1 ENS Live Breaking News

Tadepalli

2021-10-06 14:24:44

సచివాలయ ఉద్యోగులకు చేదుకబురు..?

గాంధీ జయంతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని భావించిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక చేదు కబురు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తూ.. చక్కర్లు కొడుతుంది.  ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ మరో ఏడాది ప్రభుత్వం పొడిగించనుందని, వారు బాధపడకుండా వారి జీతం రూ.15 నుంచి 20వేలు చేస్తుందనేది దీని సారాంశం. ఈ విషయాన్ని కొందరు డివిజన్ లెవల్ అధికారులు సైతం గ్రామ సచివాలయాలకు తనిఖీలకు వచ్చిన సందర్భంగా ఉద్యోగులతో కుశల ప్రశ్నలు వేస్తూ ఈ మాటను కూడా చెప్పి వెళ్లిపోతున్నారు. దానివెనుక ఒక సాంకేతిక కారణాన్ని కూడా అధికారులే చెబుతుండటం విశేషం. అదేంటంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే అందరూ డిపార్టమెంటల్ పరీక్షలు పాస్ కాలేదని.. ఈ కారణంగా రెండు మూడు దఫాలు మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి టెస్టులు పెట్టి వారంతా పాసైన తరువాత ఒకే సారి ఉద్యోగులందరికీ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది అన్నట్టుగా సచివాలయాల్లో ఉద్యోగులకు అధికారులు చెప్పి వెళ్లిపోతున్నారని తెలిసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులకు ఈ చేదు కబురు జీర్ణం కావడం లేదు. కరోనా రెండేళ్లసమయంలో తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలు అందించామని, అదే సమయంలో చాలా మంది కరోనా భారిన కూడా పడ్డామని, తీరా అక్టోబరు 2 తరువాత తీపి కబురు అందుతుందనుకుంటే ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2వ వనివారాలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజులనే  తేడా లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకే సేవలు అందించామని తీరా ఇపుడు ప్రభుత్వమే ఈ విధంగా ప్రొబేషన్ మరో ఏడాది పొడిగిస్తుందనే బాంబు పేల్చిందని వాపోతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పెట్టి వుంటే గాంధీ జయంతి నాటికి అందరు ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్ కు సిద్దంగా ఉండేవారనే విషయాన్ని సదరు సచివాలయ ఉద్యోగులు అధికారుల వద్ద ప్రస్తావిస్తే.. తమకు అందిన సమాచారం మాత్రమే తాము చెబుతున్నామని, తమకి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదని మరోమాటగా కూడా చెబుతున్నారట. ప్రభుత్వ ఉద్యోగం, అందునా రెగ్యులర్ ఉద్యోగాలని చెప్పి.. చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సాప్ట్ వేర్ తో పలు ప్రైవేటు కంపెనీల్లో వేలాది రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని వచ్చామని.. తీరా చూస్తే ప్రభుత్వం తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజుకో ట్విస్టు ఇస్తుంటే.. పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా వుంటుందోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం కనీసం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బదిలీలు చేపట్టినా సొంత జిల్లాలు, తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోతే కనీసం ఇచ్చే రూ.15వేలు జీతానికి ఇంటి అద్దెలు, ఖర్చులైనా తగ్గుయాని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే రూ.15 వేలు జీతం సరిపోవడం లేదని, చేస్తున్న ఉద్యోగాల్లో రోజుకో నిబంధన.. ఒక్కో అధికారి ఒక్కో ఆదేశం, ఒక్కో ఒక్కోవిధంగా చెబుతుంటే ఈ ఉద్యోగాలు చేయగలమా అనే వాదన కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి బలంగా వినిపిస్తుంది. అందులోనూ మండల స్థాయి అధికారులు సైతం గ్రామసచివాలయ ఉద్యోగులను చిన్పచూపు చూడటం, వర్క్ లోడు పెంచుతూ.. ప్రైవేటు కంపెనీల్లో మాదిరిగా వర్క్ టార్గెట్లు ఇవ్వడం కూడా సచివాలయ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

