1 ENS Live Breaking News

భక్తుల‌కు మరింత రుచిగా అన్న‌ప్ర‌సాదాలు..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత రుచిగా, శుచిగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుపై అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ‌ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల్లో కూర‌గాయ‌ల సంఖ్య పెంచాల‌న్నారు. మ‌ధ్యాహ్నం ఒక ర‌క‌మైన మెనూ, రాత్రి ఒక ర‌క‌మైన మెనూ అందించేందుకు ర‌క‌ర‌కాలైన కూర‌గాయ‌ల‌ను వాడాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కింద‌ ప‌నిచేసే సిబ్బందికి డ్ర‌స్‌కోడ్‌, క్యాప్స్‌, గ్లౌజ్ అందివ్వాల‌న్నారు. ముఖ్యంగా వంట మాస్టార్ల‌కు, స‌ర్వింగ్ చేసే సిబ్బందికి అవ‌స‌ర‌మైన మెల‌కువ‌లు నేర్చుకోవ‌డానికి ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో శిక్ష‌ణ అందివ్వాల‌ని సూచించారు. స‌ర్వింగ్ సిబ్బంది వ‌డ్డించేట‌ప్పుడు భ‌క్తుల‌ను ఎలా సంభోదించాలి, స‌ర్వింగ్ ఎలా చేయ్యాలి, ఏవిధంగా మెలగాలి అనేది ఈ శిక్ష‌ణలో భాగంగా ఉండాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేసే కిచ‌న్‌, డైనింగ్ హాల్‌లో అవ‌స‌ర‌మైన ఆధునిక యంత్రాలు, ప‌రిక‌రాలను అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు ద్వారా కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అన్న‌ప్ర‌సాదాల త‌యారీలో వినియోగించే బియ్యం, ప‌ప్పు ధాన్యాలు, నూనె, నెయ్యి త‌దిత‌ర ముడిస‌రుకుల నాణ్య‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాల‌న్నారు. త‌ద్వార భ‌క్తుల‌కు అందించే భోజ‌నంలో నాణ్య‌త మెరుగ్గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మ‌న రాష్ట్రంలోనే గాక‌ ద‌క్షిణాది రాష్ట్రాల్లో జరిగే పుష్క‌రాలు, ప్రత్యేక ఉత్సావాలు వంటి పెద్ద జ‌న స‌మూహం ఉండే వేడుకలలో కూడా, భ‌క్తులకు టిటిడి అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి,  జెఈవో స‌దా భార్గ‌వి, ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, అద‌న‌పు ఎఫ్ఎ అండ్ సిఎవో  ర‌విప్ర‌సాదు, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్, క్యాట‌రింగ్ అధికారి శాస్త్రీ ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

తిరుమల

2021-09-03 12:54:48

భూమి సేకరణకు 3నెలలు గడువు..సిఎస్

రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు,నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు గాను మరో మూడు మాసాలు అనగా డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా,ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ నుండి ప్రగతి ప్రాజెక్టుల మానిటరింగ్ గ్రూపు కో-చైర్మన్ అయిన కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, రసాయన,ఎరువులు శాఖామాత్యులు మనీష్ మాండవీయ,మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెన్స్ చార్జీ ఫర్  సైన్స్ అండ్ టెక్నాలజీ,ఎర్త్ సైన్సెస్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పియంఓ ఫెర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ డా.జితేంద్ర సింగ్ లు వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్,నడికుడి-శ్రీకాళహస్తి,కడప-బెంగుళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మిగతా భూమి సేకరించి అప్పగించేందుకు మరో మూడు మాసాలు సమయం కావాలని విజ్ఞప్తి చేయుగా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించిందించి ఆగడువులోగా భూమి అప్పగించాలని చెప్పారు.ప్రగతి ప్రాజెక్టులను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిషయంలో అత్యంత శ్రద్ధ కనపర్చి ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పడాలని కేంద్ర మంత్రులు సూచించారు.వివిధ రాష్ట్రాల వారీ ప్రగతి ప్రాజెక్టులు పెండింగ్ అంశాలను వారు సిఎస్ లతో సమీక్షించారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు భూమి సమీకరణకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని అప్పటికి మిగతా భూమి అప్పగింత ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన భూమిలో కొంతమేర రైల్వే శాఖకు అప్పగించగా మిగతా భూమిపై వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.దీనిలో భాగంగా ప్రభుత్వ భూమిని గుర్తించడం తోపాటు ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర మంత్రులకు వివరించారు.

ఇప్పటి వరకూ ఆయా ప్రాజెక్టులకు భూమి సమీకరించి అందించిన వివరాలను సిఎస్ కేంద్ర మంత్రులకు వివరించారు. అదేవిధంగా కొవ్వూరు- భద్రాచలం నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్  పేర్కొన్నారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర టిఆర్అండ్బి,రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,వి.ఉషారాణి తోపాటు అర్జా శ్రీకాంత్, డా.చలపతి రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-03 11:04:57

మా కుటుంబాలేం పాపం చేశాయ్ సారూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంచేసినా దానికో లెక్కుంటుంది.. అదేంటో కాస్తతిక్క కూడా ఉన్నట్టే కనిపిస్తుందని గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 24వేల మంది ఉద్యోగులు. ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువ జీతానికి రూ.15వేలు(బిపీఎల్ కుటుంబాల సంపాదన కంటే తక్కువ) సంపాదిస్తే.. కేవలం మేము రేషన్ కార్డులో ఉన్నామనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా కార్డు మొత్తం రద్దు చేసేస్తే మాకుటుంబాలు ఏం తిని బతకాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులంతా. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు సంపాదించిన వారంతా నిరుపేదలేనని, కేవలం తాము ఆ కార్డులో ఉన్నందుకు కార్డు రద్దు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో అధికంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు బిపీఎల్ కుటుంబాలకిచ్చే రేషన్ కార్డులు వినియగించకూడదనే ఉత్తర్వుతో ఉద్యోగస్తులు స్వచ్చందంగా రేషన్ కార్డులు సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ఉద్యోగం వచ్చిన వెంటనే పేస్కేలు ఇస్తారని అదేంటో తాము సాధించిన ఉద్యోగాలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతాలు ఇస్తూ, ఇంకా సర్వీసులు రెగ్యులర్ చేయకుండానే రేషన్ కార్డులు తొలగించడం సరికాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కావాలంటే కార్డుల్లో ఉద్యోగాలు పొందిన తమను తొలగించి తమ కుటుంబాల కార్డులు అలాగే ఉంచాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నా అవి కనీసం ప్రభుత్వం ద్రుష్టికి చేరడం లేదు. ఏ ప్రభుత్వ శాఖలో అయితే ఏ శాఖ ఉద్యోగం వస్తే అదేశాఖకు సంబంధించిన విధులు నిర్వహిస్తారని, కానీ సచివాలయాల్లో ఉద్యోగులతో ప్రభుత్వం అన్నిశాఖలకు సంబంధించిన విధులను చేయిస్తుందని, అక్కడ కనిపించని నిబంధనలు తక్కువ జీతంలో ఉద్యోగాలు పొందిన తమ కుటుంబాల రేషన్ కార్డులను తొలగించడానికి మాత్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లోకి వస్తే.. రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో తమకిచ్చే పేస్కేలు పరంగా చూసుకున్నా ఒక్కో ఉద్యోగి సుమారు రెండున్నర లక్షలకు పైనే జీతం కోల్పోయామని, దాని గురించి ఆలోచించని ప్రభుత్వం తమ రేషన్ కార్డుల విషయంలో ఉత్తర్వులు, ఉద్యోగాలకు ముడిపెట్టడం ఇదేం పద్దతంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు అధికారాలు విధులు కట్టబెట్టని ప్రభుత్వం తమకు అనుకూలంగా మాత్రం అన్ని నిర్ణయాలను ఆగమేఘాలపై అమలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండకూడదు వాటిని తొలగించిన ప్రభుత్వం అదే నిబంధనలు అమలు చేస్తూ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ప్రకారం అధికారాల బదలాయింపులు చేపడితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల సహేతుకంగా ఉన్నాయని అంతా భావించేవారమని, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టాలంటే ఒక విధానం, ప్రభుత్వం లాభపడాలంటే మరో విధానం అమలు చేయడం పద్దతి కాదని వాపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న తమను కార్డుల్లో నుంచి తప్పించి తమ కుటుంబ సభ్యులను అలాగే ఉంచి కార్డులు రద్దు చేయకుండా ఉంచాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి తప్పితే అభ్యర్ధనలు పట్టించుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర నుంచి రేషన్ కార్డులు తప్పించి, కనీసం అతితక్కువ జీతాలు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది్ వేచిచూడాలి..!

