1 ENS Live Breaking News

మా దుస్తితి ఎవరికి చెప్పుకోము.. మీకు తప్పా

గ్రామ స్థాయిలో మహిళలు, విద్యార్ధినిల సంరక్షనార్ధం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారంటే ఏమో అనుకున్నారు అంతా.. ఏదైనా సమస్య వస్తే ప్రజలంతా మహిళా పోలీసుల ద్వారా పోలీస్ స్టేషన్ కి చెప్పకుంటారు.. అదే గ్రామ సచివాలయ మహిళా పోలీసుకే సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి..ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి.. వీరిని పట్టించుకునే నాధుడేడి.. జీతం ఇచ్చేది సచివాలయం కనుక విధులన్నీ ఇక్కడే చేయాలంటారు పంచాయతీ కార్యదర్శి.. అదేంటి మీది హోం డిపార్ట్ మెంట్ కదా..మీరు స్టేషన్ ఎస్ఐ చెప్పే ఉద్యోగం చేయాలి కదా అంటారు స్టేషన్ ఎస్ఐ.. పోనీ స్టేషన్  విధులు వేసినపుడు ఎస్ఐని ఎంపీడీఓతో మాట్లాడమంటే నాకేం సంబంధం అదంతా మీరే చూసుకోండి అంటారు.. అలా కాదని గ్రామసచివాలయంలో విధులు ఉన్నప్పడు స్టేషన్ డ్యూటీలకు రావడం కుదరదని ఎస్ఐకి కార్యదర్శిగా ఒక్క మాట చెప్పమంటే ఇది మరీ బాగుంది, అయినా మీ కోసం మేమెందుకు మాట్లాడతామంటారు పంచాయతీ కార్యదర్శిలు.. మీరేం చేస్తారో మాకు అనవసరం మేం చెప్పింది చేయాల్సిందే అంటున్నారు. దీనితో ఈ ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర వేదింపులకు గురవుతున్నారు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు. ఇచ్చేది ప్రస్తుతం జీతం రూ.15 వేలే అయినా గ్రామసచివాలయం నుంచి ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ కి 30 సార్లు తిప్పుతిన్నారు స్టేషన్ ఎస్ఐలు.. గ్రామసచివాలయంలో పని చేయకపోయినా.. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ పనులపై వెళ్లినా.. అదేదో దేశ ద్రోహం చేసినట్టు సమావేశాల్లో నిలబట్టి మరీ తిడుతున్నారు పంచాయతీ కార్యదర్శిలు. వాస్తవానికి ఈ రెండు శాఖలకూ జిల్లాశాఖల అధికారులు దిశ నిర్ధేశం చేయాల్సి వుంది. అలా చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రంగా నలిగిపోతున్నారు. అలాగని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చినా వాటిని మండల స్థాయిలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శిలు పట్టించుకునే పరిస్థితిలేదు. అదేదో చిత్తుకాగితంలా పక్కన పెట్టేస్తున్నారు. అలాగని డిజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు జిల్లా పోలీసు అధికారులైనా ప్రాపర్ ఛానల్ లో మండల కార్యాలయాలకు పంపుతున్నారా అదీలేదు. దీనితో ఒకేసారి అటు పోలీస్ స్టేషన్, ఇటు గ్రామసచివాలయాల్లో విధులు ఉన్న సమయంలో అటు ఎస్ఐ నుంచి ఇటు పంచాయతీ కార్యదర్శి నుంచి నానా చీవాట్లు పడుతున్నారు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు. ఇలాంటి వేధింపులతో ఇప్పటికే జిల్లాలో కొంత మంది మహిళా పోలీసులు విధులకు రాజీనామాలు చేసినా, మరికొందరు చేయడానికి కూడా సిద్దపడుతున్నా.. మహిళా పోలీసుల దుస్థితి, ఇబ్బంది, వేధింపులు, చీత్కారాలు జిల్లా అధికారులకు వరకూ చేరడంలేదు.

