1 ENS Live Breaking News

ఏపీలో కొత్తగా వీరికే డిపార్ట్ మెంటల్ టెస్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సరికొత్త విధానాలకు తెరలేపింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఒక్కశాఖలోని  డిపార్ట్ మెంటల్ పరీక్షల లేని వారికి కూడా క్రియేట్ చేసి మరీ నిర్వహిస్తోంది. గతంలోలేని ప్రభుత్వ శాఖలకు సైతం ఇపుడు కొత్తగా టెస్టులు నిర్వహించి దేశవ్యాప్తంగా వున్న రాష్ట్రాల ద్రుష్టిని ఏపీవైపు మరల్చుకుంటోంది. ఈ విషయంలో ఉద్యోగులను నుంచి తీవ్ర నిరసన ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. ఉద్యోగులకు ఈ పరీక్షలు వింతగానూ, కొత్తగానూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి ప్రత్యేక నిర్వచనం చెబుతోంది. అదీకూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన తరువాత ఈ డిపార్ట్ మెంటల్ టెస్టులు ఉంటాయని ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని లక్షా 34వేల మంది ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై ఒంటికాలపై లేచి మరీ మండిపడుతున్నారు. డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని కనీసం ఏడాది ముందుగా చెప్పి, సిలబస్ ఇచ్చి ఉంటే ఉద్యోగులంతా ఉత్తీర్ణత సాధించేవారని,, తీరా సర్వీసు రెగ్యులర్ చేయడానికి నెలరోజుల ముందు పరీక్ష పెట్టి పాసైతేనే సర్వీస్ రెగ్యులర్ అంటే ఎంత మంది పాసై ఉద్యోగాలు రెగ్యులర్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ప్రాధమిక శిక్షణ తప్పా మరే ఇతర శిక్షణలు ఇవ్వలేదని, ఈ కారణంగానే డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఖచ్చితంగా పెట్టి అందులో సిలబస్ ను ప్రత్యేకంగా ఉంచి వారికి శిక్షణ స్థాయిలో ఉంటుందనే కారణంతోనే ఈ విధంగా డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని వారికి కూడా పరీక్షలు పెడుతున్నామని ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి ప్రత్యేకంగా చెప్పారు. అదే సమయంలో ఈఎన్ఎస్ కూడా ఇదే పరీక్ష విషయాన్ని ముందుగా ఉద్యోగులకు చెప్పి ఉంటే పరిస్థితి బాగుండును కదాని ప్రశ్నిస్తే.. కరోనా సమయం కావడంతో అప్పుడు ప్రకటించలేదనే మాటను ఆ అధికారి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 8శాఖలకు అసలు డిపార్ట్ మెంటల్ టెస్టులే లేనపుడు ఏ విధంగా వీటిని నిర్వహిస్తారని కూడా ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ఆయా శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పై అవగాహన వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి శిక్షణ వారికి చాలదని.. ఆకారణంతోనే శిక్షణ తరహాలో కూడి డిపార్టమెంటల్ పరీక్షలు వీరికి నిర్వహిస్తున్నామని ఆ అధికారి బదులిచ్చారు. దానికి మహిళా పోలీస్ లనే ఉదాహరణగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న వీరికి అన్ని పోలీస్ స్టేషన్లలో లోనూ వారం రోజుల పాటు ప్రత్యేకంగా రెండవ దఫా శిక్షణ కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇపుడు కూడా ఉద్యోగులంతా మెరిట్ ప్రాతిపదిక మార్కులు తెచ్చుకోవాల్సిన పనిలేదని, క్వాలిఫై అయితే సరిపోతుందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను పోగొట్టడానికే ఈ క్లారిఫికేషన్ తమకున్న సమాచారం మేరకు ఇస్తున్నామని కూడా(పేరు రాయడానికి ఒప్పుకోని అధికారి) చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా..దేశం మొత్తం తొంగిచూసే ప్రభుత్వ శాఖగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపుదిద్దుకోవడానికి మాత్రం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తున్నారని తడుముకోకుండా చెప్పారు. ఇపుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులంతా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సీఎం ను ఆశానికి ఎత్తేస్తారని చెప్పడం విశేషం. ఈ డిపార్టమెంటల్ టెస్టులు కూడా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు విధినిర్వహణలో అన్నిరకాలుగా సౌకర్యంగా ఉండాలనే ప్రభుత్వం నిర్వహిస్తోందని.. ఇందులో వేరే ఉద్ధేశ్యం ఏమీ లేదని మాత్రం ప్రభుత్వంలోని పెద్దలు వల్లెవేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఏ శాఖలోని ఉద్యోగులకూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోవిధంగా స్పందించి, పరీక్షలు నిబంధనలు పెట్టడం మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది..!

Tadepalli

2021-09-11 05:53:16

విష్ణునివాసం లో గదుల కేటాయింపులు..

తిరుపతి లో రాబోయే శనివారం నుంచి భక్తులకు విష్ణు నివాసం లో గదులు  అందుబాటులోకి తేవాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల విష్ణునివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ,  ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఎదురుగా గదుల సమాచారం తెలిపే వివరాలు ఏర్పాటు చేయాలన్నారు.  అదేవిధంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమాచారం తెలియడం వల్ల భక్తులు సులభంగా స్థానిక ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని జెఈఓ చెప్పారు. శ్రీనివాసం నుంచి టూరిజం శాఖ స్థానిక ఆలయాలకు బస్సులు నడుపుతున్న విషయం విదితమే. విష్ణు నివాసంలో 50 శాతం గదులు భక్తులకు ఆన్ లైన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విష్ణు నివాసం చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.  అనంతరం ఆమె రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడుతూ, శనివారం నుంచి గదులు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం ఆమె  రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలను  పరిశీలించారు. కోవిడ్ కారణంగా ఈ సత్రాలు భక్తులకు తాత్కాలికంగా కేటాయించనందువల్ల చిన్నపాటి మరమ్మతులకు గురికావడం,  పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం  గమనించారు. గదుల మరమ్మతులు త్వరగా చేయించి పిచ్చి మొక్కలు తొలగించి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేయాలని ఆదేశించారు.  ప్రస్తుతానికి మూడవ సత్రంలోని గదులు భక్తులకు అందుబాటులోకి తేవాలని,  ఈ లోపు రెండవ సత్రంలో మరమ్మతులకు గురైన గదుల పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈఈలు  కృష్ణారెడ్డి,   సుమతి,  డిప్యూటీ ఈ ఈ  జోగయ్య,  సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ,  విష్ణు నివాసం ఏ ఈ ఓ  సీతామహాలక్ష్మి ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

Tirupati

2021-09-09 14:51:10

సీఎం సహాయనిధికి అపోలో రూ.2 కోట్లు విరాళం..

