1 ENS Live Breaking News

ఆ రెండింటిలోనూ ఏదో ఒకటి ఉంటేనే అనుమ‌తి..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి  మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ - 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.  కావున భక్తులు త‌మ‌ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నది.

Tirumala

2022-01-24 11:29:33

సచివాలయ ఉద్యోగులను అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం ప్రశ్నార్ధకమే..

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వీరిని కాదని ఇతర శాఖలకు ప్రాధాన్యత ఇచ్చి వీరిని పక్కన పెట్టడం ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో..మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమే వాదన తెరపైకి తీసుకు వస్తున్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే తప్పా మనకి  ప్రభుత్వ సహకారం, గుర్తింపు ఇచ్చిన మాదిరిగానే ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించాలని, అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం కూడా అదే స్థాయిలో వుంటుదనే విషయాన్ని మీడియాకి లీకులిస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యస్థ ద్వారానే నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందిస్తున్నది. వీరి సహకారం ప్రభుత్వానికి కొరవడితే సంక్షేమం పడకేడయం తప్పదు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు విరమించుకుంటే దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రంగా వుంటుందనేది ఇపుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చేసింది. రెండేళ్ల పాటు చెప్పిన పని, చెప్పని పని చేసిన తమకు ఇదేనా గుర్తింపు అంటూ ఉద్యోగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశం అవుతుంది. 

కరోనా సమయంలో అన్నిప్రభుత్వ శాఖలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే పనులు చేయించిందని, కరోనా టీకా విషయంలో ప్రాణాలకు తెగించి ప్రజలందరికీ సేవలు చేస్తే ఇదేనా తమకు దక్కే గౌరవం అంటున్నారు ఉద్యోగులు. తొలిరోజు అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్, జెసి, మండల స్థాయిలో ఎంపీడీఓలు సచివాలయ ఉద్యోగులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలను మాత్రం ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. అవసరం అయితే పెన్ డౌన్ చేయాలనే నిర్ణయంతోనే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.  కొన్ని చోట్ల ఉద్యోగులు మాత్రం భయపడి కొన్ని అధికారిక వాట్సప్ గ్రూపుల్లోకి మళ్లి వెనక్కి చేరిపోయారు. కానీ చాలా చోట్ల మాత్రం ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే ఉద్యోగులు తెగించే ఉన్నట్టు కనిపిస్తుంది..

కాగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేసిన  ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్.జగ్మోహనరెడ్డి దగ్గరకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సీఎం కూడా బాధపడినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖ ఉద్యోగులు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడమేంటనే విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతోంది. దీనితో గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆగమేఘాలపై చర్చలు జరిపారు. ఆపై కలెక్టర్లు, జెసిలు, డిపీఓలు, ఆఖరికి ఎంపీడీఓలు కూడా సచివాలయ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల ద్వారా, వారికి అనుకూలంగా వున్న కొందరు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా వార్నింగులు ఇచ్చారు. ఆ సమయంలో సచివాలయ ఉద్యోగులు అప్పటికి కొంత మంది మెత్తబడినా.. తమకు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పోల్చుకుంటే తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందనే విషయాన్ని మనసులో పెట్టుకున్నారు.  ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులపాటు తమకు సమ న్యాయం చేయని ప్రభుత్వానికి ఎందుకు సహకారం అందించాలనే వాదనను తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి అదీ కూడా నిజమే.. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారు 13 లక్షలకు పైగా వున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు న్యాయం చేసినపుడు రాని ఆర్దిక భారం ఒక్క లక్షా 30వేల ఉద్యోగులం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనివారికి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారికి ప్రొబేషన్ పూర్తిచేయడం వలన ఆర్ధిక భారం పెరిగిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వంపై గౌరవంతోనే కేవలం 15వేల రూపాయల జీతానికే పనిచేశామని ఇంకెంత కాలం అదే జీతాలకు పనిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఏం చేసినా అలా పడుంటారని వారి కోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదనే విషయాన్ని ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సలహాదారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. అంతకీ మొండి పట్టు పడితే సస్పెండ్ చేస్తాం..ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని బెదిరిస్తే.. వాళ్లే దారిలోకి వస్తారని కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టుగా రాష్ట్రంలో అందరు సచివాలయ ఉద్యోగుల సామాజిక గ్రూపుల్లో తీవ్రమైన చర్చనడుస్తుంది. ఆ మాట కొస్తే సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల కారా, వారికి ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవా అంటే అంత అవసరం లేదన్నట్టుగానే ఇప్పటి వరకూ చేస్తూ వచ్చారని..అందుకే నేరుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా జూన్ తరువా అందరికీ ఒకేసారి సర్వీసు రెగ్యులర్ చేస్తామని ప్రకటించారని సచివాలయ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా జీతం నష్టపోయామని, మరో ఆరు నెలలు జీతం కోల్పోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్లే తమను కాదని, మిగిలిన ప్రభుత్వ శాఖల ప్రయోజల కోసం ఆలోచిస్తే...తమ పరిస్థితి ఏంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం కొనసాగితే ముందు ముందు తమ సహకారం ప్రభుత్వం అందుకోవడం కష్టమని కూడా మీడియాకి లీకులిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి కూడా అలానే కనిపిస్తున్నది. అణచివేయాలని చూస్తే ఎవరైనా తిరగబడతారనే లాజిక్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర అధికారుల జిల్లాల్లో జెసిలు, మండలాల్లోని ఎంపీడీఓలు మరిచిపోవడం కూడా చర్చనీయాం అవుతుంది. ఈ లోపాలనే ప్రతిపక్షాలు కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటే వాటి ప్రభావం వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా కనిపించే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రేపు రాష్ట్ర రాజధానిలో జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటేందనే విషం ఉత్కంఠను రేపుతోంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-01-09 07:56:32

YSRCPప్రభుత్వ మానస పుత్రికను పెడచెవిన పెట్టిన ఫలితం..

భారత దేశం మొత్తం తొంగిచూసే విధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వమే పెడచెవిన పెట్టింది. కరోనాలాంటి ప్రాణాంతక వైరస్ సమయంలో సెలవులు సైతం తీసుకోకుండా పనిచేసినందుకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పూర్తియినా..వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా పక్కన పెట్టింది. ప్రభుత్వానికి గ్రామస్థాయిలో ఎంతో బలాన్నిచేకూర్చిపెడుతుందనుకున్న సచివాలయ వ్యవస్థ, అందులోని ఉద్యోగులే ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వాస్తవానికి ఈ పరిణామాన్ని ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు. అయితే ఈ ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వచ్చినది కాదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వానికి కాస్త తేడాగా ఆలోచనలు రుద్ది కావాలనే సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని దూరంచేయడానికే..రెండేళ్లు ప్రొబేషన్ పూర్తయినా..కనీసం సచివాలయ ఉద్యోగులను అసలు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించకుండా ఇతర శాఖల ఉద్యోగులకు వరాలు ఇచ్చి..తమకు రిక్త హస్తం చూపిస్తారా అంటూ ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయారు. 

వినూత్నంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని  మండలాల్లోని అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చేసి..తమకు న్యాయం చేయాలంటూ సచివాలయ ఉద్యోగులంతా తమ తమ వాట్సప్ గ్రూపుల్లో స్టేటస్ లు పెట్టి మరీ నిరసన తెలియజేశారు. సోమవారం నుంచి తమ నిరసన దశలవారీగా పెంచుతామని మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకూ సందేశాలను పంపారు. ఒకేసారి లక్షా 28 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఏం చెప్పినా చేస్తారనే కోణంతో రెండేళ్లలో పెట్టాల్సిన డిపార్టమెంటల్ టెస్టులన్నీ రెండేళ్లు పూర్తయిన తరువాత పెట్టడం, కరోనా సమయంలో కనీసం సెలవులు ఇవ్వకపోవడమే కాకుండా, రెండవ శనివారం, ఆదివారాల్లోనూ అజమాయిషీ చేసి మరీ పనిచేయించుకున్న ప్రభుత్వం తమను ఇంత దారుణంగా పక్కన పెడుతుందని తాము కలలో కూడా ఊహించలేదని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు గ్రామస్థాయిలో ప్రజలందరికీ చేర్చడానికి, ఆరోగ్యసేవలు అందించడానికి ప్రాణాలు పణంగా పెట్టినా ప్రభుత్వం గుర్తించకుండా, కేవలం ఇతర ప్రభుత్వశాఖలకు ఇచ్చిన గౌరవం తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా జనవరి నెల జీతంతోనే పెంచిన పీఆర్సీ జీతం ఇవ్వడంతోపాటు, రెండేళ్లు సర్వీసు పూర్తయిన తమకు ప్రొబేషన్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో లేకపోయినా ప్రభుత్వానికి అనుగుణంగా పనులు అదనపు గంటలు, సెలవుల్లో పనిచేయించుకున్న ప్రభుత్వం...ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులకు మాత్రం సర్వీసు ప్రొబేషన్ ఆరు నెలలు పొడిగింపు ఇచ్చారని..అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగానే చేయించుకుంటూనే తమను పక్కనపెట్టి అవమానించారని ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు మండల స్టాఫ్ వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో బయటకు వచ్చేయడంతో విషయాన్ని గమనించిన ఎంపీడీఓలు సచివాలయ కార్యదర్శిలతో సచివాలయ ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీచేయించింది. అయినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. అదే సమయంలో కార్యదర్శిలను మచ్చిక చేసుకొని, సచివాలయ ఉద్యోగులకు వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నమూ చేశారు. దీనితో విషయం తెలుసుకున్న ఉద్యోగులు కొన్ని జిల్లాల్లో బహిరంగంగానే తమ నిరసన తెలియజేసి మీడియా ముందుకి వచ్చారు. దీనితో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనను ఆ శాఖ జేసిలే అడ్డుకోలేకపోయారు.