విశేషం ఏంటంటే ఇంతకాలం మండల అధికారులుగానీ, పంచాయతీ కార్యదర్శిలు గానీ పాలక వర్గాలు లేనపుడు, ఇంత మంది సిబ్బంది లేనపుడు వారిదే రాజ్యం అన్నట్టుగా విధులు నిర్వహించారు. తీరా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పడి ఒకేసారి గ్రామస్థాయిలోనే 14 మంది సిబ్బందిని చూసేసరికి మండల అధికారుల్లోనూ, పలు పంచాయతీల్లోని గ్రేడ్1 నుంచి గ్రేడ 4 కార్యదర్శిల వరకూ అంతా వీరిపై పెత్తనం చలాయిస్తున్నట్టుగా మారిపోయారనే వాదన ఉద్యోగులు నుంచి చాలా బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖల విధినిర్వహణ కంటే పంచాయతీలోని పనులు తాము చెప్పినట్టు చేస్తేనే సకాలంలో జీతాలు అందుకుంటారనే బెదిరిపులు కూడా ఉద్యోగులకు అధికం అయ్యాయి. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు ఒక్కటై ఉద్యోగులను స్కూలు పిల్లలను చూసినట్టే చూస్తున్నారనే ప్రచారం కూడా అధికంగా జరుగుతుంది. అయితే ఈ విషయాలేమీ జిల్లా కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయ జెసీలు, జిల్లా పంచాయతీ అధికారుల ద్రుష్టి వరకూ వెళ్లడంలేదు. దీనితో పంచాయతీ స్థాయిలో గ్రేడ్-1 నుంచి గ్రేడ-4 కార్యదర్శిలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు ఏం చెప్పినా అది సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వస్తుంది. ఇక్క విచిత్రం ఏంటంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్లుగానీ, జీఓలు గానీ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామ సచివాలయాలకు చేరడం లేదు. కానీ ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత ఉద్యోగులంతా మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల కంటే అత్యధిక విద్యావంతులు కావడంతో  ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓలు వచ్చినా, సర్క్యులర్లు వచ్చినా మండల అధికారుల కంటే ముందుగానే వాటిని సంపాదించ గలుగుతున్నారు.

వాటి ఆధారంగా గ్రామసచివాలయాల్లో సిబ్బంది పనులు చేసుకు పోతున్న సమయంలో కూడా వాటిని మండల అధికారులు, పంచాయతీల్లో పలువు కార్యదర్శిలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పకపోయినా ప్రభుత్వ ఆదేశాలు వీరికి తెలుస్తున్నాయని, కొంత మంది తాము పెట్టే సమావేశాల్లోనే తమనే తిరిగి ప్రశ్నిస్తున్నారనే కడుపు మంటను రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో అధికారులు ప్రదర్శిస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే  మండల అధికారులే సచివాలయ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేలా దగ్గరుండి సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇన్ని విధాలుగా అధికారుల నుంచి ఒత్తిడులు, చిరాకులు, చీత్కారాలు, కడుపుమంటలు ఎదుర్కొని రెండేళ్లపాటు విధులు నిర్వహిస్తే.. తీరా అక్టోబరు రెండు తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకుంటే ఆ మాట మరోఏడాది పాటు వెనక్కి వెళ్లేలా ఉన్నట్టు డివిజనల్ స్థాయి అధికారులు చేస్తున్న ప్రచారాలను బట్టి తెలుస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగానే గాంధీ జయంతి నాటికి సచివాలయ ఉద్యోగుల రెగ్యులైజేషన్ విషయంలో ప్రభత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు కూడా జరుగుతున్న ప్రచారం నిజమేనని నమ్మే స్థితికి చేరుకున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు వస్తుంది..ఉన్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారా.. లేదంటే డిజివనల్ స్థాయి అధికారులు ప్రచారం చేస్తున్నట్టుగా మరో ఏడాది ప్రొబేషన్ పెంచుతారా అనేవిషయంలో క్లారిటీ అయితే రావాల్సి వుంది..!

Tadepalli

2021-10-03 03:31:47

మహాత్మా మణ్ణించు.. అధికారాలు ఇవ్వనందుకు క్షమించు..

గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రుకోరిన సంఘమా ఇది.. స్వామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా అన్నాడో సినీ కవి..ఆయన మాటలు ఏమో గానీ.. భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని స్థాపించడకం కోసం, గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించడం కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తిచేకుంది. దీనికి అంతా గర్వపడాలి. అదే సమయంలో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ప్రకారం ఏ ఒక్క అధికారాలు ఇవ్వకుండా రెండేళ్లపాటు ఉత్తుత్తి ఉద్యోగులుగా, సాధారణ పనులే చేయిస్తున్నందుకు సిగ్గుపడాలి కూడా.  ప్రభుత్వమే ఇచ్చిన జీఓ, ఇదే ప్రభుత్వం అమలు చేయలేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదనే భావించాలి. ప్రభుత్వంలో జిఓ(గవర్నమెంట్ ఆర్ఢర్) అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. కానీ ఏపీ ప్రభుత్వంలో గ్రామసచివాలయాల్లో మాత్రం అది రెండేళ్లు పూర్తయినా అమలు కాలేదు. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ కానీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది కానీ, కమిషనర్ గిరిజాశంకర్ లు గానీ ఈ జీఓని అమలు చేయలేకపోయారు. అంటే ఒకరకంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆశయాలకు ఈరెండు ప్రభుత్వశాఖలు సాధ్యమైనంతగా కష్టపడి గాలీ తీసేస్తున్నట్టే లెక్క. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏం చేసినా జీఓల ప్రకారంమే, జీఓలతోనే చేస్తుందని పదే పదే చెప్పే మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ జీవో నెంబరు 149 విషయంలో చేతులెత్తేశారంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వమే ఆలోచన చేసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శిల వరకూ అమలైన జీఓ ఒక్క గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజలకు సేవచేసేందుకు గ్రామసచివాలయానికో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం వారికి అధికారాలు, విధులు, నిధులు, పరిధులు కేటాయించకపోతే వాళ్లు ఎలా పనిచేస్తారో ప్రభుత్వంలోని పెద్దలకు, ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదేశాఖ అధికారులు తెలియజేయాలి కూడా..అలా అన్నప్పుడు ఇలాంటి జీఓలన్నీ అమలు చేయాల్సిన బాధ్య పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్యకార్యదర్శిదే. ఆయనే దానిని పక్కనపెట్టేశారు. 