Tadepalle

2021-09-01 02:55:14

సచివాలయ ఉద్యోగుల బదిలీలు అప్పుడేనా..?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయా.. జరుగుతాయా.. ఉంటే ఎపుడు ఉంటాయి.. అసలు ఐదేళ్ల వరకూ ఉండవా.. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత  ఏడాది చేసేస్తారా.. ఏది నిజం.. ప్రస్తుతం ఉద్యోగుల్లో ఇదే విషయమై తీవ్రమైన చర్చజరుగుతోంది. ఎవరో ఒకరు వేసిన ప్రశ్న మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాల్లో పనిచేస్తున్న లక్షా 35 వేలయ మంది ఉద్యోగుల మనసులను తీవ్రంగా తొలిచేస్తుంది. ఈ విషయంలో క్లారిటీ తెచ్చేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net తన నెట్వర్క్ తో రంగంలోకి దిగింది. వాస్తవాలు తెలుసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈఎన్ఎస్ నెట్వర్క్ దగ్గరకి వచ్చిన వివరాలు, కొందరు రాష్ట్ర అధికారులతో మాట్లాడిన తరువాత వచ్చిన క్లారిటీ ప్రకారం.. సచివాలయ ఉద్యోగులో ఇప్పట్లో బదిలీలు జరగవనేది సూచన ప్రాయంగా అధికారులు చెబుతున్నారు. దానికి కారణాలను కూడా వారు 5 అంశాలను ఈఎన్ఎస్ వద్ద ప్రస్తావించారు. 1)సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కాలేదు.. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.. 2)ఉద్యోగులకు బదిలీలు జరగాలంటే ట్రాన్స్ ఫర్ పాలసీని ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ప్రకటించాలి.. 3)నేటికీ గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు సరైన జాబ్ చార్ట్ రాలేదు, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ కాలేదు..గెజిట్ లు పబ్లికేషన్ కాలేదు.. 4) ఏ ప్రభుత్వ శాఖలోనైనా బదిలీలు జరగాలంటే కనీసం మూడున్నరేళ్లు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది.. 5) ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్నవారి ఉద్యోగాల్లో ఎంత మంది సర్వీసులు రెగ్యులర్ అవుతాయో ఎంతమందికి సమయం పడుతుందో..(వారికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఆధారంగా) అని మొదలు పెట్టారు. ఇదీ వాస్తవమే.. అసలు ఉద్యోగాలే రెగ్యులర్ కాకుండా బదిలీలు ఎలా చేస్తారో ఉద్యోగులకే తెలియాల్సి వుంది. ఒకవేళ సర్వీసులు రెగ్యులర్ అయినా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునేదాకా ఆ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే మహిళా పోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసి జీఓనెంబరు 59 విడుదల చేయడం దానిపై కొంత మంది వ్యతిరేకించడం, వారి పదోన్నతుల్లో డిగ్రీ అర్హత ఉన్నా.. ఎస్ఐగా కాకుండా హెడ్ కానిస్టేబుల్ గా ప్రకటించడం, వారికి ఖాకీ డ్రెస్సు ఇస్తామంట కొందరు వద్దని చెప్పడం, ఇక మిగిలిన శాఖల ఉద్యోగులను తీసుకుంటే ప్రభుత్వం కేటాయించి ఏక రూప దుస్తుల విధానాన్ని వ్యతిరేకించడం. ఇవన్నీ పక్కనపెడితే అసలు నూతనంగా విధుల్లోకి చేరిన ఉద్యోగులను ఎలా బదిలీలు చేయాలనే అంశం. ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికే వందసార్లు వెయ్యికోణాల్లో ఆలోచిస్తూ.. వారి సర్వీసులకు చాలా నిబందనలు పెట్టి వాటిని అమలు చేయడానికి రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో కొత్త కొత్త విధానాలను రూపొందిస్తోంది.

 ఈ తరుణంలో ఉద్యోగుల్లో ఉన్న బదిలీల ఆశలపై సదరు ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు సరకదా..వారి సర్వీసులకు సంబంధించిన అన్నీ అంశాలూ పూర్తైన వరకూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే ఉద్యోగులు మాత్రం వారి వారి సామాజిక మాద్యమాల్లో మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, జిల్లాల పరిధిలోనే జరిగే బదిలీల కోసం పెద్ద పెద్ద చర్చలకు తెరతీస్తున్నారు. ఒక ప్రక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు సంబంధించి జీఓనెంబరు 149 పెండింగ్ లో ఉండిపోవడంతోపాటు 8శాఖల సిబ్బందికి డిపార్టమెంటల్ టెస్టుల విషయంలోనూ ఒక్కోశాఖకు సంబంధించి ఒక్కో గెజిట్ పబ్లికేషన్ ను ప్రభుత్వం ఆలస్యంగా విడుదల చేసుకుంటూ వస్తుంది. వాస్తవానికి ఉద్యోగులకు సర్వీసు రూల్స్ దగ్గర నుంచి ప్రొబేషన్ డిక్లరేషన్ తోపాటు, ట్రాన్స్ ఫర్స్ ఎలిజిబిలిటీ వచ్చినా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొచి బదిలీలకు జీఓ ఇస్తే తప్పా ఆ పని జరగదు. ‘ఆలు లేదు సూలు లేదు కొడుడుపేరు సోమలింగం’ అన్నట్టుగా సచివాలయ ఉద్యోగులు అపుడే బదిలీల కోసం ఆలోచిస్తుండం విచిత్రంగా ఉందంటూ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు జస్ట్ కామెడీగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లడం, ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాలు, పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, గ్రేడ్-1,4 కార్యదర్శిల నుంచి ప్రోత్సాహం లేకపోవడం, వేరే వేరే జిల్లాల్లో ఉద్యోగాలు లభించడం, ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు జీతం ఎటూ చాలకపోవడం తదితర ఎన్నో కారణాలను సచివాలయ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఏది ఎలా వున్నా, ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు డిక్లరేషన్ ప్రకటించి వారందరికీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత మాత్రమే పదోన్నతలకు సంబందించి ఏ పనైనా ముందుకి కదులుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 