 జెసిలు ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు పంచాయతీల్లోని గ్రేడ్ 5 కార్యదర్శిలపై మండిపడ్డారు..కొన్ని చోట్ల కార్యదర్శిలు సచివాలయ ఉద్యోగులకు నచ్చజెప్పాలని చూసినా, భయపెట్టాలని ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. పైగా ఆ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వారి వారి సామాజిక మాద్యమాల్లో షేర్ చేసి మరీ..అందరికీ తెలియజేసుకున్నారు సచివాలయ ఉద్యోగులు. అసలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులంగా మనం ప్రభుత్వాన్ని సరర్వీసు రెగ్యులర్ చేయమని అడగటమేంటని..అన్ని ప్రభుత్వశాఖల్లోనూ ఏవిధమైన నిబంధలు పాటిస్తున్నారో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనూ అవే నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ప్రభుత్వానికి ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖలో మాత్రం లేనిపోని నిబంధనలు, అన్నిరకాల పనులు అప్పగించి చేయించిన ప్రభుత్వం ఎందుకు తమను పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఇప్పటి వరకూ పనిచేసి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల కారణంగా గౌరవం తీసుకొచ్చిన ఉద్యోగులే ఇటు ప్రతిపక్షాల ముందు, అటు ఇతర ప్రభుత్వ శాఖ ముందు ప్రభుత్వానికి గాలి తీసేసే చర్యకు పూనుకున్నాయి...

 కాదు కాదు..ఈ విధంగా పూనుకునేలా ప్రభుత్వానికి తమ సొంత నిర్ణయాలు ఆపాదించే లా చేసిన కొంత మంది ద్వారా మాత్రమే జరిగిందనేది ఇపుడు తేటతెల్లమైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ మానస పుత్రికకు ప్రాధాన్యత ఇచ్చిన తరువాత ఇతర ప్రభుత్వశాఖలకు ప్రాధాన్యత ఇచ్చివుంటేపరిస్థితి వేరాలా ఉండేది. కాని దానికి వ్యతిరేకంగా జరగడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం చర్చనీయాంశం అవడంతోపాటు, ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చిపెట్టింది. సలహాలిచ్చేవారికి పరిపాలనపై పట్టులేకపోతే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయనే విషయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాల్సిందేనని వాదన సర్వత్రా వినిపిస్తున్నది.

Tadepalli

2022-01-08 17:27:18

ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. సచివాలయ ఉద్యోగులకు ఆ జీతం జూలై తరువాతే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్న వేళ.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతం విషయంలో అందించిన  కధనాలు మరోసారి అక్షర సత్యం అయ్యాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రస్తావించారు కూడా. అవును మీరు చదువుతున్నది నిజం.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు 2తో రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన తరువాత  వారికి కేవలం రూ.20 వేలు మాత్రమే జీతం అందుతుందని, మరో ఏడాది పాటు ఉద్యోగులు అదే రూ.15వేలు జీతానికి లేదా మరో ఐదు వేలు పెంచి  రూ.20వేలు చేసి మాత్రమే ఇస్తుందని(పీఆర్సీ అమలు జరిగితేనే అది కూడా)ముందుగానే ప్రత్యేక కధనాన్ని అందించింది. అయితే ఆ కధనాన్ని చూసిన సచివాలయ ఉద్యోగులు, మరి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఫేక్ వార్త అని, సత్యదూరమని కొట్టిపడేశాయి. అంతేకాదు ఎవరూ నమ్మ వద్దని పట్టించుకోవద్దని కూడా ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈఎన్ఎస్ కధనంలో చెప్పిన విధంగానే 2022 జూలై నెల జీతంలో అదీ పెంచిన జీతం జూలై నెల జీతంతో  అమలు చేస్తామని ప్రకటించింది. దీనితో ఈఎన్ఎస్ రాసే వార్తల్లో ఎక్కడా తేడాలు ఉండవని, అసత్యలు ఉండవని మరోసారి ప్రభుత్వ ప్రకటన ద్వారా తేటతెల్లం అయిపోయింది. తేడాగా ఆలోచించే ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు, ఈఎన్ఎస్ కధనాలను మరింత తేడాగా, తప్పుడుగా వారి వారి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసే వారికి ప్రభుత్వ ప్రకటనే ఒక చెంపపెట్టులా తగిలిందనేది అందరూ గుర్తుంచుకునేలా చేసింది.

ఇక్కడ రాష్ట్రప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు..తప్పు పట్టడం అసలే లేదనే విషయాన్ని కాస్త తేడాగాళ్లు గుర్తుంచుకోవాలి. కేవలం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత ఏ మీడియా సంస్థ వెలుగులోకి తేవని విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా బయటకు తీసుకు రావడంతో పాటు, ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలు, అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తామని అక్టోబరు 2నే ప్రకటించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అదే చేస్తున్నాం. ఇక ముందు కూడా అదే చేస్తాం.. అయితే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న న్యూస్ నెట్వర్క్ ను వినియోగించి తాజా విశేషాలను ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మధ్యలో ప్రజానికానికి చేరవేస్తున్నాం. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తయిన తరువాత కూడా రూ.15 వేల జీతం మాత్రమే వస్తుందని, లేదంటే మరో ఏడాది రూ.5వేలు పెంచి రూ.20 మాత్రమే జీతం అందుకుంటారని సరిగ్గా ఆరు నెలల క్రితమే ఈవిషయాన్ని ప్రత్యేక కధనంగా అందించాం. ఇపుడు అదే నిజమైంది. అంతేకాదు పీఆర్సీతోపాటు పెరిగిన జీతం జూలై నెల నుంచి మాత్రమే అమలు చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డే ప్రకటించడం కూడా విశేషం. అంటే ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ జీతం జనవరి నుంచే తీసుకుంటే ఒక్క సచివాలయ ఉద్యోగులే ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ చెప్పటినట్టుగా ఏడాది తరువాత రూ.20వేలు పెరిగిన జీతంగా తీసుకుంటున్నారు. అంటే ఏడాది పాటు పెరిగిన జీతం నష్టపోతున్నట్టే కదా(ఏమో చెప్పలేం ఏడాది తరువాత రెగ్యులర్ పేస్కేలు, పెంచిన పీఆర్సీ పే స్కేలు జూలై నెల జీతం కలిపి ఇచ్చినా ఇవ్వొచ్చు, లేదంటే ప్రభుత్వంపై భారం పడుతుందని ఇవ్వకపోవనూ వచ్చు)..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సమస్యలు, ప్రభుత్వం అమలు చేయని జీఓల విషయంలోనూ, ప్రొబేషన్ రెండేళ్లుపూర్తయినా వారి సర్వీసులు రెగ్యులర్ చేయని విషయంలోనూ, సాంకేతిక కారణాలను, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ ప్రత్యేక కధనాల రూపంలో అందిస్తున్నది. రానున్న రోజుల్లో కూడా అందిస్తుంది కూడా. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈఎన్ఎస్ వారి వెనుక ఉండి వారి సమస్యలను ప్రత్యేక కధనాల రూపంలో ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతుంది. అప్పుడైనా..ఇప్పుడైనా..ఎప్పుడైనా.. ఈఎన్ఎస్ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాత్రమే పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. వాస్తవానికి ప్రొబేషన్ పూర్తిచేసుకొని, ప్రభుత్వం పెట్టిన అన్ని టెస్టులు పాసైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెంచిన జీతం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు అమలు చేసి వుంటే సచివాలయ ఉద్యోగులకు కూడా చాలా ఆనందించేవారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. కనీసం సచివాలయ ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారాల్లో సైతం వారి సాధరణ పనులు చూసుకోకుండా ప్రభుత్వం కోసం పనిచేశారనే కోణంలో కూడా ఆలోచించలేదు. పైగా కరోనా పాండమిక్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందించిన సేవలు మాత్రం వెలకట్టలేనివి. చాలా మంది కరోనా మహమ్మారికి బలయ్యారు..మరికొంద మంది ఆ వైరస్ భారిన పడి మంచాన కూడా పట్టారు. అలాంటి సమయంలోనూ ఒక్క ఉద్యోగి కూడా ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులు నిర్వహించారు. కానీ ఇవేమీ ప్రభుత్వం పనిగణలోకి తీసుకోలేదు. ఆ విషయాలను కూడా ఈఎన్ఎస్ తన ప్రత్యేక కధనాల విషయంలో ప్రస్తావించిన పాఠకులకు తెలుసు.

అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు లబ్ది(జనవరి నెల నుంచి పీఆర్సీ అమలు చేసిన పెరిగి జీతం) సమానంగా చేకూరిందా అంటే లేదనే ప్రభుత్వ ప్రకటన ద్వారానే తేటతెల్లమైపోయింది. అంతేకాకుండా నాటి నుంచి నేటి వరకూ వీరి సర్వీసు రూల్సు విషయంలోనూ, వారి వారి ప్రభుత్వశాఖల జిల్లా అధికారుల ఆదేశాలు సచివాలయాల్లో అమలు జరిగే విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తరువాతనై తీసుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఫలితంగా చాలా మంది ఉద్యోగులు, ఇటు కొంతమంది పంచాయతీ కార్యదర్శిలు, కొద్ది మంది తేడా సచివాలయ కార్యదర్శిలు, మరికొంత మంది మండల అధికారుల ఓవర్ యాక్షన్ వలన నరకం చూడాల్సి వస్తుంది. చాలా కాలం తరువాత చాలా మంది పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువ మంది అన్నిశాఖల సిబ్బంది చూడటం ద్వారా వారి పైశాచికత్వాన్ని, తెలిసీ తెలయని ప్రభుత్వ నిబంధనలు(వీరిలో చాలా మందికి ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్, యాక్టు తెలియనే తెలియవనే విషయం గుర్తుంచుకోవాలి) అజమాయిషిని, దానికి కాస్త తేడా ఓవరేక్షన్  కూడా సచివాలయ ఇతరశాఖల ఉద్యోగులపై కూడా చూపిస్తున్నారు. ఇది ఈఎన్ఎస్ చెబుతున్న విషయం కాదు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు. సహచర ఉద్యోగులు పడుతున్న వేదనలు. అయితే సిబ్బంది కూడా తాము ఇబ్బంది పడుతున్నా బాధలు పడి సర్వీసు రెగ్యులైజేషన్ కోసం అంతా వేచి ఉన్నారు.

ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ పూర్తయిపోతే లెక్క తేడా వుంటుందని సంకేతాలు కూడా కొంత మంది ఉద్యోగులు ఇస్తున్నారు కూడా.. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడంతో వీరి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ కూడా మరో ఏడాది పొడిగింపు  జరుగుతుందని ప్రభుత్వం చెప్పకనే పీఆర్సీ ప్రకటించిన సమయంలో చెప్పేసింది. చివరిగా ఈఎన్ఎస్ చెప్పేది ఒక్కటే ప్రభుత్వానికే కాదు మరెవరికీ తాము వ్యతిరేకం కాదు, మరెవరకీ చేరువ అసలే కాదు.. ప్రభుత్వం చేసే అభివ్రుద్ధి, మంచి ఏస్థాయిలో పతాక శీర్షికలతో కధనాలు అందించామో..అదే సమయంలో కొందరు అధికారుల అనాలోచిత చర్యల వలన ప్రభుత్వానికి మచ్చవచ్చే సమయంలోనూ, అదే సమయంలో ఉద్యోగులు పడే ఇబ్బందులను, తద్వారా ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరును కూడా ఆదే స్థాయిలో ఆ విషయాలను,వాస్తవాలను బయటకు తీసుకు వస్తామని ప్రకటిస్తున్నాం. ఈ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఎవరికీ భయపడేది అసలే లేదని బల్లగుద్ది చెబుతున్నాం. తేడాగా ఆలోచించే వారి విషయంలో వాస్తవాల కధనాలతోనే ప్రజల ముందుకి వెళతామని, అందిస్తామని హెచ్చరిస్తున్నాం కూడా. ఈఎన్ఎస్ కథనాలు వాస్తవాలవడం ఇది మొదటి సారి కాదు, చివరి సారి అసలే కాదు..ఈ పరంపర జీవనదిలా కొనసాగుతూనే వుంటుంది..!

తాడేపల్లి

2022-01-08 04:27:26

జిఓనెం-2లో ఈఎన్ఎస్ చెప్పిందే అక్షర సత్యమైంది.. ప్రభుత్వమే ఆ జీఓను వెనక్కి తీసుకుంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలకు అధికారాలిస్తూ విడుదల చేసిన జీఓనెంబరు-2 విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పినట్టే జరిగింది. ప్రభుత్వం ఈ జీఓను వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. జీఓనెంబరు-2 విడుదలచేసి సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమించినపుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. ఈ జీఓ విడుదల విషయంలో వచ్చిన ఇబ్బందులు, ఆ తరువాత సాంకేతిక కారణాలు చాలా మందికి వీఆర్వోలకు కనీసం డిగ్రీ అర్హత లేకపోవడం, పరిపాలనపై పట్టులేకపోవడం, పంచాయతీల్లో సిబ్బంది వీఆర్వోలను డిడిఓలుగా అంగీకరించకపోవడం తదితర పరిణామాలపై ప్రత్యేక కధనాలు అందించింది. ఆ తరువాత సర్పంచ్ లు, కార్యదర్శిలు ఈవిషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గ్రామ పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని. దీనితో కంగారు పడిన పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామసచివాలయ వ్యవస్థకే ముసలం వస్తుందని భావించిన ప్రభుత్వం ఆ తరువాత వెంటనే జీఓని రద్దు చేయకుండా మళ్లీ డీడీఓ అధికారాలు పంచాయతీలు, సచివాలయ కార్యదర్శిలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మెమో జారీ చేశారు. ఈ విషయంలో కోర్టుకి వెళ్లిన పంచాయతీ సర్పంచ్ లు తమ వాదన బలంగా వినిపించడంతో గత్యంతరం లేక ప్రభుత్వం జీఓనెంబరు 2ను ఇపుడు వెనక్కి తీసుకుంటున్నట్టుగా హైకోర్టుకి తెలియజేసింది.

 ప్రభుత్వ పరిపాలన, జీఓలు అమలు, లోపాలు, సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, ముఖ్యం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ  విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యేక కధనాలు అందిస్తూ వచ్చింది. ఇకపై కూడా అందిస్తూనే వుంటుంది కూడా. అయితే అప్పుడు వాస్తవాలను ముందే గమనించి రాసిన సమయంలో ఈఎన్ఎస్ కధనాలను రాష్ట్ర వ్యాప్తంగా వున్న చాలా వీఆర్వోలు కొట్టిపడేశారు..ప్రభుత్వమే ఇపుడు ఆ జీఓను వెనక్కితీసుకుంటుందని హైకోర్టుకి తెలియజేయడంతో ఎవరైతే కామెంట్లు, ఓవరేక్షన్ చేశారో వారంతా ఇపుడు ముక్కున వేలుసుకున్నారు. ఈఎన్ఎస్ ప్రభుత్వ పరిపాలన విషయంలో అందించే పరిశోధనాత్మక కధనాలు, వాస్తవాలు జీఓనెంబరు 2 విషయంలో కూడా వొమ్ముకాలేదని, తన కధనాల్లో ఏవైతే విషయాలు ప్రస్తావిస్తూ ప్రచురించిందో అదేవిధంగా.. జీఓనెంబరు రద్దుకాక పోతే పాలనా పరమైన ఇబ్బందులు, కోర్టుల్లో ఇబ్బందులు తప్పవనే విషయాలు ఇపుడు తేటతెల్లమయ్యాయని ఎవరైతే కామెంట్లు చేసి..లైట్ తీసుకున్నారో వారందరికీ ఈఎన్ఎస్ కధనాలు కళ్లు తెరిపించాయి.

వాస్తవానికి గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో అధిపతిగా వున్న పంచాయతీ, సచివాలయ కార్యదర్శిలకే డిడిఓ అధికారాలుండాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పంచాయతీ కార్యదర్శిలే మొత్తం సచివాలయాలను, పంచాయతీలను పరిపాలిస్తుంటారు. అలాంటిది వారికి కాకుండా సిబ్బందిలో ఒకరైన వీఆర్వోకి డిడిఓ అధికారాలు కట్టబెట్టడం అనేది అవివేక చర్యగానే ఇపుడు తేలిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో రెండు, మూడు గ్రామ సచివాయలయాలు ఉన్నచోట కూడా పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు డిడిఓ అధికారాలు, జీఓనెంబరు-149ని అమలు చేసి అధికారాలు కట్టబెడితే ప్రభుత్వం అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149 విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకపోతే..గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలు వారి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత మళ్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే జీఓనెంబరు 2 విషయంలో ఏం జరిగిందో అపుడు కూడా తప్పని సరిగ్గా జిఓనెంబరు149ని కూడా అమలు చేయాల్సి వుంటుంది. అలాకాకుండా ముందుగానే అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి మద్దతు రావడంతోపాటు గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడానికి ఆస్కారం వుంటుంది..