ఈవిషయం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిల ద్రుష్టికి  ఈఎన్ఎస్ నేషల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net గత రెండేళ్లుగా తీసుకెళుతూనే ఉంది. కానీ ఫలితం శూన్యం. రోజూ తిని భోజనమే ఒక రోజు మానేస్తే శరీరంలో ఏదో తెలియని లోపం, వెలితీ కనిపిస్తుంది. అలాంటిది ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించడానికి అధికారాలుఇవ్వకపోయినా అవే లోపాలు, సేవల్లో జాప్యాలు, ప్రజలకు ఆయా సచివాలయా పరిధిలో న్యాయం చేయలేకపోయిన అంశాలు కనిపించాయి. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని కీర్తిస్తూ.. అదే సమయంలో ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు చేయకుండా ఉండేందుకు ఇదే ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్ ఐఏఎస్ లు చేసిన లోపాలు గుర్తు చేస్తూ ఈ ప్రత్యేక కధనం ద్వారా గాంధీజయంతి రోజున మరోసారి గుర్తుచేస్తున్నాం. చాలా గ్రామపంచాయతీల్లో కార్యదర్శిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి 4 వరకూ కార్యదర్శిలు ఇన్చార్జి బాధ్యతలు టంచనుగా అప్పగించి.. పనిచేస్తున్న పంచాయతీల్లో పూర్తిస్థాయిలో పనులు చేయకుండా..అటు ఇన్చార్జి పంచాయతీల్లో పనులు, సేవలు అందించడానికి వీలు లేకుండా చేస్తున్న అధికారులు గ్రేడ్-5 కార్యదర్శిలకు మాత్రం జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు, దస్త్రాలు నేటి వరకూ కేటాయించలేదు. అదేమంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలెక్టర్లు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లా దీనిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు స్పందించలేదు. అంతేకాదు ఈ విషయంలో ఈఎన్ఎస్ ప్రత్యేకంగా వారిని సంప్రదించాలని సుమారు 100పైగా ఫోన్ కాల్స్, 50కి పైగా మెసేజులు, మరో 80కి పైగా వాట్సప్ మెసేజులు, ఆపై జీఓనెంబరు 149 అమలుకాకపోవడం వలన ప్రజలకు సేవలు అందడం లేదని ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా ప్రచురిచించ కధనాలను షేర్ చేసినప్పటికీ ఒక్క సమాధానం కూడా రాలేదు. ఈ వార్త రాయడానికి గంట ముందు కూడా ఇద్దరు అధికారులను ఇదే విషయమై సంప్రదించినా ఫలితం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది..ముఖ్యమంత్రి మంచివాడైతే రాష్ట్రం శుభిక్షంగా వుంటుంది.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పడం కోసం లక్షా 35ఉద్యోగాలు కొత్తగా స్రుష్టించి, కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త సచివాలయ భవనాలు నిర్మించి, 750పైకా సర్వీసులు సచివాలయాల్లోనే అందుబాటులోకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ సైతం కీర్తించారు.. అంతటి కీర్తికి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులు కనీసం అక్కడ విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా, అధికారాలు ఇవ్వకుండా ఈ రెండేళ్లు పనిచేయిందంటే ప్రభుత్వ ఆశయానికి అధికారులు ఏ స్థాయిలో గండి కొడుతున్నారో ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరోకటి ఉండదు. ప్రభుత్వం నియమించిన అధికారికి విధులు, నిధులు, అధికారాలు ఇవ్వకపోతే ప్రజలకు ఏవిధంగా సేవలు అందిస్తారనే కనీస సాంకేతక కారణం కూడా ఆలోచించకుండా ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ లు ఈ విషయంలోనే వ్యహరించారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు,  పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వారా ఈజీఓనెంబరు 149 ఇప్పటికైనా అమలు చేయకపోతే..గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి వచ్చే మద్దతు పూర్తిగా పోయే ప్రమాదాలున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతుంది. మేకుంటే శుభిక్షం..లేదంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా మొదలయ్యే ప్రమాదముంది. అదీ కేవలం పంచాయతీరాజ్ శాఖ అధికారులు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వని అధికారాలు, ప్రోత్సాహం వలనే..ఈ గాంధీ జయంతి రోజు తర్వాతనైనా ప్రభుత్వంలోని గ్రామ,వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లు మేల్కుంటారేమో చూడాలి..!

