1 ENS Live Breaking News

మహిళా పోలీసులకు ఆ ఎస్పీ రోల్ మోడల్..

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని సుమారు 14న్నరవేల మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ రోల్ మోడల్ గా మారిపోయారు. సచివాలయాలు ఏర్పాటైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక్క పోలీసు అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 129, 59లను శాఖా పరంగా క్రింది స్థాయి ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తెలియజేసి..వారిని పోలీసులుగా గుర్తించే ఏర్పాటు చేయలేదు. మహిళా పోలీసులు సాధారణ పోలీసులనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిందేననే ఆదేశాలు జారీచేసిన దాఖలాలేవు. కానీ తూర్పుగోదావరి జిల్లాకి కొత్తగా వచ్చిన ఎస్పీ వస్తూ వస్తూనే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ పోలీసులను బాహ్యప్రపంచానికి నిజమైన పోలీసులుగా ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని పోలీసులకు నొక్కిచెప్పి.. సచివాలయ మహిళా పోలీసులను హోంశాఖ సాదారణ పోలీసులుగా గుర్తించాల్సిందేనని మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సు పెట్టి అన్ని డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు మహిళా పోలీసుల సమక్షంలోనే చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. దీనితో ఆవిషయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. 

రాష్ట్రంలో డీజీపి తరువాత ఆ స్థాయిలో మహిళా పోలీసులను గుర్తించినది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మాత్రమే నంటూ వారంతా ప్రశంసల జల్లు కురిస్తున్నారు. అంతేకాకుండా దిశ ఎస్ఓఎస్ యాప్ రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రోత్సహిస్తున్న తీరును కూడా జిల్లా మహిళా పోలీసులంతా తమతో ఎస్పీ ఒక కుటుంబ పెద్దగా మాట్లాడితన తీరును ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ చాలా చోట్ల హోంగార్డు నుంచి కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు తమను మీరంతా నిజమైన పోలీసులా, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించినంత మాత్రాన మేము మిమ్మల్ని మాతో సమానంగా పోలీసులుగా గుర్తించలేమని మాట్లాడేవారని.. అలాంటి మాటలకు ఒకేఒక్క వీడియోకాన్ఫరెన్సు ద్వారా అడ్డుకట్ట వేయడంతోపాటు.. ఆ విధానాన్ని మార్చుకోవాలని తమ ముందే పోలీసులకు ఎస్పీ వివరించన తీరు తమలో ఎంతో ఆత్మస్తైర్యాన్ని నింపిందంటూ హర్షం  వ్యక్తం చేస్తున్నారు. పైగా గ్రామాల్లో మహిళా పోలీసులున్నారనే భరోసా స్టేషన్ ఎస్ఐలే ప్రజలకు అవగాహన కల్పించాలని, వీరంతా సాధారణ పోలీసులేననే విషయాన్ని జీఓనెంబరు 59తో ప్రభుత్వమే వారికి గుర్తింపు నిచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా పోలీసుశాఖలో చర్చనీయాంశమవుతోంది. 

పైగా అవినీకి పాల్పడిన పోలీసులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, వీడియో కాన్ఫరెన్సు కి ఒక్కరోజు ముందు తూర్పుగోదావరి జిల్లాలో నలుగు ఏఎస్ఐలను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా వీరంతా ప్రస్తావించుకున్నారు. పైగా మరో ఏఎస్ఐని విధుల్లో నుంచి తొలగించిన తీరు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసిందని, రెండేళ్లలో సరైన జిల్లా పోలీసు అధికారిని చూశామని.. నిజమైన పోలీసు అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగులను గౌరవిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకున్నామని మహిళా పోలీసులంతా తమ ఆనందాన్ని ఎస్పీతో మాట్లాడిన తీరును తమ సహచర మహిళా పోలీసులతో పంచుకోవడం విశేషం. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా రావీంధ్రబాబు రావడంతోనే పోలీసు శాఖ ప్రక్షాలణ చేపట్టడం ఇటు జిల్లాపోలీసులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే జిల్లాలోని ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడం విశేషం.

 పైగా నవంబరు2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకోబుతన్న తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీసులకు ప్రస్తుత ఎస్పీ వచ్చిన తరువాత వారికి వచ్చిన గౌరవం, పోలీసులుగా తమను గుర్తించాలని పదే పదే పోలీసులను హెచ్చరించిన తీరు తమకు మార్గదర్శకమని.. మహిళా పోలీసులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్పీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల ఎస్ఐలతోపాటు కానిస్టేబుళ్లును హెచ్చరించిన విషయాన్ని జిల్లా పోలీసులు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుంటారో.. లేదంటే  గతంలో వ్యవహరించినట్టుగానే.. మీరు మాలా నిజమైన పోలీసులు కాదంటూ వెటకారంగా మాట్లాడుతూ, మహిళా పోలీసులకు గాలి తీసేసి వారిలో ఆత్మస్తైర్యాన్ని చెదరగొడతారో.. ఎస్పీ ఆదేశించిన హెచ్చరికను శిరసా వహించి ఈ విధంగా మాట్లాడినట్టు ఇక ముందు మాట్లాడకుండా ఉంటారో.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు ఎంత వరకూ పాటిస్తారనేది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. కానీ వస్తూ వస్తూనే ఎస్పీ రవీంధ్రనాధ్ తీసుకున్న చర్యలకు పోలీసు శాఖలో తేడా అధికారులకు ముచ్చెమటులు పడుతున్నా ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది..! 

Tadepalle

2021-07-27 02:58:50

ఫిషింగ్ హార్బర్లు వేగంగా పూర్తిచేయండి..

రాష్ట్రంలో మంజూరైన 8 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల పై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖు స్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు. ఈపిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించడం తోపాటు మిగతా అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న సంబంధిత కలెక్టర్లను ఆయన ఆదేశించారు.ఇంకా వీటి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సిఎస్ కమిటీ సభ్యులు అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మత్స్య శాఖ కమీషనర్ కన్నబాబు, ఆర్థిక శాఖ ఇఓ కార్యదర్శి సత్యనారాయణ, మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్,ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vijayawada

2021-07-26 16:46:26

ఎపిడిఆర్పి ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలి..

ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ(SSC)సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల రూ.ల అంచనాలతో శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఎపి డిఆర్పి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. వాస్తవానికి ఈపనులన్నీ 2015-2020 ల మధ్య ఐదేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే కరోనా తదితర కారణాల వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు.దానివల్ల ఈప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈఏడాది వరకూ గడువును పెంచినందున ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు లోగా పనులన్నీ పూర్తి కావాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండాలోని అంశాలను వివరించారు. ఇప్పటి వరకూ 1452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 73శాతం ఫిజికల్ ప్రోగ్రస్ ను,71శాతం ఫైనాన్సియల్ ప్రోగ్రస్ ను సాధించినట్టు తెలిపారు. ఈసమావేశంలో ఆర్థిక, టిఆర్అండ్బి శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్,యంటి కృష్ణ బాబు,  ఎపి డిఆర్పి ప్రాజెక్టు డైరెక్టర్ కె.కన్నబాబు,అటవీ,ఎపి ట్రాన్సుకో ఇతర విభాగాల అధికారులు, వీడియో సమావేశం ద్వారా జివియంసి కమీషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

తాడేపల్లి

2021-07-26 16:13:34

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఝలక్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఝలక్ మామూలుగా లేదు. అక్టోబర్ నెలాఖరుకు మొదటి బ్యాచ్ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిభిషన్ పూర్తవుతున్న సమయంలో ప్రభుత్వం పెట్టే డిపార్టమెంట్ టెస్ట్ పాసైతేనే అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రొహిభిషన్ సమయం రెండేళ్లూ మామూలుగా ఉండిపోయిన ప్రభుత్వం సరిగ్గా ఉద్యోగాలు రెగ్యులర్ అయి పేస్కేలు వర్తింపజేసే సమయంలో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసైతే తప్పా ఉద్యోగాలు రెగ్యులర్ కావని.. ఎంతకాలం ఆ పరీక్ష పాస్ కాకపోతే అంతవరకూ ప్రొభిషన్ సమయాన్ని పొడిగిస్తామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. దీనితో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు లక్షా 16 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆలోచనలో పడింది. వాస్తవానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్ష విషయం ముందే చెబితే ప్రొహిభిషన్ రెండేళ్ల సమయంలో ఉద్యోగులు ఎప్పుడో పాసై ఉండేవారమి చెబుతున్నారు. కానీ అలా చెప్పకుండా సర్వీసు రెగ్యులర్ చేయడానికి 3నెలల సమయం వుందనగా ఈ విషయాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రాష్ట్రప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ పేస్కేలు ఇస్తూ.. రెండేళ్ల ప్రొహిభిషన్ డిక్లేర్ చేస్తూ సర్వీసులు రెగ్యులర్ చేస్తుంది. ఆ సమయంలోనే ఎస్ఆర్ లు ఓపెన్ చేస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ,వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 16వేలకు పైగా ఉద్యోగులను 13 జిల్లాల్లో 15వేల 5 సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. 

నియమించిన వెంటనే తూతూ మంత్రంగా ఒక నెల శిక్షణ ఇచ్చి వారందరినీ విధుల్లోకి తోసేసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో వసతులు లేకపోయినా, పూర్తిపేస్కేలు లేకపోయి వారంతా ఉద్యోగాలు రెండేళ్లు పూర్తిచేసుకోబోతున్నారు. నియామక సమయంలో ప్రకటించిన విధంగా కావాలనుకుంటే ఈ డిపార్ట్ మెంట్ పరీక్ష ఎప్పుడైనా పెట్టడానికి ఆస్కారం వుంటుంది. కానీ రెండేళ్ల పాటు కరోనో సమయంలో కనీసం సెలవులు కూడా రెండవ శనివారం, ఆదివారం  వినియోగించుకోకుండా..సచివాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్లు లేకపోయినా, సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఉపయోగించి మరీ ప్రభుత్వానికి సేవలందించారు సచివాలయ ఉద్యోగులు. తరువాత ఏడాదిలోనే ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు ఇచ్చి ఆపై ఇంటర్నెట్ మరో 3నెలలు ఇవ్వకుండానే వీరితో సేవలు చేయించుకుంది ప్రభుత్వం. తామందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చాయనే ఆనందంతో వీరంతా ఎంతో కష్టపడి రాష్ట్రప్రభుత్వాని సేవలు అందిస్తూ ఎంతో పేరుతెచ్చారు. తీరా ఇపుడు రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసైతే తప్పా సర్వీసులను రెగ్యులర్ చేయమని, పాసయ్యేంత వరకూ ప్రొహిభిషన్ లో ఉంచుతామని ప్రకటించడం నిజంగా తమను ఇబ్బంది పెట్టడమేనని సచివాలయ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అటు ప్రభుత్వం కూడా ఒకేసారి లక్షా 16 వేల మందికి పేస్కేలు అమలు చేయాలంటే ఖజానాపై తీవ్రస్థాయిలో ఆర్ధిక భారం పడుతుందని భావించి రెండేళ్ల కాలంలో ఈ డిపార్ట్ మెంట్ పరీక్షప్రస్తావన తేకుండా.. ఇపుడు తేవడ సమంజసంగా లేదని ప్రభుత్వ ఉద్యోగులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ ప్రత్యేక పరీక్ష విషయం ఉద్యోగాల్లోకి చేరిన వెంటనే ప్రకటిస్తే రెండేళ్లలో ఉద్యోగులంతా ఆ పరీక్ష పాసయ్యేవారని.. అపుడు ప్రభుత్వం అనుకున్నట్టు ఒకేసారి అక్టోబరు 2నాటికి సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఉండేదని చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో ఆది నుంచి జరుగుతున్న ప్రచారం తమ సర్వీసులు రెగ్యులర్ అవుతున్న తరుణంలో  ప్రభుత్వం అమలు చేయడం ఏమాత్రం ఆహ్వానించ దగినది కాదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, అభిమానం రెండూ ఖచ్చితంగా పోతాయని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలోనూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు ఇదేనా ప్రభుత్వం తమని గుర్తించడమంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ప్రత్యేక డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనను విరమించుకోవాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.