Tadepalli

2022-01-05 05:17:14

రెండేళ్లు దాటిపోతున్నా అమలు కాని జీఓ-149..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల ప్రొబేషన్ రెండేళ్లు దాటిపోతున్నా జీఓనెంబరు 149 ఆధారంగా సంక్రమించాల్సిన అధికారాలు, విధులు, నిధులు మాత్రం పంచాయతీరాజ్ శాఖ వీరికి అమలు చేయలేదు. దీనితో రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు ఎలాంటి అధికారాలు లేని ఉత్సవ విగ్రహాల్లా కనీసం సంతకం పెట్టే అధికారం కూడా లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుంది. జీఓ నెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు వారు పనిచేసే సచివాలయ పరిధిని మొత్తం వీరికి అప్పగించాలసి వుంటుంది. దానికోసం మేజర్ పంచాయతీని విభజించి అందులోని నిధులను, విధులను, అధికారాలను కూడా బదలాయించాలి కానీ..ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలు ఏర్పాటై 26 నెలలు గడుస్తున్నా వీరికి మాత్రం ఆ అధికారాలను ప్రభుత్వం బదలాయించలేదు. దీనితో అధికారాలు ఇవ్వని జీఓలు ఎందుకు విడుదల చేయాలంటూ గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వం మరియు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ వ్యవహరా శైలిపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలందించాలని సచివాలయ కార్యదర్శిలు ఉద్యోగాల్లోకి చేరినా నాటి నుంచి నేటి వరకూ ప్రభుత్వం జీఓనెంబరు 149 ద్వారా చట్టబద్ధంగా తమకు రావాల్సిన అధికారాలను బదలాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం  రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు ఆరు వేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓల దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం నేటికీ ఫలితం లేకుండా పోయింది. తమకు అధికారాలు లేకపోవడం వలన ఆఖరుకి పారిశుధ్య నిర్వహణ కూడా సొంతంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎందుకు విధులు నిర్వహిస్తున్నామో తమకే తెలియడం లేదంటూ నిరసన తెలియజేస్తున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటి మరో మూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో అయినా ప్రభుత్వం గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, తమ సచివాలయ పరిధిని లెక్కల ప్రకారం విభజిస్తుందా లేదంటే ఇప్పటివరకూ ఎలాంటి అధికారమూ ఇవ్వకుండా పనిచేయించినట్టుగా వారితో విధులు నిర్వర్తించేలా చేస్తుందా అనేది తేలాల్సి వుంది..

Tadepalli

2022-01-01 05:19:38

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఎప్పుడు.. పేస్కేలు అమలయ్యేనా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ శాఖ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శాఖ విశేషాలు తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూసి శభాష్ అంటూ మెచ్చుకుంది.. ఇంత వరకూ బాగానే వున్నా.. ఇందులో పనిచేస్తున్న సుమారు లక్షా 30వేల మంది ఉద్యోగుల్లో కొంత మందికి మొన్న అక్టోబరు2తో రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.  అలా ప్రొబేషన్ పీరీయడ్ పూర్తియన మొత్తం ఉద్యోగులందరికీ సర్వీసు రెగ్యులర్ చేసి పేస్కేలు అమలు చేయాలి. కాని సర్వీసు ప్రొబేషన్ పూర్తయి 3 నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి, గ్రామ, వార్డు సచివాలయ శాఖ పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వశాఖల నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. వాస్తవానికి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగుల నుంచి అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు అక్టోబరు 2నాటికే సర్వీసు ప్రొబేషన్ తంతు ముగించి నంబరు 2 న ఇచ్చే జీతాలు పేస్కేలుతో కలిపి ఇవ్వాల్సి వుంది. ఆవిధంగా జరగకపోవడమే ఇపుడు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం అవుతుంది. 

 సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఇదే జీతాలు ఇస్తారని కొందరు, కాదు కాదు మరో ఐదువేలు కలిపి 20వేల రూపాయలు ఇస్తారని కొందరు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఈ తరుణంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఉద్యోగుల్లో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆనందం అయితే ఉంది తప్పితే తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా, పేస్కేలు అమలు చేస్తారా, రెండేళ్లు పూర్తయినా ఇంకా ఎందుకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసు రెగ్యులర్ ఎందుకు చేయలేదనే అనుమానాలు ఉద్యోగులను వెంటాడుతూనే ఉన్నాయి.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ శాఖను అయితే ఏర్పాటు చేసింది తప్పితే ఇందులో పనిచేసే సుమారు 14శాఖల ఉద్యోగులకు మాత్రం వారి విధులు, నిధులు, పరిధిలు మాత్రం రెండేళ్లు దాటిపోతున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది ..కాదు కాదు కావాలనే కొన్ని ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు ఈ విధంగా వ్యవహరించి ఉద్యోగుల్లోని ఆందోళనకు, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అన్నింటికంటే ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టిన దానికి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగిస్తారనే మాట ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఇదే జరిగితే అలా ప్రసూతి సెలువులు తీసుకున్నమహి ళా ఉద్యోగులు సహచర ఉద్యోగుల దగ్గర ఆరు నెలలు సర్వీసులో జూనియర్ గా మారిపోవడంతోపాటు, పదోన్నతులు కూడా కోల్పోయే ప్రమాదం వుంది.  ఈ విషయంలో ప్రభుత్వంలోని జిఏడీ ప్రకటన చేయాల్సి వున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ప్రసూతి సెలవులు తీసుకున్న ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఆరు నెలల గడువు పొడిగిస్తారనే భావను ఉద్యోగులు వచ్చేస్తున్నారు. కాగా కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రసూతి సెలవులకు, సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధం లేదని అధికారులు తెగేసి చెబుతున్న ప్రకటనలు కూడా సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీసు రూల్సు ఏం చెబుతున్నాయనే విషయంలో ప్రభుత్వ అధికారులకు సైతం క్లారిటీ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంతేకాదు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు సబార్టినేట్ సర్వీసు రూల్స్ 16హెచ్ విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ అంశం ఇపుడు మళ్లీ తెరపైకి వస్తుంది.

కాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ లో సాధారణ పనిదినాలు కంటే అత్యధికంగా 2వ శనివారాలు, ఆదివారాలతోపాటు అదనపు పనిగంటకు కూడా పనిచేసి రోజులున్నాయి. ఇవన్నీ ప్రభుత్వంలోని సర్వీసు రూల్సు నిబంధనలోని కావు. అయినా..అదనపు పనులు చేయించుకున్న ప్రభుత్వ శాఖల అధికారులు నిబంధనలు అమలు, ఇచ్చిన జీఓలు తమ విషయంలో ఎందుకు పాటించి అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు ‘ఆ ఒక్కటీ అడక్కు’అనే సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజలకు అహర్నిసలు సేవలు చేసినా..కరోనా కాటు బలైన ఉద్యోగులున్నా.. చాలామంది సచివాలయ ఉద్యోగులు నేటికీ కరోనా వ్యాధి భారిన పడుతున్నా ప్రభుత్వంలోని, ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలకు మాత్రం ఏమీ పట్టడటం లేదు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని నిబంధనలు, అదనపు పనిదినాలు, పనిగంటలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే చూస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసు రెగ్యులైజేషన్ కావడం ఆలస్యం కావడం పట్ల సచివాలయ ఉద్యోగుల్లో భయం నెలకొంది. వాస్తవానికి ఆ భయాన్ని ప్రభుత్వమే పోగొట్టాల్సి వున్నా నేటికీ సరైన ప్రకటన చేయకపోవడం విశేషం. ప్రభుత్వ నిబంధన ప్రకారం సర్వీసు రెగ్యులైజేషన్ కాస్త ఆలస్యంగా చేసినా.. ప్రభుత్వం ఉద్యోగ నియామక సమయంలో ఇచ్చిన నిబంధనల ఆధారంగా ఏ రోజుకైతే రెండేళ్ల సర్వీసు పూర్తయ్యిందో ఆ తేదీ నుంచి పేస్కేలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు, జీతం అమలు చేస్తారా లేదా అనేది కూడా ఇపుడు సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందో..!

Tadepalli

2021-12-21 05:07:16

జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మోకాలడ్డుతున్న జీఓనెంబరు-149..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, వ్యాధుల భారిన పడకుండా పరిరక్షిం చేందు ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ల అనాలోచిత నిర్ణయాల కారణంగా జీవోనెంబరు 149 మోకాలు అడ్డుతోంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి, జీఓనెంబరు-149కి లింకేంటనే అనుమానం మీకు కలిగితీరాలి. లేదంటే పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులు చేసే తప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు వస్తుందో.. గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల ద్వారా సేవలు ప్రజలు ఎందుకు పూర్తిస్థాయిలో అందకుండా పోతున్నాయో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా విభజించిన సచివాలయాల పరిధిలు ఆధారంగా విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని అప్పగించి ప్రజలు సేవలు చేయించాలి. పేరుకే ఆ జీఓ ఉంది తప్పితే దానిని రెండేళ్లుగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ అమలు చేసిన పాపన పోలేదు. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలుగానే రెండేళ్ల పాటు విధులు నిర్వహించాల్సి వచ్చింది. 

