1 ENS Live Breaking News

హెచ్ఆర్ఎంఎస్ లో సాంకేతిక లోపం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అత్యవసరంగా సెలువులు పెట్టాలంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెచ్ఆర్ఎంఎస్(హ్యూమన్ రీసోర్స్ మేన్ పవర్ సిస్టమ్)లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఇటు పంచాయతీ కార్యదర్శిలకు గానీ, అటు పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు గానీ లాగిన్ ఇవ్వకపోవడంతో వీరికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెలవుచీటి రాసి సచివాలయంలోనూ, అటు పోలీస్ స్టేషన్లలోనూ ఇచ్చినా ఫలితం ఉండటం లేదు. బయోమెట్రిక్ అటెండెన్సు విధానం కూడా హెచ్ఆర్ఎంఎస్ కు అనుసంధానం అయి ఉండటంతో మహిళా పోలీసులు సెలువులు పెట్టిన సమయంలో బయోమెట్రిక్ సిస్టమ్ లో విధులకు హాజరు కానట్టు చూపిస్తుంది. దీనితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు సాధారణ సెలవులు పెట్టుకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలకు తెలియజేసినా.. ఇంకా హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లు తమకు కూడా ఇవ్వలేదని ఎస్ఐ లు చెబుతున్నారు. దీనితో వీరి సెలవులు ఆన్ లైన్ లో నమోదు కావడం లేదు. తమకు అత్యవసర సమయంలో సెలవులు తీసుకునేందుకు హెచ్ఆర్ఎంస్ లాగిన్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని మహిళా పోలీసులు వేడుకుంటున్నారు. అయితే గ్రామసచివాలయశాఖలోని సుమారు 19 శాఖలకు చెందిన సిబ్బందికి చెందిన ప్రభుత్వ శాఖల విధులు, ఆన్ లైన్ సిస్టమ్ అంతా నవీకరణ జరుగుతుందోని సచివాలయ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి తెలియజేశారు. త్వరలోనే ఈ సాంకేతిక సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు..ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని ఆయన వివరించారు. ఈ విషయం అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల నుంచి వస్తున్న సచివాలయ మహిళా పోలీసులు  ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని  ప్రభుత్వం త్వరితగతిన సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా పోలీసులు ఆందోలన పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.

Tadepalle

2021-08-18 03:04:08

ఏపీలో కొత్త కర్ఫ్యూ సడలింపులివే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ప్రకటించింది. తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఇవ్వాలని అధికారులను సిఎం వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎవరు మాస్కు ధరించకపోయినా ఫైన్లు వేయడం ద్వారా ఖచ్చితంగా మాస్కు ధారణ చేస్తారని అభిప్రాయ పడ్డారు.

Tadepalle

2021-08-17 15:17:37

థర్డ్ వేవ్ వచ్చినా దైర్యంగా ఎదుర్కోవాలి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, రాబోయే థర్డ్ వేవ్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ, స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రమంతా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం 
మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లలో కరోనా వైరస్ టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం అందేలా చూడాలాన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకొని కేసులు పెట్టాలన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కాగా రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 17,218,రికవరీ రేటు 98.45%,పాజిటివిటీ రేటు 1.94 % గా ఉందన్నారు. 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10,
3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3 ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినా  20,464 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ఇక డి టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు 27,311 అందుబాటులో ఉన్నాయని, ఆగష్టు నెలాఖరునాటికి 104 చోట్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు అధికారులకు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో  ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-08-17 14:27:44

2023కి సమగ్ర భూ సర్వే మొత్తం పూర్తికావాలి..

భారత దేశంలో తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందేళ్ల తర్వాత ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతోందని ఎంతోప్రతిష్ట్మాకంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ, సచివాలయాల్లోని సర్వేయర్లు అందరినీ వినియోగించి
జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి చేయాలన్నారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్న సీఎం  అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని సూచించారు.  సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్‌ కావాలన్నారు. ఆ భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని, అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని, దీనికోసం అవసరమైన సాప్ట్‌వేర్‌ను సమకూర్చుకోవాలన్నారు.
సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండంతోపాటు, దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం సూచించారు. 

అనంతరం అధికారులు మాట్లాడుతూ, అనుకున్న సమయానికి కచ్చితంగా సమగ్ర భూసర్వే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీని కచ్చితంగా దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామన్న అధికారులు సీఎంకి తెలియజేశారు. సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామని భూగర్భగనులశాఖ అధికారులు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్,  పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-12 15:16:41

అట్టడగు వర్గాల అభివ్రుద్ధికి విశేష క్రుషి..

రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్ధానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) ఛైర్మన్‌గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ గురువారం తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ ప్రధాన కార్యాలయంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బలహీన అట్టడుగు వర్గాల వారిని గత ప్రభుత్వం విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యస్‌సి యస్‌టి బిసి వర్గాల వారు ఆర్ధిక ఎ దుగుదలకు దూరం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో బలహీనవర్గాల వారుపడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడ్డారన్నారు. దేశంలో ఎ క్కడాలేనివిధంగా పేదప్రజలకు 38 లక్షల ఇళ్లస్ధలాలను మంజూరు చేయడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో యస్‌సి యస్‌టి వర్గాల వారికి అధికప్రాధాన్యతనిచ్చి వారు ఆర్ధికంగా నిలదొక్కుకోవడం ద్వారా సమాజంలో సముచితస్ధానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్ధేశ్యమన్నారు. 

లిడ్‌క్యాప్ సంస్ధ ద్వారా అట్టడుగువర్గాలవారికి ఆర్ధికప్రయోజనం చేకూరే విధంగా కృషి చేయాలని ఆయన నూతన ఛైర్మన్‌కు సూచిస్తూ అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ పేదబలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డే నన్నారు. ఇటీవల కార్పోరేషన్ ఛైర్మన్‌లుగా అధికశాతంమంది బలహీనవర్గాలవారిని ఆయన ఎ ంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిర్జీవమైన లిడ్‌క్యాప్ సంస్ధకు జవసత్వాలను తీసుకొచ్చి ముందుకు నడపడం ద్వారా సంస్ధపై ఆధారపడిన బలహీనవర్గాల వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఇప్పటికే తాను ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు పరచడం ద్వారా ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని సఫలీకృతం చేసి ఆయన మన్ననలను పొందేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలోలెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టరు కె. హర్షవర్ధన్, జనరల్ మేనేజరు యం. పుష్పవతి, అసిస్టెంట్ మేనేజరు యన్. అధికారి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-12 14:13:58

గ్రామ సచివాలయాల్లో కానరాని స్పందన..

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలు, 13 మంది జిల్లా కలెక్టర్లు.. మరో 13 మంది గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు.. వీరందరీకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదే పదే చెబుతున్నమాట ఒక్కటే ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుమ్మం వద్దనే స్పందన కార్యక్రమం నిర్వహించమని. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. కానీ ఈ కాలంలో సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన  ఒక మంచి కార్యక్రమంగా ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే తప్పెవరది. సోమవారం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు స్పందన అర్జీదారులతో నిండిపోతున్నాయి. వందల సంఖ్యలో వివిధ సమస్యలపై దరఖాస్తులు అధికారుల ముందుకి చేరుతున్నాయి. వేల సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహిస్తే ఈ పరిస్థితి వచ్చేదా అంటే కాదనే చెబుతారు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నీ సచివాలయాల ద్వారానే అందించాలని సీఎం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు నిర్లక్ష్యమో తెలీదు గానీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ ఒక్క సచివాలయంలో కూడా స్పందన కానరావడం లేదు. 

అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్నట్టుగా తయారైంది ఇపుడు సచివాలయాల పరిస్థితి. ఒకప్పుడు గ్రామపంచాయతీలో ఒక కార్యదర్శి, పెద్ద పంచాయతీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు లేదా, ఒక బిల్ కలెక్టర్ ఉండేవారు. ఇపుడు అదే స్థానంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత సుమారు 14శాఖల సిబ్బంది అందుబాటులో వున్నా ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇవేవో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, www.enslive.net కావాలని అంటున్న మాటలు కాదు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో నమోదవుతున్న  అర్జీలు చెప్పే సంఖ్య. విచిత్రం ఏంటంటే అర్జీదారుడు ఇచ్చే దరఖాస్తుని జిల్లా కలెక్టర్ కి ఇచ్చినా.. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినా పరిష్కారం అయ్యేది స్థానికంగానే.. ఎందకనో స్పందన అంటే ప్రజలకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయమనే గుడ్డి నమ్మకం వచ్చేసింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలంతా వారి రాజకీయ సామర్ధ్యాన్ని ఉపయోగించి రెండు మూడు పంచాయతీలకు డిప్యుటేషన్లు, ఇన్చార్జిలు వేయించుకోవడమే. ఇలా అదనపు పనులు తమపై వేసుకొని.. ఉన్న సచివాయాల్లో పూర్తిస్థాయిలో ఉండక, అటు ఇన్చార్జి పంచాయతీలు, సచివాలయాల్లో అందుబాటులో ఉండక స్పందన కార్యక్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది. అందులోనూ ప్రస్తుత సచివాలయ ఉద్యోగులు మినహా గతంలో పంచాయతీల్లో పనిచేసే 70శాతం మంతి పంచాయతీ కార్యదర్శిలకు కనీసం కంప్యూటర్ వినియోగం కూడా తెలీదు. దీనితో ఇక్కడకి ఏ సమస్యపై పరిష్కారం కోసం వచ్చినా దరఖాస్తు దారుడు తెచ్చే అర్జీ ఆన్ లైన్ చేసే దిక్కుండేది కాదు. ఇపుడు ప్రతీ గ్రామ సచివాలయాలనికి డిజిటల్ అసిస్టెంట్ తోపాటు మరో 13ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులో వున్నప్పటికీ స్పందన కార్యక్రమం మాత్రం సక్రమంగా జరగడం లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసీల ఉత్తుత్తి పర్యటనలు..
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, జెసిలను తప్పనిసరిగా వారంలో 4 రోజులు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించడంతో వారంతా సచివాలయ సందర్శనకు వెళుతున్నారు.. తప్పితే అక్కడ స్పందన జరుగుతున్న తీరుపై ద్రుష్టి పెట్టడం లేదనే విషయం కలెక్టర్ కార్యాలయాలకు వచ్చే అర్జీలే తేటతెల్లం చేస్తున్నాయి. వెళ్లిన ప్రతీసారీ ప్రభుత్వ లక్ష్యాన్ని వల్లెవేస్తున్నారు తప్పితే ఎందుకు స్పందన నిర్వహించడం లేదు.. ఎందుకు గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులోనూ కలెక్టర్లు, జెసిలు సచివాలయ సందర్శనకు వెళ్లే ప్రతీసారీ ముందుగా సమాచారం ఇచ్చిగానీ వెళ్లడం లేదు. అలా సమాచారం అందుకున్న సచివాలయ సిబ్బంది కలెక్టర్ వచ్చే సమయానికి అంతా సిద్దం చేసి పనిచేస్తున్నట్టుగా కలరిస్తున్నారు. దీనితో గ్రామాల్లో సచివాలయ సేవలు బాగా అందుతున్నాయని రికార్డు చేసుకొని వచ్చేస్తున్నారు కలెక్టర్లు జేసిలు. ఒక్కసారి అధికారులు మారు వేషంలో వస్తే తప్పా సచివాలయాల్లో ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది..

సచివాలయాల్లో అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిలు..
ఒక పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేయాలని ఆదేశాలు, ఆగ్రహాలు వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చే విషయంలో నేటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. జీఓనెంబరు 149 ఆధారంగా మేజర్ పంచాయతీల్లో విభజించిన సచివాలయ పరిధిలు ఆధారంగా అధికారాలు, విధులు, రికార్డులు, ఖజానా చిట్టా విభజించాల్సి వున్నా ప్రభుత్వం మాత్రం నేటికీ ఆపనిచేయలేదు. దీనితో చేతిలో అధికారం లేని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు తమపరిధిలోనే వారు ఆడుతూ, పాడుతూ పనిచేయాల్సి వస్తుంది. అలాగని కాస్త గట్టిగా పనిచేయాలంటే అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లో ఉండిపోవడంతో తాము చేయడానికి ఏముందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 వరకూ అందరూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులమే అయినప్పటికీ కేవలం అధికారాలు మాత్రం గ్రేడ్-1,2,3,4 వాళ్లకు ఇచ్చి ఇతర కార్యాలయ పనులు మాత్రం మాతో చేయిస్తున్నారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. చేతిలో అధికారం లేకపోవడంతో సచివాలయంలో పనిచేసే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా మాట వినడం లేదని వాపోతున్నారు. ఏ చిన్న పనికోసమైనా సచివాలయం-1లో వుండే గ్రేడ్ 1,2,3,4  కార్యదర్శిల దగ్గరకే వెళ్లాల్సి వస్తుందని, అందులో వారికి డిప్యుటేషన్లు, రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు కేటాయింపు జరగడంతో సాధారణ పనులు కూడా పెండింగ్ లో ఉండిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మండలంలోని ఎంపీడీఓ, డిపీఓ, జిల్లా కలెక్టర్, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించినా తమకు అధికార బదలాయింపులు చేయలేదని చెబుతున్నారు. తప్పులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని పనిచేయలేదని, స్పందన నిర్వహించలేదని మమ్మల్ని ఎలా నిందిస్తారని గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఒంటి కాలిపై లేస్తున్నారు.