 లేదంటే సర్వీసును రెగ్యులర్ చేసి తరువాత ఈ పరీక్షను పెట్టాలని, అపుడు నిబంధనలు విధిస్తే బాగుంటుంది తప్పా.. సర్వీసు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుందని ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లపాటు ప్రత్యేక నోటిఫికేషన్ అని చెప్పడంతో తమ పేస్కోలు కోల్పోయామని, అలాగని సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత తమకు రావాల్సిన రెండేళ్ల పేస్కేల్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని కూడా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఉద్యోగలకు వ్యతిరేకంగా చేయడం వలన రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల మద్దతు కూడా ఉండే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అందులోనూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనే ఏకకాలంలో కాలంలో వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇప్పటి వరకూ దేశంలోనే గొప్ప వ్యవస్థగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వానికి భంగపాటు తప్పదని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేదంటే జీతాల భారం తట్టుకోలేక, నిబంధన బూచీ చూపి ఖచ్చితంగా ప్రకటించిన డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనకే కట్టుబడి అది పాసయ్యే వరకూ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా ఉంటుందా అనేది వేచి చూడాలి..!

Tadepalle

2021-07-26 13:33:29

ఏపీ ఫైబర్ నెట్ సేవలకి ఆపరేటర్ల మోకాలడ్డు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి తక్కువ ధరలకు కేబుల్ టీవీతోపాటు, గ్రామ, వార్డు సచివాలయాలకు నాణ్యమైన వేగంతో కూడిన ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఏపీ ఫైబర్ నెట్ కి రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం అందించే ఏపీఫైబర్ నెట్ కనెక్షన్ లకు బదులు వారి సొంత నెట్వర్క్ కనెక్షన్లు వేసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో 13జిల్లాల్లోని కేబుల్ నెట్ కోసం సుమారు 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇవే కనెక్షన్లు ద్వారా ఇంటర్నెట్ అందాల్సి వున్నా కేవలం కొన్ని చోట్ల మాత్రమే అందిస్తోంది. మిగిలిన చోట్ల ఉద్యోగులే వారి సొంత ఇంటర్నెట్ ను కూడా సచివాలయ సేవలకు వినియోగించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ వెబ్ సైట్ https://apsfl.in/ లో ప్రకటించినట్టుగా 100, 50, 30ఎంబీపీఎస్ వేగం అయితే ఎక్కడా రావడం లేదు. ఇక ఇళ్లకు వేసే కనెక్షన్లకు తరచుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా సక్రమంగా అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్లు సక్రమంగా వేయకపోవడంతో చాలా గ్రామాలకు నేటికీ స్థంబాలను ఏర్పాటు చేసి హెచ్టీ కేబుల్ వైర్లు రన్ చేసి కనెక్షన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో చెట్లు పడినపుడు, వర్షాలు వచ్చేటపుడు పిడుగులు పడుతున్న సమయంలో వైర్లు దెబ్బతింటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్ ఆపరేట్లర్ల మధ్య వున్న గొడవలన్నీ ఏపీఫైబర్ నెట్ మీద చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తోపాటు, ఇప్పటికే ఈ కనెక్షన్లు అందుబాటులో వున్న 5400 గ్రామాల్లో ప్రతీ మూడు రోజులకు ఇబ్బందులు వస్తూనే వున్నాయి. ఇక గ్రామ సచివాలయాల్లో అయితే కనీసం బయో మెట్రిక్ వేయడానికి కూడా నెట్ స్పీడ్ పెరగగక పోవడంతో ఉద్యోగులు వారి మొబైల్ నెట్ ని వినియగించి కార్యాలయ పనులు, బయోమెట్రిక్ అటెండెన్సు వేయాల్సి వస్తుంది.

 గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా కేబుల్ ఆపరేటర్లు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ రావడం లేదని ప్రచారం చేస్తూ కనెక్షన్లు వేయమన్నవారికి కనెక్షన్లు వేయడం లేదు. మరీ బలవంతం పెడితే.. వేసినా చాలా చోట్ల వారే అవాంతరాలు స్రుష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేవలం  9లక్షల 70వేల మందికి మాత్రమే ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు చేరాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా చోట్ల కేబుల్ ఆపరేటర్లు కూడా వారి కేబుల్ సెటప్ బాక్సులతో ఇంటర్నెట్ వ్యాపారం కూడా మొదలుపెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనితో ఏపీఫైబర్ నెట్ ద్వారా ఆన్ లైన్ లో కనెక్షన్ కావాలని  దరఖాస్తు చేసున్న లక్షల మందికి నేటికీ కనెక్షన్లు అందలేదు. దానికి కేబుల్ ఆపరేటర్లు చెప్పే ఒకే ఒక్క కారణం ప్రభుత్వం సెటప్ బాక్సులు సరఫరా చేయడం లేదని. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24వేల కిలోమీటర్ల పరిధిలో కేబుల్ ను నడిపింది ఏఫీఫైబర్ నెట్ సంస్త. ఇంటికి వేసుకునే ప్లాన్ల నుంచి కమర్షియల్ గా వేసుకునే ప్లాన్ల వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో అతి తక్కువ రేట్లకు పథకాలున్నా అవి ప్రజల వద్దకు చేరడంలేదు.

కరోనా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవడానికి సైతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్లు ఇవ్వలేకపోయారు. చేసేది లేక వేల, లక్షల సంఖ్యలో సాఫ్ట్ ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ పనులకు ప్రైవేటు ఇంటర్నెట్ సంస్థలనే ఆశ్రయించాల్సి వచ్చింది. వాస్తవానికి కరోనా సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అందించి వుంటే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు,  ఇటు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల ద్వారా అందించే ఆన్ లైన్ క్లాసులకు ఎంతో బాగా ఉపయోగపడేది. కానీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేయకపోడంతో విద్యార్ధులు ప్రైవేటు నెట్వర్క్ లను ఆశ్రయించాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో అందుతున్న ఏపీ ఫైబర్ నెట్ సేవలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. కావాలనే కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని ఇటు అధికారులు కూడా గుర్తించారు. దీనితో కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ చి చెప్పారు. కేవలం గ్రామాల్లోని కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం వలన ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. వాటిని పరిష్కరించడంలో ఆపరేటర్లు చొరవ చేపడం లేదున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు 70శాతం వుంటే కేవలం ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు కేవలం 30శాతం మాత్రమే ఉన్నాయని అధికారిక లెక్కలే తెలియజేయడం విశేషం.

ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ నిరుపేదల ఇంటికి కేబుల్ లైన్ తో కూడిన ఇంటర్నెట్ అందించి ఆన్ లైన్ తరగతులు, ప్రత్యేక డిజిటల్ తరగతుల, మరికొందరికి వర్క్ ఫ్రం హోమ్, గ్రామణీ వ్యాపార సంస్తలకు ఇంటర్నెట్ చేరువ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఏపీ ఫైబర్ నెట్ జంక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే గ్రామం మొత్తం అన్ని కుటుంబాలకు, సంస్థలకు ఏపీఫైబర్ నెట్ ద్వారా కేబుల్ టీవీలతో, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసం సచివాలయాల్లో టెక్నీషియన్లను నియమించాలా... అక్కడి నుంచి మళ్లీ కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక లింక్ ఏర్పాటు చేయాలా అనే కోణంలో ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కేబుల్ ఆపరేటర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఏపీఫైబర్ నెట్ సేవలు అందని విషయం ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వీటి నిర్వహణను పంచాయతీలకు అప్పగించి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. గ్రామానికొక టెక్నీషియన్ ను నియమించినా.. లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లనే ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలకు వినియోగించుకోవాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన.. ఎలాగూ పంచాయతీలో ఉండే పారిశుధ్య సిబ్బందిని అత్యవసర సమయంలో ఈ కేబుల్ సేవలకు కూడా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా వేగంతో కూడిన నాణ్యమైన ఇంటర్నెట్ ప్రజలకు అందించడంతోపాటు ఆన్ క్లాసులకు, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు, గ్రామాల్లోని వ్యాపార సంస్థలకు ఇలా అన్నింటికీ కనెక్షన్లు ఇచ్చి సేవలందించడంతోపాటు, ఆదాయ మార్గాలను పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన. అదే జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేబుల్ వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసేందుకు వేసే ఎత్తులన్నీ చిత్తవడంతోపాటు, ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి..!

Tadepalle

2021-07-26 02:36:50

జీఓ149 అమలు కాకపోతే రూ.కోట్లలో నష్టం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు రెండేళ్లు పూర్తి కావొస్తున్నా  అధికార బదలాయింపులు గ్రేడ్-1,2,3,4 పంచాతీ కార్యదర్శిల నుంచి వేరుచేయలేదు. ఒక్క అధికారం, ఒక్క దస్త్రం కూడా లేకుండా.. కాదు కాదు ఇవ్వకుండా 2'సంవత్సరాలపాటు సచివాలయ కార్యదర్శిలతో ప్రభుత్వం గ్రామాల్లో సేవలు చేయించింది. ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు కమిషనర్ కూడా ఇక్కడే తప్పుచేశారు. ప్రభుత్వమే జారీచేసిన జీఓనెంబరు 149 అమలు చేయకుండా తాత్సారం చేయడం వలన ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ స్థాయిలో రాష్ట్రంలో నష్టం వచ్చిందో.. ఒక్కసారి గ్రామసచివాలయాల సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం.. మీ-సేవా కేంద్రాలు పూర్తిచేసిన సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం పరిశీలిస్తే ప్రభుత్వానికే కాదు.. ఈ జీఓని అమలు చేయకుండా ఉండిపోయిన అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇందులో మాయలేదూ మంత్రం లేదు. కేవలం రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోవడం, జీఓ 149అమలు చేయకపోవడం వలన ఇప్పటి వరకూ వారి చేతుల్లో ఎలాంటి అధికారాలు లేకుండా గ్రామాల్లో చెత్త ఎత్తించడం ఇంటిపన్నులు వసూలు చేయడం, కరోనా వేక్సిన్లు వేయించడం వంటి పనులు చేస్తూ ఉత్తుత్తి కార్యదర్శిలుగా యాక్టింగ్ చేస్తూ వస్తున్నారు.. 

