1 ENS Live Breaking News

శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.  అనంత‌రం ఈవో, అదనపు ఈవోలు కలిసి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం, అగరబత్తులు, 2022 డైరీ క్యాలెండరు అందజేశారు.  శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా దంపతులు అఖిలాండం వద్ద  కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.  ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్  హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, జస్టిస్  నరేంద్ర కుమార్ వ్యాస్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-15 16:14:02

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్  ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,  దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి  శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ , పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం సిజెకి సీఎంతో పాటు మంత్రులు కూడా పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

Tadepalli

2021-10-13 16:18:50

ఏపీ సీఎం సంప్రదాయాలు పాటించే వ్యక్తి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చేవ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి చెప్పారు. టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవోధర్మారెడ్డి దంపతులు మంగళవారం తిరుమల లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. అనంతరం వీరు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామివారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి మాట్లాడుతూ, రాఘవేంద్రస్వామివారి కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. స్వామివారి ఆదేశంతో తిరుమల కు వచ్చి శ్రీ వేంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామివారి దయతోనే జరిగిందన్నారు. కార్యక్రమం చాలా బాగా, సంప్రదాయ బద్దంగా నిర్వహించారని టీటీడీని అభినందించారు.

Tirumala

2021-10-12 06:55:48

2022 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం వైఎస్.జగన్

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు ల‌క్ష‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

Tirumala

2021-10-11 17:21:33

2021-10-11 14:53:47

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

శ్రీవారి  బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు. ముందుగా  సీఎం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు  పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని  మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు,  డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి,  కన్నబాబు,  కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  మార్గాని భరత్,  రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  రోజా,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటే గౌడ,  ఆదిమూలం,  చింతల రామచంద్రారెడ్డి,  ఆరణి శ్రీనివాసులు,  మేడా మల్లికార్జున రెడ్డి,  తిప్పేస్వామి, ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జడ్ పి ఛైర్మన్  శ్రీనివాసులు, బోర్డు సభ్యులు  ప్రశాంతి రెడ్డి,  పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మధుసూదన్ యాదవ్,  కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి  వాణీ మోహన్, జిల్లా కలెక్టర్  హరినారాయణన్, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ  వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 14:52:47

సప్తగోప్రదక్షిణ మందిర ప్రారంభించిన సీఎం..

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమ‌వారం సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న  ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.  తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ భక్తులు ముందుగా సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది. తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించడం జరిగింది.

ప్రాముఖ్యతలు..
 ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం, గోదర్శనం, గోపూజ, ప్రత్యేకంగా గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేయడమైనది. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యములు గానీ, గ్రాసం గానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించడం జరిగింది. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచి వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు  గురుమూర్తి,  మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జె ఈ ఓ  సదా భార్గవి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి, దాత  శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 12:31:15

నడకదారి పైకప్పును ప్రారంభించిన సీఎం..

తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును సోమ‌వారం సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌ ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు. ఈ పైకప్పు అక్కడక్కడా పాడై పునరుద్ధరణ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో నడకమార్గంలో నూతనంగా పైకప్పు నిర్మించడానికి ముందుకొచ్చింది. అలిపిరి నుండి గాలిగోపురం వరకు 1100 మీటర్ల దూరం కొత్తగా గాల్‌వాల్యూమ్‌ రూఫింగ్‌ షెల్టర్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి తిరుమల జిఎన్‌సి వరకు 3,250 మీటర్ల దూరం కొత్తగా ఆర్‌సిసి రూఫ్‌ షెడ్లు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, ఉపసభాపతి  కోన రఘుపతి, మంత్రులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు గురుమూర్తి,  మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఎం.సచిన్,  ఏవీఎస్ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 12:26:41

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు..

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి  శేఖ‌ర్ బాబు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మన్  రవిచంద్రన్ ఆధ్వ‌ర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.  శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

Tirumala

2021-10-10 11:13:54

Tadepalli

2021-10-06 14:24:44

సచివాలయ ఉద్యోగులకు చేదుకబురు..?