ప్రభుత్వం ముందు గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా అధికారాలు బదలాయిస్తే తప్పా.. వారి అధికారం వినియోగించి సచివాలయాల్లో స్పందన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించే పరిస్థి కనిపించడం లేదు. అటు ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకొని, జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పిస్తే తప్పా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం, ఇంటి ముంగిటే స్పందనతో సమస్యలకు పరిష్కారమనే ప్రధాన సమస్య పరిస్కారం అయ్యేట్టట్టు కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!

Tadepalle

2021-08-10 01:34:35

ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక..

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సోమవారం అమరావతిలో ఏర్పాటైంది. ఇందులో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా  జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్, రాజేష్ బాత అసోసియేట్ కార్యదర్శిలు స్థానం దక్కింది. ఇక కార్యవర్గం చూసుకుంటే ఫౌండర్ ప్రెసిడెంట్  డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ కె.వి రమణ, అసోసియేట్ ప్రెసిడెంట్స్ హరి దాస్ ఈరన్న, జనరల్ సెక్రటరీ ఎం సునీల్ కుమార్, సెక్రటరీ -కోఆర్డినేషన్ ఆర్. రాజా నాయక్,అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ జయలక్ష్మి, ట్రెజరర్  సి.హెచ్ ఆనంద్, సెక్రెటరీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ప్లానింగ్  డాక్టర్ ఎల్ ఆనంద్ కుమార్, యు పద్మావతి,  రీజనల్ ప్రెసిడెంట్స్  ఎం రవికుమార్, కె.వి నాగజ్యోతి,  ఎస్ కృష్ణా రావు,వెంకటేశ్వర్లు, పబ్లిసిటీ సెక్రెటరీ కొత్తపల్లి వెంకటరమణలుగా వున్నారు. ఈ కార్యవర్గం 2021-2024 వరకూ పనిచేస్తుందని ప్రచార విభాగం తెలియజేసింది.

Tadepalle

2021-08-09 14:39:53

ఇక మహిళా పోలీస్ గా పిలవాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అనే హోదా జీఓఎంఎస్ నెంబరు 129 నుంచి 60లతో మహిళా పోలీసుగా మారిపోయింది. రాష్ట్ర హోంశాఖ ఉద్యోగులుగా ఉన్నవీరందరినీ ఇకపై మహిళా పోలీసులుగానే పిలవాలని ఆదేశిస్తూ.. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు జీఓనెంబరు 129ను ఎమెండ్ మెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 60ని విడుదల చేసింది. దీని ప్రకారం సాధారణ పోలీసులకు ఉండే అన్ని అధికారాలు మహిళా పోలీసులకు కూడా వర్తిస్తాయని అందులో పేర్కొంది. అంతేకాకుండా వీరికి పోలీసు సిబ్బంది మాదిరిగా శిక్షణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎక్కడైనా వారందరినీ మహిళా పోలీసులుగా పిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు ఆ జీఓలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిని అదనపు సాధారణ గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరిచినట్టుగా వివరించింది. ఈ యొక్క విషయాన్నిసీఎం ఓఎస్డీ, పీఎస్ లతోపాటు  రాష్ట్ర డీజీపి కార్యాలయం, స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హోంమంత్రి కార్యాలయాలకూ ప్రత్యేకంగా తెలియజేశారు. డిజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలకు, అక్కడి నుంచి ఎస్పీకార్యాలయం, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, అక్కడ అడ్మిన్ ఎస్పీలకు ఈ సమాచారం చేర్చింది ప్రభుత్వం. 

గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగం విషయంలో పోలీస్ శాఖలోనే కింది స్థాయి సిబ్బందికి(హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ) ఉన్న అనుమానాలు, వారి ఇబ్బందులను నివ్రుత్తి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక జీఓ, గెజిట్లను అందరికీ సర్క్యూలేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాలో వచ్చిన ఈ జీఓలు, గెజిట్ లపై పోలీసుశాఖలోని ఏ ఒక్క సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, వ్యవహరించడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుళ్లుగానీ, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఏ విధంగానూ.. ఏ స్థాయి వారైనా అదైర్య పరిచేవిధంగా కానీ, వారంతట వారే మహిళా పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేసే విధంగా ప్రేరేపించేలా వ్యవహరించినా వారిపై ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం నుంచి హోంశాఖలో ఏ జీఓ వచ్చినా దానిని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల గ్రూపులో పెట్టి అవగాహన కల్పిస్తున్నారు.  