  గ్రామ సచివాలయాల ద్వారా సుమారు 745 సర్వీలు అందుబాటులోకి వచ్చినా వాటి ద్వారా ప్రభుత్వానికి కేవలం వారి చేతుల్లో అధికారాలు లేకనే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఆదాయాన్ని ఆర్జించి పెట్టలేకపోయారు. దీనితో  ప్రభుత్వం కోట్ల రూపాయాల్లో ఆదాయం కోల్పోయింది(ఉదాహరణకు ఒక్కో సచివాలయం నుంచి అన్ని సర్వీసులు, ఇంటిపన్నులు కలుపుకొని ఏవరేజ్ న నెలకు ఒక్కో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి పనిచేసే గ్రామ సచివాలయంలో నెలకు రూ.20వేలు ఆదాయం వస్తుందను కుంటే.. రాష్ట్రవ్యాప్తంగీ 5879 మంది గ్రేడ్-5 కార్యదర్శిలు ఉన్నారు. ఆలెక్కన చూసుకున్నా సుమారుగా రూ.1 కోటి 17లక్షలు ఆదాయం నెలకు కోల్పోయింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం 745 సర్వీసులను గ్రామసచివాలయాల్లో అందిస్తే.. వాటి ద్వారా ఒక్కోగ గ్రామసచివాలయం నుంచి ఎంతెంత ఆదాయం వస్తుందో అధికారులే లెక్కలు గట్టుకోవాల్సివుంది) అలాగని ప్రస్తుతం అధికారాలు, రికార్డులు, కనీసం సానిటేషన్ సిబ్బందిని కూడా ఇవ్వకుండా వారి దగ్గరే  అన్ని అధికారాలు రికార్డులు ఉంచుకున్న గ్రేడ్-1, 2,3,4 పంచాయతీ కార్యదర్శిలైనా ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెట్టారా అంటే అదీలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సొమ్ము మొత్తం వారి బంధువుల ఖాతాలకు, చేయని పనులకు బిల్లులు పెట్టి  నిధులన్నీ  భారీ స్థాయిలో కొందరు తేడా కార్యదర్శిలు దారి మళ్లించుకున్నారు. అలా చేతివాటం ప్రదర్శించిన జిల్లాల్లో తూర్పోగోదావరి మొదటి స్థానంలో ఉండగా, విశాఖజిల్లా రెండవ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం, అనంతపురం, కడప, కర్నూలు ఇలా అన్ని జిల్లాల్లోని తేడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు శక్తి వంచన లేకుండా వారిజేబులు నింపుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు..నేటికీ పడుతూ ప్రభుత్వ ఖజానికి పేద్ద రంధ్రం చేశారు. ఈ విషయంలోనే కొంత మంది సస్పెండ్ లు అయ్యి ఇంటి దగ్గరే కూర్చొని సగం జీతాలు తీసుకుంటూ ఎలాంటి చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోకుండానే దర్జాగా వున్నారు.

 ఇక్కడ మీకు ఒక్క అనుమానం రావాలి.. గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా ఆదాయం రాకపోతే ప్రభుత్వానికి ఏవిధంగా నష్టం వాటిల్లిందీ అని. అక్కడ చిన్న అవకాశాన్నే రాష్ట్రవ్యాప్తంగా మీసే-వ కేంద్రాలు జాక్ పాట్ లా వినియోగించుకున్నాయి.  అదెలాగో చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మండలంలో మీసేవా కేంద్రాలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఒక్క రెవిన్యూశాఖలోని 68 రకాల సర్వీసుల నుంచి అత్యధికంగా 60వేలు దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు అందిస్తే.. అదే మండంలోని 14 గ్రామ పంచాయతీల్లో, 16 గ్రామ సచివాలయాల ద్వారా మొత్తం పరిక్షరించిన రెవిన్యూ శాఖ ద్వారా కేవలం   18వేల సర్వీసు రిక్వెస్టులకు ద్రువకరణలు పూర్తిచేయగలిగారు. అంటే ఒక్క మండలంలోనే మూడింతలకి పైగా ఆదాయం సచివాలయాలున్నా  మీ-సేవా కేంద్రాలు తన్నుకు పోయాయి(ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క మండలాన్నే ఎందుకు ప్రస్తావించామంటే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఎంత మేరకు ఆదాయం ఇప్పటి వరకూ కోల్పోయిందో తెలిస్తే ఒకేసారి ప్రజులు, ఉద్యోగుల ద్రుష్టిలో ప్రభుత్వం పరువు పోతుందని కేవలం జిల్లాలోని ఒక్క మండాలంలోని లెక్కలు మాత్రమే బయటపెట్టాం.. ప్రభుత్వం అన్ని జిల్లా సమాచారం జిల్లా కలెక్టర్ల ద్వారా తెప్పించుకుంటే తప్పు ఏస్థాయిలో జరిగి..అంతకంటే నష్టం మరింత స్థాయిలో జరిగిందో అర్ధం కావాలని). 

వాస్తవానికి ఆ ఆదాయం మొత్తం గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి రావాలి..ఇక్కడే అన్ని రకాల సేవలు అందిస్తున్న విషయం ప్రజలకు మరింత చేరువ కావాలి. ఇలా ఎందుకు జరగలేదనే విషయం పరిశీలిస్తే.. ఎలాంటి అధికారాలు లేని తాము ఏ మొహం పెట్టుకొని ప్రజలను చైతన్య పరుస్తామని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా  గొల్లుమంటున్నారు. కనీసం కాలువల దగ్గర బ్లీచింగ్ చల్లించాలన్నా.. ఫినాయిల్ వేయాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి సాధారణ ప్రజలు మాదిరిగా చేతులు కట్టుకొని అడుక్కోవాల్సి వస్తుందని.. అది తాము వెళ్లిన సమయానికి అక్కడ కార్యదర్శి వుంటే(ఉద్యోగం ఇక్కడైనా డెప్యుటేషన్లు, ఇన్చార్జిల బాధ్యతలు వీరికే అప్పగించడంతో ఏ ఒక్క పంచాయతీలోనూ వీరు సక్రమంగా సమాయానికి దొరకడం లేదు). ఒక్క మండలంలోనే సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులు మీసేవాలు తన్నుకుపోతుంటే..జిల్లా వ్యాప్తంగా ఎన్ని లక్షల సర్వీసులు తన్నుకుపోయారో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల సర్వీసులు తన్నుకుపోయారో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులే చెప్పాల్సి వుంటుంది. అదీ కేవలం రెవిన్యూ ద్వారా వచ్చే సర్వీసులే.. మరి ఇతర శాఖల సర్వీసులు ఇక్కడ లెక్కల్లోకి రాలేదు. అదంతా నాణానికి ఒకవైపే. 

ఇపుడు నాణానికి రెండో వైపు చూద్దాం.. అధికారాలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల దగ్గరే వుంచేసిన రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు వారికే మేజర్ పంచాయతీల్లో ఖాళీ అయిన స్థానాలను ఇన్చార్జి బాధ్యతలు చేయాలంటూ వారికే డిప్యుటేషన్లు కూడా పనిగట్టుకొని వేస్తున్నారు. రెగ్యులర్ పంచాయతీల్లోనే పనిచేయకుండా ఆదాయం కోల్పోయేలా చేసిన వీరికే ప్రభుత్వం అదనపు పనులు అప్పగించి ఇన్చార్జి పంచాయతీల్లో కూడా ఆదాయారం రాకుండా చేయడంలో అధికారులే ముఖ్యంగా కనపిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలపై గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు పంచాయతీల్లో ఇన్చార్జిల పేరుతో తిరుగుతుంటే గ్రామాల్లో వసూలు కావాల్సిన పన్నలున్నీ భారీగా పేరుకు పోతున్నాయి. గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్నవారు అధికారాలు లేకపోయినప్పటికీ వారి పరిధిలో వారు కాస్తో కూస్తో వసూలు చేస్తున్నా.. ఆ సేవ మొత్తం అధికారాలు, రికార్డులు వారి వద్దే ఉంచుకొని, పన్నులన్నీ కట్టించుకుని కాగితాలపై లెక్కలు చూపిస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలు చేసిన పనంతా తామే చేసినట్టుగా అధికారుల ముందు తెగ కష్టపడిపోయినట్టు చూపిస్తున్నారు వీరంతా. దీంతో విషయాన్ని పసిగట్టిన చాలా మంది సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు అధికారం లేకుండా ప్రజల వద్దకి వెళ్లినా.. రికార్డులు లేకుండా ఇంటి పన్నుల వసూలుకి వెళ్లినా జనం కూడా వీరిపై తిరగబడటంతో వీరు సచివాలయాల్లో పారిశుధ్యం, ఇతర సేవలను మాత్రమే చూసుకుంటూ కాలం గడిపేస్తూ వస్తున్నారు. 

వారికి అధికారాలు లేవని.. అక్కడ సర్వీసు రిక్వెస్టులు పెడితే పనులు జరవగవని తెలుసున్న ప్రజలు కూడా తమ అత్యవసర  పనులన్నీ చేయించుకోవడానికి మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఇక ఆఖరిగా ప్రభుత్వం ఇపుడు ఇంటిపన్నులు సవరణ చేసి కొత్త పన్నులు వేస్తున్న తరుణంలో కూడా గ్రేడ్-5 కార్యదర్శిలకు రికార్డులు ఇవ్వకుండా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిల దగ్గరే రికార్డులన్నీ ఉంచుకున్నారు. దీనితో కొత్తగా వేయాల్సిన పన్నులు కూడా పడకేశాయి. ఇదే పరిస్థికి కొనసాగితే గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం వున్న 745 సర్వీసుల కంటే అధికంగా సేవలు పెట్టినా ప్రజల వద్దకు అవి చేరే పరిస్థితి కనిపించడం లేదు. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం అంతకంటే లేదు.. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోతే  మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలను కట్టి అక్కడ సిబ్బందిని ఉంచినా కరెంటు, ఇంటర్నెట్ బిల్లు, కార్యాలయ మెయింటినెన్సు బిల్లులు ప్రభుత్వానికి భారం తప్పా మరొక ఆదాయ వనరు అస్సలు కనిపించలేదు. అయితే ఈ విషయం మొత్తం పంచాయతీరాజ్ అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవరిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయ్యాయి. అదే రాష్ట్రవ్యాప్తంగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయితే ప్రభుత్వానికి ఆర్దిక భారం మరింతగా పెరిగిపోతుంది.  అపుడు ప్రభుత్వం సచివాలయాల వారీగా రికార్డులు, అధికారాలు, ఆదాయ వ్యవయాల పెత్తనాలు గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ద్వారా బదలాయించకపోతే రాష్ట్రప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం కోల్పోవలసి వస్తుంది. అంతేకాదు సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు కూర్చోబెట్టి మాత్రమే జీతాలు ఇచ్చే పరిస్థితే కనిపిస్తుంది.