 పంచాయతీ కార్యదర్శిలు, స్టేషన్ ఎస్ఐలు ఇచ్చిన టార్గెట్ లు పూర్తిచేయకపోయినా.. చెప్పిన సమయానికి రాకపోయినా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. మీ ఉద్యోగాలు ఎలా రెగ్యులర్ అవుతాయో చూస్తామంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. అసలు ఉద్యోగ నియామకాలు చేసే అధికారంగానీ, విధుల్లోని తొలగించే అధికారం గానీ, ఆఖరికి ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తరువాత  వారి సర్వీసులను రెగ్యులర్ చేసే అధికారం గానీ ఇటు స్టేషన్ పోలీసులకు గానీ, అటు గ్రామసచివాలయ కార్యదర్శిలకు గానీ లేదు. కానీ హద్దులు దాటి మరీ వీరంతా మహిళా పోలీసులకు  తెగ వార్నింగులు ఇచ్చేస్తున్నారు. వారిద్దరి మాటలు, ఇచ్చే వార్నింగ్ లు, చేసే ఓవరేక్షన్ విన్నా, చూసినా.. మహిళా పోలీసుల బాధలు తెలుసుకున్నా..నిజంగా అటు స్టేషన్ ఎస్ఐ, ఇటు పంచాయతీ కార్యదర్శిలే తమకి వచ్చే జీతాలు ఇచ్చేస్తున్నారేమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంటుంది బయటవారికి. ఒక్కోసారి జిల్లా అధికారులే తమతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారన్న నెపం కూడా వీరిద్దరూ ప్రదర్శించడం కూడా విస్మయానికి గురిచేస్తుంది. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసుల దుస్థితి నిజంగా చాలా దయనీయంగా వుంది. సచివాలయాల్లో కార్యదర్శిలు చేసే ఓవరేక్షన్ ఇటు జిల్లా పంచాయతీ అధికారులు, స్టేషన్ లలో ఎస్ఐ ఇచ్చే వార్నింగ్, తిట్ల పురాణం అటు జిల్లా ఎస్పీలకు చేరడం లేదు. నిజంగా పరిస్థితి ఆ ఇద్దరు జిల్లాశాఖల అధికారులకు చేరితే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు. ప్రజల సమస్యలను స్పందన రూపంలో సచివాలయాల్లో సమర్పిస్తే  గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించే పోలీసు విభాగానికి చెందిన మహిళాపోలీసులు.. వారి సమస్యలను జిల్లా పోలీస్ స్పందనలో ఫిర్యాదులు చేస్తే తప్పా పరిష్కారం అయ్యేటట్టు కనిపించడం లేదు. 

ఈ పరిస్థితి ఏ ఒక్క జిల్లాలోనో కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే గంజాయి వనంలో తులసి మొక్కలా కొన్నిచోట్ల స్టేషన్ ఎస్ఐలు మానవతా ద్రుక్పదంతో సమస్యలను పరిష్కరిస్తుంటే.. ప్రభుత్వ విధులపై అవగాహన ఉన్న పంచాయతీ కార్యదర్శిలు మహిళా పోలీసులు విధులకు ఆటకం కల్పించకుండా, వారిని వేధించకుండా వారు చేసే ఉద్యోగాలకు వన్నె తెస్తున్నారు. మరికొందరు వచ్చిందే సూపర్ డూపర్ చాన్సు అనుకొని మొత్తం అజమాయిషీ చలాయించే పనే పెట్టుకోవడంతో మహిళా పోలీసులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలు జీతం సచివాలయం నుంచి పోలీస్ స్టేషన్లకు తిరగడానికే సరిపోయినా.. వారి కుటుంబ పోషణకు అప్పులు చేసుకొని జీవనం సాగిస్తూనే విధులు నిర్వహిస్తున్నా...వీరి బాధలు, వేధనలు, వేధింపులు ఎవరికీ పట్టడం లేదు. మానవతా ద్రుక్పదంతో ఆలోచించే జిల్లా ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులూ మీరైనా స్పందిస్తారా..లేదంటే మీ కింది స్థాయి సిబ్బంది చేసే పనులకే వంత పాడతారా అనేది తేలాల్సి వుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను చెప్పుకోలేని మాటలతో వేధించే కొందరు పంచాయతీ కార్యదర్శి(బయటకు చెప్పుకోలేని మాటలు, చేష్టలతో వేధించే) లను, వారి ఆగడాలను మాత్రం ఆధారాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ద్రుష్టికి తీసుకెళతామని మాత్రం మహిళా పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలు ప్రచురించడమే కాకుండా, వారికి దన్నుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని కూడా తెలియజేస్తున్నాం. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలపై గళం విప్పే ఈఎన్ఎస్ ఇకపై కూడా ఉద్యోగుల సమస్యలను, ఇబ్బందులను కూడా బహ్య ప్రపంచానికి, అటు ముఖ్యమంత్రి కార్యాలయం ద్రుష్టికి కూడా ప్రత్యేక వార్తా కధనాల ద్వారా తీసుకెళతామని నిర్భయంగా ప్రకటిస్తున్నాం.