ఉత్తుత్తి కార్యదర్శిలు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీరంతా విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకూ వీరు సంతకం పెట్టే ఒక్క అధికారం కూడా పంచాయతీరాజ్ శాఖ వీరికి కల్పించలేదు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ప్రొబేషన్  రెండేళ్లు పూర్తవుతున్నతరుణంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు జరిగితే పల్లెలన్నీ అద్దంలా మెరిసిపోవాలి.. కానీ అలా జరగడం లేదు. దానికి కారణం గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలనే విషయం ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వంలోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు..మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు గుర్తించాల్సివుంది. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వీరిని జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శిలు లేని పంచాయతీలకు గ్రామ, వార్డు సచివాలయశాఖ జెసీల ఆదేశాలన్నాయంటూ వీరిని ఇన్చార్జిలుగా నియమించారు. దీనితో ఉద్యోగం చేసేచోట కంటే ఈ సీనియర్ కార్యదర్శిలకు ఇన్చార్జిలు ఇచ్చిన పెద్ద, మేజర్ పంచాయతీల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఈ తరుణంలో గ్రామస్థాయిలో పారిశుధ్యం పడకేస్తున్నది. కనీసం మేజర్ పంచాయతీల్లో వున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలైనా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే పారిశుధ్య సిబ్బంది వీరి మాట వినడం లేదు.

 కొద్దో గొప్పో పంచాయతీల్లో వింటున్నా, సానిటేషన్ సామాగ్రికి, బ్లీచింగ్ ఫౌడర్ గా పేరుపెట్టుకున్న తెల్లబూడిద చల్లేందుకు, వాటిని తీసుకోవడానికి గ్రేడ్-1 కార్యదర్శిల నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల దగ్గరకు గ్రేడ్-5 కార్యదర్శిలు వెళ్లి దేహీ అంటూ పారిశుధ్య సిబ్బందిని, సామాగ్రిని అడుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి. 60శాతం మేజర్ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు సక్రమంగా లేనే లేరు. వున్నచోట పనిచేయించడానికి సిబ్బంది తక్కువగా ఉండటం పంచాయతీ ప్రధాన కార్యదర్శి( గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకూ) గ్రేడ్-5  సచివాలయ కార్యదర్శిలకు అందుబాటులోకి లేకుండా పోతున్నారు. అందునా గ్రేడ్-5 కార్యదర్శిలకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో వీరు గ్రామస్థాయిలో పారిశుధ్య నిర్వహణ కూడా చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయాన్ని మండల, జిల్లా స్థాయి ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేరుగా వినతి పత్రం సమర్పించినా కనీసం చలనం లేదు. ఈ తరుణంలోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తడి, పొడి చెత్తవాహనాలు ప్రభుత్వ పంచాయతీలకు కేటాయించినా వాటిని వినియోగించడానికి డ్రైవర్లు సైతం లేని దుస్థితి నెలకొంది. దీనితో ఆ వాహనాలన్నీ పంచాయతీ కార్యలయాల ముందు అలంకరణ ప్రాయంగానే మిగిలిపోయాయి. అదే జీఓనెంబరు 149ని ప్రభుత్వం అమలు చేసి వుంటే..గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఉండేవి. ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి గ్రామస్థాయిలో అమలు చేయడానికి వీరికి పూర్తిస్థాయిలో అధికారాలుండేవి. పరిపాలన, పారిశుధ్య నిర్వహణ సదరు కార్యదర్శిలకు కేటాయించిన సచివాలయ పరిధిలో పూర్తిస్థాయిలో జరిగేది. 

ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లు సంయుక్తంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎదురయ్యే సమస్యలను, లోపాలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతూ వస్తున్నది. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలో కనీసం చలనం రాలేదు.  ఈ శాఖలో జరుగుతున్న తప్పులు, లోపాలు, సమస్యలు ప్రజలకైనా, ప్రజలను పాలించే ప్రజాప్రతినిధులకై అర్ధమవ్వాలనే సంకల్పంతోనూ.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో మంచి ఆశయంతో, లక్ష్యంతో, ప్రజలకు సేవసేయడానికి ప్రవేశపెట్టిన పథకాలకు ప్రభుత్వశాఖల ముఖ్య అధికారులే ఏ విధంగా గాలితీసేస్తున్నారో తెలియజేసే ఉద్దేశ్యంతోనే ఈ ప్రత్యేక కధనాలను ప్రజల ముందుకి తీసుకు వస్తున్నాం. అదే సమయంలో మంచి కార్యక్రమాలను కూడా అంతకంటే పెద్దస్థాయిలోనే ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియజేయడంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, బాధ్యతగా వ్యవహరిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జీఓ నెంబరు 149 అమలు విషయంలోనూ, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు, సచివాలయాల పరిధిలు కేటాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే తప్పా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమమే కాకుండా మరే ఇతర కార్యక్రమం, పథకాలు, సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాల్సి వుంది..చూడాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ద్రుష్టిపెడతారా లేదా అనేది..!

Tadepalli

2021-12-18 05:32:14

వారి సర్వీసు రెగ్యులరైజేషన్ కి 6నెలలు ఆగాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ ఆరునెలలు పొడిగించనున్నారు. ఫలితంగా ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా సర్వీసులో ఆరు నెలలు సీనియారిటీ కోల్పోయి సహచర ఉద్యోగుల దగ్గర జూనియర్ లుగా మారిపోబోతున్నారు. దీనితో ఇపుడు ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులంతా లబో దిబో మంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో ఆరు నెలలు వీరు అదే 15వేల రూపాయల జీతానికే పనిచేయాల్సి వుంటుంది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు అక్టోబరు 2నాటికి క్రమబద్దీకరించాల్సి వుంది. కానీ ప్రభుత్వ ఆ తేదీకి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ చేయలేదు. ఆ నెలలో జిల్లా కలెక్టర్ల ద్వారా సమాచారం సేకరించి ప్రభుత్వశాఖల వారీగా సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారభించింది. ఆ సమయంలోనే అన్నిశాఖల ఉద్యోగులతోపాటు, మహిళా ఉద్యోగుల నుంచి సెలవుల జాబితాలు సేకరించిన సమయంలో ఈ విషయం తేటతెల్లమైంది. సచివాలయాల్లోని అందరు మహిళా ఉద్యోగుల నుంచి ప్రసూతి సెలవులు, మెడికల్ లీవులకు సంబంధించిన సెలవుల జాబితాను శాఖల వారీగా ప్రభుత్వం తీసుకుంది. అలా ప్రసూతి సెలవులు తీసుకున్నవారందరికీ సర్వీసు మరో 6 నెలలు పొడిగింపు వర్తిస్తుందని జిల్లా శాఖల అధికారులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం సచివాలయ మహిళా ఉద్యోగుల్లో నెలకొంది.   

అయితే ప్రభుత్వంలోని కొన్నిశాఖల అధికారులు మాత్రం సర్వీసు రెగ్యులరైజేషన్ కి, మెటర్నటీ లీవులకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ దానికి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవని కూడా అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు అన్నిరకాల లీవుల సమాచారం సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా శాఖల అధికారులు సేకరించారు. రెండేళ్లు పూర్తిచేసుకున్నవారి నుంచి సర్వీసు రెగ్యులరైజేషన్ కి సంబంధించి ప్రొఫార్మాను జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆ సమయంలో జిల్లా అధికారులు చేసిన సూచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ మహిళా ఉద్యోగుల గ్రూపులో పెద్ద ఎత్తున చర్చనడుస్తున్నది. రెండేళ్లు సమయం కేవలం 15వేలు జీతానికి పనిచేసిన సచివాలయ మహిళా ఉద్యోగులంతా మరో ఆరు నెలల పాటు అదే జీతానికి పనిచేయడానికి సిద్దంగా లేరనేది ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చల శారాంశం.

పోనీ 6 నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కోసం వేచి వుంటే సహచర ఉద్యోగుల దగ్గర సర్వీసు విషయంలో వీరంతా ఆరు నెలలు జూనియర్లుగా మారిపోతారు. అంతేకాకుండా ప్రమోషన్ సమయంలో వీరికి ఆరునెలల సమయం వలన చాలా ప్రయోజనాలు కోల్పోపోయే ప్రమాదం వుంది. ఈ తరుణంలో ప్రభుత్వం పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు మేలు చేసినట్టే, ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఏదైనా తీపి కబురు చెబుతుందాని అంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీఎన్జీఓ నేతలు కూడా సచివాలయ ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి వీరికి సర్వీసు రెగ్యులరైజేషన్ సమయానికి పూర్తయితే పర్వాలేదని, లేదంటే  ఈ విషయంలో కోర్టుకెళ్లడమే ఉత్తమంగా సచివాలయ మహిళా ఉద్యోగులంతా భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.  ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరుకి ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ఒక క్లారిటీకి రావాలని ఉద్యోగులంతా భావిస్తున్నారని సమాచారం. 

అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆది నుంచి సమస్యలపైనా, అభివ్రుద్ధి కార్యక్రమాలపైనా, ప్రభుత్వ శాఖల అధికారుల తేడా వ్యవహారాలపై అక్షర సమరం చేస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ న్యూస్ యాప్ enslive, అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లతో ఇప్పటికే ఈ సమస్య నుంచి మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో ఒక మంచి మార్గం చూపించడానికి రంగంలోకి దిగింది. దీనికోసం అంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నిబందనలపై అధ్యయనం చేస్తున్నది. అంతేకాకుండా ఇలాంటి సమస్య వచ్చినపుడు గతంలో కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టుకి వెళ్లినపుడు వచ్చిన తీర్పులను కూడా న్యూఢిల్లీ నుంచి తెప్పించే పనిలో పడింది ఈఎన్ఎస్. అంతేకాకుండా మహిళా ఉద్యోగలకు జఠిలంగా మారిన ఈ సమస్యను పరిష్కరించడంలోనూ, ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకెళ్లడంలోనూ ప్రత్యేక ద్రుష్టిసారించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా, వారి పక్షాన ఈఎన్ఎస్ అండగా నిలబడుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. తల్లికావడమే సచివాలయ ఉద్యోగులు చేసిన పాపంగా ఇపుడు వారి సర్వీసు రెగ్యులైజేషన్ మరో ఆరు నెలలు వెనక్కి వెళితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అదైర్య పడకండి సచివాలయ ఉద్యోగుల్లో తల్లులుగా మారి సర్వీసు రెగ్యులైజేషన్ ఆరనెలలు పొడిగింపడిన వారి పక్షాన నిలిచి న్యాయం జరిగేలా ఈఎన్ఎస్ వంతు క్రుషిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం..

Tadepalli

2021-12-16 02:46:24

గ్రామ సచివాలయ మహిళా పోలీసుల గమ్యం ఎటు..? జీఓనెంబరు 59 పరిస్థితేంటి..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి చిక్కులూ లేకుండా గడిచిన వీరి విధులకు సరిగ్గా ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయంలోనే అన్ని రకాల అడ్డంకులూ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అదేసమయంలో ప్రభుత్వం కూడా హైకోర్టులో పడిన కేసుతో డోలాయమానంలో పడింది.  గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలుగా వున్న వీరిని జీఓనెంబరు 59తో మహిళా పోలీసులుగా మార్చింది పోలీస్ శాఖ. అప్పటి నుంచి కొంత కాలం ఐసిడిఎస్, పోలీస్ 2శాఖల్లోనూ విధులు నిర్వహించిన వీరు జీఓనెంబరు 59తో వీరి బాధ్యతలు, విధులు పోలీసు శాఖకే అత్యధికంగా కేటాయించారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టుని ఏర్పాటుచేయడం ఇష్టంలేని కొందరు పోలీసు సిబ్బంది, మరికొందరు దురుద్దేశ పరులు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్ధేశ్యంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఆ సమయంలో మహిళా పోలీలసును  చులకనగా చూస్తూ.. మీరు మా పోలీసులతో సమానం కాదని, మీరు ఎంత కాలంల ఈ పోస్టుల్లో ఉంటారో కూడా చూద్దామనే కామెంట్లు కూడా చేసినట్టు భారీగానే ప్రచారం జరిగింది. మహిళా పోలీసులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసిన విషయాన్ని గమనించి,  వీరి నియామకాలు చెల్లవంటూ కోర్టు కెక్కారు. ఇది వాస్తవానికి  అయినా..గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం వీరిని నియమించి రెండుళ్లుగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ కల్పిస్తూ వస్తుంది. ఏది ఎలా జరిగినా కేసు కోర్టుకి వెళ్లిన తరువాత ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలి.. అలా దాఖలు చేసే సమయంలో మళ్లీ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి జిఓనెంబరు 59ని ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకి తెలియజేసింది. అంతేకాకుండా వీరిని గ్రామసచివాలయాల్లోనే ఉంచి ఏ శాఖ ద్వారా విధులకు వినియోగించాలి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రకటన కూడా చేసింది. ఈ తరుణంలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులంతా తమ ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లిందనే భావనతో నేరుగా రాష్ట్ర పోలీసు ముఖ్య అధికారి డిజీపి గౌతం సవాంగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమను పోలీసుశాఖలోనే ఉంచాలని, యూనిఫారం ఇవ్వాలని, శిక్షణ ఏర్పాటు చేయాలని అర్జీ పెట్టారు. ఆ సమయంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. జీఓ నెంబరు 59ని ఉపసంహ రించుకోలేదని.. మహిళా పోలీసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పడం. వాస్తవానికి కోర్టులో మహిళా పోలీసులను పోలీసుశాఖలోకి విలీనం చేస్తూ చేసిన జిఓ నెంబరు 59ని ఉపసంహరించుకున్నట్టు పోలీస్ శాఖ హైకోర్టుకి తెలియజేసింది. ఇపుడేమో మహిళా పోలీసులు అర్జీ పెట్టిన సమయంలో ఆ జీఓను ఉపసంహచరించుకోలేదని చెప్పడంతో మహిళా పోలీసులంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఇదే గ్రామ, వార్డు మహిళా పోలీసుల్లో కొందరు ఖాకీ డ్రెస్సు వేసుకోవడం ఇష్టం లేని మరో వర్గం వారంతా తమను ఐసీడీఎస్ లో విలీనం చేయాలంటూ అధికారులను సంప్రదించడంతో..అసలు గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసుల పోస్టు అనేది ఉంటుందా..? ఊడుతుందా అనేది క్లారిటీ రాకుండా పోయింది. కానీ డీజీపీ గౌతం సవాంగ్ మాత్రమం తమకు అన్యాయం జరుగుతుందని మహిళా పోలీసులు అర్జీలు పెట్టే సమయంలో నేరుగా వారిని సముదాయిస్తూనే..కోర్టుకు అఫడవిట్లు దాఖలు చేసే సమయంలో జీఓను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి, సర్వీసులు రెగ్యులర్ అయ్యే సమయానికి మహిళాపోలీసులందరినీ గాల్లో పెట్టడానికి కావాలనే కొందరు పథకం రచించి ఈ రకమైన కోర్టు కేసుల ద్వారా రెగ్యులర్ చేసే సమయాన్ని పొడిగించాలని ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అయితే ఆ విషయం గ్రామ సచివాలయలయంలోని చాలా మంది మహిళా పోలీసులకు అర్ధం కావడం లేదని, దీనితో పోలీసు ఉన్నతాధికారులను కలిసి అర్జీలు సమర్పించే సమయంలో అధికారులు చేసిన ప్రకటనలు మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఆందోళన రేకిస్తున్నాయనే అంశాన్ని ఇపుడు తెరపైకి తీసుకు వస్తున్నారు. హైకోర్టుకి జీఓనెంబరు 59ను ఉస సంహరించుకుంటున్నట్టు తెలియజేసిన పోలీస్ శాఖ..ఇపుడు మహిళా పోలీసులు నేరుగా వెళ్లి తమ ఉద్యోగాలు ఇక్కడే కొనసాగించాలని కోరిన సమయంలో జీఓనెంబరు 59ని ఉప సంహరించలేదని ప్రకటించడం వెనుక మర్మం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నా.. తరువాత మరింత పటిష్టంగా దానిని రూపొదింస్తారా..? అనే వాదన కూడా తెరపైకి వస్తుంది? ..మూడు రాజధానుల విషయంలో ఇచ్చిన జీఓను వెనక్కి తీసుకొని..మరింత పటిష్టంగా మళ్లీ తిరిగి జీఓను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టుగా మహిళా పోలీసుల విషయంలోనూ ఆ విధంగా ప్రకటించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2021-12-14 04:17:02

గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతిసెలవులపై నోరు మెదపని ఏపీఎన్జీఓ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మహిళా ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ముందుండే ఏపీఎన్జీఓ కూడా గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో నోరు మెదపకపోవడం ఉద్యోగులకు అసహనాన్ని కలిగిస్తున్నది. రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా వున్న ఏపీఎన్జీఓ సచివాలయ ఉద్యోగుల విషయంలో అనేక డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చని ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కూడా సిద్దపడింది. ఈ తరుణంలో వారికి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగు మద్దతు చాలా అవసరం. అయితే ఈ ఉద్యోగుల విషయంలో ఎల్లప్పుడూ ప్రకటనలు తప్పితే సీరియస్ గా వ్యవహరించిన దాఖలాలు లేవు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు తీసుకున్న దానికి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మరో ఆరు నెలలు వెనక్కి వెళుతుందనే విషయం, గ్రేడ్5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 అమలు చేయకపోవడం, అక్టోబరు 2నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయకపోవడం, వివిధ కారణాలతో ప్రభుత్వం కాలయాపన చేయడం, ప్రక్రుతి విపత్తు కరోనా నెపంతో రెండవ శనివారాలు, ఆదివారాలు అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వ అధికారుల  విషయంలోనూ ఏపీ ఎన్జీఓ సక్రమంగా నోరు మెదకపోవడం పట్ల సచివాలయ ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓకి తమ మద్దతు ఇవ్వాలా వద్దా అనే చర్చకు సామాజిక మాద్యమాల్లో తెరలేపారు. ఇదే సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు  పీఆర్సీ, డీఏలు, ఎరియర్స్ విడుదల సమస్యలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపైనా ఏపీఓ ఎన్జీఓ పోరాటం చేస్తుందని చెప్పినా గ్రామసచివాలయ ఉద్యోగులు ఎవరికీ నమ్మకాలు అయితే లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేతలు ఎక్కడికి వెళ్లినా గ్రామసచివాలయ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈరోజు విశాఖలో జరిగే రాష్ట్రనేతల సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రధాన సమస్యలపై స్పందించకపోతే, తమ యూనియన్ల ద్వారా మాత్రమే పోరాటం చేస్తాం తప్పితే ఏపీఎన్జీఓతో అంటీ ముట్టనట్టు ఉండాలనే భావనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వచ్చినట్టు సామాజిక మాద్యమాల్లో చర్చలు నడిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై విశాఖలో జరిగే సమావేశంలో ఏ మాట్లాడి, ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతారనిదే ఇపుడు చర్చనీయాంశం అయ్యింది..