 మరోవైపు తమకు అధికారాలు ఇవ్వనంత సేపు తాము ఎలా ప్రజలకుసేవలు చేస్తామని సచివాలయ నూతన కార్యదర్శిలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ శాఖలోని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.esnlive.net ద్వారా కధనాలు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతిల్లోనే ఉంచేసిన అధికారాలు జీఓనెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు బదలాయించకపోవడం వలన వచ్చే వచ్చిన ఆర్దిక నష్టాలను రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి మరీ తెలియజేస్తున్నారు చాలా మంది అధికారులు.  రాబోయే నష్టాలను వివరిస్తే..రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు ఏ స్థాయిలో ఆదాయాన్ని తన్నుకుపోతున్నాయో.. గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటికి ఆదాయం ఎందుకు రావడం లేదో అనే విషయంపై పరిశోధనాత్మక వార్తలు అందిస్తే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఆలోచించే అవకాశం వుంటుందనే విషయాన్ని వాస్తవ కధనాల రూపంతో వెలుగుతోకి తీసుకు వస్తుంది ఈఎన్ఎస్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీఓనెంబరు 149ని అమలు చేస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు బదలాయించకపోతే వారు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోయి.. సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే 745 సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

 పైగా ఇప్పటికే మండల స్థాయి నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వరకూ వినపతి పత్రాలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో తమకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉండిపోవాలని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామ సచివాలయాలకు వివిధ సర్వీసుల ద్వారా రావాల్సిన ఆదాయం కోల్పోగా.. గ్రామ పంచాయతీ పరిధిలో సవరించిన ఇంటి పన్నులు వేయడంలోనూ.. వాటి ద్వారా ఆదాయం సమకూర్చడంలోనూ గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి సహకారం కనిపించే అవకాశం దరిదాపుల్లో లేదు. చూడాలి పంచాయతీరాజ్ శాఖ పంతానికి పోయి ఎప్పటికీ జీఓనెంబరు 149 అమలు చేయకుండా.. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికార బదలాయింపులు చేయకపోతే..ఇప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని మరీ సచివాలయాలకు రావాల్సిన ఆదాయం మొత్తం కొట్టేస్తున్న మీ-సేవ ఆదాయాలను ప్రభుత్వం తహశీల్దార్ల డాష్ బోర్డులపై చూసుకోవడం తప్పా మరేమీ చేయలేని పరిస్థితులు మాత్రమే మిగులుతాయి. మరోవైపు ఉన్న పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శి స్థానం సరిపోదన్నట్టు వున్నవారికే నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం ద్వారా గ్రామస్థాయిలో రావాల్సిన ఆదాయం మరెంత బకాయిలుగా పేరుకుపోతుందో అధికారులు గమనించాల్సి వుంది. ఏది ఏమైనా ఒక్క జీఓ అమలు చేయడం వలన ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, గ్రామ సచివాలయాలు పెట్టిన లక్ష్యం నెరవేరుతుందని తెలిసినా దానిని అమలు చేయని ఏపీ ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను ఏమనుకోవాలో అర్ధం కావడం లేదని సచివాలయ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు..!

Tadepalle

2021-07-25 03:21:09

సచివాలయ ఉద్యోగుల రెగ్యులర్ లో మెలిక..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణలో నైపుణ్య పరీక్షలతో పాటు, క్రెడిట్ బేస్ అసెస్ మెంటు పరీక్షలను మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వం మెలికపెట్టినట్టుగా  కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 18వేల మంది ఉద్యోగులకు అక్టోబరు 2. 2021నాటికి సర్వీసులు రెగ్యులర్ కావాల్సి వుంది. అయితే గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైన వారి జాబితాలనే  తొలుత జిల్లాల వారీగా జాబితాలు సేకరిస్తోంది. ఇంకా చాలా మంది ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాల్సి వుంది.. మరికొందరు రాసి తప్పిన వారున్నారు. మరోవైపు మరికొంత మంది మహిళా పోలీసులకు సైతం కరోనా నేపథ్యంలో శాఖపరమైన శిక్షణ కూడా పూర్తి కాలేదు. చాలా మందికి శిక్షణలో పెట్టే పరీక్షలు పూర్తి కాలేదు దీనితో వారికి హుటాహుటీన 15 రోజుల పాటు ఆన్ లైన్ శిక్షణతోపాటు మండల కేంద్రాల్లోని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో క్షేత్ర స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తరువాత వీరితో పాటు మిగిలిన శాఖల ఉద్యోగులకు సెప్టెంబరు నెల 17లోపు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే  2019 అక్టోబరు నుంచి 2020 జనవరి వరకూ విడదల వారీగా సచివాలయ విధుల్లోకి చేరిన వారిని దఫ దఫాలుగా రెండేళ్ల ప్రొబిషన్ కాలాన్ని లెక్కగట్టి వారి సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుంది. కాగా ఇపుడు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ పై ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ రాలేదు. దీనితో ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్రనాయకులు సీఎంను కలిసి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కూడా వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శిల అధికారాలు వీఆర్వోలకు బదలాయిస్తు ప్రభుత్వం జారీచేసిన జీఓనెంబరు 2 ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో వుంది. దానికి నాలుగు వారాల్లో గడువు వుంది. మరోవైపు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారి జాబితాను జిల్లాల వారీగా సిద్దం చేస్తున్న తరుణంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన వారంతా తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయనే ధీమాతో ఉండగా.. అవి రాయని వారికి భయం పట్టుకుంది. అందులోనూ సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారీగా ఆర్ధిక భారం పడుతంది. ఉన్న నిధులన్నీ సంక్షేమ పథకాలకే ప్రభుత్వం వెచ్చిస్తుండటం, రెండు దఫాలు కరోనాకి ప్రభుత్వం అత్యధిక మొత్తంలో నిధులు ఖర్చుచేయడంతో ఇపుడు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులకు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయా లేదా అనే భయం వెంటాడుతోంది. ఇదే సమయంలో జీఓనెంబరు 2 అంశం హైకోర్టులో వాదనలు జరిగినపుడు రాష్ట్రంలో పంచాయతీలు ఉండగా ఎందుకు దానికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారనే మాటను వాడింది హైకోర్టు బెంచ్.. ఆపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం, ఇటు కార్యదర్శిలు, వీఆర్వోల ఉద్యోగ సంఘాల మధ్య అధికారానికి(డిడిఓ) సంబంధించిన వాదలను అధికమవడంతో ఆ ప్రభావం సచివాలయ ఉద్యోగులపై పడుతందనే భయంకూడా వీరిని వెంటాడుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా కరోనా నేపథ్యంలో మరో ఏడాది సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ అంశాన్ని పొడిగిస్తారనే ప్రచారం కూడా అధికంగా ప్రాచుర్యంలోకి రావంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో ఇదే అంశానికి సంబంధించి నిత్యం భారీ స్థాయిలో చర్చలు కూడా నడుస్తున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి మాత్రం ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయమై సానుకూలంగానే పవనాలు వీస్తుండటం కాస్త వీరికి ఊరట నిస్తున్నా.. లోలోన ఆందోళన మాత్రం వీరిని వీడటం లేదు. ఓపక్క ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులు ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైతే వారంతా పదోన్నతి( ప్రమోషన్) జాబితాలో రోస్టర్ విధానంలో ముందుంటారని చెబుతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం 2015 పీఆర్సీ పేస్కేలుకి లోబడి వారికి నియామకాలు చేపట్టింది. అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వీరికి కూడా పీఆర్సీ అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. అక్టోబరు 2 నాటికి ప్రభుత్వం అధికారంలో వచ్చి రమారమీ రెండున్నరేళ్లు గడుస్తుంది. అప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చిన పీఆర్సీ, 8 డిఏల బాకాయిల చెల్లింపు అమలు చేయాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందు వున్న భారీ నగదు పథకాలు..వాటిని అమలుచేస్తూ... సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేస్తే ఆ భారం రెండింతలు అవుతుంది. దీనితో ఉద్యోగుల సర్వీసు విషయంలో బయో మెట్రిక్, శాఖ పరమైన శిక్షణ, ఉద్యోగుల చేతివాటం, వివిధ కేసులు, కోరానా విపత్తు భారం అన్ని అంశాలను ఏకం చేసి ఏదైనా మెలిక పెట్టి మరో ఏడాది కాలయాపన చేస్తుందానే అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా అక్టోబరు  నెల నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ నాలుగు విడతలుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది.. చూడాలి ప్రభుత్వం ఏదైనా మెలిక పెడుతోందో..ఉన్న మెలికలుల తీసేస్తుందో.. సర్వీసు కాలాన్ని పొడిగిస్తుందో.. డిపార్ట్ మెంటల్ టెస్టులను, వాటితోపాటు క్రెడిట్ బేస్ అసెస్ మెంట్ పరీక్షలను అడ్డుపెడుతుందో.. పీఆర్సీని బూచిగా చూపిస్తుందో.. కోర్టు కేసులను ఉద్యోగుల ముందుంచుతుందో..ఆర్ధిక భారాన్ని నెపంగా తెరమీదికి తెస్తుందో.. అవన్నీ కాదని ఇచ్చిన మాటకి కట్టుబడి 2022 జనవరి నాటికి సచివాలయ ఉద్యోగులందరి సర్వీసులను రెగ్యులర్ చేస్తుందో..తేలాల్సి వుంది..!

