస్యంగా చేసిన కౌన్సిలింగ్ తరువాత కూడా వారికి బదిలీల అయిన చోటుకి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వ శాఖకు జరగని విధంగా..విభిన్నంగా ప్రక్రియ జరగడాన్ని కూడా ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లిం  ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాం. 

విషయం తెలుసుకున్న అధికారులు ఆఘమేఘాలపై పోస్టింగ్ ఆర్డర్లకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు. ఏఏ ప్రాంతాలకు అభ్యర్ధులకు బదిలీలు జరిగాయో ఆయా ప్రదేశాల్లోని సచివాలయాల్లో విధుల్లోకి చేరాలంటూ సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులురావడంతో సచివాలయ ఉద్యోగులు ఈవిషయాన్ని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయాని ఫోన్లు చేసి తెలియజేసి ధన్యవాదములు తెలియజేశారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడంతోపాటు, ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే విషయంలోనూ సామాజిక బాధ్యత వహిస్తుందని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులపై వరుస కథనాలు ప్రచురించడం వలనే ప్రభుత్వ వర్గాలు సత్వరమే స్పందించాయని పేర్కొన్నారు. వాస్తవాలను అత్యంత వేగంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు తెలియజేసే విషయంలో మొదటి నుంచి ఒకే ఒరవడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఇకపై కూడా ఉద్యోగుల సమస్యలపైనే కాకుండా..కొన్ని తేడా వ్యవహారాలపైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం..!

Amaravati

2023-06-23 02:00:33

సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ సరే..నియామక ఉత్తర్వులేవి..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏశాఖ ఉద్యోగులకు జరగని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రకటించిన తేదీకి అభ్యర్ధన బదిలీల ప్రక్రియ జరగకపోవడం.. జరిగే సమయానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉద్యోగులకు తరువాత చేపడతామని వారికి ఇంటికి పంపడం.. ఆ తరువాత జిల్లాల్లోనే కౌన్సిలింగ్ లు చేపట్టడం అన్నీ జరిగిపోయాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా చాలా జిల్లాల్లో కౌన్సిలింగ్ తరువాత ఉద్యోగు జాయిన్ అవ్వాల్సిన సచివాలయాలకు నియామక ఉత్తర్వులు నేటికొచ్చి జారీచేయలేదు. పైగా ఏ సచివాలయానికి ఏ ఉద్యోగి వెళుతున్నారో చెప్పే జాబితాను కూడా సదరు సచివాలయాల్లో నోటీసు బోర్డులో పెట్టిస్తామన్న ఉత్తర్వులు కూడా అమలుకాలేదు. ఇక అంతర్ జిల్లాలకు బదిలీలు, పరస్పర బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారు ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుందో తెలీక  వేచిచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో సుమారు 19 ప్రభుత్వశాఖలు మిలితమై ఉండటం ఆ శాఖలకు సంబంధించిన రాష్ట్ర అధికారులకు మధ్య పరస్పర సహకారం, సమాచారం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతున్నది. 

సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అభ్యర్ధ బదిలీల ప్రక్రియకు గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేశారు. కానీ దానిప్రకారం ఎక్కడా జరగకపోవడం విశేషం. అసలు ఉద్యోగుల కౌన్సిలింగ్ కి సంబంధించినంత వరకూ ఇచ్చే ఉత్తర్వులు ఒకటి.. తీరా ఆతేదికి అక్కడికి చేరుకుంటే జరిగేది మరొకటి అవుతున్నది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగుల కౌన్సిలింగ్ అంటే అది జరిగిన వెంటనే కేటాయించిన ప్రదేశానికి బదిలీలు చేసిన నియామక ఉత్తర్వులు అక్కడే ఇచ్చేసేవారు. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. కౌన్సిలింగ్ పూర్తయినా చాలా మందికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి నియామక ఉత్తర్వులు నేటికీ అందలేదు. దీనితో కొందరు కేటాయించిన ప్రదేశాలు నచ్చక.. పాతప్రదేశాల్లోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకొని జిల్లాశాఖల కార్యాలయాలకు తిరుగుతున్నారు. అయితే వారికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొన్నిరోజులు వేచి ఉండాలనే సమాధానం మాత్రం చెబుతున్నారు. దీనితో తమ పరిస్థితి ఏమిటో తమకే అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు జరిగిన కౌన్సిలింగ్ కు సంబంధించి వచ్చిన ఉత్తర్వులు, తరువాత జరిగిన విధానం, ఆపై కేటాయించిన ప్రదేశాల్లోకి వెళ్లి జాయిన్ కావడానికి నియామక పత్రాలు ఇవ్వకపోవడాన్ని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా వింతగానే పరిగణిస్తున్నారు.