అదే సమయంలో స్టేషన్ పరిధిలోని పోలీసులు కూడా వారి స్టైల్ లోవారూ నోటికొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పసిగట్టిన జిల్లా ఎస్పీలు అన్ని డివిజన్ల డిఎస్పీలకు, సర్కిల్ ఇనెస్పెక్టర్లకు, స్టేషన్ ఎస్ఐలకు కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహిళా పోలీసులను హోంశాఖ ఉద్యోగులుగా ఇష్టం ఉన్నా, లేకపోయినా గుర్తించాలని చెబుతున్నారు. అయినప్పటికీ  మహిళా పోలీసు నియామకాలు, ప్రత్యేక జీఓలు, ప్రభుత్వ గెజిట్లు(రాజపత్రం) విడుదలైనా కొందరు కిందిస్థాయి పోలీసులు వారి పద్దతి మార్చుకోని సిబ్బందిపై స్టేట్ ఇంటెలి జెన్సుతో కాకుండా, సెంట్రల్ ఇంటెలి జెన్సు ద్వారా స్టేషన్ స్థాయిలో సిబ్బంది మహిళా పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనే కోణంలో ప్రభుత్వం నిఘా పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే డిజిపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు మహిలా పోలీసు వ్యవస్థను గ్రామాల్లో పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించి గ్రామ సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే మహిళా పోలీసులతో ప్రత్యేక గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఏం జరిగినా తక్షణమే సదరు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందేవిధంగా పక్కా నెట్వర్క్ ను కూడా పెంచారు. ఈ క్రమంలో ప్రభుత్వము, ఏపీ పోలీస్ బాస్, డిజిపీ గౌతం సవాంగ్ సైతం మహిళా పోలీసు అనే పదంతోనే వీరిని వ్యవహరిస్తున్నారు. ఇకపై స్టేషన్ లోని పోలీసులు సిబ్బంది కానీ, ఎస్ఐలు, సీఐలు, డిఎస్పీలు జీఎంఎస్కే అని వ్యవహరించకూడదని, ఆ పదాలన్నీ జీఓనెంబరు 60తో కనుమరుగు అయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది..!


Tadepalle

2021-08-09 01:50:53

మరోసారి టిటిడి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆదివారం జిఓనెంబరు 146 ను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లోనే ట్రస్టుబోర్డు సభ్యులను కూడా నియమిస్తామని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడీ చైర్మన్ గా వైవీ ఇప్పటికే రెండేళ్లు చైర్మన్ గా పనిచేశారు. మళ్లీ ఆయననే ప్రభుత్వం చైర్మన్ గా తిరిగి నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తనను మరోసారి టిటిడి చైర్మన్ గా తిరిగి నియమించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నో మంచికార్యక్రమాలు చేపట్టారు వైవీ..

Tadepalle

2021-08-08 07:38:53

మహిళా పోలీసులకూ ఖాకీ డ్రెస్సు ఖాయం..

గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసు ఖాకీ డ్రెస్సు వేసుకొని తిరగడం ద్వారానే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆస్కారం వుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన సుమారు 15వేల మంది మహిళా పోలీసులకు హోంశాఖ ఖాకీ డ్రెస్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకాలు అస్సలు తమకు ఇష్టం లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మీరు మాలా నిజమైన పోలీసులా, మీకు డ్రెస్సులుంటాయా.. శిక్షణలుంటాయా.. మీరు ఏ విషయంలో మాలాగ రెగ్యులర్ పోలీసులుగా ఫీలవుతున్నారు అంటూ మరెన్నో రకాలుగా చేసిన కామెంట్లను కేంద్ర ఇంటెలిజెన్సు విభాగం ద్వారా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులను కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ జీఓనెంబరు 59ని విడుదల చేసింది. దీనితో క్రింది స్థాయి పోలీసు సిబ్బంది కామెంట్లకు అడ్డుకట్ట పడింది. ఆ తరువాత రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీలు ముందు మీరు మహిళా పోలీసులను హోంశాఖ పోలీసులుగా ఇష్టం వున్నా, లేకపోయినా గుర్తించాలనే ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది ఒప్పుకోక తప్పలేదు. ఇపుడు తాజాగా మహిళా పోలీసులకు ప్రభుత్వం ఖాకీ డ్రెస్సు కూడా ఇచ్చి గ్రామ పరిరక్షణలో భాగం చేయడానికి అన్ని ఏర్పాట్లును చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జీఓనెంబరు 59 ఆధారంగా వీరిని సాధారణ పోలీసులుగానే మార్పుచేసిన ప్రభుత్వం వీరికి కూడా దశల వారీగా పోలీసు శిక్షణ  ఇవ్వనుంది. 