Tadepalle

2021-07-24 02:26:20

సచివాలయ ఉద్యోగలకి అదనపు పనిభారం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు భర్తీ చేయక పోవడం వలన సచివాలయ సిబ్బంది అదనపు పని భారం మోయాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మేజర్ పంచాయతీల్లో ఒకే చోట రెండు నుంచి మూడు సచివాల యాలు ఏర్పడటం, సుమారు 13వేలకు పైగా ఖాళీలు మిగిలిపోవడం, గ్రేడ్1 కార్యదర్శిలు సీనియారిటీ పేరుతో పక్కకు జరిగిపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం మొత్తం పడుతోంది. అలాగనీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ జీఓనెంబరు 149 ని అమలు చేయకపోవడంతో అధికార వికేంద్రీకరణ సైతం జరగలేదు. సచివాలయ పరిధిలోని రికార్డులు, ముఖ్య విధులు, అధికార లావాదేవీలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉంచుకొని, కొత్తగా చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలతోనే పనంతా చేయిస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సచివాలయా వారీగా పరిధిని విడదీయని అధికారులు, తమతోనే అదనపు పనిచేయించే గ్రేడ్ 1, 2 కార్యదర్శిల ఉత్తుత్తి, విధులు, అనధికార ఇన్చార్జి ఉద్యోగాలు, డిప్యుటేషన్లను కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సచివాలయాల్లో  పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వెటర్నరీ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్, తదితర పోస్టులన్నీ కలిపి సుమారు 13వేలకు పైగానే ఖాళీలు ఉండిపోయాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో వాస్తవానికి ఈ ఉద్యోగాలను తొలుత భర్తీచేయాల్సి వుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిలోనే సేవలు అందుతాయి. అలాకాకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలలను మాత్రమే చూపడం విచిత్రంగా వుందంటున్నా సచివాలయ ఉద్యోగులు. అత్యవసర ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన భర్తీచేస్తాయి. అదేంటో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో పూర్తిస్థాయిలో ఉద్యోగులను భర్తీచేయకుండా వదిలేసింది. పైగా ప్రొభిషన్ పేరుతో తమతోనే పనులు అధికారం ఇవ్వకుండా పనులు చేయిస్తూ.. యాక్టింగ్ పనులు చేసే గ్రేడ్-1 కార్యదర్శిల వైపు ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యస్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో జీతం ప్రొభిషనరీ సమయంలో కేవలం రూ.15వేలు మాత్రమే ఇవ్వడంతో ఎటూ చాలని వారు చాలా మంది ఈ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. మరికొన్ని ఉద్యోగాలు అర్హత సాధించిన వారు లేక వదిలేస్తే..వెటర్నరీ, సెరీకల్చర్, ఫిషరీష్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శి ఇలా చాలా రకాల ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండిపోయాయి. దీనితో మూడు సచివాలయాలు ఉన్నచోట ఖాళీగా వున్న పోస్టుల్లో ఆయా శాఖ సచివాలయ ఉద్యోగులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఉద్యోగులపై పనిభారం అధికంగా పడుతుంది. అధికారాలు తమకు తేకపోయినా సిబ్బందితో దగ్గరుండి అదనపు విధులు తామే చేయించాల్సి వస్తుందని చెబుతున్నారు గ్రేడ్5  పంచాయతీ కార్యదర్శిలు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ శాఖల వారీగా వారి విధులకు సంబంధించిన డ్యూటీ చార్టులను కూడా ప్రత్యేక జీఓల రూపంలో విడుదల చేస్తుంది. ఈ క్రమంలో అదనంగా ఖాళీగా వున్న ఉద్యోగాల్లో అదనపు విధులు నిర్వహిస్తున్నవారిపై పనిభారం పడుతోందని, అయినప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా ప్రభుత్వ పరంగా తమకు రావాల్సిన అధికార బదలాయింపుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు కనీసం ద్రుష్టి సారించడం లేదనే విమర్శలు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. అంతేకాకుండా వీరు ఉద్యోగస్థానంతో పాటు అధికారులు డిప్యుటేషన్, ఇన్చార్జి ఉద్యోగానికి సంబంధించిన వర్క్ టార్గెట్లపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారట.. అటు అధికారుల ఆదేశాలు పాటిస్తూ విధినిర్వహణలో అదనపు విధులు ఖచ్చితంగా నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు సచివాలయ ఉద్యోగులు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఇన్చార్జి, లేదా డిప్యుటేషన్ విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం అదనపు జీతం మంజూరు చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు ప్రొభేషన్ లోనే ఉన్నారు. వారికి వచ్చే ఆ రూ.15వేలు జీతంతోనే వారికి కేటాయించిన ఇన్చార్జి పోస్టుల బాధ్యతలు, రికార్డులు, ట్రాన్స్ పోర్టు ఇలా అన్నిరకాల ఆర్ధిక భారాలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా అదనపు విధులు చేద్దామన్నా చేతిలో కనీసం అధికారాలు పెట్టకుండా... తమ పరిధి తమకు అప్పగించకుండా.. అన్ని అధికారాలు.. రికార్డులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే వుంచి వారి పనులు కూడా తమతోనే చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రెండవ శనివారం, ఆదివారాల్లో కనీసం సెలువులు వినియోగించుకోవడానికి వీలులేకుండా ఆరోజుల్లోనే కోవిడ్ వేక్సినేషన్ కు సైతం సచివాలయ ఉద్యోగులనే వినియోగించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులంతా. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ లో అయినా గ్రామ, వార్డు సచివాలయ మిగులు ఉద్యోగాలు భర్తీచేస్తే తమకు అదనపు పనిభారం తగ్గుతుందని ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ విచిత్రంగా సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేయడంతో ఇన్చార్జి బాధ్యతలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాల్లో డిప్యుటేషన్లు, ఇన్చార్జి బాధ్యతలు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకు తొలగించాలని ఆదేశాలు జారీచేసినా..మండల, వార్డు స్థాయిల్లో మాత్రం సచివాలయ ఉద్యోగులతోనే జిల్లా అధికారులు వారితో అదనపు పనులు చేయిస్తున్నారని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అదనపువిధులు, డిప్యుటేషన్లు, ఇన్చార్జిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సి వుంది..!

Tadepalli

2021-07-23 02:22:47

ఆంధ్రాలో అంతర్జాతీయ పర్యాటకం..

దేశీయ పర్యాటకులనే కాకుండా ఇతర దేశాల పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటకం, సాంస్కృతికం, యువజన, క్రీడా శాఖలకు చెందిన ఉన్నాతాధికారులతో సచివాలయంలోని తన చాంబరులో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాలు, అటవీ ప్రాంతాలను కలుపుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు సర్క్యూట్ లుగా (రాయలసీమ, విజయవాడ, గోదావరీ, ఉత్తరాంధ్ర) పర్యాటక ప్యాకేజిలు పెట్టాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమలో తలకోన, హార్సీ హిల్స్, తిరుపతి.. కృష్ణా,గుంటూరు పరిధిలో  భవానీ ఐలెండ్, దుర్గమ్మ దేవాలయం, బౌద్దరామాలు, గోదావరి పరిధిలో అన్నవరం, పాపికొండలు, దిండి ప్రాంతంలో బోటింగ్, ఉత్తరాంధ్రలో పాడేరు, అరుకు, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం ప్రాంతాలను పర్యాటక సర్క్యూట్ పరిధిలో అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. విశాఖలో బీచ్ ల నిర్మాణం, కృష్ణా గోదావరి నదీ పర్యాటకాన్ని స్థానిక అంశాల ఆధారంగా పర్యాటకలకు ప్యాకేజీలను అందిస్తామన్నారు. విశాఖ ప్రాంతంలోని ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని పర్యాటకాన్ని.. అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ప్రభుత్వం పర్యాటక శాఖకు స్థలం కేటాయించిందని మంత్రి తెలిపారు. 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందించేందుకు 4 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో  రాష్ట్రంలో పదిహేను ప్రాంతాల్లో క్రీడా కేంద్రాలను అభివృద్ది చేసేందుకు.. ఖేల్ ఇండియా పథకం క్రింద  విశాఖపట్నం, కడప, తూర్పు గోదావరి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిస్తున్నామన్నారు. ఈ ఏడాది వై.ఎస్.ఆర్. క్రీడా పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కేటాయించామన్నారు. స్పోర్ట్సు కోటా క్రింద జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలను పరిశీలించి స్పోర్ట్సు కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. థర్డు వేవ్ లేకపోతే.. కోవిడ్  జాగ్రత్తలతో గతంలో మాదిరిగానే టూరిజం ఫెస్టివల్స్, ఆగస్టు నుంచి ప్రతి నెలా కనీసం రెండు యువజన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్, ఏపీ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఈడీ మాల్ రెడ్డి.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Tadepalle

2021-07-20 17:17:42

గ్రేడ్-5 కార్యదర్శిల చూపు గ్రూప్-2 వైపు..

ఒక్క నిర్ణయం జీవితాలను మార్చేస్తుందనే నానుడి ఎపుడైనా విన్నారా.. దానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయంతో లక్షా 20వేల మంది జీవితాల్లో వెలుగునిండాయి. కానీ ఆ ఆనందం సచివాలయాల్లో విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిల్లో లేదు. దానికి కారణం ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో ఉద్యోగ కల్పన అయితే చేసిందిగానీ.. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడంతో ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 6వేలకు పైగా వున్న గ్రేడ-5 కార్యదర్శిలు కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. అతి తక్కువ జీతం(2ఏళ్లుగా రూ.15వేలే).. సాధారణ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కంటే అనదంగా మూడు గంటల పని.. మరీ ముఖ్యంగా చేతిలో కనీసం అధికారంలేని ఉద్యోగం.. ఏ చిన్న పనికైనా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిని జోలిపట్ట అడుక్కోవడం..ఇలాలంటి ఉద్యోగం  చేసే కన్నా.. ఈ ఉద్యోగానికి సలాంకొట్టి ప్రభుత్వం కొత్తగా తీయబోయే జాబ్ కేలండర్ కి పోటీ పడితే ఏదో ఒక పోస్టు కొట్టి మన జీవితాలను మార్చుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చారట వీరంతా.. తమకు జీఓనెంబరు 149 ద్వారా అధికార బదలాయింపులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల నుంచి వాటి పరిధిలోని సచివాలయాలకు మార్పుచేయాలని ఎంపీడీఓలు, డీపీఓలు, ఎమ్మెల్యేలు, ఆఖరికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి ద్విదేది, కమిషనర్ గిరిజా శంఖర్ కు వినతి పత్రాలు ఇచ్చినా నేటికీ ఫలితం మాత్రం రాలేదు. దీనితో వారి వారి ఆలోచనలను సామాజిక మాద్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.. కాకపోతే అవి ఎందకూ పనిచేయలేదని ఆవేదన చెందతున్నారు. తామేమీ కొత్తగా తమకోసం జీఓలు తెమ్మని కోరడం లేదని.. ఉన్నజీఓలనే అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామంటూ మీడియా ముందు గొల్లుమంటున్నారు. రాష్ట్రప్రభుత్వంలో ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగికి కైనా ఒక నిర్ధిష్ట డ్యూటీ  వుంటుందని.. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మాత్రమే అటు ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు గానీ క్లారిటీ లేదని.. అధికారాలు, దస్త్రాలు లేని ఉద్యోగులుగా తామే గుర్తించబడ్డామనేది వీరి ఆవేదన. అంతేకాకుండా అటు ప్రభుత్వం కూడా ఒక్కోసారి ఒక్కోవిధంగా వ్యవహరిస్తూ జీఓలు విడుదల చేస్తుందని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జాబ్ కేలండర్ లో పెంచుతున్న ఉద్యోగాల్లో  డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉన్న మనమంతా భవిష్యత్తు చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఆదిశగా ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాల కోసం పోటీ పడాలని వాట్సప్, టెలీగ్రామ్, ఫోన్లు ద్వారా తమ తమ ఆలోచనలను పంచుకోవడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అదే జరిగితే ప్రభుత్వం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచే వేలల్లో ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుంది. అపుడు మళ్లీ ఉద్యోగ ప్రకటన ద్వారా ప్రభుత్వం మరోసారి ఉద్యోగ నియామకాలు, శిక్షణ చేపట్టాల్సి వస్తుంది. కొరివితో తలగోక్కున్నట్టు జీఓనెంబరు 149ని అమలు చేస్తే చాలా మంది ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో ఉండటానికి కూడా అవకాశం వుంటుంది. లేదంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో వున్న 80శాతం యువత వేర్వేరు ఉద్యోగాలకు వెళ్లిపోవడానికి సిద్దంగా వున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని ఎందుకు అమలు చేయడం లేదో నేటికీ దానిని విడుదల చేసిన రాష్ట్ర అధికారులకు గానీ.. జిల్లా కలెక్టర్లకుగా గానీ అంతు చిక్కడం లేదు. అలాగని రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలకు ఉద్యోగ కాలం కూడా ఎంతో కాలం లేదు. వారంతా సుమారు ఐదు నుంచి ఏడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుంది. అపుడు ఆ స్థానికి వెళ్లిన వారి నుంచి కూడా ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురైతే.. జీఓ నెంబరు 149 అమలు కాకపోతే ప్రభుత్వానికి తలనొప్పులు తప్పవు.. ఆ స్థానంలోకి వచ్చే గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుక్కొటారు. వాస్తవానికి గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని రాష్ట్రంలో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా పలు కేసులు కోర్టులకు చేరిన విషయం కూడా రుజువు చేస్తుంది. ఈ సమయంలోనే ఆ జీఓ-2పై హైకోర్టుకి వెళ్లడంతో అక్కడ కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారనే చాలా పెద్ద పదం వాడింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని మదించి, రాజ్యాంగంలోని 73వ అధికరణానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీఓనెంబరు 2పై కోర్టులు కీలకంగా వ్యాఖ్యానించినా ప్రభుత్వంలో గానీ.. ప్రభుత్వశాఖల కార్యర్శిల్లో గానీ మార్పు రాలేదు. ఈ పరిణామాలన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ముఖ్యంగా గ్రేడ్-5 కార్యదర్శిలు ఈ ఉద్యోగాల్లో ఉంటే ఎలాంటి అధికారం లేకుండా.. కనీసం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా రాదని.. ఇలా అయితే ఉద్యోగాలు చేసి అనవసరమనే భావనకు వచ్చారు. విశేషమేమిటంటే అటెండరు నుంచి ఐఏఎస్ వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ అధికారాలను కట్టబెట్టిన రాష్ట్రప్రభుత్వం  ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల జాబ్ చార్ట్ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోగా.. ఒక్క అధికారమూ కట్టబెట్టలేదు. పైగా ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1 కార్యదర్శిల చేతిలోనే అధికారాలన్నీ ఉంచి గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రతీ చిన్నపనికీ వీరందరిన పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు. దీనితో పేరుకి గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్న వీరంతా ఏ పనికావాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చుట్టూ దండలుకట్టుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్లైనా పంచాయతీల్లో తిన్నగా వుంటున్నారా అంటే ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించారు జిల్లా అధికారులు. ఈ తరుణంలో గ్రామంలో కనీసం చెత్త ఊడ్చాలాన్నా పంచాయతీ నుంచి శానిటేషన్ సిబ్బందిని తీసుకెళ్లే అధికారం గానీ.. వీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించే అధికారం వీరి చేతుల్లో లేకుండా పోయింది. గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి అధికారం లేకుండా పనిచేస్తూ వచ్చారు. విసుగుచెందిన వీరంతా ఇక లాభం లేదనుకొని ఈ ఉద్యోగంలో ఉంటూ మరో కొత్త ఉద్యోగం వస్తే జంప్ అయిపోవాలని నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధుల్లోచేరిన తరువాత మంచి ప్యాకేజీతో ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వస్తే సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు అలా వెళ్లిపోయిన ఉద్యోగాలే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేలకు పైగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149ని అమలు చేస్తుందా..లేదంటే తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా ఎలాంటి అధికారం ఇవ్వకుండానే  గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలను విధులు నిర్వహించమంటుందా అనేది తేలాల్సి వుంది..!