జిల్లాల పరిధిలో కౌన్సిలింగ్ లు పూర్తయినందున ఇక పరస్పర బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండకపోవచ్చునని, వారికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి వారి మాత్రుశాఖల అధికారులు ఆన్ లైన్ లో ఉత్తర్వులు పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ జరగని ఉద్యోగులకు తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆవేదన చెందుతున్నారు. వారి జిల్లాశాఖల కార్యాలయాలకు సమాచారం కోసం ప్రయత్నించినా..రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకుండా తాము మాత్రం ఏం చేయగమని ఆ చిరాకంతా ఉద్యోగులపై ప్రదర్శిస్తుండటం విశేషం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాశాఖల ఉద్యోగులు కౌన్సిలింగ్ పూర్తయిన అభ్యర్ధులకు వెంట వెంటనే నియామక పత్రాలను జారీచేసి ఉద్యోగులు ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. కొన్ని జిల్లాల్లో మాత్రం తీరా కౌన్సిలింగ్ అయ్యే సమయాన్ని 2రోజుల ముందు ప్రకటించి, ఉద్యోగులు వచ్చేసిన తరువాత వారికి మళ్లీ ఎప్పుడు కౌన్సిలింగ్ పెడతామో చెబుతామని ప్రకటించడంతో సదరు అంతర్ జిల్లాలకు దరఖాస్తు చేసుకున్నవారంతా ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. మరికొందరు ఇప్పటి వరకూ సెలవులపైనే దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లోనే ఉండిపోయారని సమాచారం అందుతుంది. ఈగందగోళ పరిస్థితిపై ప్రభుత్వం నిర్ధిష్ట ప్రకటన చేయకపోవడం వలన ఉద్యోగులు అయోమయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కౌన్సిలింగ్ పూర్తయిన వారికి నియామక పత్రాలు, ఇంకా కౌన్సిలింగ్ జరగని వారికి తేదీల ప్రకటన, లేదంటే ఆన్ లైన్ లోనే చేస్తామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు..!

Amaravati

2023-06-22 04:00:49

ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్నీ ఉచితమే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూన్ 23న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేవలం నాలుగు వారాల పాటు ఈ ఉచిత సేవలు కొనసాగుతాయి. దానికోసం సచివాలయశాఖలోని సాఫ్ట్ వేర్ ను, వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నారు. భారతదేశంలోనే ప్రపధమంగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సేవలు అందించడకోసం దీనిని ఏర్పాటు చేసినా..ఇక్కడ అందించే సేవలపై ఉద్యోగులే సరైన అవగాహన ప్రజలకు కల్పించేవారు కాదు. అటు రాష్ట్ర అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు పదే పదే ఆదేశించినా సిబ్బంది వాటిని పెడచెవిన పెట్టేవారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసే సౌలభ్యం కలిగింది. ఇక్కడి నుంచి జారీచేసే కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ఇలా అన్ని సేవలనూ ఉచితంగానే చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఏపని కావాలన్నా సచివాలయాలకే వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇటు జిల్లా అధికారులకు, అటు రాష్ట్ర అధికారుల ద్వారా సమన్వయంతో ప్రజల వద్దకే సచివాలయ సేవలను తీసుకెళ్లాలని భావించిన ప్రభుత్వానికి ఫలితాలు తక్కువగానే వచ్చాయి. అదే సమయంలో సచివాలయ సేవలపై అవగాహన కూడా రాలేదు. ఒక్కసారిగా సేవలన్నీ ఉచితం అనేసరికి ఇపుడు ఏపని కావాలన్నా అంతా సచివాలయాల వద్దకే పరుగులు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.