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్‌ టు ఆంధ్రాకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది. ఆ మొత్తానికి  సంబంధించిన చెక్కులను అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతా రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌కు అందజేశారు. ఈ సందర్బంగా వారిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆపోలో  ప్రెసిడెంట్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కార్పొరేట్‌ డవలప్‌మెంట్‌) నరోత్తమ్‌ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్‌) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్‌ వెర్టికల్‌) శివరామకృష్ణన్‌లు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-09 14:43:44

ప్రముఖ ఆదాయ వనరుగా పర్యాటకరంగం..

ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు.  పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా శాఖలు, పర్యాటక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో థాయిల్యాండ్, మలేషియా, స్విట్జర్లాడ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ది పర్చేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కోవిడ్ కు ముందు సాలీనా రూ.120 కోట్ల మేర ఆదాయం పర్యాటక శాఖ ద్వారా వచ్చేదని, ప్రస్తుతం  కోవిడ్ పరిస్థితుల్లో అది రూ.60 కోట్లకు పడిపోయిందన్నారు. కోవిడ్ ఆసుపత్రులు,  కోవిడ్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను పర్యాటక సంస్థ చేపట్టడం వల్ల అంతమాత్రం ఆదాయానన్నా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఇటు వంటి గడ్డు పరిస్థితుల నుండి పర్యాటక శాఖను కాపాడి, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకొనేలా పర్యాటక రంగాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు. 
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పర్యాటక హోటళ్ల వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క పర్యాటకునికి తెలిసే విధంగా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి దసరా పండుగలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ యాప్ ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మాసం ఒక ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు.   రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా మరియు రాయలసీమ పర్యాటక సర్క్యూట్లకు ఒక్కొక్క మేనేజరు చొప్పున మొత్తం నలుగురు మేనేజర్లను నియమించి ప్రత్యేక వోల్వో బస్సుల ద్వారా రెండు  లేక మూడు రోజులపాటు పర్యాటక ప్యాకేజిలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా సర్క్యూట్లలో గల పర్యాటక ప్రాంతాలకు చుట్టుప్రక్కల నున్న రాష్ట్రాల నుండి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది  కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 24  ప్రభుత్వ, 164 ప్రైవేటు బోట్లు అన్నింటినీ ఆపరేషన్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లైన్ లను నడిపేందుకు సంబందిత సంస్థలతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.   ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బాపట్ల, సూర్యలంక తదితర 13  ప్రాంతాల్లో ఐదు నక్షత్ర హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో 50 శాతం హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు.  అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 37 పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి గూగుల్ సెర్చి టాప్ టెన్ బెస్టు హోటళ్లలో అవి కనిపించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో “ ప్రసాదం” పథకం  అమల్లో బాగంగా  టెంపుల్ టూరిజం అభివృద్దికి చర్యలు చేపట్టామని, రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ది పనులు ఇప్పటికే చేపట్టామని, మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ది పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, యువజన శాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Tadepalle

2021-09-08 12:42:27

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం..

రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో  జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో  జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులంతా సజ్జల రామకృష్ణారెడ్డిని  కలిసి పలు అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జర్నలిస్టులు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల సమస్య,హెల్త్ ఇన్సూరెన్స్ ,ప్రమాద బీమా పాలసీ వంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీను బాబు వివరించారు. ప్రధాన పత్రికలతో పాటు చిన్న పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన అనేక మంది జర్నలిస్టులు పలు సమస్య లు ఎదుర్కొంటున్నారని సజ్జల  దృష్టికి తీసుకు వెళ్ళారు.  అంతేకాకుండా దశాబ్దాల తరబడి ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల కూడా జర్నలిస్ట్ లు తీవ్ర ఆందోళన చెందుతున్న వివరించారు. ఇక  1994లో విశాఖలో  23 మంది జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించిన నేటికీ వారికి ఎన్ఓసి లు జారీ చేయలేదని శ్రీనుబాబు సజ్జలకు  వివరించారు.  మరోవైపు 2005 ఆక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఘం సుమారు ఐదున్నర కోట్లు ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, అనేక వ్యయ ప్రయాసలకోర్చి సొమ్ము చెల్లించినప్పటికి  నేటికీ  ప్రభుత్వము ఆయా  స్థలాలు సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం కూడా తీవ్ర ఆవేదనకు  గురిచేస్తుందన్నారు. విశాఖ అర్బన్ అధ్యక్షులు పి.నారాయన్  మాట్లాడుతూ, తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అనేక సంవత్సరాల నుంచి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియజేశారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. వీటిపై సజ్జల సానుకూలం గా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సజ్జల హామీఇచ్చారు. చిన్న పత్రికలును ఆదుకుంటా మన్నారు. అనంతరం సజ్జలకు శ్రీనుబాబు సింహాద్రినాథుడు జ్ఞాపికను అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 13 జిల్లాలు కు చెందిన  జర్నలిస్టు సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలేల్ల అప్పి రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్రఅధ్యక్షులు వెంకటరావు,  ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు. విశాఖ నుంచి జర్నలిస్ట్ సంఘం నాయకులు ఈరోతి ఈశ్వర్ రావు, బందరు శివప్రసాద్, జి.శ్రీనివాసరావు,సీతారామ్ మూర్తి, ఆనంద్ రావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-06 14:28:00

శ్రీవారి నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం..

దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్న తయారుచేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన న‌వ‌నీత సేవ‌లో భ‌క్తులు పాల్గొనేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి ఏడు బ్రాండ్ల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్ర‌యం కోసం అందుబాటులోకి తెస్తామ‌న్నారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో శ‌నివారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. స్వామివారికి చెందిన సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈఓ వివరించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు టిటిడి అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో స‌దా భార్గ‌వి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-04 06:35:34