Guntur

2021-07-19 02:15:22

కోర్టు ఆదేశాలను అమలు చేయని IAS లు..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులకు కోర్టు కష్టాలు తప్పడం లేదు.. కాదు కాదు కోర్టు ఆదేశాలను అమలు చేయక కావాలనే సీనియర్ ఐఏఎస్ లు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా హైకోర్టు ఆగ్రహానికి గురైన పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వం శాఖల్లోని అత్యధిక సంఖ్యలో కోర్టు వ్యవహారాల చుట్టూ తిరుగుతున్నశాఖగా కూడా పంచాయతీరాజ్ శాఖ వార్తల్లో నానుతూనే వుంది. వివరాలు తెలుసుకుంటే తన నియామకం నాటి నుంచి బిల్ కలెక్టర్ గా సర్వీసుని క్రమబద్దీకరించాలని తూర్పుగోదావరి జిల్లా చెందిన భైరవమూర్తి 2019లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడే హైకోర్టు ఆయన సర్వీనుకి క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఎప్పటిమాదిరిగానే హైకోర్టు ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు అమలు చేయకుండా ఉండిపోయారు. దీనితో బైరవమూర్తి మళ్లీ 2020లో హైకోర్టులోనే కోర్టు ధిక్కరణ వాజ్యం వేశారు. అందులో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీనాగేశ్వర నాయక్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనితో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు మళ్లీ హైకోర్టులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ శాఖల్లోనే హైకోర్టు ఆదేశాలే కాదు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలనే అమలు చేయని శాఖగా కూడా గుర్తింపు తెచ్చున్న ఈ శాఖ అధికారులు ఇటీవల హైకోర్టు ఆగ్రహానికి గురై వింత శిక్షను కూడా అనుభవించారు.  అయినప్పటికీ ఈ శాఖ అధికారుల తీరులో మాత్రం మార్పురాలేదు. వాస్తవానికి శాఖాపరంగా చేసిన తప్పులపై ఉద్యోగులు కోర్టుకి వెళ్లిన సమయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వంలోని సదరు శాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయాల్సి వుంది. విచిత్రంగా పంచాయతీరాజ్ శాఖలో మాత్రం ఆవిధంగా జరగడంలేదు. ఫలితంగా అధికారుల తీరువలన ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. అలాగని ఏ విషయంలో అయితే ఉద్యోగులు కోర్టుకెళ్లారో దానికి సంబంధించిన కౌంటర్ ను కూడా ప్రభుత్వశాఖ పరంగా కోర్టు ముందుంచలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ సంజాయిషిలు ఇస్తున్నారు తప్పితే న్యాయస్థానం ఆదేశాలను మాత్రం అమలు చేయకపోతున్నారనే విషయం కోర్టులు ఇచ్చే దిక్కరణన నోటీసులు, అధికారులకు కోర్టులు వేసే శిక్షలే రుజువు చేస్తున్నాయి. అసలు హైకోర్టు పలు కేసుల విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులను తీవ్రంగా హెచ్చరించడం, శిక్షలు వేయడాన్ని ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి సుమోటాగా స్వీకరించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సి వుంది. లేదంటే ఒక్క ప్రభుత్వశాఖ చేసిన తప్పుకు ప్రతీసారి అధికారులు కోర్టుకు హాజరవుతున్నారంటే.. దానికి కారణం ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా లేదని, అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు ప్రభుత్వశాఖల అధికారులను హెచ్చరించినా.. అధికారులకు శిక్షలు వేసినా అవి అధికారలకే అన్నట్టు బావిస్తుందా... లేదంటే ప్రభుత్వానికి వేస్తున్నట్టు బావిస్తోందో అర్ధం కాని పరిస్థి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో నెలకొని వుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తున్నాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా ప్రభుత్వశాఖల కార్యదర్శిలకి నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా రాజున్న రోజుల్లో మరిన్ని వ్యవహారాలు, కేసుల విషయంలో హైకోర్టుతోపాటు, ఇతర కోర్టుల ఆగ్రహానికి గురికాక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అమరావతి

2021-07-18 05:20:28

బయో మెట్రిక్ వేయకపోతే రంగు పడుద్ది..

ప్రజలకు సేవలందించాలని గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే.. అక్కడ పనిచేసే సిబ్బందిని ఇష్టానుసారంగా కావాల్సిన చోటుకి డిప్యుటేషన్లు, అదనపు విధులకు పంపుతున్నారు.. ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో సచివాలయాల్లో ఉండటం లేదు.. డిజిటల్ అసిస్టెంట్లను ఎక్కడా బయట విధులకు పంపకూడదనే ప్రత్యేక జీఓ ఉన్నా మండల అధికారులు కావాలనే వారిని బయటకు పంపుతూ వారి కార్యాలయ విధులకు వాడుతున్నారు.. అలా అయితే గ్రామసచివాలయాలు ఎందుకు.. మనం అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది.. ఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దు.. సచివాలయ సిబ్బంది డిప్యుటేషన్లన్నీ రద్దుకావాలి.. ఎవరికి కేటాయించిన సచివాలయంలో వారే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉండాలి.. ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సుతో ఉండాల్సిందే.. ఏం చేస్తారో నాకు తెలియదు సోమవారం నుంచి మొత్తం సచివాలయాల స్వరూపమే మారిపోవాలి.. ఇవీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లుకి ఇచ్చిన ఆదేశాలు.. ఇవన్నీ ఎందుకంటే సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు అదనంగా కేటాయిస్తున్న విధులు, సక్రమంగా వేయని బయోమెట్రిక్ రిపోర్టులు తెచ్చిన తంటా.. రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ నేరుగా సీఎం చెక్ చేసిన సమయంలో ప్రతీ జిల్లాలోనూ 60శాతనికి పైగానే బయోమెట్రిక్ పడని విషయం..సచివాలయ సిబ్బందిని అదనపు విధులకు వినియోగిస్తున్నట్టు తేలింది.. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఖచ్చితంగా బయో మెట్రిక్ ను వేసేలా చూడాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఉదయం సాయంత్రం రిపోర్టులు జిల్లా కలెక్టరేట్లకు చేరుతున్నాయి. రాష్ట్రంలోని 13జిల్లాలు, 16 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాల సిబ్బంది బయో మెట్రిక్ వేయడంలో వెనుకంజలో ఉన్నారు.. మరికొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రసన్నం చేసుకొని కావాల్సిన సచివాలయాల్లోకి అదనపు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. ఫలితంగా సీఎం ఆదేశాలతో ప్రస్తుతం డెప్యూటేషన్ లో వున్న కార్యదర్శిలంతా వారి వారి సొంత సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అన్ని డిప్యుటేషన్లు సోమవారం నుంచే రద్దు కానున్నాయి. ఏ ఒక్క సచివాలయ సిబ్బందికి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని, బయోమెట్రిక్ లోపాలు ఇబ్బందులు వుంటే తక్షణమే సరిచేయాలని సీఎం కలెక్టర్లకు వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా గందర గోళ పరిస్థితి ఏర్పడింది.  జిల్లాల్లో సచివాలయ కార్యదర్శిలు, వీఆర్వోలు, సర్వేయర్లు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లకు అదనపు విధులు, డిప్యుటేషన్లు వేయడంతో వారి బయో మెట్రిక్ అటెండెన్సు కూడా చాలా తక్కువగా నమోదు అవుతుంది. దానిపై తమకు మండల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటేషన్లు వేశారని చెప్పుకునే సిబ్బందికి సోమవారం నుంచి సమయానికి రాకపోతే  రంగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. బయో మెట్రిక్ అటెండెన్సు ఆధారంగా సిబ్బందికి జీతాలు ఇవ్వనున్నారు. ఖచ్చితంగా సోమవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ సచివాలయంలోనే అన్నిశాఖల సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాల్సి వుంటుంది. ఇదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసే సమయంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది బయో మోట్రిక్ అటెండెన్సు పరిగణలోకి తీసుకోవడంతో ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా సచివాలయాల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తక్కువగా ఉంటే సదరు జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది మొత్తం ప్రజలకు గ్రామంలోనే ఉండి సేవలు అందించేందుకు సోమవారం నుంచి సిద్దమవుతారు. ఇప్పటి వరకూ సచివాలయ కార్యదర్శిలకు బయో మెట్రిక్ నుంచి మినాయింపులు ఇచ్చారని చెప్పుకునేవారంతా కూడా ఖచ్చితంగా సమయానికి బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, మండల అధికారులు(ఎంపీడీఓలు, తహశీల్దార్లు,ఏఓలు) గండికొడుతున్నట్టు స్పష్టంగా సీఎం నేరుగా గుర్తించేలా చేసింది. రాష్ట్రంలో సచివాలయ సిబ్బందికి కేటాయిస్తున్న అదనపు విధుల  కారణంగా ఈ బయో మెట్రిక్ అటెండెన్సు సక్రమంగా పడటం లేదనే విషయం స్పష్టమైంది. అయినా ఇక్కడ తప్పంతా సచివాలయ ఉద్యోగులదే అన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎందుకు సచివాలయ సిబ్బంది సమయానికి బయో మెట్రిక్ వేయలేకపోతున్నారనే విషయంపై రాష్ట్రప్రభుత్వం ఆరాతీస్తే.. జిల్లా అధికారులు, మండల అధికారులు సచివాలయ సిబ్బందికి అదనపు పనులు సిబ్బందిలేమిని కారణంగా చూపి కావాలనే పురమాయిస్తున్నట్టు లెక్కతేలింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సచివాలయ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులు అప్పగించకూడదని.. డెప్యూ టేషన్లు రద్దు చేయాలని.. ముఖ్యంగా ప్రతినిత్యం సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఏ పనులకూ వినియోగించకూడదనే జీఓను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల కార్యాలయాల్లో సిబ్బంది కొరతగా ఉండటంతో చాలా మండలాల్లో డిజిటల్ అసిస్టెంట్ల సేవలను అనధికారికంగా ఎంపీడీఓలు, తహశీల్దార్లు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసినప్పటికీ దానిని కూడా ఎంపీడీఓలు భేఖాతరు చేయడంతో వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సచివాలయాలకి కేటాయించిన సిబ్బంది వారి సచివాలయాల్లో ఉండకపోతే కలెక్టర్లుపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరు కలెక్టర్లు అన్నిశాఖల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణమే డిప్యూటేషన్లు రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కూడా కలెక్టర్లు జిల్లాఅధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్సు ఆధారంగానే సచివాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు అందించాలని కూడా కలెక్టర్లంతా జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండేళ్లకు గానీ సచివాలయ ఉద్యోగులపై ద్రుష్టిసారించకపోవడంతో ఇప్పటి వరకూ ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతూ వచ్చింది. ఇపుడు నేరుగా సీఎం రంగంలోకి దిగడంలో ప్రభుత్వంలోని సుమారు 14శాఖల ముఖ్యకార్యదర్శిలంతా కలెక్టర్లందరికీ ఫోన్ ఇన్ చేసి తలంటేశారు. సోమవారం నుంచి 100శాతం బయో మెట్రిక్ పడకపోతే చర్యలు తొలుత జిల్లా కలెక్టర్లపై ఉంటే.. కలెక్టర్లు జిల్లా అధికారులపైనా, జిల్లా అధికారులు మండల అధికారులకు చార్జిమెమోలు జారీచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేసమయంలో సచివాలయ సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ప్రజల నుంచి వచ్చే శాఖల వారీ అర్జీలకు ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వుంటుంది. సర్వేయర్లకు సైతం డిప్యూటేషన్లు రద్దు, అదనపు విధులు మండల అధికారులు రద్దుచేయాలి. అలా కాకపోతే రాష్ట్రశాఖ ముఖ్య కార్యదర్శిల నుంచి అనుమతులు తెచ్చుకోవాలని జిల్లా శాఖ అధికారులకు కలెక్టర్లు తెగేసి చెప్పేశారు. దీనితో సోమవారం నుంచి సచివాలయ సిబ్బంది ఉదయమంతా వారి డ్యూటీ చార్టు ప్రకారం విధులు, మధ్యాహ్నం నుంచి స్పందన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనాలి.. కానీ రాజకీయ ఒత్తిళ్లు.. యధాస్థితిగానే మండల అధికారుల ప్రత్యేక పనుల పురమాయింపు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలను అమలు చేయకపోవడం అలవాటుగా మారిన ప్రభుత్వశాఖల అధికారులు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలను ఏ స్థాయిలో అమలు చేస్తారనేది వేచి చూడాలి.. ఒకవేల అమలు చేయకపోతే రంగు పడటం ఖాయంగానే కనిపిస్తుంది ఆదేశాల్లో మాత్రం.. చూడాలి ఏం జరుగుతుందనేది. 