Amaravati

2022-04-07 12:44:19

ఏపీలో నూతన జిల్లాల విభజన గోరంత.. చేయాల్సిన పనులు కొండంత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఉగాదినాటికి మార్చి గోరంత పనిని చేసి..ఆపై కొండంత పనిని అధికారుల బుజాలపై వేసింది. ఉగాది తరువాత నుంచి పరిపాలన సాగుతుందని చెప్పిన ప్రభుత్వం కొత్త జిల్లాల్లో కలెక్టర్లలో పాలన మొదలు పెట్టింది. జిల్లాల విభజన అధికారికంగా జరిగినా..అక్కడ జరగాల్సిన పరిధిలు, అధికారులు, సిబ్బంది బదిలీలు పూర్తిస్థాయి జాబితా మాత్రం చాంతాడంతుంది. చాలా ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి ఉద్యోగులు లేరు. సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. కాకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న పాలసీని అనుసరించి ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా అయితే మార్చిచూపించింది. ఇప్పటి వరకూ పాత జిల్లాల పేర్లతోనే అందరికీ అలవాటైన పేర్లను ఇప్పటికిప్పుడు కొత్తపేర్లతో పిలవడం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ.. పిలవక తప్పని పరిస్థితి. ప్రజల పరిస్థితే ఇలా వుంటే మొన్నటి వరకూ ఒకే జిల్లాలో వున్న అధికారులు ఇపుడు వారంతా రెండు జిల్లాలకు, మూడు జిల్లాలకు కొత్త అధికారులుగా మారిపోవడంతో వారి జిల్లాల్లోకి వచ్చే నియోజకవర్గాలు, మండలాలు, ప్రాంతాలు, సరిహద్దులు లెక్కలు వేసేకునేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుంది అంటున్నారు అధికారులు. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగానూ, జెసీలుగా ఉన్నవారు ప్రధాన పరిలాన చేస్తున్నప్పటికీ, కింది స్థాయి అధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది విభజన తరువాత చేయాల్సిన పనులను ప్రభుత్వం ఇచ్చిన వివిధ ఫార్మాట్ల రూపంలో మళ్లీ ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లలో చాలా బిజీగా నిమగ్నమై వున్నారు. ఇప్పటికే 13 జిల్లాలుగా వున్నవన్నీ 26 జిల్లాలుగా మారడంతో ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా అధికారిక వెబ్ సైట్లు రెడీ అవుతున్నాయి. కొన్నింటికి ఇంకా అధికారుల జాబితాల, ప్రకభుత్వ శాఖల వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత సాధారణ పద్దతిలోనే అధికారులు, ఇతర కార్యాలయ సిబ్బంది ఉంటారని అనుకున్నారు ఉద్యోగులంతా. సిబ్బంది చాలాకపోతే కొత్తవారిని నియమిస్తారని అంతా ఊహించారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వ పరిపాలన మొత్తమే మర్చేసింది ప్రభుత్వం. ఇకపై గతంలోమాదిరిగా 75 ప్రభుత్వశాఖల కార్యాలయాల్లో ఉండేవిధంగా సిబ్బంది ఉండరు. వారందరినీ కుదించి పనుల భారం మొత్తం కుదించిన ఆ సిబ్బంది, అధికారులనే పైనే వేయనుంది. ఇప్పటికే 13 కొత్త జిల్లాలకు అధికారులు, సిబ్బంది తరలి వెళ్లిపోవడంతో ఇప్పటి వరకూ జిల్లా కేంద్రాల్లో పనిచేసిన అధికారులు సిబ్బంది చాలక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నూతన విధానాలకు అనుగుణంగా సమాచారం అడుగుతుండటంతో సిబ్బంది లేమితో కొట్టి మిట్టాడుతున్న జిల్లా అధికారులంతా సమాచారం ఇచ్చే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్న మయ్యారు. దీనితో విభజన పని గోరంత మాత్రమే అయినా..ఆ తరువాత మిగిలివున్న పని కొండంత వున్నదని..ఆ భారం మొత్తం తాము మోయాల్సి వస్తుందని అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు పెద్ద స్థాయిలో వారి వారి సామాజిక మాద్యమాలు, టెలీఫోన్లలో చర్చకు తెరలేపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాత జిల్లాలతోపాటు, కొత్త జిల్లాల్లోనూ ఇదే హాట్ టాపిక్..అయితే కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తరుణంలో ఎక్కడైనా ఇదే తరహా పనులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ సిబ్బంది కొరత వుండటంతో కొత్త ఫార్మాట్ ల పనిభారం జిల్లా అధికారులపై చాలా ఎక్కువగా పడుతుండటం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ పరిస్థితి సుమారు ఆరునెలల పాటు కొనసాగే అవకాశం వుంటుందని అటు ప్రభుత్వ వర్గాల్లోని ముఖ్యశాఖల అధికారులు సైతం చెప్పడం విశేషం..!