ఈ మేరకు డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశా నిర్ధేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ధేశించిన కొత్త నిబంధన ప్రకారం వీరికి కూడా పోలీసు యూనిఫారం రానుంది. ఈ విషయాన్ని డిజిపి ఎస్పీలకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాకీ డ్రెస్ మోడల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా చూపించారు. బహుసా ఇదే మోడల్ ఖాకీ డ్రెస్సులను మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళా పోలీసులను నియమించిన ప్రభుత్వం, హెడ్ కానిస్టేబుళ్లుగా వున్న 2052 మందిని రాష్ట్రవ్యాప్తంగా వున్న పోలీసు స్టేషన్లలో ఉన్నట్టు గుర్తించింది. సర్కిల్ లెవల్ లో ఏఎస్ఐలు 196 మంది ఉండగా, మహిళా ఎస్ఐలు 97 మంది ఎస్డీపీఓ లెవల్ లో వున్నట్టుగా గుర్తించారు. ఇక ఇనెస్పెక్టర్ గా ఒక యూనిట్ లో 18ని ఉండేలా  సర్కిళ్లలో కూడా నియమించనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక జిల్లాల్లో ప్రభుత్వం ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలను ఏ ప్రాతిపధికన రెగ్యులర్ చేయాలి, వీరికి ఏ విధమైన పరీక్షలు నిర్వహించాలి, దేహ దారుడ్యానికి, నడక లేదా పరుగు ఏ విధంగా పెట్టాలనే అంశాలకు సంబంధించి కూడా డిజిపి గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆగస్టు 15న మహిళా పోలీసులకు డ్రెస్ కోడ్ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతుంది. అయితే అది ఆ తేదీనే ప్రకటిస్తారా.. లేదంటే వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షలన్నీ పూర్తయిన తరువాత, వీరి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ప్రకటిస్తారనే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు మహిళా పోలీసు పోస్టుల విషయంలో, వారి విధుల విషయంలోనూ, వారిని మానసికంగా క్రుంగదీసి, వారి ఉద్యోగాలు వారంతట వారే వదిలి పోయేలా చేసిన(కొన్ని జిల్లాల్లో మహిళా పోలీసులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు, మరికొంత మంది మహిళా పోలీసు ఉద్యోగాన్ని వదిలి వేరొక ఉద్యోగానికి వెళ్లిపోయారు) ప్రయత్నాలకు ప్రభుత్వం ఒక్కసారిగా ఖాకీ యూనిఫారం ఇస్తున్నట్టు నేరుగా పోలీస్ బాస్ డిజిపి ప్రకటించడంతో మహిళా పోలీసులపై జరుగుతున్న ప్రచారాలను, సిబ్బంది చేసే కామెంట్లకు గట్టిగానే అడ్డుకట్ట వేయగలిగింది. వాస్తవానికి మహిళా పోలీసులను ప్రభుత్వం గ్రామాల్లో నియమించడం ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐల ప్రాభల్యం గ్రామాల్లో తగ్గిపోతుందని, గ్రామాల్లోకి వెళితే అప్పటికే వున్న మహిళా పోలీసులనే గౌరవిస్తారనే  భావనకు రాష్ట్రంలో చాలా మంది పోలీసులు(హోం గార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు) వచ్చినట్టుగా తీవ్ర ప్రచారం జరగడంతోపాటు, చాలా చోట్ల పోలీసు సిబ్బందే బయట పడిపోయారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బంది ఎంతో ఆందోళన చెంది, బయటపడి మరి మనసులోని ఆలోచనలు మహిళా పోలీసుల దగ్గర అన్నా.. ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేది, ఉద్యోగాల్లో నియమించేది హోంశాఖ మాత్రమే. 

అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడటం ద్వారా కొందరిలోనైనా ఆలోచన పెరిగి చేస్తున్న ఉద్యోగాలను వారంతట వారే మానివేసేలా చేయలి.. లేదంటే వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోవడం గానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఖాకీ డ్రెస్సు వద్దని చెప్పించే ప్రయత్నం చేయడంలో సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా చాలా గట్టిగానే కష్టపడ్డారనేది హాట్ టాపిక్. కానీ జిల్లా ఎస్పీలు మాత్రం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతో చాలామంది ఇపుడు ఆ ప్రవర్తన మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.  నిన్న డిజిపీ గౌతంగ సవాంగ్ మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇస్తున్నామనే మాటను ప్రకటించిన తరువాత.. ఏదో రకంగా మాట్లాడే క్రిందిస్థాయి పోలీసు సిబ్బంది గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. అయితే మహిళా పోలీసుల ఒంటిపైకి ఖాకీ చొక్కా వచ్చేంత వరకూ పోలీసుశాఖలో ఏ నిబంధన అమలు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మహిళా పోలీసులందరికీ ఖాకీ డ్రెస్ ఇస్తారా లేదంటే.. తమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో వారికి ప్రాబల్యం తగ్గిపోతుందని ఆ ఆలోచనను మార్చుకుంటారా.. తేలాల్సి వుంది..!


Tadepalle

2021-08-07 03:56:15

10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల..

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షాఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ అన్నారు.  విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ 7 నుండి 16వ తేదీ వరకూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని అయితే విద్యార్ధుల ఆరోగ్యభద్రత, ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని మే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిర్ణయం మేరకు 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. పరీక్ష ఫీజుకట్టిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు ఎ ంతోకీలకమని మంత్రి అన్నారు. ఉద్యోగాల నియామకంలో కాలేజీ విద్యలో, కేంద్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు ముఖ్యంగా మిలటరీ రిక్రూట్‌మెంట్‌లో 10వ తరగతిలోని మార్కుల ఆధారంగానే ఉద్యోగనియామకాలు చేపడతారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ పరీక్ష పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని దీనిలోభాగంగా సంవత్సరకాలం పాటు విద్యార్ధుల ప్రతిభను ఆధారంగా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు.

రద్దు అయిన 10వ తరగతి పరీక్షల విధివిధానాలను పరిశీలించి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని అన్నారు. ఈహైపవర్ కమిటి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం 10వ తరగతి పరీక్షాఫలితాలను విడుదల చేశామని మంత్రి అన్నారు. విద్యార్ధులెవరికీ నష్టంలేకుండా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. అందరికీ ఉపయోగపడేలా 2019-20, 2020-21 సంవత్సరానికి ఎ వ్వరూ నష్టపోకుండా 10వ తరగతిలో గ్రేడింగ్ ఇవ్వాలని హైపవర్ కమిటి నివేదిక ఇచ్చిందని మంత్రి అన్నారు. ఈనివేదికను యధాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు.
2020-21వ సంవత్సరంలో సంవత్సర కాలంపాటు వారి ప్రతిభను ఆధారంగా తీసుకుని వ్రాతపరీక్షల్లో అత్యధిక వెయిటేజ్‌ను ఇస్తూ 70 శాతం, 30 శాతం వెయిటేజ్ మార్కులతో గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో 6 లక్షల 26 వేల 981 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 22 వేల 391 మంది బాలురు, 3 లక్షల 04 వేల 036 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 లక్షల 37 వేల 354 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 26 వేల 753 మంది బాలురు 3 లక్షల 10 వేల 601 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు.

10వతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెర్ ఫార్మెన్స్ స్టేట్‌మెంట్లు (గ్రేడ్ షీట్లు) కొరకు విద్యార్ధులు ఠషష://స|షషె.శి|.శూ.గుు.n వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి అన్నారు. విద్యార్ధులు వారి రోల్ నెంబరును ఎ ంటర్ చేయడం ద్వారా గ్రేడ్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. ఈవెబ్ సైట్‌కు సంబంధించి పాస్‌వర్డు కఊ – 2020 అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనరు చినవీరభద్రుడు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎ గ్జామినేషన్స్ సుబ్బారెడ్డి, యస్ఇఇఆర్ టి డైరెక్టరు ప్రతాపరెడ్డి, ప్రకాశం జిల్లా డిఇఓ సుబ్బారావు, పెనమలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పై#్రవేట్ విద్యాసంస్ధల ప్రతినిధులు వై. విజయకుమార్ , పి. వెంకటకుమార్ , తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి

2021-08-06 16:44:15

నందిగామలో డా.జాలాది జయంతోత్సవం..