గాంధీ జయంతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని భావించిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక చేదు కబురు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తూ.. చక్కర్లు కొడుతుంది.  ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ మరో ఏడాది ప్రభుత్వం పొడిగించనుందని, వారు బాధపడకుండా వారి జీతం రూ.15 నుంచి 20వేలు చేస్తుందనేది దీని సారాంశం. ఈ విషయాన్ని కొందరు డివిజన్ లెవల్ అధికారులు సైతం గ్రామ సచివాలయాలకు తనిఖీలకు వచ్చిన సందర్భంగా ఉద్యోగులతో కుశల ప్రశ్నలు వేస్తూ ఈ మాటను కూడా చెప్పి వెళ్లిపోతున్నారు. దానివెనుక ఒక సాంకేతిక కారణాన్ని కూడా అధికారులే చెబుతుండటం విశేషం. అదేంటంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే అందరూ డిపార్టమెంటల్ పరీక్షలు పాస్ కాలేదని.. ఈ కారణంగా రెండు మూడు దఫాలు మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి టెస్టులు పెట్టి వారంతా పాసైన తరువాత ఒకే సారి ఉద్యోగులందరికీ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది అన్నట్టుగా సచివాలయాల్లో ఉద్యోగులకు అధికారులు చెప్పి వెళ్లిపోతున్నారని తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులకు ఈ చేదు కబురు జీర్ణం కావడం లేదు. కరోనా రెండేళ్లసమయంలో తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలు అందించామని, అదే సమయంలో చాలా మంది కరోనా భారిన కూడా పడ్డామని, తీరా అక్టోబరు 2 తరువాత తీపి కబురు అందుతుందనుకుంటే ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2వ వనివారాలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజులనే  తేడా లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకే సేవలు అందించామని తీరా ఇపుడు ప్రభుత్వమే ఈ విధంగా ప్రొబేషన్ మరో ఏడాది పొడిగిస్తుందనే బాంబు పేల్చిందని వాపోతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పెట్టి వుంటే గాంధీ జయంతి నాటికి అందరు ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ కు సిద్దంగా ఉండేవారనే విషయాన్ని సదరు సచివాలయ ఉద్యోగులు అధికారుల వద్ద ప్రస్తావిస్తే.. తమకు అందిన సమాచారం మాత్రమే తాము చెబుతున్నామని, తమకి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదని మరోమాటగా కూడా చెబుతున్నారట. ప్రభుత్వ ఉద్యోగం, అందునా రెగ్యులర్ ఉద్యోగాలని చెప్పి.. చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సాప్ట్ వేర్ తో పలు ప్రైవేటు కంపెనీల్లో వేలాది రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని వచ్చామని.. తీరా చూస్తే ప్రభుత్వం తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజుకో ట్విస్టు ఇస్తుంటే.. పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా వుంటుందోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం కనీసం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బదిలీలు చేపట్టినా సొంత జిల్లాలు, తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతే కనీసం ఇచ్చే రూ.15వేలు జీతానికి ఇంటి అద్దెలు, ఖర్చులైనా తగ్గుయాని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే రూ.15 వేలు జీతం సరిపోవడం లేదని, చేస్తున్న ఉద్యోగాల్లో రోజుకో నిబంధన.. ఒక్కో అధికారి ఒక్కో ఆదేశం, ఒక్కో ఒక్కోవిధంగా చెబుతుంటే ఈ ఉద్యోగాలు చేయగలమా అనే వాదన కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి బలంగా వినిపిస్తుంది. అందులోనూ మండల స్థాయి అధికారులు సైతం గ్రామసచివాలయ ఉద్యోగులను చిన్పచూపు చూడటం, వర్క్ లోడు పెంచుతూ.. ప్రైవేటు కంపెనీల్లో మాదిరిగా వర్క్ టార్గెట్లు ఇవ్వడం కూడా సచివాలయ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