Visakhapatnam

2021-12-07 03:18:14

విశాఖ మన్యంలో డోలీమోతలు లేకుండా చేస్తాం..

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తో కలిసి  మండలంలోని మూలపేట గ్రామ పంచాయతీ పాలమామిడి ఆదివాసీ గిరిజన గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఉదయం 6.30 గంటలకు డౌనూర్  చేరుకుని  బచ్చింత గ్రామం నుంచి కాలినడకన వెళ్లి గెడ్డ దాటి సుమారు నాలుగు  కిలోమీటర్ల దూరం (ఒక ప్రక్క) కొండలపైకి నడిచి మూలపేట పంచాయతీ పాలమామిడి గ్రామాన్ని చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డోలీ మోతల నివారిస్తామని చెప్పారు గ్రామానికి విద్యుత్, తాగునీరు, రహదారి, పాఠశాల భవనం లేదని గిరిజనులు  ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  గ్రావిటీ తాగునీటి పథకం, రహదారి నిర్మాణం పాఠశాల  భవనం నిర్మిస్తామని చెప్పారు. ఆర్వో ఎఫ్ ఆర్  పట్టాలు ఎంత మందికి మంజూరు చేసారని ఆరా తీశారు.  పంచాయతీ లో 400 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశామని సబ్ కలెక్టర్ వివరించారు. డోలీ మోతల గ్రామాల కష్టాలను ఐటీడీఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ వివరించారు. గతొలుత డౌనూర్ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల లో జరిగిన మన బడి నాడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు పరిశీలించారు. వంట పరిశీలించి మెనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత డౌనూర్ గ్రామ సచివాలయం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. సచివాలయం వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే వివరించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేవను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి, పురుషులు వార్డు, ఫార్మసీలో మందులు, ల్యాబ్ ను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఔషధ మొక్కలు నాటాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ట్రైకార్ ఎం డి ఈ.రవీంద్రబాబు ,గిరిజన సంక్షేమశాఖ డిడి  జి.విజయకుమార్, ఎస్ ఈ  ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2021-11-23 12:09:27

సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. 3 రాజధానుల బిల్లు వెనక్కి..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానిబిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఏజీ ఈ విషయాన్ని హైకోర్టుకి తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మూడు రాజధానుల విషయమై రాష్ట్రం పెద్ద స్థాయిలో చర్చనడుస్తుండటం, అదే సమయంలో టీడీపీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పట్టుబట్టిన నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా అసెంబ్లీలో ప్రకటించనున్నారు.                                                                                           

Tadepalli

2021-11-22 07:30:33

మహిళా ఉద్యోగులకు ప్రసూతి శాపం.. సర్వీసు రెగ్యులైజేషన్ కి నిభందనల కళ్లెం..

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవే వుండదనే నానుడి మీకు గుర్తుండే వుంటుంది.. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులూ చేయని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు సాధారణ సెలవుదినాల్లోనూ ఉచితంగా చేసే అధనపు విధులు చూస్తే అచ్చు అదే గుర్తుకు వస్తుంది అందరికీ.. ఏంటీ ఏదో తేడా కొడుతుంది అనుకుంటున్నారా..నిజంగానే తేడా కొట్టింది.. ప్రభుత్వ సెలవుల్లో ప్రత్యేకంగా అదనపు విధులు విధులకు పిలిచి సాధారణ ఉద్యోగ సమయం కంటే అధికంగా  పనిచేయించుకోవడానికి అడ్డు రాని నిబంధనలు హఠాత్తుగా ప్రభుత్వానికి ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి నిభందనలు అడ్డువచ్చాయని వారిని ఓ ఆరు నెలలు వెనక్కి నెట్టేందుకు చూస్తున్నారు అధికారులు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం సాధారణ సెలవుల్లో ఉద్యోగులకు అదనపు విధులు ప్రభుత్వం అప్పగించకూడదు. అలా తప్పక అప్పగిస్తే చేసిన పనికి లెక్క కట్టాలి.. అది జీతంతోపాటు కలిపి ఇవ్వాలి. కానీ అది గ్రామ, వార్డు సచివాలయ శాఖలో జరగదు, ప్రభుత్వానికి అసలు ఆ నిబంధనే గుర్తులేదు. ప్రభుత్వ ఉద్యోగులకు దొరికే ఆ ఒక్కరోజు ఆదివారం, లేదా రెండవ శనివారాల్లోనే ప్రభుత్వానికి, సచివాలయ శాఖలో మిలితంగా వున్న 11 ప్రభుత్వ శాఖలకు అత్యవసరంగా పని పడుతుంది. అనుకున్నదే తడువుగా జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో వారికి ఆ సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా డ్యూటీలు వేస్తారు. అదేమంటే చెప్పింది చేయడమే మీ పని.. దానికి లాజిక్కులు, జీఓలు, రూల్సు మాట్లాడకూడదు అంటూ బెదిరింపులకు దిగుతారు అధికారులు. అసలే కొత్తగా వచ్చిన ఉద్యోగం, పూర్తిస్థాయిలో జీతం రాకపోయినా ఇచ్చే ఆ రూ.15వేలతో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు ఇపుడు వారానికి దొరికేది ఒక్కరోజు సాధారణ సెలవులు ఇంట్లో కనీసం బట్టలు ఉతుక్కునే అవకాశం కూడా లేకుండా ఆదివారం, రెండవ శనివారాలు ప్రత్యేకంగా చేసే ఉచిత విధులకే పోతున్నాయి. అయినా పర్లేదు ప్రభుత్వం తమని గుర్తిస్తుందీ అనుకుంటే ఇపుడు గుండెలపై బండరాయి వేసింది. అదే రెండేళ్ల కాలంలో ప్రసూతి సెలవులు మహిళా ఉద్యోగులు పెట్టుకున్న ఆ సెలువులు పూర్తయ్యే వరకూ సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తికాదనే అతి బరువైన మాట. 