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు 90వ జయంతో త్సవాన్ని నందిగామలో నిర్వహిస్తున్నట్టు జాలాది కళాపీఠం వ్యవస్థాపకులు డా.జాలాది విజయ తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదిన స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నందిగామలో శ్రీవెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు హాజరవుతున్నారని చెప్పారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు డా.జాలాది విజయ తెలియజేశారు. జాలాది జయంతిని ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలోని కవులు, కళాకారులు ఉన్నచోట చేయాలనే సంకల్పంతో ఈ జయంతిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సదర్భంగా ఆమె కోరారు.

Nandigama

2021-08-06 03:28:54

వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తో ప్రాధమిక వైద్యం..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వైద్యానికి మహర్ధశ పట్టనుంది. దివంగత ముఖ్యమత్రి డా.వైఎస్ రాజశేఖకరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేసి గ్రామంలో ప్రాధమివైద్యాన్ని అందించడానికి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రతీ గ్రామసచివాలయం పరిధిలో ఒక వైఎస్సార్ క్లినిక్ ను నిర్మిస్తున్నారు. ప్రాధమిక రోగాలకు సంబంధించి 14 రకాల మెడికల్ టెస్టులు చేసి 65 రకాల మందులను, మరో 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్లు, మరో 12 రకాల వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. గ్రామంలో ఉండే ఏఎన్ఎం 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే వారికి ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జల్లాల్లోని సచివాలయాల పరిధిలోని వున్న ప్రజలను ఆయా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు అనుసంధానం చేశారు. వ్యాధి నిర్ధారణ చేయడం కోసం క్యూర్ కోడ్ విధానాన్న ప్రవేశ పెడుతున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నుంచి ప్రాధమిక వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ డేటాను అనుసంధానం చేస్తారు. ఇలా ప్రాధమిక వైద్యం గ్రామస్థాయిలో అందించి అంతకు మించితే వారికి వైద్యం ప్రాధమిక వైద్యకేంద్రాల్లో ఇంకా అవసరమైతే జిల్లా వైద్యశాలకు పంపి ఉచితంగానే వైద్యం చేయిస్తారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు వస్తారు. ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంచుతారు. రోగులు వేచి వుండటానికి వేయిటింగ్ హాలు ల్యాబు, ఫార్మశీ, ఇలా అన్నీ వేర్వేరుగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో వుండే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్లే పనిలేకుండా పూర్తిస్థాయిలో గ్రామస్థాయిలోనే మినీ హాస్పపత్రులను నిర్మాణం చేస్తుంది ప్రభుత్వం. గ్రామాల్లోనే ప్రజలకు ప్రాధమిక వైద్యం పూర్తిస్థాయిలో అందించాలనుకున్న డా.వైఎస్సార్ పేరుతోనే వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు సగానికిపైగా పూర్తయ్యాయి. వాటికి అనుగుణంగా ఆగస్టు చివరినాటికి ఇందులో పనిచేయడానికి మిడ్ లెవల్ హెల్త్ ప్రొవడైర్లను కూడా ప్రభుత్వం నియమించనుంది. సుమారు 6వేలకు పైగానే వీరిని నియమించడానికి అటు ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్రవేసింది. ఇక్కడ ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించే సమయంలో ఏమైనా అనుమానాలొస్తే వైద్యులను, 104 ద్వారా సంప్రదించడానికి టెలీ మెడిసిన్ విధానాన్ని కూడా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం దీనికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని, వీడియో కాన్ఫరెన్సు సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి నాటికి ప్రతీ గ్రామంలోనూ డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజలకు ప్రాధమిక వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లును ఇక్కడే అందించనున్నారు. దానికోసం ఆశను కూడా ఇక్కడే అందుబాటులోకి తీసుకు వస్తోంది ప్రభుత్వం.

Tadepalle

2021-08-06 02:36:33

పీవీ సింధూకి విజయవాడలో ఘన స్వాగతం..

విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. యువత సింధును ఆదర్శంగా  తీసుకోవాలన్నారు.

Tadepalle

2021-08-05 18:00:26

ఏపీసీడ్స్ కి అవార్డు పట్ల సీఎం హర్షం..

మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని  సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) అధికారులకు సూచించారు. గురువారం సంస్థకు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ను కలిసి అవార్డు వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబులు తెలియజేశారు. గవర్నెన్స్‌ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్‌ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని సీఎం అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్‌ ఎండీని, సిబ్బందిని ప్రశంసించారు.

Tadepalle

2021-08-05 16:12:31