ఉద్యోగుల అవినీతికి చెక్ పెడుతూ పర్యవేక్షణ..
ఒకప్పుడు  కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ద్రువీకరణ పత్రాలు పొందాలంటే మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అంతేకాకుండా అక్కడ సిబ్బందికి, అధికారులకి మామూళ్లు ముట్టజెబితే వారికి తీరిక సమయాల్లో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత చాలా వరకూ అవినీతికి అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ చాలా మంది సచివాలయ, రెవిన్యూ ఇతర శాఖల ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. వీరందరినీ ఒకేసారి దారిలోకి తేవాలంటే సేవలన్నీ ఉచితం చేసి వాటిపై పర్యవేక్షణ చేపడితేనే దారిలోకి వస్తారని భావించిన ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ద్రవీకరణ పత్రాలు సచివాలయాల నుంచి ప్రజలకు చేరాలి. ఉచితంగా అందించే ఈ సేవలపై ఏ ఒక్క ఉద్యోగి అయినా లంచాలకు కక్కుర్తి పడితే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మండల అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ఈ శాఖకు అనుబంధంగా ఉన్న అధికారులంతా నిత్యం సచివాలయాలను సందర్శిస్తూ ఇక్కడ అందే సేవలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయాల సేవలు ఉచితంగా అందడంతోపాటు, నాలుగు వారాలు ఇక్కడి సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన వస్తుంది. అటు మీసేవ కార్యకలాపాలకు కూడా పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అక్కడ డబ్బులిచ్చి పనిచేయించుకోలేనివారంతా సచివాలయాల ద్వారా ఉచితంగానే సేవలు పొందడానికి వీలుపడుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం కొంతమేరే ఉండటం..ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు కొట్టి పడేస్తున్నాయి. ఇది కూడా 
జియో ఫ్రీ సిమ్ లానే ఉంటుందని అందరికీ అలవాటైన తరువాత మళ్లీ రేటు పెడతారనే ప్రచారమూ అపుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోవడం 
విశేషం. చూడాలి ఏం జరుగుతుందనేది.!

Amaravati

2023-06-21 03:19:42

సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలెప్పుడో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తొలుత జిల్లా పరిధిలో బదిలీలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అంతర్ జిల్లాల ఉద్యోగులకు, పరస్పర బదిలీలకు సంబంధించిన సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఇటీవలే ఉమ్మడి 13 జిల్లా్లో జరిగిన బదిలీల ఉద్యోగులకు కౌన్సిలింగ్ తరువాత ఆర్డర్లు ఇచ్చారు. వారంతా ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. వాస్తవానికి జిల్లాల ప్రక్రియ పూర్త యిం ది కనుక అంతర్ జిల్లాల బదిలీలు కూడా చేపడితే ఈ అభ్యర్ధన బదిలీల విషయం పూర్తయిపోతుంది. కానీ అలా చేయకుండా జిల్లా పరిధిలోన బదిలీలను మాత్రమే ప్రభు త్వం పూర్తిచేసింది. తొలుత జూన్ 19న అంతర్ జిల్లా బదిలీలు జరుగుతాయని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ అది జరగకపోవడంతో దరఖాస్తు చేసుకు న్నవా రంతా ప్రభుత్వం ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. మిలిన వారికి కూడా బదిలీల ప్రక్రియ చేపడితే మొత్తం బదిలీల ప్రక్రియ శేషం లేకుండా ఉంటుంది. 