Amaravati

2021-07-18 02:30:57

ENSకథనాలపై స్పందించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్, ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net కథనాలకు(న్యూస్ కార్డ్) జిల్లా కలెక్టర్లు స్పందించక పోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు అందుకుంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో అభివ్రుద్ధి, లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలకు ఏవిధంగా సేవలు అందించలేకపోతుందనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు కథనాలు అందిస్తున్నాం. ముఖ్యంగా సచివాలయ స్పందనకు కరోనా మోలకాడ్డు శీర్షికన వచ్చిన కథనంపై నేరుగా సీఎం వైఎస్ జగన్ స్పందించి, జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీచేసిన తీరు ఒక్కసారిగా 16 ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను కదిలించేలా చేసింది. ముఖ్యంగా మండల అధికారులు సచివాలయ సిబ్బందిలో కీలక భూమిక వహించే డిజిటల్ అసిస్టెంట్లను కరోనా వేక్సినేషన్ క్యాంపులకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు పంపడం, సచివాలయ కార్యదర్శిలకు ఒకటి రెండు అదనపు సచివాలయాలు డిప్యుటేషన్ వేయడం తదితర విషయాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందించాం. సరిగ్గా ఇవే కారణాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ ముఖ్యమైన సమాచారాన్ని, ప్రభుత్వం విడుదల చేసి జీఓ నెంబర్లు, అందులో ప్రస్తావించిన ముఖ్యమైన విషయాలను  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేకంగా కధనాలు అందిస్తున్నాం. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్పందించినా చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు కరోనా వేక్సినేషన్ లో తామంతా తెగ కష్టపడిపోతున్నామని జిల్లా కలెక్టర్ల వద్ద రంగు పులుముకోవడానికి సచివాలయ సిబ్బంది అదనపు విధుల కోసం రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా కరోనా వేక్సినేషన్ కు, మండల కార్యాలయంలోని పనులకు వినియోగించుకున్న విషయాన్ని బయటకు తీసుకు వచ్చింది ఈఎన్ఎస్. అయితే మొదట్లో చాలా లైట్ తీసుకున్న జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీసీఈఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన వీడియో కాన్ఫరెన్సులో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ద్వారా ప్రస్తావించిన కధనాల్లో విషయాలపై తలంటడంతో ఒక్కసారిగా అధికారులంతా కంగారు పడ్డారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మండల అధికారులు సచివాలయాల నుంచి కదపడానికి వీల్లేదని చేసిన ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ విధులకు ఆటంకం కలిగించ వద్దని ప్రత్యేకంగా జీఓ జారీచేసినా జిల్లా అధికారుల ఆదేశాలతో మండల అధికారులు అదనపు విధులు అప్పగించడంతోపాటు  కార్యాలయ విధులకు వినియోగించుకునేవారని, ఈఎన్ఎస్ కధనాలతో ప్రభుత్వంలో చలనం వచ్చి నేరుగా విషయం ముఖ్యమంత్రి ద్రుష్టికీ తీసుకెళ్లారంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం ఆదేశాలతో తమకు విముక్తి లభించినట్టు అయ్యిందని అభిప్రాయపడుతున్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి తోపాటు సుమారు 16 ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శిలు, పోలీస్ డీజీపి కూడా సచివాలయ ఉద్యోగులకు అదనపు విధులు కేటాయించడానికి వీల్లేదని, డిప్యుటేషన్లు అసలు వేయవద్దని.. ఒకవేళ వేసి వుంటే తక్షణమే రద్దు చేయాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులకు టెలీకాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీచేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది సోమవారం నుంచి సచివాలయాలకే పరిమితం కావాలని కలెక్టర్లు గట్టిగా ఆదేశాలు జారీచేశారు. తప్పనిసరిగా బయోమెట్రిక్ నూటికి నూరుశాతం పడేలా చేయాలని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనితో ఈఎన్ఎస్ కధనాలు రాష్ట్రప్రభుత్వాన్ని చైతన్య పరచడంలో కీలక భూమిక వహించినట్టైంది. ఇపుడే కాకుండా ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా జరిగే అభివ్రుద్ధి, అందే సేవలపై రానున్న రోజుల్లోనూ మంచి మంచి కధనాలు అందిస్తామని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరోసారి తెలియజేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఒత్తిడిలు వచ్చినా ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని కూడా ప్రకటిస్తున్నాం. వైఎస్.జగన్మోహనరెడ్డి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శమైందనే విషయాన్ని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని కూడా చెబుతున్నాం. అదే సమయంలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, మండల అధికారుల అనాలోచిత చర్యలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడతామని, అదే సమయంలో ఉన్నతంగా పనిచేసిన అధికారులపై కూడా ప్రత్యేక చైతన్య, ఆదర్శవంతమైన కధనాలు(న్యూస్ కార్డ్) అందిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలను అన్ని మీడియాల కంటే ముందుగా తెలియజేస్తామని కూడా మాట ఇస్తున్నాం. సచివాలయాల సేవల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనలు, సూచనలు, సలహాలు కూడా ప్రజలకు కధనాల ద్వారా తెలియజేస్తామని ప్రకటిస్తున్నాం..!