భక్తుల‌కు మరింత రుచిగా అన్న‌ప్ర‌సాదాలు..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత రుచిగా, శుచిగా అన్న‌ప్ర‌సాదాలు అందించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుపై అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ‌ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల్లో కూర‌గాయ‌ల సంఖ్య పెంచాల‌న్నారు. మ‌ధ్యాహ్నం ఒక ర‌క‌మైన మెనూ, రాత్రి ఒక ర‌క‌మైన మెనూ అందించేందుకు ర‌క‌ర‌కాలైన కూర‌గాయ‌ల‌ను వాడాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కింద‌ ప‌నిచేసే సిబ్బందికి డ్ర‌స్‌కోడ్‌, క్యాప్స్‌, గ్లౌజ్ అందివ్వాల‌న్నారు. ముఖ్యంగా వంట మాస్టార్ల‌కు, స‌ర్వింగ్ చేసే సిబ్బందికి అవ‌స‌ర‌మైన మెల‌కువ‌లు నేర్చుకోవ‌డానికి ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో శిక్ష‌ణ అందివ్వాల‌ని సూచించారు. స‌ర్వింగ్ సిబ్బంది వ‌డ్డించేట‌ప్పుడు భ‌క్తుల‌ను ఎలా సంభోదించాలి, స‌ర్వింగ్ ఎలా చేయ్యాలి, ఏవిధంగా మెలగాలి అనేది ఈ శిక్ష‌ణలో భాగంగా ఉండాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదాల త‌యారు చేసే కిచ‌న్‌, డైనింగ్ హాల్‌లో అవ‌స‌ర‌మైన ఆధునిక యంత్రాలు, ప‌రిక‌రాలను అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు ద్వారా కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అన్న‌ప్ర‌సాదాల త‌యారీలో వినియోగించే బియ్యం, ప‌ప్పు ధాన్యాలు, నూనె, నెయ్యి త‌దిత‌ర ముడిస‌రుకుల నాణ్య‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాల‌న్నారు. త‌ద్వార భ‌క్తుల‌కు అందించే భోజ‌నంలో నాణ్య‌త మెరుగ్గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మ‌న రాష్ట్రంలోనే గాక‌ ద‌క్షిణాది రాష్ట్రాల్లో జరిగే పుష్క‌రాలు, ప్రత్యేక ఉత్సావాలు వంటి పెద్ద జ‌న స‌మూహం ఉండే వేడుకలలో కూడా, భ‌క్తులకు టిటిడి అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి,  జెఈవో స‌దా భార్గ‌వి, ఎఫ్ఎ అండ్ సిఎవో  బాలాజి, అద‌న‌పు ఎఫ్ఎ అండ్ సిఎవో  ర‌విప్ర‌సాదు, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్, క్యాట‌రింగ్ అధికారి శాస్త్రీ ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

తిరుమల

2021-09-03 12:54:48

భూమి సేకరణకు 3నెలలు గడువు..సిఎస్

రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు,నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు గాను మరో మూడు మాసాలు అనగా డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా,ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ నుండి ప్రగతి ప్రాజెక్టుల మానిటరింగ్ గ్రూపు కో-చైర్మన్ అయిన కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, రసాయన,ఎరువులు శాఖామాత్యులు మనీష్ మాండవీయ,మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెన్స్ చార్జీ ఫర్  సైన్స్ అండ్ టెక్నాలజీ,ఎర్త్ సైన్సెస్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పియంఓ ఫెర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ డా.జితేంద్ర సింగ్ లు వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్,నడికుడి-శ్రీకాళహస్తి,కడప-బెంగుళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మిగతా భూమి సేకరించి అప్పగించేందుకు మరో మూడు మాసాలు సమయం కావాలని విజ్ఞప్తి చేయుగా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించిందించి ఆగడువులోగా భూమి అప్పగించాలని చెప్పారు.ప్రగతి ప్రాజెక్టులను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిషయంలో అత్యంత శ్రద్ధ కనపర్చి ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పడాలని కేంద్ర మంత్రులు సూచించారు.వివిధ రాష్ట్రాల వారీ ప్రగతి ప్రాజెక్టులు పెండింగ్ అంశాలను వారు సిఎస్ లతో సమీక్షించారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు భూమి సమీకరణకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని అప్పటికి మిగతా భూమి అప్పగింత ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన భూమిలో కొంతమేర రైల్వే శాఖకు అప్పగించగా మిగతా భూమిపై వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.దీనిలో భాగంగా ప్రభుత్వ భూమిని గుర్తించడం తోపాటు ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర మంత్రులకు వివరించారు.

ఇప్పటి వరకూ ఆయా ప్రాజెక్టులకు భూమి సమీకరించి అందించిన వివరాలను సిఎస్ కేంద్ర మంత్రులకు వివరించారు. అదేవిధంగా కొవ్వూరు- భద్రాచలం నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్  పేర్కొన్నారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర టిఆర్అండ్బి,రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,వి.ఉషారాణి తోపాటు అర్జా శ్రీకాంత్, డా.చలపతి రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-03 11:04:57

మా కుటుంబాలేం పాపం చేశాయ్ సారూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంచేసినా దానికో లెక్కుంటుంది.. అదేంటో కాస్తతిక్క కూడా ఉన్నట్టే కనిపిస్తుందని గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 24వేల మంది ఉద్యోగులు. ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువ జీతానికి రూ.15వేలు(బిపీఎల్ కుటుంబాల సంపాదన కంటే తక్కువ) సంపాదిస్తే.. కేవలం మేము రేషన్ కార్డులో ఉన్నామనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా కార్డు మొత్తం రద్దు చేసేస్తే మాకుటుంబాలు ఏం తిని బతకాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులంతా. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు సంపాదించిన వారంతా నిరుపేదలేనని, కేవలం తాము ఆ కార్డులో ఉన్నందుకు కార్డు రద్దు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో అధికంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు బిపీఎల్ కుటుంబాలకిచ్చే రేషన్ కార్డులు వినియగించకూడదనే ఉత్తర్వుతో ఉద్యోగస్తులు స్వచ్చందంగా రేషన్ కార్డులు సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ఉద్యోగం వచ్చిన వెంటనే పేస్కేలు ఇస్తారని అదేంటో తాము సాధించిన ఉద్యోగాలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతాలు ఇస్తూ, ఇంకా సర్వీసులు రెగ్యులర్ చేయకుండానే రేషన్ కార్డులు తొలగించడం సరికాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కావాలంటే కార్డుల్లో ఉద్యోగాలు పొందిన తమను తొలగించి తమ కుటుంబాల కార్డులు అలాగే ఉంచాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నా అవి కనీసం ప్రభుత్వం ద్రుష్టికి చేరడం లేదు. ఏ ప్రభుత్వ శాఖలో అయితే ఏ శాఖ ఉద్యోగం వస్తే అదేశాఖకు సంబంధించిన విధులు నిర్వహిస్తారని, కానీ సచివాలయాల్లో ఉద్యోగులతో ప్రభుత్వం అన్నిశాఖలకు సంబంధించిన విధులను చేయిస్తుందని, అక్కడ కనిపించని నిబంధనలు తక్కువ జీతంలో ఉద్యోగాలు పొందిన తమ కుటుంబాల రేషన్ కార్డులను తొలగించడానికి మాత్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లోకి వస్తే.. రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో తమకిచ్చే పేస్కేలు పరంగా చూసుకున్నా ఒక్కో ఉద్యోగి సుమారు రెండున్నర లక్షలకు పైనే జీతం కోల్పోయామని, దాని గురించి ఆలోచించని ప్రభుత్వం తమ రేషన్ కార్డుల విషయంలో ఉత్తర్వులు, ఉద్యోగాలకు ముడిపెట్టడం ఇదేం పద్దతంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు అధికారాలు విధులు కట్టబెట్టని ప్రభుత్వం తమకు అనుకూలంగా మాత్రం అన్ని నిర్ణయాలను ఆగమేఘాలపై అమలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండకూడదు వాటిని తొలగించిన ప్రభుత్వం అదే నిబంధనలు అమలు చేస్తూ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ప్రకారం అధికారాల బదలాయింపులు చేపడితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల సహేతుకంగా ఉన్నాయని అంతా భావించేవారమని, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టాలంటే ఒక విధానం, ప్రభుత్వం లాభపడాలంటే మరో విధానం అమలు చేయడం పద్దతి కాదని వాపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న తమను కార్డుల్లో నుంచి తప్పించి తమ కుటుంబ సభ్యులను అలాగే ఉంచి కార్డులు రద్దు చేయకుండా ఉంచాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి తప్పితే అభ్యర్ధనలు పట్టించుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర నుంచి రేషన్ కార్డులు తప్పించి, కనీసం అతితక్కువ జీతాలు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది్ వేచిచూడాలి..!