Tadepalli

2023-06-19 03:53:31

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్య ఒక్కటైనా తీర్చారా..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక..ప్రజలకు తక్కువ సమయంలో అత్యధిక సేవల ద్వారా చేరువైన ఏకైక ప్రభుత్వశాఖ గ్రామ, వార్డు సచివాలయశాఖ. భారతదేశంలోనే ఏపీలో ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు ఎలాంటి సమస్యలూ ఉండవనుకున్నారు దీనిని ఏర్పాటుచేసినపుడు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా. అయితే వీరి సమస్యలు తప్పా..అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారుల సమస్యలు ఈ ప్రభుత్వంలో తీరుతున్నాయి తప్పితే ఈశాఖ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా తీరడం లేదు. కానీ ఈశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మీడియా ప్రచారాలతో మేమున్నాం మీకోసం, సమస్యలన్నీ తీర్చేస్తాం, 50 సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి పరిష్కరించామంటూ తెగ ఊదరగొడుతున్నారు. వాస్తవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఈ ఒక్కశాఖతో సుమారు 19 ప్రభుత్వశాఖలు ముడిపడి ఉండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య వారికే సరైన సమన్వయం లేక ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వశాఖల్లోని అతిపెద్ద రెండవ శాఖ ఉద్యోగులుగా ఉన్నవీరికి అసలు వీరి ఉద్యోగం ఏమిటి..? వీరికి ఏ సర్వీసు రూల్సు అమలు/వర్తింపజేచేస్తారు..? వీరి ఉద్యోగం నాల్గవ తరగతా..? ఐదవ తరగతా..? 6వ తరగతా..? అసలు వీరిది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమేనా..? అదే అయితే వీరికి ఎందుకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోయింది అనేది ఈశాఖ ఉద్యోగ సంఘాల నాయకులకే సరైన క్లారిటీ లేదనేది తేటతెల్లం అవుతుందంటున్నారు విశ్లేషకులు. వాటికి కారణాలను క్రమ సంఖ్యవారీగా ఒక్కసారి పరిశీలిస్తే..!

1)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ శాఖకు నేటివరకూ చట్టబద్దత తీసుకురాలేదు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసినా దానిని అసెంబ్లీలో ఆమోదింప చేయలేదు. 2)ఇదే శాఖలో ఉన్న కొన్నిశాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. 3)వీరికి ఏ కేటగిరీ ఉద్యోగాల క్రింద సర్వీసు రూల్సు వర్తింపచేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఏపీ సబార్డినేట్ సర్వీసురూల్స్ ని సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తామని ప్రకటించినా ఈ శాఖలోని ఉద్యోగులు గ్రేడ్-6, గ్రేడ్-5 కేటగిరీ ఉద్యోగాలున్నాయి..4)చట్టబద్దత లేని ప్రభుత్వశాఖ క్రిందిస్థాయి ఉద్యోగులకు ఏ విధంగా పిఆర్సీ అమలు చేస్తారో నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో పీఆర్సీ ఇచ్చినట్టు చెప్పిన ప్రభుత్వం వీరికి ఐఆర్ వర్తింపచేయలేదు. ఇపుడూ అదే పరిస్థి ఉంటుందా..అనేది అనుమానమే. 5) సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అదనంగా 9నెలలు తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేశారు. ఆ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వీరి పేస్కేలుకి కలపలేదు..అపుడే వీరు అదనపు కాలానికి పేస్కేలు కోల్పోయారు, అదే సమయంలో డిఏలను కూడా కోల్పోయారు. 6)ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి డిఏ వర్తిస్తుందా..లేదా అనేది ఇంకా డైలమాలోనే ఉన్నది. డిఏ వర్తిస్తే ఎప్పటి నుంచి లెక్కగట్టి ఇస్తారు..? ఇప్పటికే ఆలస్యంగా సర్వీసులు రెగ్యులర్ చేయడం వలన ఒకటిన్న డిఏ ఉద్యోగులు కోల్పోయారు. ఆ తరువాత నుంచి వీరి సర్వీసును ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా డిఏ వర్తిపంచేస్తారు..? లేదా అనేది అనుమానమే..7)మిగిలిన ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు వర్తిస్తాయి.. ఉద్యోగులు ఏఏ పరీక్షలు రాయాలనే దానిపైనా స్పష్టత లేదు. అలా లేకపోతే వీరికి పదోన్నతులు రావు..ఎన్నేళ్లైనా పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగా ఉద్యోగులందరూ ఇదే సచివాలయాలకు పరిమితం అయి ఉండిపోతారు. 8)ఉద్యోగుల డిఏలు, పీఆర్సీలు, పెరిగిన పేస్కేలు అమలు సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా..? ఇస్తే వీరికి డిఏలను కలపి రాయాలా..లేదంటే కలపకుండా రాయాలా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.. 9)ప్రభుత్వం ఈశాఖ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డిఏలు వర్తిస్తాయని ఇచ్చిన జీఓల్లో ఎక్కడా గ్రామ,వార్డు సచివాలయశాఖ నుపేర్కొనలేదు. వీరికి అసలు డిఏలు వస్తాయా..రావా..? 10) అన్ని ప్రభుత్వశాఖలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్టుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ యూనియన్ కు ప్రభుత్వ గుర్తింపు ఉందా..అలా ఉంటే జాల్లా యూనిట్ ఆఫీస్ బ్యారర్ లకు ఇతర ఉద్యోగ సంఘాల మాదిరిగా ప్రయోజనాలు సమకూరుతాయా లేదా అనేది కూడా తేలలేదు. ఇలాంటి సమస్యలు ఈశాఖ ఉద్యోగులకు చాలానే ఉన్నాయి. వాటిపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావన తేకుండా ప్రతీసారి ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్పితే వీరి సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడం లేదు. 

ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు తమ ఉద్యోగాలు అసలు రెగ్యులర్ ఉద్యోగాలేనా..? అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం వస్త ఈ ఉద్యోగాలన్నీ తీసేస్తారని..లేదంటే వేరే శాఖలు పంపేస్తారనే ప్రచారం కూడా రాష్ట్రంలో చాలా గట్టిగా జరుగుతుంది. కారణం వీరికి ప్రభుత్వ ఉద్యోగంలోని కేటగిరీలు తెలియకపోవడం, ఏ కేట గిరీకి ఏ సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్, ఇన్ సర్వీసు విధానాలు అమలు అవుతాయో తెలియకపోవడం, వాటి కోసం ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియకపోవడమే. ఈ విషయంలో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఉద్యోగులను చైతన్యం చేస్తూ వస్తున్నది. ఈ శాఖకు సంబంధించిన ఏ ప్రభత్వ ఉత్తర్వు సారాంశం అయినా క్షణాల్లో ఉద్యోగుల ముందుకి తీసుకు వస్తున్నది.  ఒక్కఈ ప్రభుత్వశాఖ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత వేగంగా ఉద్యోగులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధులు లాంటి వారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు రాకపోయినా, వాటిని ప్రభుత్వం అమలు చేయకపోయినా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తారు. అలాంటి ఉద్యమాలు జరగకుండా ఉండాలన్నా, ఉద్యోగుల సేవలు నిరంతరం 
ప్రజలకు చేరాలన్నా ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సిన, కల్పించాల్సిన ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించాలి. లేదంటే ఉద్యోగులంతా వన్ సైడ్ అయిపోతే ప్రభుత్వంలో భారీ మార్పులు రావడం కష్టం. ఆ విషయం గత ఎన్నికలో రుజువైందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చూడాలి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నాయకు ఎంతమేర పరిష్కరిస్తారనేది..!