విశేషం ఏంటంటే ఇంతకాలం మండల అధికారులుగానీ, పంచాయతీ కార్యదర్శిలు గానీ పాలక వర్గాలు లేనపుడు, ఇంత మంది సిబ్బంది లేనపుడు వారిదే రాజ్యం అన్నట్టుగా విధులు నిర్వహించారు. తీరా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పడి ఒకేసారి గ్రామస్థాయిలోనే 14 మంది సిబ్బందిని చూసేసరికి మండల అధికారుల్లోనూ, పలు పంచాయతీల్లోని గ్రేడ్1 నుంచి గ్రేడ 4 కార్యదర్శిల వరకూ అంతా వీరిపై పెత్తనం చలాయిస్తున్నట్టుగా మారిపోయారనే వాదన ఉద్యోగులు నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖల విధినిర్వహణ కంటే పంచాయతీలోని పనులు తాము చెప్పినట్టు చేస్తేనే సకాలంలో జీతాలు అందుకుంటారనే బెదిరిపులు కూడా ఉద్యోగులకు అధికం అయ్యాయి. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు ఒక్కటై ఉద్యోగులను స్కూలు పిల్లలను చూసినట్టే చూస్తున్నారనే ప్రచారం కూడా అధికంగా జరుగుతుంది. అయితే ఈ విషయాలేమీ జిల్లా కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయ జెసీలు, జిల్లా పంచాయతీ అధికారుల ద్రుష్టి వరకూ వెళ్లడంలేదు. దీనితో పంచాయతీ స్థాయిలో గ్రేడ్-1 నుంచి గ్రేడ-4 కార్యదర్శిలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు ఏం చెప్పినా అది సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వస్తుంది. ఇక్క విచిత్రం ఏంటంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్లుగానీ, జీఓలు గానీ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామ సచివాలయాలకు చేరడం లేదు. కానీ ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత ఉద్యోగులంతా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల కంటే అత్యధిక విద్యావంతులు కావడంతో  ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓలు వచ్చినా, సర్క్యులర్లు వచ్చినా మండల అధికారుల కంటే ముందుగానే వాటిని సంపాదించ గలుగుతున్నారు.

వాటి ఆధారంగా గ్రామసచివాలయాల్లో సిబ్బంది పనులు చేసుకు పోతున్న సమయంలో కూడా వాటిని మండల అధికారులు, పంచాయతీల్లో పలువు కార్యదర్శిలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పకపోయినా ప్రభుత్వ ఆదేశాలు వీరికి తెలుస్తున్నాయని, కొంత మంది తాము పెట్టే సమావేశాల్లోనే తమనే తిరిగి ప్రశ్నిస్తున్నారనే కడుపు మంటను రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో అధికారులు ప్రదర్శిస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే  మండల అధికారులే సచివాలయ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేలా దగ్గరుండి సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇన్ని విధాలుగా అధికారుల నుంచి ఒత్తిడులు, చిరాకులు, చీత్కారాలు, కడుపుమంటలు ఎదుర్కొని రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తే.. తీరా అక్టోబరు రెండు తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకుంటే ఆ మాట మరోఏడాది పాటు వెనక్కి వెళ్లేలా ఉన్నట్టు డివిజనల్ స్థాయి అధికారులు చేస్తున్న ప్రచారాలను బట్టి తెలుస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగానే గాంధీ జయంతి నాటికి సచివాలయ ఉద్యోగుల రెగ్యులైజేషన్ విషయంలో ప్రభత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు కూడా జరుగుతున్న ప్రచారం నిజమేనని నమ్మే స్థితికి చేరుకున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు వస్తుంది..ఉన్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారా.. లేదంటే డిజివనల్ స్థాయి అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగా మరో ఏడాది ప్రొబేషన్ పెంచుతారా అనేవిషయంలో క్లారిటీ అయితే రావాల్సి వుంది..!

Tadepalli

2021-10-03 03:31:47

మహాత్మా మణ్ణించు.. అధికారాలు ఇవ్వనందుకు క్షమించు..

గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రుకోరిన సంఘమా ఇది.. స్వామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా అన్నాడో సినీ కవి..ఆయన మాటలు ఏమో గానీ.. భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని స్థాపించడకం కోసం, గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించడం కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తిచేకుంది. దీనికి అంతా గర్వపడాలి. అదే సమయంలో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ప్రకారం ఏ ఒక్క అధికారాలు ఇవ్వకుండా రెండేళ్లపాటు ఉత్తుత్తి ఉద్యోగులుగా, సాధారణ పనులే చేయిస్తున్నందుకు సిగ్గుపడాలి కూడా.  ప్రభుత్వమే ఇచ్చిన జీఓ, ఇదే ప్రభుత్వం అమలు చేయలేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదనే భావించాలి. ప్రభుత్వంలో జిఓ(గవర్నమెంట్ ఆర్ఢర్) అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. కానీ ఏపీ ప్రభుత్వంలో గ్రామసచివాలయాల్లో మాత్రం అది రెండేళ్లు పూర్తయినా అమలు కాలేదు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ కానీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది కానీ, కమిషనర్ గిరిజాశంకర్ లు గానీ ఈ జీఓని అమలు చేయలేకపోయారు. అంటే ఒకరకంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆశయాలకు ఈరెండు ప్రభుత్వశాఖలు సాధ్యమైనంతగా కష్టపడి గాలీ తీసేస్తున్నట్టే లెక్క. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏం చేసినా జీఓల ప్రకారంమే, జీఓలతోనే చేస్తుందని పదే పదే చెప్పే మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ జీవో నెంబరు 149 విషయంలో చేతులెత్తేశారంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వమే ఆలోచన చేసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల వరకూ అమలైన జీఓ ఒక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజలకు సేవచేసేందుకు గ్రామసచివాలయానికో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం వారికి అధికారాలు, విధులు, నిధులు, పరిధులు కేటాయించకపోతే వాళ్లు ఎలా పనిచేస్తారో ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదేశాఖ అధికారులు తెలియజేయాలి కూడా..అలా అన్నప్పుడు ఇలాంటి జీఓలన్నీ అమలు చేయాల్సిన బాధ్య పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్యకార్యదర్శిదే. ఆయనే దానిని పక్కనపెట్టేశారు. 

ఈవిషయం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిల ద్రుష్టికి  ఈఎన్ఎస్ నేషల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net గత రెండేళ్లుగా తీసుకెళుతూనే ఉంది. కానీ ఫలితం శూన్యం. రోజూ తిని భోజనమే ఒక రోజు మానేస్తే శరీరంలో ఏదో తెలియని లోపం, వెలితీ కనిపిస్తుంది. అలాంటిది ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించడానికి అధికారాలుఇవ్వకపోయినా అవే లోపాలు, సేవల్లో జాప్యాలు, ప్రజలకు ఆయా సచివాలయా పరిధిలో న్యాయం చేయలేకపోయిన అంశాలు కనిపించాయి. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని కీర్తిస్తూ.. అదే సమయంలో ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు చేయకుండా ఉండేందుకు ఇదే ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్ ఐఏఎస్ లు చేసిన లోపాలు గుర్తు చేస్తూ ఈ ప్రత్యేక కధనం ద్వారా గాంధీజయంతి రోజున మరోసారి గుర్తుచేస్తున్నాం. చాలా గ్రామపంచాయతీల్లో కార్యదర్శిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి 4 వరకూ కార్యదర్శిలు ఇన్చార్జి బాధ్యతలు టంచనుగా అప్పగించి.. పనిచేస్తున్న పంచాయతీల్లో పూర్తిస్థాయిలో పనులు చేయకుండా..అటు ఇన్చార్జి పంచాయతీల్లో పనులు, సేవలు అందించడానికి వీలు లేకుండా చేస్తున్న అధికారులు గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు, దస్త్రాలు నేటి వరకూ కేటాయించలేదు. అదేమంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలెక్టర్లు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లా దీనిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు స్పందించలేదు. అంతేకాదు ఈ విషయంలో ఈఎన్ఎస్ ప్రత్యేకంగా వారిని సంప్రదించాలని సుమారు 100పైగా ఫోన్ కాల్స్, 50కి పైగా మెసేజులు, మరో 80కి పైగా వాట్సప్ మెసేజులు, ఆపై జీఓనెంబరు 149 అమలుకాకపోవడం వలన ప్రజలకు సేవలు అందడం లేదని ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా ప్రచురిచించ కధనాలను షేర్ చేసినప్పటికీ ఒక్క సమాధానం కూడా రాలేదు. ఈ వార్త రాయడానికి గంట ముందు కూడా ఇద్దరు అధికారులను ఇదే విషయమై సంప్రదించినా ఫలితం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..ముఖ్యమంత్రి మంచివాడైతే రాష్ట్రం శుభిక్షంగా వుంటుంది.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పడం కోసం లక్షా 35ఉద్యోగాలు కొత్తగా స్రుష్టించి, కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త సచివాలయ భవనాలు నిర్మించి, 750పైకా సర్వీసులు సచివాలయాల్లోనే అందుబాటులోకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ సైతం కీర్తించారు.. అంతటి కీర్తికి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులు కనీసం అక్కడ విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా, అధికారాలు ఇవ్వకుండా ఈ రెండేళ్లు పనిచేయిందంటే ప్రభుత్వ ఆశయానికి అధికారులు ఏ స్థాయిలో గండి కొడుతున్నారో ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరోకటి ఉండదు. ప్రభుత్వం నియమించిన అధికారికి విధులు, నిధులు, అధికారాలు ఇవ్వకపోతే ప్రజలకు ఏవిధంగా సేవలు అందిస్తారనే కనీస సాంకేతక కారణం కూడా ఆలోచించకుండా ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ లు ఈ విషయంలోనే వ్యహరించారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు,  పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వారా ఈజీఓనెంబరు 149 ఇప్పటికైనా అమలు చేయకపోతే..గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి వచ్చే మద్దతు పూర్తిగా పోయే ప్రమాదాలున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతుంది. మేకుంటే శుభిక్షం..లేదంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా మొదలయ్యే ప్రమాదముంది. అదీ కేవలం పంచాయతీరాజ్ శాఖ అధికారులు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వని అధికారాలు, ప్రోత్సాహం వలనే..ఈ గాంధీ జయంతి రోజు తర్వాతనైనా ప్రభుత్వంలోని గ్రామ,వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లు మేల్కుంటారేమో చూడాలి..!