Tadepalle

2021-09-01 02:55:14

సచివాలయ ఉద్యోగుల బదిలీలు అప్పుడేనా..?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్నాయా.. జరుగుతాయా.. ఉంటే ఎపుడు ఉంటాయి.. అసలు ఐదేళ్ల వరకూ ఉండవా.. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత  ఏడాది చేసేస్తారా.. ఏది నిజం.. ప్రస్తుతం ఉద్యోగుల్లో ఇదే విషయమై తీవ్రమైన చర్చజరుగుతోంది. ఎవరో ఒకరు వేసిన ప్రశ్న మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాల్లో పనిచేస్తున్న లక్షా 35 వేలయ మంది ఉద్యోగుల మనసులను తీవ్రంగా తొలిచేస్తుంది. ఈ విషయంలో క్లారిటీ తెచ్చేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net తన నెట్వర్క్ తో రంగంలోకి దిగింది. వాస్తవాలు తెలుసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈఎన్ఎస్ నెట్వర్క్ దగ్గరకి వచ్చిన వివరాలు, కొందరు రాష్ట్ర అధికారులతో మాట్లాడిన తరువాత వచ్చిన క్లారిటీ ప్రకారం.. సచివాలయ ఉద్యోగులో ఇప్పట్లో బదిలీలు జరగవనేది సూచన ప్రాయంగా అధికారులు చెబుతున్నారు. దానికి కారణాలను కూడా వారు 5 అంశాలను ఈఎన్ఎస్ వద్ద ప్రస్తావించారు. 1)సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కాలేదు.. దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి.. 2)ఉద్యోగులకు బదిలీలు జరగాలంటే ట్రాన్స్ ఫర్ పాలసీని ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ప్రకటించాలి.. 3)నేటికీ గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు సరైన జాబ్ చార్ట్ రాలేదు, సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ కాలేదు..గెజిట్ లు పబ్లికేషన్ కాలేదు.. 4) ఏ ప్రభుత్వ శాఖలోనైనా బదిలీలు జరగాలంటే కనీసం మూడున్నరేళ్లు నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది.. 5) ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్నవారి ఉద్యోగాల్లో ఎంత మంది సర్వీసులు రెగ్యులర్ అవుతాయో ఎంతమందికి సమయం పడుతుందో..(వారికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఆధారంగా) అని మొదలు పెట్టారు. ఇదీ వాస్తవమే.. అసలు ఉద్యోగాలే రెగ్యులర్ కాకుండా బదిలీలు ఎలా చేస్తారో ఉద్యోగులకే తెలియాల్సి వుంది. ఒకవేళ సర్వీసులు రెగ్యులర్ అయినా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునేదాకా ఆ జోలికి వెళ్లే పరిస్థితి లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే మహిళా పోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసి జీఓనెంబరు 59 విడుదల చేయడం దానిపై కొంత మంది వ్యతిరేకించడం, వారి పదోన్నతుల్లో డిగ్రీ అర్హత ఉన్నా.. ఎస్ఐగా కాకుండా హెడ్ కానిస్టేబుల్ గా ప్రకటించడం, వారికి ఖాకీ డ్రెస్సు ఇస్తామంట కొందరు వద్దని చెప్పడం, ఇక మిగిలిన శాఖల ఉద్యోగులను తీసుకుంటే ప్రభుత్వం కేటాయించి ఏక రూప దుస్తుల విధానాన్ని వ్యతిరేకించడం. ఇవన్నీ పక్కనపెడితే అసలు నూతనంగా విధుల్లోకి చేరిన ఉద్యోగులను ఎలా బదిలీలు చేయాలనే అంశం. ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికే వందసార్లు వెయ్యికోణాల్లో ఆలోచిస్తూ.. వారి సర్వీసులకు చాలా నిబందనలు పెట్టి వాటిని అమలు చేయడానికి రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో కొత్త కొత్త విధానాలను రూపొందిస్తోంది.

 ఈ తరుణంలో ఉద్యోగుల్లో ఉన్న బదిలీల ఆశలపై సదరు ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు నోరు మెదపడం లేదు సరకదా..వారి సర్వీసులకు సంబంధించిన అన్నీ అంశాలూ పూర్తైన వరకూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే ఉద్యోగులు మాత్రం వారి వారి సామాజిక మాద్యమాల్లో మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, జిల్లాల పరిధిలోనే జరిగే బదిలీల కోసం పెద్ద పెద్ద చర్చలకు తెరతీస్తున్నారు. ఒక ప్రక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు సంబంధించి జీఓనెంబరు 149 పెండింగ్ లో ఉండిపోవడంతోపాటు 8శాఖల సిబ్బందికి డిపార్టమెంటల్ టెస్టుల విషయంలోనూ ఒక్కోశాఖకు సంబంధించి ఒక్కో గెజిట్ పబ్లికేషన్ ను ప్రభుత్వం ఆలస్యంగా విడుదల చేసుకుంటూ వస్తుంది. వాస్తవానికి ఉద్యోగులకు సర్వీసు రూల్స్ దగ్గర నుంచి ప్రొబేషన్ డిక్లరేషన్ తోపాటు, ట్రాన్స్ ఫర్స్ ఎలిజిబిలిటీ వచ్చినా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొచి బదిలీలకు జీఓ ఇస్తే తప్పా ఆ పని జరగదు. ‘ఆలు లేదు సూలు లేదు కొడుడుపేరు సోమలింగం’ అన్నట్టుగా సచివాలయ ఉద్యోగులు అపుడే బదిలీల కోసం ఆలోచిస్తుండం విచిత్రంగా ఉందంటూ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు జస్ట్ కామెడీగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లడం, ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాలు, పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, గ్రేడ్-1,4 కార్యదర్శిల నుంచి ప్రోత్సాహం లేకపోవడం, వేరే వేరే జిల్లాల్లో ఉద్యోగాలు లభించడం, ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేలు జీతం ఎటూ చాలకపోవడం తదితర ఎన్నో కారణాలను సచివాలయ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఏది ఎలా వున్నా, ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు డిక్లరేషన్ ప్రకటించి వారందరికీ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించిన తరువాత మాత్రమే పదోన్నతలకు సంబందించి ఏ పనైనా ముందుకి కదులుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. 