Amaravati

2023-06-18 03:49:14

ఏపీప్రభుత్వం దెబ్బతో ట్రెండ్ మార్చిన ప్రైవేటు పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం విద్యతో ఏం చేయాలో తోచక కార్పోరేట్ పాఠశాలలు నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలూ పడుతున్నాయి. ప్రభు త్వపాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలల్లో 90శాతం ఇంగ్లీషు మీడియం విద్య పక్కాగా వస్తుందనే విషయాన్ని తల్లిదండ్రుల మనసు మార్చేందుకు ట్రెండ్ ను మారుస్తున్నాయి. ఇపుడు ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజి, యూకేజిలో చేర్పించే సమయంలోనే పిల్లలు ఏవిధంగా చదువులో రాణించగలుగుతున్నారు..వారికి ప్రత్యేకంగా పాఠశాలల్లోనే ట్యూషన్ పెట్టించి ప్రభుత్వపాఠశాలలు ప్రైవేటు విద్యను చేరుకోలేవనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంలో పై చేయి సాధిస్తున్నారు. ఒకప్పుడు సాధారణ డిగ్రీ చదివిన వారిని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించేవారు. కానీ ఇపుడు ఆయా సబ్జెక్టులను బోధించేందుకు, కనీసం డిఎడ్, బిఈడి, హిందీ పండిట్ ట్రైనింగ్ అయిన వారిని మాత్రమే నియమిస్తున్నారు. అదీ 25 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఏస్థాయిలో పిల్లలకు పాఠాలు ఇంగ్లీషులో చెప్పగలుగుతున్నారో చూసి మరీ వారికి ఉద్యోగాలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమ విద్యాబోధనను తమ ప్రైవేటు పాఠశాలల్లో మెప్పించాలంటే అక్కడ ఉండే ఉపాధ్యాయుల కంటే మెరుగైన మెరికాల్లాంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే యాజమాన్యాలు నియమిస్తున్నాయి.

ఒకప్పుడు సాధారణ ఇంగ్లీషు మాద్యమ విద్య మాత్రమే చెప్పే ఈ కార్పోరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిలో నిర్వహిస్తు్న్నట్టు ప్రత్యేక ఇంగ్లీషు క్లాసులు పెడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పాఠశాలలు, యూనివర్శిటీల విద్యార్ధులు, అధ్యాపకులు, ఇతరులతో ఆన్ లైన్ లో ఇంట్రాక్షన్ లు కూడా పెడుతున్నారు. వాటికి అయ్యే ఖర్చును కూడా స్పెషల్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ క్రింద అదనంగా ఫీజులు తీసుకొని భోధిస్తున్నారు. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చేలోపుగా పిల్లలకు సాధారణ ఇంగ్లీషు వచ్చేవిధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే ఇంగ్లీషు మాద్యమ విద్య అందుబాటులో ఉండేది. కానీ ఇపుడు ప్రైవేటు పాఠశాలల కంటే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన విద్య అందుబాటులోకి రావడం, సెంట్రల్ సిలబస్ ను కూడా చెప్పిస్తుండటంతో ప్రైవేటు కార్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలలు పెద్ద పోటీని ఇస్తున్నాయి. దానితో కొత్త కొత్త విధానాలను తెరపైకి తీసుకొచ్చి మాతో పోటీకి రాలేరు అన్నట్టుగా తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గట్టి ప్రచారాలను సైతం చేస్తున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి విద్యఅందుబాటులోకి రావడంతో ఇపుడు చాలా పాఠశాలల్లో అడ్మిషన్లకు ప్రైవేటు పాఠశాలలు మాదిరిగా ముందుగానే సీటు రిజర్వు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పాఠశాలల్లో నేటికీ తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉండటంతో వారు ఆంగ్లబోధన చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాధమిక స్థాయిలోనూ ఇంగ్లీషును అమలుచేస్తే ఇక ప్రైవేటు పాఠశాలలు మూత దిశగా పయనిస్తా యని విద్యార్ధుల తల్లిదండ్రులే ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఎక్కడ ఏం జరుగుతుందో విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా ఇట్టే తెలిసిపోతున్నది. వాటికి అనుగుణంగా ఏ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆంగ్లమాద్యమ విద్య అందుబాటులోకి వస్తుందో అక్కడికే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవనే బోర్డులు దర్శనమివ్వడం కార్పోరేట్ పాఠశాలలకు మింగుడు పడకుండా ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఆంగ్లమాద్యమ విద్య ప్రాధమిక స్థాయి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తే మరో ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలు మరో 50శాతం కనుమరుగు కావడం ఖాయం.

Amaravati

2023-06-17 04:42:09

గోవింధరాజస్వామి రథానికి ఏమీ కాలేదు.. టిటిడి

"తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఏమీకాకుండా నిక్షేపంగా ఉన్న రథం ఫోటోను కూడా శుక్రవారం మీడియాకి ఫ్యాక్ట్ చెక్ పేరుతో విడుదల చేశారు."తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని..ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు. కాగా సోషల్ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థల్లోనూ వస్తున్నట్టు ఏమీ జరగలేదన్నారు. రథానికి బధ్రత ఉందని తెలియజేసిన టిటిడి తప్పుడు వార్తలు ప్రచారం చేసి భక్తులను ఆందోళనకు గురిచేయొద్దని కోరింది.