Tadepalli

2021-10-02 04:40:13

మహిళా పోలీసులకు యూనిఫాం అప్పుడే..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ కేటాయించిన కాఖీ డ్రెస్సుని ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయిన తరువాత ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సాధారణ పోలీసులు మాదిరిగా ఖాకీ డ్రెస్సు ఉన్నా..వారికి కేటాయించిన కేప్ మాత్రం లైట్ స్కైబ్లూ కలర్ ఉండటంతో అందరికీ వీరంతా సచివాలయ మహిళా పోలీసులనే గుర్తింపు వచ్చేలా డిజిపి గౌతం సవాంగ్ ఈ యూనిఫాం ను డిజైన్ చేయించారు. ఇటీవలే రాష్ట్రంలోని మహిళా పోలీసులందరికీ ప్రభుత్వం కొత్తగా మొబైల్ ఫోన్లను కేటాయించింది. వాటి ద్వారా ట్రాఫిక్ చాలన్లు కూడా వీరే గ్రామస్థాయిలో వేస్తారని సమాచారం అందుతుంది. గ్రామ రక్షణతోపాటు, గ్రామస్థాయిలో ఫిర్యాదులు కూడా ఇక్కడి నుంచే స్వీకరించడంతోపాటు, అత్యవసర సమయంలో బాదితులను పోలీస్ స్టేషన్ కి పంపించే బాధ్యతను కూడా గ్రామసచివాలయ మహిళా పోలీసులే చేపట్టనున్నారట. వాస్తవానికి జీఓనెంబరు 59 ప్రకారం సచివాలయ మహిళా పోలీసులను పోలీస్ శాఖ ఉద్యోగులకుగా మార్చినా వారికి కానిస్టేబుల్స్ కి ఇచ్చే పేస్కేలు వర్తింపచేయలేదు. అదేవిధంగా బ్లూకలర్ కేప్ ని కూడా ఇవ్వలేదు. అంటే ఉద్యోగులు పోలీసుశాఖకు చెందినప్పటికీ వీరిని ప్రత్యేకంగానే గుర్తించాలని ప్రభుత్వం భావించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ తరహా కార్యక్రమాలు జరిగితే దగ్గరల్లోని స్టేషన్ల నుంచి పోలీస్ కానిస్టేబుళ్లు బంధోబస్తు, ఇతర వ్యవహారాలు చూసే వారు. ఇకపై సచివాలయ మహిళా పోలీసులే అవన్నీ చూడనున్నారు. రానున్న రోజుల్లో మహిళా పోలీసుల పాత్ర రాష్ట్రవ్యాప్తంగా చాలా కీలకంగా మారనుందనడాని వీరికి కేటాయించిన ఖాకీ డ్రెస్సే సంకేతాలు ఇస్తుంది. అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే జిఓలు, సర్క్యులర్ లు కూడా మండల, సచివాలయ సిబ్బంది కూడా ఖచ్చితంగా అమలు చేసేలా వాటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సైతం పంపుతున్నారు. ఆ సర్క్యులర్లు, ఆదేశాలు ఇకపై ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచే మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామసచివాలయాలకు రానున్నాయి. వచ్చిన ఆదేశాలు ఆ క్షణం నుంచే అమలు చేయాల్సిన బాధ్యత కూడా వుంటుంది. మహిళా పోలీసు వ్యవస్థ ద్వారా గ్రామ రక్షణతోపాటు, దిశయాప్ వినియోగం, దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఒక్క ఖాకీ డ్రెస్సు చాలా కార్యకాలపాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