కాగా  రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లకు మాత్రం లైన్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వంలోని ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ పదోన్నతలు(సర్వీస్ రెగ్యులైజేషన్) రాగానే ఒక్కసారే జంప్ అయిపోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు రెగ్యులర్ అయిపోతే ఒక పనైపోతుందని, కావాలంటే ఆ తరువాత బదిలీలు, పదోన్నతులు, ఇతరత్రా అంశాలు చూసుకుందామన్నట్టుగా కామ్ గా ఉండి పోతున్నారు. మరికొంత మంది తమకు రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, పరిధిల కావాలని పట్టుబడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గ్రామసచివాలయాల్లో డిడిఓగా ఉండే కార్యదర్శిలను కాదని పంచాయతీరాజ్ శాఖ ఆ అధికారాలను విద్యార్హత తక్కువగా వున్న వీఆర్వోలకు కట్టబెట్టింది ఆ అంశం కాస్త కోర్టులో ఉంది. గ్రేడ్-5 కార్యదర్శిల అధికారాలు సైతం ఇంకా గాల్లోనే ఉన్నాయి.. ఇంకా భర్తీకానీ చాలా పోస్టులను ప్రభుత్వం ఇంకా భర్తీచేయలేదు. ఇలా ఎటు చూసినా బదిలీలకు సంబధించి ఏ కోణంలోనూ లైన్ క్లియర్ గా ఉన్నట్టు మాత్రం కనిపించం లేదు. అయితే ఇన్ని కారణాలు చెప్పిన అధికారులు ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని దగ్గర చేసి బదిలీలు చేయించినా చేస్తారంటూ అధికారులు ముగించడాన్ని బట్టి బదిలీలకు అశకాశం 50-50 చాన్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో అక్టోబరు 2 తరువాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయంపై అందరికీ ఉత్కంఠ నెలకొంది..!

Tadepalle

2021-08-31 02:12:40

శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం..

శ్రీ‌కృష్ణాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకుని అర్చ‌కుల‌కు అంద‌జేశారు.అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప‌విత్ర‌మైన కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దినం రోజున న‌వ‌నీత సేవ‌ను ప్రారంభించుకోవ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌న్నారు. క‌లియుగం ఉన్నంత‌కాలం ఈ సేవ కొన‌సాగుతుంద‌న్నారు. ఇందుకోసం గోశాల‌లో దేశవాళీ గోవుల పాల‌తో పెరుగు త‌యారుచేసి, దాన్ని సంప్ర‌దాయబద్ధంగా క‌వ్వాల‌తో చిలికి వెన్న తీస్తార‌ని చెప్పారు. ఈ  వెన్న‌ను ప్ర‌తిరోజూ గోశాల నుండి ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకొచ్చి అర్చ‌కుల‌కు అంద‌జేస్తార‌ని వివ‌రించారు. అర్చ‌కులు వెన్న‌ను స్వీక‌రించి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు వినియోగిస్తార‌ని తెలిపారు. వెన్న త‌యారీ, వెన్న ఊరేగింపులో శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొంటార‌ని వివ‌రించారు. ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఛైర్మ‌న్‌, ఈవో వెన్న త‌యారీని ప‌రిశీలించారు. క‌వ్వంతో కుండ‌లోని పెరుగును చిలికారు. ఈ సంద‌ర్భంగా గోశాల ప్రాంగ‌ణాన్ని రంగ‌వ‌ళ్లులు, పుష్పాల‌తో అలంక‌రించారు.న‌వ‌నీత సేవ‌లో వెన్న తీసుకెళ్లి స్వామివారికి స‌మ‌ర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల బ‌రువు గ‌ల వెండి గిన్నెను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి విరాళంగా అంద‌జేశారు.  న‌వ‌నీత సేవ ఊరేగింపులో చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లో చిన్నారులు ఆక‌ట్టుకున్నారు. కోలాటం క‌ళాకారులు కృష్ణుని భ‌జ‌న పాట‌లు ఆల‌పిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్‌బాబు,  హ‌రీంద్ర‌నాథ్‌,  విజ‌య‌సార‌థి,  లోక‌నాథం,  భాస్క‌ర్, విజిఓ బాలిరెడ్డి, టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, ఎవిఎస్వోలు  ప‌వ‌న్‌,  గంగ‌రాజు,  సురేంద్ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-30 13:28:52

ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ దళం..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఒక దళం ప్రజలకు దర్శనం ఇవ్వబోతుంది..13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ప్రత్యక ఏకరూప దుస్తులు(యూనిఫారం)తో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ పనిచేసే మహిళాపోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసిన ప్రభుత్వం మిగిలిన 16 శాఖల(ఆల్రెడీ వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు గ్రీన్ యాప్రాన్ఇచ్చేశారు) ఉద్యోగులకు దుస్తులను ఇవ్వనుంది. వీరంతా అక్టోబరు రెండు తరువాత అన్ని సచివాలయాల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంతోనే దర్శనమిస్తారు. వీరిని చూసిన వారందరికీ ఒక ప్రత్యేక దళంగా కనిపిస్తారు. అందుకే వీరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దళంగా విశ్లేషకులు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిై సిబ్బంది సేవలు కూడా అందిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ఉద్యోగులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ పనుల, సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చేవారందరికీ వీరు ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే యూనిఫారం ఇస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి చెప్పారు. వీరికి మెడలో వేసుకోవడానికి కూడా గ్రామ, వార్డు సచివాలయం పేరుతోనే ఐడీకార్డు బ్యాడ్జీలు కూడా ఇవ్వనున్నారు. అందరూ ఒకేలా దుస్తులు వేసుకోవడంతోపాటు, ఎవరికీ కేటాయించి ప్రభుత్వశాఖల సీట్లో వారు కూర్చొని వచ్చిన వారందరి సేవలు చేస్తారు. ఇప్పటికే 775 సేవలను సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన్న ప్రభుత్వం అన్నింటికోసం కామన్ సర్వీస్ సెంటర్ ను అనుసంధానం చేసే పనిలో ఉంది. 

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు క్రింద కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులోకి తెచ్చిన ఈవిధానం కూడా అక్టోబరు 2 తరువాత రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తుందని కూడా ఆ అధికారి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల సేవలు ఒక్క గ్రామస్థాయిలోనే ప్రజలు పొందేలా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పారు. త్వరలోనే వివిధ రకాల సర్టిఫికేట్లు(ఫార్మసీ, మెడిసిన్, పారామెడికల్ బోర్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెవిన్యువల్ ఇలా) అన్ని రకాల సేవలను కూడా ఇక్కడి నుంచే పొందే విధంగా కూడా గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేస్తుందట. అదే జరిగితే రాజధాని ప్రాంల్లో మాత్రమే ఉండే సదరు కార్యాలయాలకు ఎవరూ వెళ్లాల్సిన పనికూడా ఉండదు. ప్రజలకు ఆర్ధిక భారాన్ని తగ్గించి అన్ని రకాల సేవలను ఒకేచోట అందించడంతోపాటు స్పందన ద్వారా వచ్చే అర్జీలను కూడా వీరే పరిష్కరించాల్సి వుంటుంది. స్పందన దరఖాస్తులను మాత్రం మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల డాష్ బోర్డుల ద్వారా పర్యవేక్షించి ఎవరి స్థాయిలో వారు స్పందన అర్జీలను కూడా పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది..