Amaravati

2022-04-07 08:00:10

ఏపీ కొత్త జిల్లాల్లోనూ సమాచారశాఖ కష్టాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో ప్రభుత్వ శాఖల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు.. పాపం కష్టాలన్నీ సమాచారశాఖకే వచ్చాయి. అసలే సిబ్బందిలేమితో సతమతం అవుతున్న సమాచారశాఖలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని కొత్త జిల్లాలకు ప్రభుత్వ శాఖల నుంచి జిల్లాస్థాయి అధికారులను కొత్త జిల్లాల్లో అధికారులను నియమిస్తే ఇక్కడ మాత్రం డివిజనల్ స్థాయి అధికారులను నియమించాల్సి వచ్చింది.. అదీ ఒక్కొక్కరినే. సమాచారశాఖలో గత మూడు ప్రభుత్వాల నుంచి కొత్త నియామకాలు చేపట్టడం లేదు. దానికి కారణం ఒక్కోప్రభుత్వంలో ఒక్కరోజకీయపార్టీకి ప్రధాన మీడియా సంస్థలు ఉండటంతో ప్రభుత్వాలకు కూడా పెద్దగా సమాచారశాఖలో పనిలేకుండా పోయినట్టు అయిపోయింది. ఒక్కో ప్రభుత్వం దైర్యం చేసి ఏపీఆర్వోలను నియమించినప్పటికీ వారంతా ఈ శాఖకు కొత్తవారు కావడంతో ఉన్నా లేనట్టుగానే వుంది. దీనితో సమాచారశాఖలోని అధికారులు, సిబ్బంది కష్టాలు అన్నీ ఇన్నీ కావు అన్నట్టుగా తయారైంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తొలుత సమాచారశాఖలో ఉద్యోగాలను భర్తీచేసిన తరువాతే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేస్తాయి ప్రభుత్వాలు. కానీ విచిత్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రభుత్వాలు మాత్రం అసలు సమాచారశాఖ అనే ఒక ప్రభుత్వ శాఖ ఉందనే విషయాన్నే మరిచిపోయిన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా..మంత్రులకు పీఆర్వోలను నియమించే ప్రభుత్వాలు..పూర్తిస్థాయిలో రెగ్యులర్ సిబ్బందిని మాత్రం ఈ శాఖలో నియమించడం లేదు. అలాగని కాంట్రాక్టు విధానంలో కూడా ఖాళీలను భర్తీ చేయడంలేదు. నాల్గవ తరగతి ఉద్యోగాలను మాత్రం కారుణ్యనియమాకాల కింద నియమిస్తున్నారు తప్పితే ప్రత్యేకంగా ఈ శాఖకంటూ ఉద్యోగులను ఏపీలో నియమించే పనిమాత్రం పెట్టుకోవడం లేదు. ఒక కరంగా ఇది కావాలని చేస్తున్నా.. దాని ప్రభావం పత్రికలు, మీడియాపై చాలా పడుతోంది. ప్రభుత్వ సమాచారం మొత్తం సమాచారశాఖలోని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి, సహాయ పౌరసంబంధాల శాఖ అధికారి ఇవ్వాల్సి వుంది. సిబ్బంది లేమితో ఉన్న ఒకటి అరా సిబ్బంది జిల్లా కలెక్టరేట్లతే పరిమితం అయిపోతున్నారు. ఈ క్రమంలో పత్రికలకు మీడియాకి