Tadepalli

2021-09-30 11:11:31

ఏపీ సచివాలయ మహిళాపోలీస్ కేప్ రంగుపై ఆఫ్రికన్ మహిళా పోలీసుల హర్షం..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన కాకీ యూని ఫారంతోపాటు లైట్ బ్లూకలర్ కేప్ ను కేటాయించడం పట్ల ఆఫ్రికాదేశ(ఐక్యరాజ్యసమితి) మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికన్ మహిళా పోలీసులకు ఇచ్చిన కేప్ కలర్ ను ఇపుడు ఏపీలోని సచివాలయ మహిళా పోలీసులకు ఇవ్వడం వలన మాకు అపారమైన గౌరవం దక్కిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని ఆఫ్రికన్ మహిళా పోలీసులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళా పోలీసులకు ఏపీ ప్రభుత్వంలోని హోంశాఖ కూడా అదే రంగు కేప్ ని మంజూరు చేయడమే దీనికి కారణం. వాస్తవానికి ఆఫ్రికాలోకూడా మహిళా పోలీసు విభాగం వుంది. అక్కడ దేశంలో వారితో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించడంతోపాటు ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆ క్రమంలో ఇపుడు రాష్ట్రంలో కూడా అంతకంటే అత్యధిక స్థాయిలో మహిళా పోలీసుల నియామకం చేపట్టడం, మహిళల కోసం దిశ యాప్ ని రూపొందించడం, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశను చట్టం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న క్రుషికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. దానికి కారణం రాష్ట్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోస్టులకు స్రుష్టించడమే వాదన కూడా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. మహిళా పోలీసులు విధుల్లోకి చేరి అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. దానికి గుర్తుగా ప్రభుత్వం కూడా వీరికి పోలీసు డ్రెస్సుని కేటాయించింది. అలా కేటాయించిన డ్రెస్సుకి లైట్ బ్లూకలర్ కేప్ ఇవ్వడం ఇపుడు దేశంలో ప్రాధాన్యత సంతరించుకోగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాల చూపు ఆంధ్రప్రదేశ్ వైపునకు మళ్లింది. దేశంలోనే చరిత్ర స్రుష్టించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇపుడు మహిళా పోలీసు విభాగం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్చించుకునే స్థాయికి ఎదగటం నిజంగా శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు. దిశ చట్టం, పోలీసు స్టేషన్లు మరింత సమర్ధవంతంగా పనిచేసి మహిళలకు నూటికి నూరుశాతం రక్షణ కల్పిస్తే.. ఇదే వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకంటే ముందు ప్రపంచదేశాల మహిళా పోలీసుల నుంచి గౌరవం పొందడం కూడా ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Tadepalli

2021-09-27 05:40:27

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సహకారం మరువలేనిది..

ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్దల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్‌ లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కాలిసి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మీట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు,సిబ్బంది కూడా బాగా కష్టపడి పరిచేశారని సీఎం కూడా కొనియాడారు.  మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఎన్నికల్లో మరోసారి రుజువైందన్నారు.  

Tadepalli

2021-09-22 15:42:04