Tirupati

2023-06-16 09:15:32

98డిఎస్సీ టీచర్లకి ఉద్యోగాలిచ్చారు..జీతాల మరిచారు..!

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులుకి ఉద్యోగాలిచ్చి పేరు తెచ్చుకుంటే.. పాఠశాల విద్యాశాఖ వారికి జీతాలు ఇవ్వకుండా పస్తులుంచి వచ్చిన పేరుకి గాలి తీసేస్తున్నది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం రాష్ట్రవ్యాప్తం సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకి నేటికీ జీతాలు చేతికి అందలేదు. దానికి సాంకేతిక కారణం కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగికైనా హెచ్ఆర్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసి ఆ వివరాలను ట్రజరీలకు పంపాల్సి వుంటుంది. అలా పంపిన తరువాత మాత్రమే ఉద్యోగులకు సమయానికి జీతాలు పడతాయి. ఆ అకౌంట్ లేకపోయినా, తయారు కాకపోయినా మేస్టార్లంతా చక్కగా జీతాలు రాక పస్తులుండాల్సిందే. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనే అదే జరుగుతోంది. నేటికీ ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు 98 డిఎస్సీ ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఎంఎస్ ఐడి లు రాలేదు. ఆ విషయాన్ని అన్ని మండలాల ఎంఈఓలు నానుస్తున్నారు. కొన్నిచోట్ల డబ్బులిస్తేగానీ ఈ అకౌంట్లు క్రియేట్ చేయడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగాలొచ్చినా..జీతాలు రాకపోవడంలో ఉద్యోగాల్లోకి చేరిన ఉపాధ్యాయులంతా అప్పులు చేసుకొని విధులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు గానీ ఎంఈఓలకు నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచేయకపోవడంతో ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్రక్రియ 
రాష్ట్రవ్యాప్తంగా సా...గుతోంది. దానితో ఉద్యోగాలొచ్చాయని ఆనందపడాలో..వచ్చిన తరువాత జీతాలు రాలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

మొదటి నెలలో పనిచేసిన 14 రోజులకి జీతాల బిల్లలు పెట్టాంటే కొత్తగా విధుల్లోకి చేరిన వారందరికీ సాలరీ అకౌంట్ల జాబితా ట్రజరీలకు సమర్పించాల్సి వుంటుంది. ఆ పైన సాలరీ బిల్లలు అప్లోడ్ చేస్తే అందరు ఉపాధ్యాయులతోపాటుగా వీరికి కూడా జీతాలొస్తాయి. లేదంటే ఎప్పటికీ జీతాలు వచ్చే పరిస్థితి ఉండదు. అలా చేయాలంటే ముందు హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు తయారు చేయాల్సి వుంటుంది.ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎంఈఓలను ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వేసవి సెలవులు అనంతరం విధులకు వెళ్లాలంటే ముందునెలలో చేసిన విధులకు కాస్తయినా జీతాలు పడితే జూన్ నెల కాస్త వెసులుబాటు కలుగుతుందని.. పోయిన నెలా అప్పులు చేసుకొని.. ఇప్పుడు కూడా అప్పులు చేసుకునే విధులకు వెళ్లాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, లాంటి జిల్లాల్లో ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ మారుమూల ఏజెన్సీలోని పాఠశాలల్లోనే నియమించారు. అక్కడ ఉపాధ్యాయులు నివాసం ఉండాలన్నా.. ఇళ్లకు అద్దెలు కట్టుకొని కుటుంబాలను పోషించుకోవాలన్నా కనీసం నెలకు 10 నుంచి 15వేల రూపాయల ఖర్చు..పాఠశాలలకు వెళ్లిరావడానికి నెలకు మరో రూ.5వేలు పెట్రోలుకి ఖర్చు వెరసి రూ.20 వేల వరకూ ఖర్చులు అవుతాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా ఎంఈఓలు ఈ ఉపాధ్యాయుల ఇబ్బందులపై కనికరించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విధుల్లోకి చేరిన ఉపాధ్యాయుల 
హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు సత్వరమే ఆన్ లైన్ లో నమోదు చేసి బకాయి జీతాలు ఇప్పించాలని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు..!