సమాచారం అందడం లేదు. అదేమంటే ఉన్నంత వరకూ మాత్రమే పనిచేయగలనిమ, లేని సిబ్బందితో ఎక్కడ జిల్లా సమాచారం మొత్తం అందించగలమని అంటున్నారు సమాచారశాఖ అధికారులు. కనీసం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనైనా కొత్త జిల్లాలకు డిపీఆర్వోలను, డివిజన్ కేంద్రాల్లో డివిజనల్ పీఆర్వోలనైనా ప్రభుత్వం నియమిస్తుందా అదీలేకుండా పొయింది. మా శాఖ కోసం ప్రభుత్వాలు ఆలోచించాలని ఇందులోని అధికారులు నెత్తీనోరూ కొట్టుకున్న ఫలితం లేకుండాపోయింది. విచిత్రం ఏంటంటే ఈ శాఖకకు చెందిన మంత్రులే ఈ శాఖకోసం పట్టించుకోకుండా వ్యవహారం చేయడం విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం 13 జిల్లాలు26 జిల్లాలుగా మారానా... రేపో మాపో మరో జిల్లా పెరిగి 27 జిల్లాలు అయినా ఈశాఖలో మాత్రం జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో లేరు...రారు.. వచ్చే పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. అలాగని కాంట్రాక్టు పద్దతిలో అయినా సిబ్బందిని నియమించారా అదీలేదు. ఇన్ని ఇబ్బందులు మద్య ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు ఒక్కొక్కరినీ పంపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమాచారశాఖపై ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ పథకాలు, సమాచారం మీడియా, పత్రికలకు అందే అవకాశం కనిపిస్తుంది లేదంటే అవే కష్టాలు కొత్త జిల్లాల్లోనూ ఉత్పన్నం కావడం తధ్యంగానే కనిపిస్తోంది.

Tadepalli

2022-04-06 11:18:43

Tadepalli

2022-03-31 13:38:51

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ఈఎన్ఎస్ లైవ్ ప్రసారం..

ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీ బడ్జెట్ 2022-23 బడ్జెట్ ను ప్రవేశ పెడతుంది. మంత్రులు బడ్జెట్ ప్రసంగాలు చేస్తున్నారు. ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తున్నాం. మీరు ఎక్కడ వున్న ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ వుంటే ప్రత్యక్ష ప్రసారాలన్నీ మీ అరచేతిలోనే చూసేయొచ్చు.. ఇంకెందుకు ఆలస్యం తక్షణమే గుగూల్ ప్లే స్టోర్ నుంచి ens live యాప్ ని ఇనిస్టాల్ చేసుకోండి. ముఖ్య మైన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారంలో తిలకించండి..

తాడేపల్లి

2022-03-11 06:45:18

సీఎం వైఎస్.జగన్ కి అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు..