కాగా  రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు మాత్రం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లకు మాత్రం లైన్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వంలోని ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ పదోన్నతలు(సర్వీస్ రెగ్యులైజేషన్) రాగానే ఒక్కసారే జంప్ అయిపోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు రెగ్యులర్ అయిపోతే ఒక పనైపోతుందని, కావాలంటే ఆ తరువాత బదిలీలు, పదోన్నతులు, ఇతరత్రా అంశాలు చూసుకుందామన్నట్టుగా కామ్ గా ఉండి పోతున్నారు. మరికొంత మంది తమకు రావాల్సిన అధికారాలు, విధులు, నిధులు, పరిధిల కావాలని పట్టుబడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గ్రామసచివాలయాల్లో డిడిఓగా ఉండే కార్యదర్శిలను కాదని పంచాయతీరాజ్ శాఖ ఆ అధికారాలను విద్యార్హత తక్కువగా వున్న వీఆర్వోలకు కట్టబెట్టింది ఆ అంశం కాస్త కోర్టులో ఉంది. గ్రేడ్-5 కార్యదర్శిల అధికారాలు సైతం ఇంకా గాల్లోనే ఉన్నాయి.. ఇంకా భర్తీకానీ చాలా పోస్టులను ప్రభుత్వం ఇంకా భర్తీచేయలేదు. ఇలా ఎటు చూసినా బదిలీలకు సంబధించి ఏ కోణంలోనూ లైన్ క్లియర్ గా ఉన్నట్టు మాత్రం కనిపించం లేదు. అయితే ఇన్ని కారణాలు చెప్పిన అధికారులు ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని దగ్గర చేసి బదిలీలు చేయించినా చేస్తారంటూ అధికారులు ముగించడాన్ని బట్టి బదిలీలకు అశకాశం 50-50 చాన్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో అక్టోబరు 2 తరువాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయంపై అందరికీ ఉత్కంఠ నెలకొంది..!

Tadepalle

2021-08-31 02:12:40

శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం..

శ్రీ‌కృష్ణాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకుని అర్చ‌కుల‌కు అంద‌జేశారు.అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప‌విత్ర‌మైన కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దినం రోజున న‌వ‌నీత సేవ‌ను ప్రారంభించుకోవ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌న్నారు. క‌లియుగం ఉన్నంత‌కాలం ఈ సేవ కొన‌సాగుతుంద‌న్నారు. ఇందుకోసం గోశాల‌లో దేశవాళీ గోవుల పాల‌తో పెరుగు త‌యారుచేసి, దాన్ని సంప్ర‌దాయబద్ధంగా క‌వ్వాల‌తో చిలికి వెన్న తీస్తార‌ని చెప్పారు. ఈ  వెన్న‌ను ప్ర‌తిరోజూ గోశాల నుండి ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకొచ్చి అర్చ‌కుల‌కు అంద‌జేస్తార‌ని వివ‌రించారు. అర్చ‌కులు వెన్న‌ను స్వీక‌రించి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు వినియోగిస్తార‌ని తెలిపారు. వెన్న త‌యారీ, వెన్న ఊరేగింపులో శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొంటార‌ని వివ‌రించారు. ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఛైర్మ‌న్‌, ఈవో వెన్న త‌యారీని ప‌రిశీలించారు. క‌వ్వంతో కుండ‌లోని పెరుగును చిలికారు. ఈ సంద‌ర్భంగా గోశాల ప్రాంగ‌ణాన్ని రంగ‌వ‌ళ్లులు, పుష్పాల‌తో అలంక‌రించారు.న‌వ‌నీత సేవ‌లో వెన్న తీసుకెళ్లి స్వామివారికి స‌మ‌ర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల బ‌రువు గ‌ల వెండి గిన్నెను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి విరాళంగా అంద‌జేశారు.  న‌వ‌నీత సేవ ఊరేగింపులో చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లో చిన్నారులు ఆక‌ట్టుకున్నారు. కోలాటం క‌ళాకారులు కృష్ణుని భ‌జ‌న పాట‌లు ఆల‌పిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్‌బాబు,  హ‌రీంద్ర‌నాథ్‌,  విజ‌య‌సార‌థి,  లోక‌నాథం,  భాస్క‌ర్, విజిఓ బాలిరెడ్డి, టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు  శివ‌కుమార్‌, ఎవిఎస్వోలు  ప‌వ‌న్‌,  గంగ‌రాజు,  సురేంద్ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-30 13:28:52

ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ దళం..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఒక దళం ప్రజలకు దర్శనం ఇవ్వబోతుంది..13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ప్రత్యక ఏకరూప దుస్తులు(యూనిఫారం)తో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ పనిచేసే మహిళాపోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసిన ప్రభుత్వం మిగిలిన 16 శాఖల(ఆల్రెడీ వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు గ్రీన్ యాప్రాన్ఇచ్చేశారు) ఉద్యోగులకు దుస్తులను ఇవ్వనుంది. వీరంతా అక్టోబరు రెండు తరువాత అన్ని సచివాలయాల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంతోనే దర్శనమిస్తారు. వీరిని చూసిన వారందరికీ ఒక ప్రత్యేక దళంగా కనిపిస్తారు. అందుకే వీరికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దళంగా విశ్లేషకులు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిై సిబ్బంది సేవలు కూడా అందిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ఉద్యోగులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ పనుల, సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చేవారందరికీ వీరు ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే యూనిఫారం ఇస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి చెప్పారు. వీరికి మెడలో వేసుకోవడానికి కూడా గ్రామ, వార్డు సచివాలయం పేరుతోనే ఐడీకార్డు బ్యాడ్జీలు కూడా ఇవ్వనున్నారు. అందరూ ఒకేలా దుస్తులు వేసుకోవడంతోపాటు, ఎవరికీ కేటాయించి ప్రభుత్వశాఖల సీట్లో వారు కూర్చొని వచ్చిన వారందరి సేవలు చేస్తారు. ఇప్పటికే 775 సేవలను సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన్న ప్రభుత్వం అన్నింటికోసం కామన్ సర్వీస్ సెంటర్ ను అనుసంధానం చేసే పనిలో ఉంది. 

ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు క్రింద కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులోకి తెచ్చిన ఈవిధానం కూడా అక్టోబరు 2 తరువాత రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తుందని కూడా ఆ అధికారి చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల సేవలు ఒక్క గ్రామస్థాయిలోనే ప్రజలు పొందేలా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పారు. త్వరలోనే వివిధ రకాల సర్టిఫికేట్లు(ఫార్మసీ, మెడిసిన్, పారామెడికల్ బోర్డు, డ్రైవింగ్ లైసెన్స్ రెవిన్యువల్ ఇలా) అన్ని రకాల సేవలను కూడా ఇక్కడి నుంచే పొందే విధంగా కూడా గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేస్తుందట. అదే జరిగితే రాజధాని ప్రాంల్లో మాత్రమే ఉండే సదరు కార్యాలయాలకు ఎవరూ వెళ్లాల్సిన పనికూడా ఉండదు. ప్రజలకు ఆర్ధిక భారాన్ని తగ్గించి అన్ని రకాల సేవలను ఒకేచోట అందించడంతోపాటు స్పందన ద్వారా వచ్చే అర్జీలను కూడా వీరే పరిష్కరించాల్సి వుంటుంది. స్పందన దరఖాస్తులను మాత్రం మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల డాష్ బోర్డుల ద్వారా పర్యవేక్షించి ఎవరి స్థాయిలో వారు స్పందన అర్జీలను కూడా పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది..

ఇక సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల అధికారాలు, విధులు, నిధులు పరిధిల బదలాయింపుపై కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. పంచాయతీ కార్యదర్శిల ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందట. ఇప్పటికే ఈ విషయమై ఉద్యోగులంతా ఆందోళన చేయడం, మండలం నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వరకూ లేఖలు సమర్పిస్తూ వచ్చారు. అయితే కేవలం ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కాకపోవడం, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డంకిగా ఉండటం, ప్రస్తుతం ఉన్న గ్రేడ్-1,4 యూనియన్  నేతల ఒత్తిడి వలన కాస్త ఆలస్యం అవుతున్నా.. ఖచ్చితంగా అమలు చేస్తామని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇంటిపన్నులు పెంచిన తరుణంలో వాటి ఎసెస్ మెంట్లు పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేయకపోయాయి పంచాయతీలు, వారికి పూర్తిస్థాయిలో సిబ్బంది(జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు) ఉన్నా వారు పని పూర్తిచేయలేకపోయారు. అప్పుడు కూడా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులే ఆ పనులు వారి వారి పరిధిలోని ఇళ్లకు అర్ధరాత్రి సమయంలో కూడా అసెస్ మెంట్లు ఆన్ లైన్ చేశారు. దీనితో వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం వున్న గ్రేడ్-1,4 పంచాయతీకార్యదర్శిల్లో 80శాతం మందికి కంప్యూటర్ వినియోగంపై అవగాహన లేకపోవడం, సిబ్బంది ఉన్నా పని సకాంలో పూర్తిచేయకపోయిన విషయాన్ని గుర్తించామని పంచాయతీరాజ్ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గ్రేడ్-5 కార్యదర్శిలు డిమాండ్ సహేతుకంగా ఉన్నప్పటికీ, అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుందని, మరోవైపు జిల్లాల నుంచి కలెక్టర్లు కూడా ఇదే విషయమై చర్చలు జరుపుతున్న విషయాన్ని కూడా ఆయన కొందరు రాష్ట్ర సచివాలయ మీడియా ముందు ప్రస్తావించినట్టు సమాచారం అందుతుంది.  అయితే వీరికి ఎప్పుడు బదలాయింపులు ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ రావడానికి సమయం పట్టేట్టు కనిపిస్తుందని, అదే సమయంలో ఉద్యోగులకు రెగ్యులర్ అయితన తరువాత అధికార బదలాయింపులు చేయపోతే వారు కోర్టుకు వెళితే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు రావడానికి మార్గం సుగమం అయినట్టుగానే కనిపిస్తుంది..ఇక అధికారులు నిర్ణయం తీసుకోవడమే తరువాయి. కాగా ఏకరూప దుస్తులపై మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. కాకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరగవనే సంకేతాలు కూడా దుస్తుల టెండరు తేటతెల్లం చేసింది.. !

Tadepalle

2021-08-30 06:11:51

ఐఏఎస్ అధికారులంతా పల్లె బాటపట్టారు..

ఆ.. ఐఏఎస్ అధికారి పేరు ఏ. సూర్యకుమారి..  విజయనగరంజిల్లాకి  కలెక్టర్, అన్ని ప్రభు త్వశాఖలను శాసించే జిల్లా ముఖ్య అధికారి, పలు సంస్ధలకు చైర్మన్.. కావాలను కుంటే ఏసీ గదుల్లో కూర్చొని కింది స్థాయి అధికారులతో పనిచేయించొచ్చు.. ఆదేశాలివ్వొచ్చు.. చిటెక వేసి క్షణాల్లో పథకాలు అమలు చేయించవచ్చు.. కానీ అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు ఏమనుకుంటున్నారో మాత్రం వాస్తవాలు తెలియవు.. ఇదే విషయాన్ని గమనించిన సీఎం  వైఎస్ జగన్మోహనరెడ్డి కలెక్టర్లూ మీరు ప్రజల ఇంటి ముందుకు వెళ్లాలి..ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో అని తెలుసుకోవాలని కోరారు. అంతే రాష్ట్రంలోని విజయనగరం జిల్లాతో పాటు, మిగిలిన 12 జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు తమ కార్యాలయాల్లో ఏసీ గదులు వదిలిపెట్టి క్షేత్రస్థాయిలో నిజంగా ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇంటి ముందుకెళ్లి ఒక సాధారణ వ్యక్తిలా ప్రభుత్వ పథకాల కోసం ఆరాతీస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల కోసం చేసే వేల కోట్ల సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు అందుతున్నాయో..లేదంటే మధ్యలో దళారులు, అమలు చేసే అధికారులు తినేస్తున్నారో..అదీ కాదంటే పథకం రాసినందుకు ఆయా పార్టీల నేతల బొక్కేస్తున్నారో స్వయంగా జిల్లా కలెక్టర్ పసిగట్టేందుకు ఈ ప్రజల ముంగిట ప్రభుత్వ పథకాల అమలు శోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. 75ఏళ్ల స్వాంతంత్ర్య భారత దేశంలో అఖిలభారతస్థాయి అధికారి సాధారణ ప్రజల గుమ్మం ముందు చేతులు కట్టుకొని నిలుచుని మరీ ప్రభుత్వ పథకాల అమలు కోసం వాకబు చేసిన అంశాన్ని ఎవరైగా ఊహించారా అంటే లేదనే చెప్పాలి. 