Tadepalle

2021-07-17 16:02:21

కాఖీ చొక్కాలేదు.. చేతిలో లాఠీ అసలేలేదు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ ఉండాలి.. ఆకతాయిల ఆగడాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. దిశ చట్టంతో మహిళల దశను మార్చాలి.. దిశ చట్టం దేశానికే ఆదర్శం కావాలి.. నలుదిశలా వ్యాప్తి చెందాలి.. మహిళలకు పోలీసు శాఖ ఒక రక్షణ కవచంలా మారాలి.. అలా జరగాలంటే మహిళా పోలీసు వ్యవస్థ ఒక్కటే ముఖ్యం.. అలా జరగాలన్నా.. ప్రభుత్వం అనుకున్నట్టు గ్రామాల్లో తేడాగాళ్లకు కాస్త భయం వచ్చేటట్టు చేయాలన్నా.. మహిళా పోలీసుల ఒంటిపై కాఖీ చొక్కా.. నెత్తిన మూడు సింహాల గుర్తు.. చేతిలో లాఠీ ఉంటేనే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేది.. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఉత్తుత్తి పోలీసులుగానే మిగిలిపోయారు.. నిజమైన పోలీసులనే సివిల్ డ్రెస్సులో ఉంటే ఎవరూ పట్టించుకోరు..ఇక మహిళా పోలీసులమని చెప్పి సాధారణ దుస్తుల్లో గ్రామాల్లో తిరుగితే పరిస్థితి ఎలా వుంటుందో ఆలోచించుకోవాలి.. ఏంటి తేడాగా చదువుతున్నాం అనుకుంటున్నారా... కాదు కాదు మీరు కరెక్టుగానే చదువుతున్నారు.. ప్రభత్వ వ్యవస్థలోని లోపాలు.. రాష్ట్ర అధికారులు నిర్ధిష్టంగా ఇవ్వలేని ఆదేశాలు.. ఈ ఆర్టికల్ చదవేటపుడు మిమ్మల్నే కాదు ప్రజలను కూడా కాస్త చులకనగా ఆలోచించేలా చేస్తున్నాయి.. కారణం ఒక్కటే రాష్ట్రస్థాయిలో పోలీస్ బాస్ డిజిపి ఇచ్చిన ఆదేశాలు, ప్రత్యేక జీఓలు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడమే.. నేటికీ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ప్రభుత్వమే ఏ విధంగా గుర్తించాలో ఒక కొలిక్కిరాలేదంటే ఇక ప్రజలకు, మహిళలకు ఏ విధంగా సేవలందించి రక్షణ కల్పిస్తారనే అంశం ప్రశ్నార్ధకమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం నియమించిన మహిళా పోలీసులకు ఏ తరహా విధులు అప్పగించాలి, వీరిని ఏవిధంగా గుర్తించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డిజీపీ వరకూ అధికారులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి గ్రామస్థాయిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా వీరి నియామకాల సమయంలో జీఓ నెంబరు 129 ద్వారా సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు వీరికి ఐసిడిఎస్ అంగన్వాడీల పర్యవేక్షణ బాధ్యత కూడా అప్పగించారు. అంతవరకూ బాగానే వున్నా.. పోలీస్ ఉద్యోగమంటే ఒంటిపై కాఖీ చొక్కా, చేతిలో లాఠీ లేకపోతే గ్రామస్థాయిలో ప్రభుత్వం అనుకున్న గ్రామ సంరక్షణ జరగదు. అలా కాఖీ చొక్కా లేకపోతే వచ్చేది పోలీసులని ప్రజలు కూడా గుర్తించరు.. దీనితో ప్రభుత్వం తరువాత మరో జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. మహిళా పోలీసులందరినీ సాధారణ పోలీసులుగా మారుస్తున్నామని అందులో పేర్కొంది. అంతే కాదు వీరికి పదోన్నతి వస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం ఆ జీఓ పేర్కొంది. ఇక్కడే చిక్కంతా వచ్చిపడింది. డిగ్రీ చదువుకున్న తమను కానిస్టేబుళ్ల మాదిరిగా ఎలా గుర్తిస్తారంటూ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు సాధారణ పోలీసులు చేసే విధులకంటే తాము అధికంగా విధులు నిర్వర్తిస్తున్నామంటూ  చెప్పుకొస్తున్నారు. తమకు పదోన్నతి కల్పిస్తే ఎస్ఐలుగా పదోన్నతి కల్పించాలనేది వీరి డిమాండ్. ఇదిలా వుంటే గ్రామస్థాయిలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్ పోలీసులుగా తమ గౌరవానికి భంగం కల్పించారని హోంగార్డు నుంచి స్టేషన్ ఎస్ఐల వరకూ తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు.. మిమ్మల్ని తాము సాధారణ పోలీసులుగా గుర్తించలేమని, మేముండగా మిమ్మల్ని పోలీసులని ఎలా పిలుస్తారని.. ఇది జరిగేపని కాదని పోలీసులంతా వీరిని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల నేరుగా మీరు నిజమైన పోలీసులు కాదనీ.. మేమే నిజమైన పోలీసులమని.. అయినా డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు పొందిన మీరు.. మాలా ఇంటర్ విద్యార్హతతో కానిస్టేబుల్స్ గా ఉండటం ఏంటంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం విశేషం. దీనితో ఈ విషయం కాస్తా నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందటంతో వీరికి ప్రస్తుతం పోలీసు యూనిఫారం కాకీ డ్రెస్సు, లాఠీ ఇవ్వాలా లేదంటే. సివిల్ డ్రెస్సులో పేరుకే పోలీసులుగా ఉంచి, హోంగార్డులు, కానిస్టేబుళ్ల కిందనే విధులు నిర్వర్తించేలా చేయాలా అనే కోణంలో పోలీసులు వర్గాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇటు మహిళా పోలీసుల్లో కూడా చాలా మంది 45సంవత్సరాలు వచ్చినవారున్నారు. వారంతా తమకు పోలీస్ డ్రెస్సు వద్దని, పదోన్నతి ఇస్తే ఐసిడిఎస్ విభాగం నుంచి ఇవ్వాలని చెబుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా స్టేషన్ పోలీసులు తమకి ఏ స్థాయి ఉద్యోగం అంటే...  పోలీస్ డ్రెస్ వేసుకున్న ఉద్యోగం కావాలా, లేదంటే గ్రామసచివాలయంలోనే డ్రెస్సులేని ఉత్తుత్తి పోలీసు ఉద్యోగం కావాలా అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారట. ప్రత్యేక సమావేశాల్లో వీరి ఆలోచనలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అసలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలో  మహిళా పోలీసు ఉద్యోగం ఇవ్వడం, వారి విధుల కోసం జీఓ 129 జారీ చేసింది ప్రభుత్వం. అసలు ఆ జీఓపై రాష్ట్రంలోని ఎంత మంది పోలీసులకు అవగాహన వుంది.. దానిపై ఎన్ని జిల్లాల ఎస్పీలు వాటిపై నిర్ధిష్ట ఆదేశాలు ఎస్ఐలకు ఇచ్చారనే దానిపైనా నేటికీ క్లారిటీ రాలేదు. దీనితో సాధారణ పోలీసులుగా ప్రభుత్వం మిమ్మల్ని నియమిస్తే మాత్రం తామెలా గుర్తిస్తామంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట కానిస్టేబుళ్లు, ఎస్ఐలు. పోలీసుశాఖ పిలవబడే  హోంశాఖలోని సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు మహిళా శిసు సంక్షేమశాఖలోని అంగన్వాడీ కేంద్రాల మానటరింగ్ విధులు వీరికి కేటాయించారు. వాటితోపాటు గ్రామస్థాయిలో ఆరోగ్య సహాయకులు చేసే విధులు ఇమ్యునైజేషన్ విధులు కూడా కేటాయించారు. ఇలా ఒక్క మహిళా పోలీసు మూడు శాఖలకు చెందిన విధులతోపాటు, గ్రామసచివాలయంలో డిజిటల్ అసిస్టెంటుకి అత్యవసర సమయంలోనూ, పని అధికంగా ఉన్న సమయంలోనూ సహాయం చేయాలని ప్రభుత్వం మహిళా పోలీసులకు తెలియజేసింది. ఇన్ని చేస్తున్న ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థకు ఒక గుర్తింపు అంటూ ఇవ్వకవోవడం విశేషం. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మహిళా పోలీసు వ్యవస్తను  హోంశాఖలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల ద్వారా మహిళా పోలీసు వ్యవస్థను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అధికారులు తమకు వీరి ద్వారా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టారన్నట్టుగా వ్యవహరిస్తూ..మహిళా పోలీసులను కాస్త చులకనగా చూస్తున్నారు. ఈ విషయం డివిజన్ స్థాయిలో డిఎస్పీల, జిల్లా స్థాయిలో ఎస్పీలకు తెలిసినా కింది స్థాయి పోలీసులకు ప్రభుత్వం జారీచేసిన జీఓల ఆధారంగా వారి విధులు వారిని నిర్వర్తించనీయండి అనే కోణంలో ఆదేశాలు జారీచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా ఆదేశాలు జారీ చేసి ఉంటే స్టేషన్ స్థాయిలో పోలీసులు.. గ్రామ సచివాలయ మహిళా పోలీసులను ప్రశ్నించే తీరు, అజమాయిషి తీరు మారుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖ రెండేళ్ల ప్రొబిషన్ అనే మాటకు మహిళా పోలీసులు కూడా కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. లేదంటే డిగ్రీ, అంతకంటే ఎక్కువగా చదువుకున్న మహిళా పోలీసులు తాము ఏఏ జీఓ నెంబర్లు ద్వారా విధుల్లోకి చేరామో... ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో జీఓనెంబర్లు 129, జీఓనెంబరు 59లను విడుదల చేసిందో.. దైర్యంగా చెప్పేంత సత్తా ఉన్నవాళ్లే మహిళా పోలీసులుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోనూ, పట్టణాల్లోని వార్డుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అంతెందుకు దిశ యాప్ టార్గెట్ లు పెడితే రోజుకు 50 నుంచి 100 రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారంటే గ్రామస్థాయిలో వీరి విధులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా గుర్తించాలనే వాదన బలపడుతోంది. ఇవేమీ కాకుండా మాట్లాడితే మేము ఒక్క లెటర్ పెట్టామంటే మీ ఉద్యోగాలు పోతాయనే పదాన్ని స్టేషన్ లో హోంగార్డులు నుంచి ఎస్ఐల వరకూ ఆ పదాలను జోబులో పెట్టుకున్నట్టే మాట్లాడటం, వీరే మహిళా పోలీసులకు జీతాలు ఇస్తున్నట్టు కలరివ్వడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదంతా హోంశాఖలోని 60శాతం మంది పోలీసులు వెలబెడుతున్న వ్యవహారం మిగిలిన 40శాతం మంతి పోలీసులు ఎంతో చక్కగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలో చాలా చక్కగా వారికి ఉపదేశిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్ ఇనెస్పెక్టర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.  అటు ప్రభుత్వంగానీ, డిజిపీ కార్యాలయం నుంచి గానీ నిర్ధిష్ట ఆదేశాలు రాకపోవడం వలనే మహిళా పోలీసుల విధులేంటో.. యూనిఫారమేంటో నేటికీ తెలియని స్థితిలో విధులు నిర్వహిస్తున్నారు వార్డు, సచివాలయ మహిళా పోలీసులు.. ముందు ముందు వీరంతా పవర్ లేని ఉత్తుతి పోలీసులుగా గ్రామస్థాయిలో యూనిఫారం లేకుండా రక్షణ కల్పిస్తారా.. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తారా..అనేది డిజీపీ ఇచ్చే ఆదేశాల మీదే ఆధారపడి వుంది..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2021-07-17 04:26:45

పులివెందులలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీ..

‘నైపుణ్య యువాంధ్రప్రదేశ్’ దిశగా వడివడిగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వరల్డ్ స్కిల్ యూత్ డే సందర్బంగా ఆయన యువతీ,యువకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం' అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తగు శిక్షణను అందించాలనేదే ధ్యేయమని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందజేయడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించినా నెంబర్ వన్ స్కిలింగ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. 2లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు"ల్లోకి ఎక్కిందన్నారు. ఇటీవల సీఎం జగన్‌ చేతుల మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందులలో రూ.30కోట్లతో 'స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ' ఏర్పాటుకు శంకుస్థాపనతో కీలక ముందడుగు వేశామని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులదే కీలకమైన పాత్ర అని, నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తుందని ముందే గుర్తించడం సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. రేపటి భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతీ ఏడాదీ జూలై 15న 'ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం' నిర్వహించుకోవడం సముచితమని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయిని, ఆ నైపుణ్యాన్ని ఉచితంగా యువతకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవులు కావాలో చెప్పండి తామే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరులు సమకూరుస్తామనేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పన లక్ష్యంగా లోక్ సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్కటి చొప్పున 4 స్కిల్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం 30 నైపుణ్య కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ1,385 కోట్లను వెచ్చించేందుకు సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు.7 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ తీసుకొని 156 ప్రముఖ ఎమ్ఎన్‌సీ  కంపెనీలలో ఉపాధి పొందిన యువత 4,500 మంది అని తెలిపారు. 2021-22లో 5వేల మందికి ఒక్క ఓమ్ క్యాప్ ద్వారా ఉపాధి అవకాశాలు అందించాలనేది లక్ష్యంమని, స్కిల్ కాలేజీలలో యువతీ, యువకులు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 24 జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.ఆ జాబితాలో ఐబీఎమ్,టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్, బయోకాన్, ఒరాకిల్ తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి స్కిల్ కాలేజ్‌లో పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'లకు శ్రీకారం చేట్టినట్లు తెలిపారు. పరిశ్రమలలో స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు అందించేందుకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్- సప్లైల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా కృషి చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు శుభాభినందనలు తలియజేశారు.

Tadepalle

2021-07-15 16:10:54