ఇక సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల అధికారాలు, విధులు, నిధులు పరిధిల బదలాయింపుపై కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. పంచాయతీ కార్యదర్శిల ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందట. ఇప్పటికే ఈ విషయమై ఉద్యోగులంతా ఆందోళన చేయడం, మండలం నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వరకూ లేఖలు సమర్పిస్తూ వచ్చారు. అయితే కేవలం ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కాకపోవడం, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డంకిగా ఉండటం, ప్రస్తుతం ఉన్న గ్రేడ్-1,4 యూనియన్  నేతల ఒత్తిడి వలన కాస్త ఆలస్యం అవుతున్నా.. ఖచ్చితంగా అమలు చేస్తామని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇంటిపన్నులు పెంచిన తరుణంలో వాటి ఎసెస్ మెంట్లు పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేయకపోయాయి పంచాయతీలు, వారికి పూర్తిస్థాయిలో సిబ్బంది(జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు) ఉన్నా వారు పని పూర్తిచేయలేకపోయారు. అప్పుడు కూడా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులే ఆ పనులు వారి వారి పరిధిలోని ఇళ్లకు అర్ధరాత్రి సమయంలో కూడా అసెస్ మెంట్లు ఆన్ లైన్ చేశారు. దీనితో వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం వున్న గ్రేడ్-1,4 పంచాయతీకార్యదర్శిల్లో 80శాతం మందికి కంప్యూటర్ వినియోగంపై అవగాహన లేకపోవడం, సిబ్బంది ఉన్నా పని సకాంలో పూర్తిచేయకపోయిన విషయాన్ని గుర్తించామని పంచాయతీరాజ్ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గ్రేడ్-5 కార్యదర్శిలు డిమాండ్ సహేతుకంగా ఉన్నప్పటికీ, అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుందని, మరోవైపు జిల్లాల నుంచి కలెక్టర్లు కూడా ఇదే విషయమై చర్చలు జరుపుతున్న విషయాన్ని కూడా ఆయన కొందరు రాష్ట్ర సచివాలయ మీడియా ముందు ప్రస్తావించినట్టు సమాచారం అందుతుంది.  అయితే వీరికి ఎప్పుడు బదలాయింపులు ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ రావడానికి సమయం పట్టేట్టు కనిపిస్తుందని, అదే సమయంలో ఉద్యోగులకు రెగ్యులర్ అయితన తరువాత అధికార బదలాయింపులు చేయపోతే వారు కోర్టుకు వెళితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు రావడానికి మార్గం సుగమం అయినట్టుగానే కనిపిస్తుంది..ఇక అధికారులు నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కాగా ఏకరూప దుస్తులపై మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. కాకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరగవనే సంకేతాలు కూడా దుస్తుల టెండరు తేటతెల్లం చేసింది.. !

Tadepalle

2021-08-30 06:11:51

ఐఏఎస్ అధికారులంతా పల్లె బాటపట్టారు..

ఆ.. ఐఏఎస్ అధికారి పేరు ఏ. సూర్యకుమారి..  విజయనగరంజిల్లాకి  కలెక్టర్, అన్ని ప్రభు త్వశాఖలను శాసించే జిల్లా ముఖ్య అధికారి, పలు సంస్ధలకు చైర్మన్.. కావాలను కుంటే ఏసీ గదుల్లో కూర్చొని కింది స్థాయి అధికారులతో పనిచేయించొచ్చు.. ఆదేశాలివ్వొచ్చు.. చిటెక వేసి క్షణాల్లో పథకాలు అమలు చేయించవచ్చు.. కానీ అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం వాస్తవాలు తెలియవు.. ఇదే విషయాన్ని గమనించిన సీఎం  వైఎస్ జగన్మోహనరెడ్డి కలెక్టర్లూ మీరు ప్రజల ఇంటి ముందుకు వెళ్లాలి..ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని తెలుసుకోవాలని కోరారు. అంతే రాష్ట్రంలోని విజయనగరం జిల్లాతో పాటు, మిగిలిన 12 జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు తమ కార్యాలయాల్లో ఏసీ గదులు వదిలిపెట్టి క్షేత్రస్థాయిలో నిజంగా ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంటి ముందుకెళ్లి ఒక సాధారణ వ్యక్తిలా ప్రభుత్వ పథకాల కోసం ఆరాతీస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల కోసం చేసే వేల కోట్ల సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు అందుతున్నాయో..లేదంటే మధ్యలో దళారులు, అమలు చేసే అధికారులు తినేస్తున్నారో..అదీ కాదంటే పథకం రాసినందుకు ఆయా పార్టీల నేతల బొక్కేస్తున్నారో స్వయంగా జిల్లా కలెక్టర్ పసిగట్టేందుకు ఈ ప్రజల ముంగిట ప్రభుత్వ పథకాల అమలు శోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. 75ఏళ్ల స్వాంతంత్ర్య భారత దేశంలో అఖిలభారతస్థాయి అధికారి సాధారణ ప్రజల గుమ్మం ముందు చేతులు కట్టుకొని నిలుచుని మరీ ప్రభుత్వ పథకాల అమలు కోసం వాకబు చేసిన అంశాన్ని ఎవరైగా ఊహించారా అంటే లేదనే చెప్పాలి. 

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని పథకాలు ప్రభుత్వానికి ఖర్చు తప్పా, ప్రజలకు ఉపయోగం లేదు. అలాంటి వాటిల్లో ఇంటింటికీ రేషన్ పథకం. ఇందులో వందల కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలుకి ప్రభుత్వం ఖర్చుచేసింది. అనుకున్నట్టు ఆ పథకం ప్రజల మనసును రంజింపచేయలేకపోయింది. ఈ పథకం వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసుకోవాలని, ప్రజల సమస్యలతోపాటు, అమలు కాని పథకాల వివరాలు తెలుసుకోవాలని కూడా ప్రజలే ఐఏఎస్ అధికారుల ముందు ఏకరువుపెట్టే ఒక బ్రుహత్తర కార్యక్రమం కోసం ఇపుడు దేశమంతా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే..గాంధీజీ కలలుగన్న గ్రామపరిపాలనను గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇపుడు వారితోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది. అయనప్పటికీ ఏదో తెలియని వెలితి, ఇంకా చాలా మంది ప్రజలకు రాజకీయ నేతల వలనో, అధికారులో, సిబ్బంది ఫాల్సు ప్రెస్టేజీ వలనో పథకాలు అందని వారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నిజమైన అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు రాజమార్గం వేసినట్టు అయ్యింది. నలగని బట్టకట్టుకొని అధికారులతో సమీక్షలు నిర్వహించే ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ, ఎండలో ఆరుబయటే నిలుచొని ప్రజలతో మమేకమై వారిని బాగోగులు తెలుసుకునేలా చేసిన ఈ ప్రయత్నం కొందరు ఐఏఎస్ అధికారులకు, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని పథకాలు  అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులకు కాస్త అసహనం కలిగించినా.. కొద్ది మంది అధికారులకు నచ్చకపోయినా, మెజార్టీ ఐఏఎస్ అధికారులను మాత్రం ఎంతగానో ఆలోచింపజేసింది. 

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇలా ఆదేశించగానే అలా కధనరంగంలోకి దిగా ఐఏఎస్ అధికారులు గ్రామాల బాట పట్టారంటే సీఎం ముందుచూపు, సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి అందాలనే ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించడం వలన ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు..వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. పనులు చేయడానికి కాసుల పందేరం పెట్టే అవినీతి అధికారుల ఆటకూడా కట్టడై పోతుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే టైమిదాటిపోయిన తరువాత కార్యాలయానికి వెళ్లి.. ఆ తరువాత సమయం మిగిలి ఉండగానే ఇంటి మొహం పట్టే అధికారులతో కూడా సీఎం తీసుకున్న నిర్ణయం చక్కగా పనిచేయించేలా చేస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ జీఓల ద్వారా పూర్తిస్థాయి అధికారాలు బదలాయింపు జరగకపోతే ప్రజలకు ఎలాంటి సేవలు అందవనే విషయం ఇప్పటికే గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో తేలిపోయింది. వీరికి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149 ఆధారంగా అధికారాలు, విధులు, నిధులు పరిధిలు పంపకాలు చేయాల్సి వున్నా ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ దానిని అమలు చేయలేదు. ఫలితంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటైనా, వీరి ద్వారా ప్రజలకు సేవలు మాత్రం అందడం లేదు. ఇపుడు ఆ విషయం కూడా గ్రామాల్లోకి వచ్చే ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులకు ప్రజలే చెప్పే సమయం వచ్చింది. ఏదైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందుని అనే మాట్లాల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తే ఐఏఎస్ అధికారులే గ్రామాల బాట పట్టారు. జిల్లా కలెక్టర్ కు విశేష అధికారం ఉంది కనుక కనుసైగలతో అధికారులు పనులు చేస్తున్నారు.. అదే నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకూ అవే అధికారాలు(149 జీవో ద్వారా సంక్రమించేవి మాత్రమే) ఉంటే ఫలితాలు ఇంకెంత బాగుంటాయో ఊహకే అందదు..  ఐఏఎస్ అధికారి మనసుపెట్టి ఆలోచించి పనిచేసే సిబ్బందికి అధికారాలు కట్టబెడితే ఫలితాలు ఏ విధంగా వస్తాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి వుంది..! 