Tadepalli

2023-06-15 09:55:32

ఉసూరు మంటూ వెనుతిరిగిన సచివాలయ ఉద్యోగులు..!

గ్రామ, వార్డు సచివాలయశాఖ రాష్ట్ర అధికారుల ముందుచూపు లేమి..అప్పటికప్పుడే తీసుకున్న అత్యవసర నిర్ణయాలు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. అంతర్ జిల్లాల మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్ లు దరఖాస్తు చేసుకున్నవారిని 15 తేదినాటికి పాత ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లకు, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు రావాలంటూ జిల్లా కలెక్టర్ల నుంచి సర్క్యులర్ లు 13న జారీ అయ్యాయి. దీనితో 14వ తేదీ సాయంత్రానికే ఉద్యోగులు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టు కున్న జిల్లాలకు వెళ్లిపోయారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో 15వ తేదిన ఒక్క స్థానిక జిల్లాల ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేపట్టాలని.. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టేది త్వరలోనే తెలియజేస్తామరని చెప్పడంతో. జిల్లాలకు చేరుకున్నవారంతా చచ్చినట్టు ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. వాస్తవానికి నాలుగు కేటగిరీల్లో బదిలీలకు ఒకేరోజు చేస్తామని జిల్లా కలెక్టర్లు జారీచేసిన సర్క్యులర్ లలో పేర్కొనడం విశేషం.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి రాజమండ్రి, కాకినాడ నుంచి విజయనగరం, కడప నుంచి తిరుపతి, చిత్తూరు నుంచి గుంటూరు, విశాఖపట్నం నుంచి కాకినాడ తదితర జిల్లాలకు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టుకున్నవారంతా మళ్లీ వ్యవయప్రయాలకోర్చి వెనుతిరిగారు. మరికొంత మంది ఉద్యోగులు వెనక్కి వెళ్లలేక మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వచ్చిన జిల్లాల్లోనే ఉండిపోయారు. 15వ తేదిన కేటగిరీల వారీగా సమయం, ప్రదేశం ఇచ్చి సంబంధిత పత్రాలకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొని అప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయం మార్చేస్తే ఎలా అంటూ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయశాఖ విభాగానికి చెందిన డిఎల్ డిఓల ద్రుష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం చెప్పినట్టు తాము చేయాలి తప్పితే ఉద్యోగు పక్షాన తాము ఏమీ చేయలేమంటూ సెలవిచ్చారు.

Tadepalli

2023-06-15 06:03:34

డిఎస్సీ 98కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు రెవిన్యువల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించిన డిఎస్సీ 98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు మరో 11 నెలలు రెవిన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి ఒక నెల నో వర్క్..నోపే విధానం అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యువల్ చేసిన ఉత్తర్వులు జూన్1 నుంచి 2024 ఏప్రిల్ 30 అమలులో ఉంటాయి. కాగా ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో అయితే చేరారు తప్పితే వారికి జీతాలు ఇవ్వడానికి వీలుగా వారి ఐడెంటిటీ, మరియు సేలరీలు మంజూరు చేసేందుకు వారికి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ లు, ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపుకార్డులు తయారు చేయలేదు. వాటి బాధ్యత రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ఎంఈఓలకు ప్రభుత్వం అప్పగించినా నేటి వరకూ ఆపని పూర్తికాలేదు. దానితో విదుల్లోకి చేరిన ఉపాధ్యాయులందరికీ నేటికీ జీతాలు అందలేదు. రాష్ట్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయులకు మాత్రం ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడీలను పాఠశాల విద్యాశాఖ అధికారులు క్రియేట్ చేశారు.

Tadepalli

2023-06-14 09:33:15