తోటి ఉద్యోగులంతా రెండేళ్లు పూర్తికాగానే వారి సర్వీసులు రెగ్యులర్ అయిపోతున్న తరుణంలో మహిళా ఉద్యోగులు మాత్రం తమకు మాత్రుత్వం మిగిల్చిన కష్టంతో మరో ఆరు నెలలు వేచి వుండే పరిస్థితి దాపురించింది. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనే నిబంధన ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తాయి. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక్క సచివాలయ శాఖలోనే ఆ నిబంధన అమలు కాలేదు. కాదు కాదు అమలు చేయలేదు. సెలవు రోజుల్లో  అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వానికి ఆ సమయంలో గుర్తుకి రాని నిబంధనలు..తీరా తమ సర్వీసులు రెగ్యులర్ చేసే సమయానికి మాత్రం అసలైన జీఓలన్నీ తెరపైకి వస్తున్నాయంటూ మహిళా ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు. గర్భం దాల్చిన సమయంలోనూ తమతో సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా ఉచితంగానే అదనపు విధులు చేసేలా చేసిన మండల, జిల్లా అధికారులు ఇపుడు తీరా సర్వీసు రెగ్యులైజేషన్ సమయం వచ్చేనాటికి మాత్రం నోరు మెదపడం లేదని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని సుమారు లక్షా 24 వేలకు పైగా వున్న ఉద్యోగుల్లో 50శాతం వున్న మహిళా ఉద్యోగుల్లో ప్రసూతి సెలువులు పెట్టిన వారికి సర్వీసులు మరో ఆరు నెలలు పొడిగించే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన వారందరికీ సర్వీసు క్రమబద్దీకరణ చేస్తున్న తరుణంతో ఈ ప్రధాన అంశం తెరపైకి వచ్చింది. మెటర్నటీ లీవుతోపాటు, మెడికల్ లీవులు పెట్టిన వారికి సైతం సదరు సెలవులు పూర్తయ్యే వరకూ వారియొక్క సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి తమ తప్పులేదని చెప్పే ఉద్దేశ్యంలో మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను, ఇతరుల మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా వారికి సర్వీసులు రెగ్యులర్ చేయాలని ఒక అర్జీ పెట్టి ఊరకుండిపోయింది. అర్జీతోపాటు రెండేళ్లుపాటు కరోనా వైరస్ భయంకరంగా విజ్రుంభించిన వేళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గానీ, ప్రస్తుతం కూడా సాధారణ సెలవుల్లోకూడా ఉచితంగానే అదనపు విధులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని గానీ, రెండేళ్లలో పేస్కేలు జీతంలో చాలా కోల్పోయారని కానీ, ప్రత్యేక సమయంలో అదనపు పనిగంటలు కార్యాలయాల్లో పనిచేస్తున్నారని గానీ, కోవిడ్ వేక్సినేషన్ లో ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారనే అంశాలను ఆ అర్జీలో పొందు పరచలేదు. సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేయించుకుందో వాస్తవానికి ప్రభుత్వానికే తెలియాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత రికార్డుస్థాయిలో కోవిడ్ సమయంలోనూ ఉద్యోగులు పనిచేశారని, చాలా మంది కోవిడ్ భారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారని.. ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ చేసే సమయంలో నిబందన కొర్రీలు పెట్టడం చాలా ఆవేదనకు గురి చేస్తుందని సచివాలయ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అందునా మహిళా ఉద్యోగులైతే బిడ్డలకు జన్మనిచ్చిన సమయంలో తీసుకున్న సెలవులే తమకు శాపాలయ్యాయని పడుతున్న బాధ వర్ణణా తీతం. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధంగా అయితే సర్వీసు నిబంధనలను పక్కన పెట్టి సాధారణ సెలవుల్లోనూ, కరోనా స్పెషల్ డ్యూటీ, రెండవ శనివారాల్లో ఇంటింటి సర్వేలు, పంచాయతీ పన్నులు వసూళ్లు, మదింపులు విధులు సచివాలయ ఉద్యోగులతో ఉచితంగానే చేయించుకుందో..అదే రీతిగా వీరి ప్రసూతి, మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుందని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి.. అదనపు పని చేయించుకోవడానికి నిబంధనలు అడ్డురావు కానీ.. సర్వీసు రెగ్యులైజేషన్ కి మాత్రం ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయని చెబుతుందా.. లేదంటే ప్రభుత్వం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం సెలవు రోజుల్లో చేసిన అదనపు సెలవులను గుర్తుంచుకొని అందరికీ రెండేళ్లు పూర్తికాగానే ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసులు రెగ్యులర్ చేస్తుందో..!

Tadepalli

2021-11-11 02:32:51

గ్రామ సచివాలయాలకు 2ఏళ్లుపూర్తి.. జీఓ.నెం.149 అమలు మాత్రం నాస్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు.149 ద్వారా అధికారాలు బదలాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ ఇంకామీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెత్తీనోరూ కొట్టుకుంటూ ఏపనైనా ప్రభుత్వ జీఓ ప్రకారమే ఖచ్చితంగా చేయాలని ప్రతీ సమావేశంలో ఆదేశించినా.. జీఓలను అతిక్రమమించ వద్దని సూచించినా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఫలితంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్నా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎలాంటి అధికారాలకు నోచుకోలేదు. పేరుకి సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నా ఎలాంటి అధికారం ప్రభుత్వం కల్పించకపోవడం వీరంతా నేటికీ ఉత్సవ విగ్రహాల్లానే నిలబడాల్సి వస్తుంది. అసలు తమను ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో సచివాలయాలకు కార్యదర్శిలుగా నియమించిందో అర్ధం కావడం లేదని, అమలు చేయని జీఓలను ఎందుకు విడుదల చేసిందో తెలియడం లేదని గ్రేడ్-5 కార్యదర్శిలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4  పంచాయతీ కార్యదర్శిలకంటే అత్యధికంగా పంచాయతీల్లో పనులు చేస్తున్నా,  తమను మాత్రం ప్రభుత్వం చిన్నచూపే చూస్తుందని ఫలితంగా ప్రజలకు అధికారికంగా ఎలాంటి సేవలు అందించలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. దేశం మొత్తం తొంగిచూసేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తమను సిబ్బందిగా నియమించిందనే పేరు, ఆనందం కంటే.. నియమించి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదనే బాధ, నిరాసే అధికంగా వుందని కార్యదర్శి మొహాలు చిట్లిస్తున్నారు. ఒక దశలో తాము ఎందుకు పనిచేస్తున్నామో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వమైనా ఒక జీఓను విడుదల చేస్తే దానిని అమలు చేస్తుందని..విచిత్రంగా జీఓ ఇచ్చిన తరువాత రెండేళ్లు గడిచినా జీఓలను అమలు చేయని రాష్ట్రప్రభుత్వ అధికారులను ఇక్కడే చూస్తున్నామని సచివాలయ సిబ్బంది చీదరించుకుంటున్నారు. ప్రజలకు ఏదో చేద్దామని ఎంతో ఉన్నత ఆశయంతో ఉద్యోగాల్లోకి చేరితే..నాటి నుంచి నేటి వరకూ ఏ అధికారం లేకుండా ఉన్న సిబ్బందిని సూపర్ వైజ్ చేయడానికి తాము పనిచేస్తున్నట్టు అవుతుందని చెబుతున్నారు. ఆదిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇక జీఓలను పూర్తిగా తమ శాఖ ఉన్నతాధికారులే పక్కనపెట్టేస్తారని దానికి ప్రత్యేక ఉదాహరణ జిఓనెంబరు 149 గా నిలుస్తుందని అంటున్నారు.

మరోరా సారి కోర్టులో భంగపాటు తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి భంగపాటు పంచాయతీరాజ్ శాఖ ద్వారానే కలిగేటట్టు కనిపిస్తుందనే  సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంభించి, నిబంధనలను, జీఓలను అమలు చేయని శాఖగా అత్యధిక కోర్టు కేసులు ఎదుర్కొంటున్న  పంచాయతీరాజ్ శాఖ గ్రేడ్-5 కార్యదర్శిలు తమ అధికారాలు, విధులు, నిధులు బదాలాయింపు జీఓనెంబరు 149 ద్వారా చేయాలని కోర్టుకి వెళితే మరోసారి సారి వార్తల్లో నిలిచేలా వుందంటున్నారు విశ్లేషకులు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు ఉద్దేశ్య పూర్వకంగానే గ్రేడ్-5 కార్యదర్శిలకు రావాల్సిన అధికారాల బదాలాయింపు జీఓనెంబరు 149ని తొక్కిపెట్టారనే విషయం ఇప్పటికే రెండేళ్లుగా స్పష్టమవుతూనే వుంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించే పనికూడా ఉండదు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన అధికారాలన్నీ ప్రభుత్వం జీఓ ద్వారానే కల్పిస్తుంది. అలా అధికారాలు ఇవ్వడానికే ఇచ్చిన జీఓనెంబరె 149ని మాత్రం గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అలుచేసి అధికారాలు కల్పించలేదు. అధికారాలులేని ఉద్యోగం కల్పించడం ఎందుకని రేపుపొద్దున్న వీరంతా వేసిన కేసులో కోర్టు ప్రశ్నిస్తే అధికారులు అక్కడ కూడా తెల్లమొహం వేసే పరిస్థితి ఎదురవుతుంది. 

ఇప్పటికే డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శి నుంచి వీఆర్వోలకు బదిలీ చేసిన విషయంలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న పంచాయతీరాజ్ శాఖకు అప్పట్లో కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు..అదే పంచాయతీలు ఉండగా గ్రామసచివాలయాలు ఎందుకు అదనంగా ఏర్పాటు చేశారనే గుర్తున్నా.. ఆమాటలతో మళ్లీ డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించినా.. ఎందుకనో గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో మాత్రం మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ సమయంలోనే తమ సర్వీసులు రెగ్యులర్ కాకుండా కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండాలని బావించిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా సర్వీసు రెగ్యుల్ అయిన మరుక్షణం తమ అధికారాల కోసం కోర్టుకి వెళ్లి ప్రభుత్వాన్ని, పంచాయతీరాజ్ శాఖను ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంత వరకూ తాము అధికారులే జీఓనెంబరు 149 అమలు చేస్తారని భావించామని, ఈ విషయంలో ఎంపీడీఓలు, డీపీఓలు, జెసి, జిల్లా కలెక్టర్ ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం వినతి పత్రాలు ఇచ్చినా అవి బుట్టదాఖలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమకి న్యాయం జరగాలన్నా, ప్రజలకు తమను నుంచి సేవలు అందాలన్నా అధికార బదలాయింపు జరగాల్సిందేనంటున్నారు గ్రేడ్-5 కార్యదర్శిలు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది..!

Tadepalli

2021-11-01 05:45:47