Tadepalle

2021-08-28 02:13:37

సచివాలయ సేవలపై బురద చల్లుతున్నారు..

భారతదేశం మొత్తం తొంగిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్తపై ఒక వర్గం మీడియా కావాలనే బుదరచల్లుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో గత ప్రభుత్వాల సమయంలో పంచాయతీలు, పాలక మండలి మాత్రమే పరిపాలన చేసేవి. ఆ తరువాత గత ప్రభుత్వం  పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సుమారు 9ఏళ్లకు పైనే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడిచాయి. ‘వంగలేక మంగళవారం’ అన్నట్టు ఆ సమయంలో తినేసిన నిధులు, లేని ఖర్చులకు చూపిన లెక్కలపై నోరుమెదపని మీడియా.. ఇపుడు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మాత్రం ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. వీటి వలన ఎలాంటి ఉపయోగం లేదన్నట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేస్తుంది. వ్యవస్థ ఏర్పాటు చేయడం తప్పుకాదు.. ఆ వ్యవస్థకి ఒక దిశా నిర్దేశం, ప్రభుత్వ జీఓలను సమయానికి అమలు చేయకపోవడం తప్పు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ అదే జరుగుతుంది. ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన తరువాత జీఓనెంబరు 149 ప్రకారం గ్రామ సచివాలయాల వారీగా పంచాయతీ పరిధిని విభజించాలి. జనాభాకు సేవలు అందించడానికి రెండు నుంచి 4వేల జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎందుకనో అక్కడ నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని మాత్రం విభజన చేయలేదు. ఫలితంగా ఇంకా పంచాయతీల్లోని గ్రేడ్-1-4 కార్యదర్శిల చేతుల్లోనే పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో మేజర్ పంచాయతీల్లో  అదనంగా మరో రెండు గ్రామ సచివాలయాలు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వం నియమించిన గ్రేడ్-5 కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. సుమారు రెండేళ్లు కావొస్తున్నా వీరికి ఎలాంటి దస్త్రాలు ఇవ్వకపోవడమే పంచాయతీరాజ్ శాఖ చేసిన ప్రధాన తప్పుగా కనిపిస్తుంది..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్క గ్రామీణ ప్రాంతంలోని సచివాలయాల్లో సుమారు ఏడువేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఉన్నారు. ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం సచివాయాలను కేటాయించారు తప్పితే, ప్రభుత్వమే విడుదల చేసి జీఓ నెంబరు 149 ఆధారంగా వీరికి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు. ఫలితంగా ఏ చిన్న పనికోసమైనా, ఆఖరికి ఆయా సచివాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నా పంచాయతీల చుట్టూ గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సమయం వ్రుధా అవుతుంది తప్పితే ప్రజలకు మాత్రం సేవలు అందడం లేదు. పంచాయతీల్లో నిధులు పుష్కలంగా వున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించకపోయినప్పటికీ ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, విద్యుత్ మీటర్లు, ఇలా చాలా సర్వీసుల ద్వారా గ్రామపంచాయతీలకు అత్యధిక స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం జనాభా ప్రాతిపధిక విభజించి సచివాలయాలను ఏర్పాటు చేసినట్టుగానే విధులు, నిధులు, అధికారాలూ కూడా విభజన చేసి వుంటే ఇప్పటికే అద్బుతమైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో డీపీఓ, జిల్లా కలెక్టర్ ఆఖరికి రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీఓను అమలు చేయడానికి చొరవ చూపకపోవడంతో ప్రభుత్వం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది.

ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తిచూపకుండా.. నిధులు లేవని, పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో జరగడం లేదని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి దిగాయి. దానికి కారణం కూడా ప్రభుత్వమే. జనాభా ప్రాతిపధిక సచివాలయాలను విభజన చేసి అక్కడ సిబ్బందిని నియమించిన ప్రభుత్వం ఎందుకు పారిశుధ్య సిబ్బందిని కేటాయించలేదు.. ఎందుకు చెత్తతరలించే వాహనాలు సమకూర్చలేదు..ఎందుకు అధికారాలు, రికార్డులు బదలాయించలేదూ అంటే మాత్రం ఆ.. ఒక్కటీ అడక్కు అంటున్నాయి అధికార వర్గాలు.. చేయాల్సింది చేయకుండా ఫలితాలు వచ్చేయాలంటే ఎలా ఎలావస్తాయనే విషయంతో కనీసం ఆలోచించపోవడం విశేషం. సచివాలయాలకు కార్యదర్శిలను నియమించిన ప్రభుత్వం అదే సచివాలయాలకు పారిశుధ్య సిబ్బందిని కేటాయిస్తే ఎవరి గ్రామ సచివాలయ పరిధిలో ఆ గ్రేడ్-5 కార్యదర్శి పారిశుధ్య నిర్వహణ చేయడానికి 100 శాతం అవకాశం వుంటుంది. సచివాలయాలల్లో కార్యదర్శిలు ఉన్నా..  ప్రభుత్వం పరిధిలను విభజించకుండా మొత్తం పారిశుధ్య నిర్వహణ పంచాయతీలోనే ఉంచేయడం, అక్కడ పనిచేస్తున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలకు ఇతర పంచాయతీలకు ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఉన్న పంచాయతీల్లో పారిశుధ్యం కాస్తా అపారిశుధ్యంగా మారుతోంది. దీనితో నిర్వహణ భారం పంచాయతీలకు గుది బండలా మారుతోంది. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలు పూనుకొని చేయించాలన్నా వీరికి ఎలాంటి అధికారాలు లేకపోవడంతో కనీసం పారిశుధ్య కార్మికులు సైతం వీరి మాట వినడం లేదు. తమ పంచాయతీ కార్యదర్శి చెబితే తప్పా తాము ఎక్కడికి వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు రాష్ట్రవ్యాప్తం ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వంపై బురదచల్లే మీడియాకి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్టుగా వ్యవహరించడం ఇపుడు ప్రధాన చర్చగా మారింది. చేసిన తప్పుని పదే పదే మీడియా ఎత్తిచూపుతున్నా చూసి ముసి ముసి నవ్వులు నవ్వే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రజలకు గ్రామాల్లోనే సేవలందంచడానికి నియమించిన సచివాలయక గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు బదలాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇదే పద్దతి కొనసాగితే థర్డ్ వేవ్ లో పరిస్థితి మరింత దారుణంగా పరిణమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  పారిశుధ్య నిర్వహణ జరగగక.. ప్రజలకు మురుగు కంపే మిగిలి రోగాలతో రాష్ట్రం రాజ్యమేలడం ఖాయంగా కనిపిస్తుంది.. చూడాలి ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మేలుకుంటుందో లేదో..!