స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడంతో  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో సీఎం  వైయస్‌.జగన్‌ మోహనరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ విషయాన్ని కాకినాడలోని మీడియాకి తన చరవాణి ద్వారా ప్రకటన జారీ చేశారు. గురువారం సహచర మంత్రులతో కలిసి వెళ్లిన మంత్రి కురసాల స్కోచ్ అవార్డుల్లో వ్యవసాయ రంగానికి తొలి స్థానం రావడంపైనా హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముందుచూపుతోనే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతం చేసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే రైతుభరోసా కేంద్రాలు గ్రామసచివాలయాలకు అనుసంధానంగా ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తున్నారని మంత్రి తెలియజేశారు. సీఎంని కలిసిన వారిలో మంత్రికురసాలతోపాటు మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పి అనిల్‌ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Tadepalli

2022-03-10 15:24:09

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్‌ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణోత్సవంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్టు సమాచారం.  యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా యాదాద్రి గర్భాలయంలో బంగారు తాపడం పనులు, కలశస్థాపన తదితర అంశాలపై సమీక్షిస్తారని తెలుస్తోంది..

Yadadri temple

2022-03-10 11:01:43

మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రత్యక్ష ప్రసారం..

మహిళా దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తరలి వెళ్లారు. విజయవాడలో జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తోంది.

Tadepalli

2022-03-08 06:28:14

Tadepalli

2022-03-08 05:28:53

6న అనంతాళ్వారు 968వ అవతారోత్సవం

శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 968వ అవతారోత్సవాన్ని మార్చి 6వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉప‌న్య‌సించ‌నున్నారు.   సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

   పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.

         నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

Tirumala

2022-03-03 12:21:00

జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్.. జగనన్న తోడు కార్యక్రమం 2022 లో 5.10 లక్షల మందికి వారి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డి. ఎంతో మంది వీధి వ్యాపారులకు  జగనన్న తోడు ద్వారా లబ్ది పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యక్షంగా అందిస్తున్నాం..

Tadepalli

2022-02-28 07:27:54

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. కమిషనర్ కన్నబాబు

ఆంధ్రప్రదేవశ్ ప్రభుత్వం దేశీయ మత్స్యకారులు అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ కె.కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. జీఓనెంబరు 217పైనా ఆయన మత్స్యకారులకు పలు అంశాలను వివరిస్తున్నారు. ఆ ప్రత్యత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం  ప్రత్యేకంగా అందిస్తున్నాం..

Tadepalli

2022-02-22 10:54:25

సినిమా పరిశ్రమ సమస్యకు పరిష్కారం దక్కిందంటున్న తారలు.. ఈఎన్ఎస్ లైవ్ ప్రసారం..

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్రుషితో పరిష్కారం అయ్యేవిధంగా మార్గం సుగమం అయ్యిందని హీరో చిరంజీవి చెప్పారు. ఆయనతోపాటు, హీరో మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, పోసాని క్రిష్ణమురళి, సీనియర్ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తిలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సానుకూలంగా స్పందించారని నటులు చెబుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలు ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..


విజయనవాడ

2022-02-10 08:46:28

జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్..

అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న చేదోడు పతకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి.. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్  ద్వారా  అందిస్తున్నాం...సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సమ్మె, ఎల్లోమీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమ్మె చంద్రబాబు సీఎం కాకుండా ఉండిపోయారనే బాధపడుతున్నారంటూ మాట్లాడారు...ఆ ప్రత్యక్ష ప్రసారాలను మీ కోసం..

Tadepalli

2022-02-08 08:18:30

ఉద్యోగ సంఘాలతో చర్చలు సలఫలం.. అమరావతి నుంచి ఈఎన్ఎస్ లైవ్ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ తో ఉద్యోగ సంఘాలు చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల జేఏసి చర్చలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిరువురూ మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నారు. మంచి వాతవారణంలో చర్చలు ముగిసినట్టు వారు పేర్కొన్నారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి తలపెట్టి సమ్మెను విరమించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లకు కాస్త మార్పులతో మంత్రుల కమిటీ పచ్చజెండా ఊపింది. దానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా ఆమోద ముద్ర వేయడంతో రేపు జరగబోయే సమ్మకు తెరగినట్టు అయ్యింది..

Tadepalli

2022-02-05 16:57:45