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని పథకాలు ప్రభుత్వానికి ఖర్చు తప్పా, ప్రజలకు ఉపయోగం లేదు. అలాంటి వాటిల్లో ఇంటింటికీ రేషన్ పథకం. ఇందులో వందల కోట్ల రూపాయలు వాహనాల కొనుగోలుకి ప్రభుత్వం ఖర్చుచేసింది. అనుకున్నట్టు ఆ పథకం ప్రజల మనసును రంజింపచేయలేకపోయింది. ఈ పథకం వలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసుకోవాలని, ప్రజల సమస్యలతోపాటు, అమలు కాని పథకాల వివరాలు తెలుసుకోవాలని కూడా ప్రజలే ఐఏఎస్ అధికారుల ముందు ఏకరువుపెట్టే ఒక బ్రుహత్తర కార్యక్రమం కోసం ఇపుడు దేశమంతా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే..గాంధీజీ కలలుగన్న గ్రామపరిపాలనను గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇపుడు వారితోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది. అయనప్పటికీ ఏదో తెలియని వెలితి, ఇంకా చాలా మంది ప్రజలకు రాజకీయ నేతల వలనో, అధికారులో, సిబ్బంది ఫాల్సు ప్రెస్టేజీ వలనో పథకాలు అందని వారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నిజమైన అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు రాజమార్గం వేసినట్టు అయ్యింది. నలగని బట్టకట్టుకొని అధికారులతో సమీక్షలు నిర్వహించే ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ, ఎండలో ఆరుబయటే నిలుచొని ప్రజలతో మమేకమై వారిని బాగోగులు తెలుసుకునేలా చేసిన ఈ ప్రయత్నం కొందరు ఐఏఎస్ అధికారులకు, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని పథకాలు  అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకులకు కాస్త అసహనం కలిగించినా.. కొద్ది మంది అధికారులకు నచ్చకపోయినా, మెజార్టీ ఐఏఎస్ అధికారులను మాత్రం ఎంతగానో ఆలోచింపజేసింది. 

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇలా ఆదేశించగానే అలా కధనరంగంలోకి దిగా ఐఏఎస్ అధికారులు గ్రామాల బాట పట్టారంటే సీఎం ముందుచూపు, సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి అందాలనే ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఐఏఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించడం వలన ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు..వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. పనులు చేయడానికి కాసుల పందేరం పెట్టే అవినీతి అధికారుల ఆటకూడా కట్టడై పోతుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే టైమిదాటిపోయిన తరువాత కార్యాలయానికి వెళ్లి.. ఆ తరువాత సమయం మిగిలి ఉండగానే ఇంటి మొహం పట్టే అధికారులతో కూడా సీఎం తీసుకున్న నిర్ణయం చక్కగా పనిచేయించేలా చేస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ జీఓల ద్వారా పూర్తిస్థాయి అధికారాలు బదలాయింపు జరగకపోతే ప్రజలకు ఎలాంటి సేవలు అందవనే విషయం ఇప్పటికే గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో తేలిపోయింది. వీరికి ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149 ఆధారంగా అధికారాలు, విధులు, నిధులు పరిధిలు పంపకాలు చేయాల్సి వున్నా ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ దానిని అమలు చేయలేదు. ఫలితంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటైనా, వీరి ద్వారా ప్రజలకు సేవలు మాత్రం అందడం లేదు. ఇపుడు ఆ విషయం కూడా గ్రామాల్లోకి వచ్చే ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులకు ప్రజలే చెప్పే సమయం వచ్చింది. ఏదైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందుని అనే మాట్లాల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తే ఐఏఎస్ అధికారులే గ్రామాల బాట పట్టారు. జిల్లా కలెక్టర్ కు విశేష అధికారం ఉంది కనుక కనుసైగలతో అధికారులు పనులు చేస్తున్నారు.. అదే నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకూ అవే అధికారాలు(149 జీవో ద్వారా సంక్రమించేవి మాత్రమే) ఉంటే ఫలితాలు ఇంకెంత బాగుంటాయో ఊహకే అందదు..  ఐఏఎస్ అధికారి మనసుపెట్టి ఆలోచించి పనిచేసే సిబ్బందికి అధికారాలు కట్టబెడితే ఫలితాలు ఏ విధంగా వస్తాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి వుంది..! 

Tadepalle

2021-08-28 02:13:37

సచివాలయ సేవలపై బురద చల్లుతున్నారు..

భారతదేశం మొత్తం తొంగిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్తపై ఒక వర్గం మీడియా కావాలనే బుదరచల్లుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో గత ప్రభుత్వాల సమయంలో పంచాయతీలు, పాలక మండలి మాత్రమే పరిపాలన చేసేవి. ఆ తరువాత గత ప్రభుత్వం  పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సుమారు 9ఏళ్లకు పైనే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడిచాయి. ‘వంగలేక మంగళవారం’ అన్నట్టు ఆ సమయంలో తినేసిన నిధులు, లేని ఖర్చులకు చూపిన లెక్కలపై నోరుమెదపని మీడియా.. ఇపుడు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మాత్రం ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. వీటి వలన ఎలాంటి ఉపయోగం లేదన్నట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేస్తుంది. వ్యవస్థ ఏర్పాటు చేయడం తప్పుకాదు.. ఆ వ్యవస్థకి ఒక దిశా నిర్దేశం, ప్రభుత్వ జీఓలను సమయానికి అమలు చేయకపోవడం తప్పు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ అదే జరుగుతుంది. ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన తరువాత జీఓనెంబరు 149 ప్రకారం గ్రామ సచివాలయాల వారీగా పంచాయతీ పరిధిని విభజించాలి. జనాభాకు సేవలు అందించడానికి రెండు నుంచి 4వేల జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎందుకనో అక్కడ నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని మాత్రం విభజన చేయలేదు. ఫలితంగా ఇంకా పంచాయతీల్లోని గ్రేడ్-1-4 కార్యదర్శిల చేతుల్లోనే పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో మేజర్ పంచాయతీల్లో  అదనంగా మరో రెండు గ్రామ సచివాలయాలు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వం నియమించిన గ్రేడ్-5 కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. సుమారు రెండేళ్లు కావొస్తున్నా వీరికి ఎలాంటి దస్త్రాలు ఇవ్వకపోవడమే పంచాయతీరాజ్ శాఖ చేసిన ప్రధాన తప్పుగా కనిపిస్తుంది..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్క గ్రామీణ ప్రాంతంలోని సచివాలయాల్లో సుమారు ఏడువేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఉన్నారు. ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం సచివాయాలను కేటాయించారు తప్పితే, ప్రభుత్వమే విడుదల చేసి జీఓ నెంబరు 149 ఆధారంగా వీరికి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు. ఫలితంగా ఏ చిన్న పనికోసమైనా, ఆఖరికి ఆయా సచివాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నా పంచాయతీల చుట్టూ గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సమయం వ్రుధా అవుతుంది తప్పితే ప్రజలకు మాత్రం సేవలు అందడం లేదు. పంచాయతీల్లో నిధులు పుష్కలంగా వున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించకపోయినప్పటికీ ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, విద్యుత్ మీటర్లు, ఇలా చాలా సర్వీసుల ద్వారా గ్రామపంచాయతీలకు అత్యధిక స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం జనాభా ప్రాతిపధిక విభజించి సచివాలయాలను ఏర్పాటు చేసినట్టుగానే విధులు, నిధులు, అధికారాలూ కూడా విభజన చేసి వుంటే ఇప్పటికే అద్బుతమైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో డీపీఓ, జిల్లా కలెక్టర్ ఆఖరికి రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీఓను అమలు చేయడానికి చొరవ చూపకపోవడంతో ప్రభుత్వం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది.

ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తిచూపకుండా.. నిధులు లేవని, పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో జరగడం లేదని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి దిగాయి. దానికి కారణం కూడా ప్రభుత్వమే. జనాభా ప్రాతిపధిక సచివాలయాలను విభజన చేసి అక్కడ సిబ్బందిని నియమించిన ప్రభుత్వం ఎందుకు పారిశుధ్య సిబ్బందిని కేటాయించలేదు.. ఎందుకు చెత్తతరలించే వాహనాలు సమకూర్చలేదు..ఎందుకు అధికారాలు, రికార్డులు బదలాయించలేదూ అంటే మాత్రం ఆ.. ఒక్కటీ అడక్కు అంటున్నాయి అధికార వర్గాలు.. చేయాల్సింది చేయకుండా ఫలితాలు వచ్చేయాలంటే ఎలా ఎలావస్తాయనే విషయంతో కనీసం ఆలోచించపోవడం విశేషం. సచివాలయాలకు కార్యదర్శిలను నియమించిన ప్రభుత్వం అదే సచివాలయాలకు పారిశుధ్య సిబ్బందిని కేటాయిస్తే ఎవరి గ్రామ సచివాలయ పరిధిలో ఆ గ్రేడ్-5 కార్యదర్శి పారిశుధ్య నిర్వహణ చేయడానికి 100 శాతం అవకాశం వుంటుంది. సచివాలయాలల్లో కార్యదర్శిలు ఉన్నా..  ప్రభుత్వం పరిధిలను విభజించకుండా మొత్తం పారిశుధ్య నిర్వహణ పంచాయతీలోనే ఉంచేయడం, అక్కడ పనిచేస్తున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలకు ఇతర పంచాయతీలకు ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఉన్న పంచాయతీల్లో పారిశుధ్యం కాస్తా అపారిశుధ్యంగా మారుతోంది. దీనితో నిర్వహణ భారం పంచాయతీలకు గుది బండలా మారుతోంది. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలు పూనుకొని చేయించాలన్నా వీరికి ఎలాంటి అధికారాలు లేకపోవడంతో కనీసం పారిశుధ్య కార్మికులు సైతం వీరి మాట వినడం లేదు. తమ పంచాయతీ కార్యదర్శి చెబితే తప్పా తాము ఎక్కడికి వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు రాష్ట్రవ్యాప్తం ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వంపై బురదచల్లే మీడియాకి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్టుగా వ్యవహరించడం ఇపుడు ప్రధాన చర్చగా మారింది. చేసిన తప్పుని పదే పదే మీడియా ఎత్తిచూపుతున్నా చూసి ముసి ముసి నవ్వులు నవ్వే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రజలకు గ్రామాల్లోనే సేవలందంచడానికి నియమించిన సచివాలయక గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు బదలాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇదే పద్దతి కొనసాగితే థర్డ్ వేవ్ లో పరిస్థితి మరింత దారుణంగా పరిణమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  పారిశుధ్య నిర్వహణ జరగగక.. ప్రజలకు మురుగు కంపే మిగిలి రోగాలతో రాష్ట్రం రాజ్యమేలడం ఖాయంగా కనిపిస్తుంది.. చూడాలి ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మేలుకుంటుందో లేదో..!

Tadepalle

2021-08-26 03:08:55

మహిళాపోలీసుల సర్వీసు రెగ్యులేషన్ పై సమీక్ష..

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4  గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14న్నర వేల మహిళా పోలీసులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ లో ప్రభుత్వం సూచించిన విధంగా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోనున్నామని రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం అదనపు డిజీపీ ఎన్.సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి డిఐజీలు నాగేంద్రకుమార్, ఎస్వీరాజశేఖర్ బాబు, రాజకుమారి లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని శాఖలుగా గుర్తించిన8 ప్రభుత్వ శాఖల్లో  మహిళా పోలీసులు కూడా ఉండటంతో వీరికి ఏ విధంగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, వారికి ఏ తరహా ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి, ఏ తరహా శిక్షణలు ఇవ్వాలనే విషయంపై పూర్తిస్థాయిలో జిల్లాల ఎస్పీలతో చర్చించారు. అంతేకాకుండా మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు కేటాయింపులు, వారి యొక్క నూతన జాబ్ చార్టు అమలు, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలను ప్రస్తావిస్తూ ఈ వీడియో కాన్ఫరెన్సులో కీలక మైన అంశాలను చర్చించారు. కాగా మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ.. సర్వీసులను రెగ్యులర్ చేయడానికి చేయడానికి ఒక ప్రత్యేక వ్రాత పరీక్ష నిర్వహించేలా సూచనలు చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే అది ఏంటనే విషయంలో బయటకు మాత్రం రాలేదు. గతంలో ఇదే విషయమై పలు దఫాలు చర్చలు జరిగినా.. ఇటీవల ప్రభుత్వం 8 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విషయంలో ప్రత్యేక పరీక్షలు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు సూచించాలని చెప్పడంతో ఈరోజు జరిగిన ప్రత్యేక సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రస్తావించిన అంశాలను డిజిపీ తెలియజేసిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేకార్యదర్శి ఆదేశాల మేరకు వీరికి పరీక్షలు నిర్వహించే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటరని మాత్రం తెలుస్తుంది. ఈరోజు మంగళగిరి నుండీ అన్ని జిల్లాల ఎస్పీలు, పి.టి.సి ప్రిన్సిపాల్స్, కమాండెంట్లు, డి.టి.సి & బి.టి.సి హెడ్స్, అన్ని జిల్లాల ఎస్డీపీఓలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Tadepalle

2021-08-25 15:44:48