Tadepalle

2021-08-26 03:08:55

మహిళాపోలీసుల సర్వీసు రెగ్యులేషన్ పై సమీక్ష..

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4  గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14న్నర వేల మహిళా పోలీసులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ లో ప్రభుత్వం సూచించిన విధంగా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నామని రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం అదనపు డిజీపీ ఎన్.సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి డిఐజీలు నాగేంద్రకుమార్, ఎస్వీరాజశేఖర్ బాబు, రాజకుమారి లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని శాఖలుగా గుర్తించిన8 ప్రభుత్వ శాఖల్లో  మహిళా పోలీసులు కూడా ఉండటంతో వీరికి ఏ విధంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, వారికి ఏ తరహా ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి, ఏ తరహా శిక్షణలు ఇవ్వాలనే విషయంపై పూర్తిస్థాయిలో జిల్లాల ఎస్పీలతో చర్చించారు. అంతేకాకుండా మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు కేటాయింపులు, వారి యొక్క నూతన జాబ్ చార్టు అమలు, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలను ప్రస్తావిస్తూ ఈ వీడియో కాన్ఫరెన్సులో కీలక మైన అంశాలను చర్చించారు. కాగా మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ.. సర్వీసులను రెగ్యులర్ చేయడానికి చేయడానికి ఒక ప్రత్యేక వ్రాత పరీక్ష నిర్వహించేలా సూచనలు చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే అది ఏంటనే విషయంలో బయటకు మాత్రం రాలేదు. గతంలో ఇదే విషయమై పలు దఫాలు చర్చలు జరిగినా.. ఇటీవల ప్రభుత్వం 8 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విషయంలో ప్రత్యేక పరీక్షలు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు సూచించాలని చెప్పడంతో ఈరోజు జరిగిన ప్రత్యేక సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రస్తావించిన అంశాలను డిజిపీ తెలియజేసిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేకార్యదర్శి ఆదేశాల మేరకు వీరికి పరీక్షలు నిర్వహించే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటరని మాత్రం తెలుస్తుంది. ఈరోజు మంగళగిరి నుండీ అన్ని జిల్లాల ఎస్పీలు, పి.టి.సి ప్రిన్సిపాల్స్, కమాండెంట్లు, డి.టి.సి & బి.టి.సి హెడ్స్, అన్ని జిల్లాల ఎస్డీపీఓలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Tadepalle

2021-08-25 15:44:48

రేషన్ కార్డుతో ప్రొబేషన్ కి మెలికపెట్టారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారమే చేస్తుందని..దేశంలో ఇచ్చిన జీఓలను అచ్చుగుద్దినట్టు పాటించే ప్రభుత్వం దేశంలోనే రాష్ట్రానిదేనని అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాని అమలులో మాత్రం ‘చెప్పడానికే శ్రీరంగ నీతులు’అన్నచందాన వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఇచ్చిన జీఓలను కావాలనే అమలు చేయకుండా వదిలేయడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే చేయడం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 34 వేల మంది ఉద్యోగులకు అర్ధం కాకుండా వుంది. మళ్లీ ఇపుడు పుండుపై రోకటి పోటు అన్నట్టుగా ఇపుడు.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది తెలుపురంగు రేషన్ కార్డు వినియోగిస్తున్నారని వారంతా ప్రభుత్వానికి కార్డులు సరెండర్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి సర్కారు..దానికి రేషన్ కార్డులేని నిరుపేదలు ఎంతో హర్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది నేటికీ రేషన్ కార్డు వినియోగిస్తున్నవారందరీకి గొంతులో పచ్చివెలక్కాయ్  కూడా పడింది. దానికి స్పందించిన ఉద్యోగులు తమ రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి ముందుకొస్తే..దానికి నియమ నిబంధనలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు( ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 65 మండలాల్లో 9313 మంది) వైట్ రేషన్ కార్డు దారుల కుటుంబాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ-కేవైసీ, ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసినపుడు ఆ కార్డులు లైవ్ లో ఉన్నట్టు చూపిస్తున్నాయి. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చూస్తున్న ఉద్యోగులకు వాటిని ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. అలాగని కొంత మంది ఉద్యోగులు సరెండర్ చేయడానికి గానీ, వారి పేర్లను తొలగించుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రస్తుతం అన్నిజిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల రేషన్ కార్డులను సరెండర్ చేయాలని ప్రత్యేక సర్క్యులర్లు జారీచేశారు.

అలాగని మండలస్థాయిలో తహశీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో జెసీలు సైతం దానికి ఏ విధంగా సరెండర్ చేయాలి(ఉద్యోగి మాత్రమే తప్పుకోవాలా..లేదంటే కుటుంబం మొత్తానికి కార్డు రద్దు చేసుకోవాలా) అనే విషయంలో దిశ నిర్దేశం చేయలేదు. దీనితో తాము ఉన్న రేషన్ కార్డులో నుంచి తమపేరు ఎలా బయటకు తీయించాలనే విషయం, కార్డు సరెండర్ చేసే విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు క్లారిటీ రాలేదు. ఇదిలా వుంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తెలుపురంగు రేషన్ కార్డులో సచివాలయ ఉద్యోగులన్న కార్డులకు నిత్యవసర సరుకుల దుఖాణంలో సరుకులు కూడా ఇవ్వడం మానేశారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం రూ.15000వేలు మాత్రమే ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో జీతంగా ఇస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుపేదల వార్షిక ఆదాయం రూ.2.50లక్షలు ఉంటే వారు పేదవారిగానే లెక్క.  కానీ సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు కావడంతో వారి జీతాలు వార్షిక ఆదాయం లెక్కన చూసుకుంటే రూ.రెండు లక్షల లోపుగానే ఉన్నాయి. అలాంటపుడు వీరు నిరుపేదల జాబితాలోకి రారా అంటే.. ఖచ్చితంగా రారు అనే సమాధానం చెబుతున్నది ప్రభుత్వం. ఇలా ప్రకటించిన తరుణంలో రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులంతా వారున్న రేషన్ కార్డుల్లో నుంచి తమ పేర్లను తొలగించాలని ప్రయత్నిస్తుంటే వారికి పరిష్కారం దొరకడం లేదు. అన్నీ నిబంధనల ప్రకారం చెప్పే ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరిన వెంటనే ప్రకటించాల్సి వుంది. కానీ సుమారు రెండేళ్ల పాటు కామ్ గా ఊరుకొని ‘మావోడికి మెదిలినపుడే’ మొదలెట్టాలి అన్నట్టుగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తవుతున్న తరుణంలో ఈ నిబంధన పెట్టడమేంటని ఉద్యోగులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

ఆది నుంచి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కాస్త తేడానే వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా నియమించిన ప్రభుత్వం నేటి వరకూ తమకు అధికారాలివ్వకపోగా.. ఇప్పటికే అమలులో ఉన్న జీఓ నెంబరు 149ని అమలు చేయకుండా పంచాయతీ గ్రేడ్-1,4 వాళ్లను మాత్రమే డిడిఓలుగా కొనసాగిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనే ఎందుకు అమలు చేయడం లేదంటే ‘ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారని’ ఇలా అయితే తాము ప్రజలకు ఏం సమాధానం చెబుతామని, అధికారాలు లేకుండా తాము ఏ విధంగా సేవలు చేస్తామని వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంతో వివక్షకు గురవుతూ ఉద్యోగాలు చేస్తున్నామని..ఈ సమయంలో తామున్న రేషన్ కార్డులను సరెండర్ చేయమంటున్నారని.. వచ్చే ఈ తక్కువ జీతంతో ఎలా కుటుంబాలను నెట్టుకు రావాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి సరెండర్ చేయడానికి ముందుకొస్తే దానికి సరైన సూచనలు గానీ, సలహాలు గానీ చేయడం లేదని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు తక్కువ జీతం ఒక కారణమైతే..తీవ్ర మైన వివక్ష రెండో కారణంగా, అధికారాలు లేని ఉద్యోగాలు మూడో కారణంగా తమను వెంటాడుతున్నాయని వాపోతున్నారు. అన్నింటినీ భరిస్తూ విధులు నిర్వహిస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని..ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ లు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు..డబ్బులకు కొదవా’ అన్నట్టు రాష్ట్రంలో వున్న ఏ ప్రభుత్వశాఖలో లేని విధి విధానాలు, జీఓలు అమలు కాకపోవడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే ప్రభుత్వం చేపట్టడం దారుణమనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. రేషన్ కార్డులతో ప్రొబేషన్ కి మెలిక పెడుతూ, కఠిన చర్యలంటూ ఇపుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజు రోజుకీ ఆశక్తిని రేపుతోందంటున్నారు విశ్లేషకులు..!

Tadepalle

2021-08-25 01:52:50

ఏపీలో జూనియర్‌ కాలేజీల ఫీజులు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు..ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000 విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో..ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000 చెల్లించాలి. ఇక కార్పొరేషన్ల పరిధిలో.. కాలేజీలు ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. అంతకు మించి అధికంగా వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కరోనా తరువాత ఫీజులు ఈ విధంగా ప్రకటించడం పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది..

Tadepalle

2021-08-24 15:40:47

ఆంధ్రకేసరికి నివాళులు అర్పించి సీఎం జగన్..

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం అసువులు బాసారని, అలాంగి త్యాగమూర్తులను ప్రతీఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.*ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌ కూడా పాల్గొని టంగుటూరికి నివాళులు అర్పించారు.

Tadepalle

2021-08-23 13:19:07

జీఓ-149పై పంచాయతీరాజ్ శాఖ 2నాల్కల దోరణి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో సింహభాగమైన పంచాయతీకార్యదర్శిల విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ శాఖ రెండు నాల్కల దోరణి అవలంభిస్తుంది. పంచాయతీరాజ్ శాఖలోని జీఓనెంబరు 149ను అనుసరించి గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 వరకూ అన్ని అధికారాలు, రికార్డుల నిర్వహణ, జమాఖర్చుల విధులు చేపట్టవచ్చునని చెబుతూనే.. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎక్కడ అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీనితో విసుగు చెందిన ఉద్యోగులు నేరుగా సమాచారహక్కు చట్టాన్ని ప్రయోగించిన సందర్భంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధి శాఖ  పౌరసమాచార అధికారి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ అదికూడా అమలుకి మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఉత్తుత్తి కార్యదర్శిలుగా నేటికీ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక అంశాలన్ని ఇటు ప్రభుత్వము, గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు గమనించాల్సి వుంది. చూపించడానికే ప్రభుత్వ జీఓలు తప్పా వాటిని అమలు చేయడానికి మాత్రం పంచాయతీరాజ్ శాఖలో చోటులేదని.. ఎందుకంటే ఆ విషయాన్ని సమాచారహక్కు చట్టం దరఖాస్తుకి జవాబు ఇచ్చిన కమిషనర్ కార్యాలయ అధికారులే స్పష్టం చేశారు. దానికి కూడా కారణం లేకపోలేదు. 2019లో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి నేటి వరకూ ఎంపీడీఓలు, డిపీఓలు, జిల్లా కలెక్టర్లు ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల క్రిష్ణ ద్వివేదికి సైతం నేరుగా జీఓనెంబరు 149ని అమలు చేయమని, ప్రభుత్వ జీఓ ప్రకారం తమ పరిధి, విధులు, జాబ్ చార్టు కేటాయించాలని దరఖాస్తులు చేసినా అవన్నీ బుట్టదాఖలే అయ్యాయనడానికి ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడమే.

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు.. గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149ని ప్రకారం అధికారాలు బదలాయించకపోవడం వలన ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న ఇంటిపన్ను నవీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి కార్యదర్శిలందరికీ వారి వారి సచివాలయ పరిధి మేరకు అధికారాలు, రికార్డులు, నిధులు కేటాయిస్తే వారి పరిధిలో పనివారు చక్కగా చేసుకుని ఉండేరు. కానీ ఇపుడు ఆ అధికారాలన్నీ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-1-4 కార్యదర్శిల దగ్గరే వదిలేదయడంతో వారికి పనిచేయడం చేత కాక మళ్లీ గ్రామసచివాలయ ఉద్యోగులకు, కార్యదర్శిలకు ప్రత్యేక డ్యూటీలు వేసి వారితో చేయించుకునే పరిస్థి నెలకొంది. ఇదొక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40శాతానికి పైగా ఇంటిపన్నుల బకాయిలు పేరుకు పోయాయి. వాటిని కూడా ప్రస్తుతం పంచాయతీల కార్యదర్శిలు వసూలు చేయడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. గ్రేడ్-1-4 పంచాయతీ కార్యదరద్శిలంతా సచివాలయ ఉద్యోగులపై అజమాయిషీ చలాయించినంతగా వసూళ్లు వెళ్లాంటే మాత్రం తెగ నొప్పులు పడిపోతున్నారు. అక్కడ బిల్ కలెక్టర్లు, కొన్ని మేజర్ పంచాయతీలకు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నా.. వారికి పనిచేయడం చేతకాక ఆ పనులన్నీ మేజర్ పంచాయతీ పరిధిలో వున్న మూడు సచివాలయ సిబ్బందితోనే చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ వాదోపవాదాలు, కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఏకంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలపై తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రొబేషన్ లో వున్న గ్రామసచివాలయ సిబ్బంది కూడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వారి మాటలను వినీ విననట్టు వ్యవహరిస్తూ పనిచేస్తున్నారు. అక్టోబరు 2 నుంచి జవరిలోపు అందరి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ అవుతాయి. ఈసమయంలో పంచాయతీల్లో పెండింగ్ పనులు పూర్తయ్యాయా సరేసరి లేదంటే మాత్రం అవి పూర్తికావడానికి, పెండింగ్ ఇంటి పన్నులు వసూలు చేయడానికి ఎంత సమయం పడుతుంతో లెక్కలేదు. ఇప్పటి వరకూ తమ ఉద్యోగాలకి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భయపడుతూ, ప్రొబేషన్ లో మచ్చపడకూడదని మాత్రమే ఇప్పటి వరకూ గ్రామ సచివాలయ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కాస్త నెమ్మదిగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓ మిలాఖత్ అయి కావాలనే గ్రామ సచివాల కార్యదర్శిలను, సిబ్బంది చులకనగా చూస్తున్నారు. ఎన్నిచూసినా, ఏం చేసినా ప్రభుత్వ నిభందనల మేరకు విధులు నిర్వహిస్తూ.. చాలా చోట్ల అధికారులు తిట్టినా ఓపికతో విధులు నిర్వహిస్తున్నారు సచివాలయ సిబ్బంది. ఈ తరుణంలోనే మరో 4 నెలల సమయం  పూర్తై వీరి సర్వీసులు రెగ్యులర్ అయితే మాత్రం ఏ సచివాలయ సిబ్బందీ ఫాల్స్ ప్రెస్టీజీతో మూర్ఖంగా వ్యవహరించే అధికారుల ఒత్తిడిని, మాటలు, చులకనగా వ్యవహరించే తీరును ఓపిక పట్టరనే సంకేతాలను అపుడే సిబ్బంది విడుదల చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన జీఓనెంబరు 149ని పంచాయతీరాజ్ శాఖ గానీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి గానీ ఎందుకు అమలు చేయడం లేదనే విషయంలో సరిగ్గా నేటికీ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఎంత కాలం నాన్చుతుందో ఓపికతోనే చూద్దామనే ధీమాలోనే గ్రేడ్-5 కార్యదర్శిలతోపాటు, సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. విశేషమేంటంటే కొన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శి మొదలు కొని అన్ని శాఖల సిబ్బంది ఒక మాటమీదకు వచ్చి సచివాలయం-1 అంటే ప్రస్తుం మేజర్ పంచాయతీలుగా వున్న చోట కొన్ని పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సివున్నా.. తమకు ప్రభుత్వం కేటాయించిన విధులన్నాయని చెప్పి తప్పించుకు పోతున్నారు. ఈ తరుణంలో చాలా పనులు పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇదే సమయంలో కొందరు గ్రేడ్-1-4 కార్యదర్శిలు ఉద్యోగులపై వీర ప్రతాపం చూపించినా ఫలితం లేకుండా పోతుంది. కొన్ని పంచాయతీల్లో సిబ్బంది ఏమీ అనలేక కావాలని జీతాలు ఆలస్యంగా బిల్లులు చేసే పనికి పూనుకుంటున్నారు పంచాయతీల కార్యదర్శిలు. ఈ విషయాలన్నీ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి, స్థానిక ఎంపీడీఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు సమాచారం ఉన్నప్పటీకి నోరు మెదపకుండా అలానే ఉండిపోతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందాన.. పంచాయతీలకు సిబ్బంది ఉన్నా వారికి సాంతికపరంగా పనిచేసే విధానం, కంప్యూటర్ వర్క్ పై అవగాహన లేకపోవడంతో చచ్చినట్టు మళ్లీ సచివాలయ ఉద్యోగులతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు. దానికి కారణం ఒక్కటే ప్రస్తుతం గ్రామసచివాలయ శాఖ పనిచేస్తున్న 80శాతం మంది ఉద్యోగులు బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంటెక్, కొన్ని సచివాలయాల్లో పీహెచ్డీలు చదివిన వారు కూడా ఉండటమే. అంతేకాదు అత్యధిక చదువులున్న ప్రభుత్వ శాఖ ఉద్యోగులున్న శాఖగా  గ్రామ, వార్డు సచివాలయశాఖ రికార్డులకెక్కింది. ఈరోజుకీ చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు పదవ తగరతి, మెట్రుక్యులేషన్, అత్యధిక చదువు ఇంటర్ వరకూ మాత్రమే పూర్తిచేసిన వారు ఉండటమే దీనికి ప్రత్యేక కారణం. 

ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటీకి కావాలనే నాన్చుడు దోరణి అవలంభిస్తుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు  అధికార బదలాయింపులు జరగాల్సి వుంది. అదే సమయంలో సచివాలయాల్లోని 14 శాఖల సిబ్బందినీ వారి పనులను వారిని చేసుకోనీయాలి. అలాకాకుండా ఇటు పంచాయతీరాజ్ శాఖ, అటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కావాలనే గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందకూడదనే అడ్డుకట్ట వేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాకాకపోతే ఈపాటికే గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19రకాల సిబ్బంది సర్వీసు రూల్సు, జాబ్ చార్టు, ఆయా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వమే అమలు చేసిన జీఓలను అమలు చేసి  ప్రజలకు 50శాతం చేరువ కావాలి. నేటికీ సచివాలయాల్లో ప్రభుత్వం ఏ తరహా సేవలు అందిస్తున్నదో ప్రజలకు తెలియపోవడానికి కారణం కూడా ఇదే. తమకు అధికారాలు ఇవ్వనపుడు లేని అధికారాలతో ప్రజలకు ఏం సేవలు చేస్తామని ప్రశ్నిస్తున్నారు గ్రేడ్-5 ఉద్యోగులు. ఒక రకంగా చాలా సేవల వివరాలు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా ప్రజలకు ఎక్కువగా తెలుస్తాయి. ఒక వేళ మిగిలిన ప్రాంతాల్లోవున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలు చెప్పాలన్నా వారికి ప్రస్తుతం ఆన్ లైన్ పనులు, ఇతర జీఓలు వాటిపై అవగాహన లేదు సరికదా చాలా మంది వాటిని చదివి అర్ధం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేరు. దానికి ప్రధాన లోపం కనీసం చాలా మంది డిగ్రీ చదువు ఇంగ్లీషులో  ప్రావీణ్యత లేకపోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే జనవరి2022 దాటిన తరువాత నుంచి సచివాలయ సిబ్బంది నుంచి ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కునే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం జీఓనెంబరు 149 అమలు చేయడంతోపాటు, అన్నిశాఖలకు సంబంధించి ఆయాశాఖల జాబ్ చార్టు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓ ప్రకారం అమలు చేస్తుందో.. లేదంటే ఇంకా పాద పద్దతిలోనే నాన్చుడు వ్యవహారాన్నే కొనసాగిస్తుందో..!

Tadepalle

2021-08-21 02:31:32

24,25న ఎపిఎస్‌ఎస్‌డిసి నైపుణ్యపోటీలు..

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నైపుణ్యపోటీలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను కేఎల్ యూనివర్సిటీతోపాటు స్వర్ణభారతి ట్రస్ట్, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిపెట్, నేచురల్స్, ఆంధ్రా లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, శ్రీవిశ్వకర్మ గోల్డ్ స్మిత్ ల దగ్గర కూడా వివిధ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి టాప్ ప్లేస్ లో నిలిచినవారిని త్వరలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని 2022 సెప్టెంబర్లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

ఈ సందర్భంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు కేఎల్ యూనిర్సిటీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎపిఎస్‌ఎస్‌డిసి పనిచేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు ఎంపికైనవారు మంచి ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయికి కూడా ఎంపికై రాష్ట్రానికి మంచి పేరుకు తీసుకురావాలన్నారు. 

అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చైనాలో 2022లో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు గాను ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిర్వహించామన్నారు. 32 విభాగాల్లో పోటీలకు గాను మొత్తం 21,515 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన 397మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. వీరంతా కేఎల్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి.. మన దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం పొందడంతోపాటు చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచ నైపుణ్య పోటీల్లో సత్తా చాలాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైపుణ్య శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపారని.. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు  మన యువతకు అందించాలన్న ఉద్దేశ్యంతో అనేక సంస్థలతో కలిసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ డి.వి రామకోటి రెడ్డి, కె. విజయ్ మోహన్ కుమార్, వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్స్ కన్వీనర్ డాక్టర్ గుజ్జుల రవి, కెఎల్ యూనివర్సిటీ ప్రోవైస్ చాన్సులర్ ప్రొఫెసర్ వెంకట్రామ్, కెఎల్ యూనివర్సిటీ డీన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-18 16:39:18

మొహరం శెలవు తేదీ మార్పు..జీఓ జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహరం శెలవుతేదీని మార్పుచేస్తూ జిఓఎంఎస్ నెంబరు 1341, 1342 ను విడుదల చేసిందని మైనార్టీ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి మొహరం పండుగ గురువారం వచ్చిందని, అయితే శుక్రవారం ముస్లిం కుటుంబాలకు ఎంతో పవిత్రమైన రోజని దానిని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆగస్టు 19 శెలవుకి బదులు ఆగస్టు 20న ప్రభుత్వ ఐచ్చిక శెలవును ప్రభుత్వం ప్రకటించినట్టు పేర్కొన్నారు.

Tadepalle

2021-08-18 14:21:45