Tadepalli

2021-10-02 04:40:13

మహిళా పోలీసులకు యూనిఫాం అప్పుడే..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ కేటాయించిన కాఖీ డ్రెస్సుని ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయిన తరువాత ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సాధారణ పోలీసులు మాదిరిగా ఖాకీ డ్రెస్సు ఉన్నా..వారికి కేటాయించిన కేప్ మాత్రం లైట్ స్కైబ్లూ కలర్ ఉండటంతో అందరికీ వీరంతా సచివాలయ మహిళా పోలీసులనే గుర్తింపు వచ్చేలా డిజిపి గౌతం సవాంగ్ ఈ యూనిఫాం ను డిజైన్ చేయించారు. ఇటీవలే రాష్ట్రంలోని మహిళా పోలీసులందరికీ ప్రభుత్వం కొత్తగా మొబైల్ ఫోన్లను కేటాయించింది. వాటి ద్వారా ట్రాఫిక్ చాలన్లు కూడా వీరే గ్రామస్థాయిలో వేస్తారని సమాచారం అందుతుంది. గ్రామ రక్షణతోపాటు, గ్రామస్థాయిలో ఫిర్యాదులు కూడా ఇక్కడి నుంచే స్వీకరించడంతోపాటు, అత్యవసర సమయంలో బాదితులను పోలీస్ స్టేషన్ కి పంపించే బాధ్యతను కూడా గ్రామసచివాలయ మహిళా పోలీసులే చేపట్టనున్నారట. వాస్తవానికి జీఓనెంబరు 59 ప్రకారం సచివాలయ మహిళా పోలీసులను పోలీస్ శాఖ ఉద్యోగులకుగా మార్చినా వారికి కానిస్టేబుల్స్ కి ఇచ్చే పేస్కేలు వర్తింపచేయలేదు. అదేవిధంగా బ్లూకలర్ కేప్ ని కూడా ఇవ్వలేదు. అంటే ఉద్యోగులు పోలీసుశాఖకు చెందినప్పటికీ వీరిని ప్రత్యేకంగానే గుర్తించాలని ప్రభుత్వం భావించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో ఏదైనా ప్రభుత్వ తరహా కార్యక్రమాలు జరిగితే దగ్గరల్లోని స్టేషన్ల నుంచి పోలీస్ కానిస్టేబుళ్లు బంధోబస్తు, ఇతర వ్యవహారాలు చూసే వారు. ఇకపై సచివాలయ మహిళా పోలీసులే అవన్నీ చూడనున్నారు. రానున్న రోజుల్లో మహిళా పోలీసుల పాత్ర రాష్ట్రవ్యాప్తంగా చాలా కీలకంగా మారనుందనడాని వీరికి కేటాయించిన ఖాకీ డ్రెస్సే సంకేతాలు ఇస్తుంది. అంతేకాదు ప్రభుత్వం నుంచి వచ్చే జిఓలు, సర్క్యులర్ లు కూడా మండల, సచివాలయ సిబ్బంది కూడా ఖచ్చితంగా అమలు చేసేలా వాటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సైతం పంపుతున్నారు. ఆ సర్క్యులర్లు, ఆదేశాలు ఇకపై ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచే మండల కార్యాలయాలకు అక్కడి నుంచి గ్రామసచివాలయాలకు రానున్నాయి. వచ్చిన ఆదేశాలు ఆ క్షణం నుంచే అమలు చేయాల్సిన బాధ్యత కూడా వుంటుంది. మహిళా పోలీసు వ్యవస్థ ద్వారా గ్రామ రక్షణతోపాటు, దిశయాప్ వినియోగం, దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఒక్క ఖాకీ డ్రెస్సు చాలా కార్యకాలపాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

Tadepalli

2021-09-30 11:11:31

ఏపీ సచివాలయ మహిళాపోలీస్ కేప్ రంగుపై ఆఫ్రికన్ మహిళా పోలీసుల హర్షం..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చిన కాకీ యూని ఫారంతోపాటు లైట్ బ్లూకలర్ కేప్ ను కేటాయించడం పట్ల ఆఫ్రికాదేశ(ఐక్యరాజ్యసమితి) మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికన్ మహిళా పోలీసులకు ఇచ్చిన కేప్ కలర్ ను ఇపుడు ఏపీలోని సచివాలయ మహిళా పోలీసులకు ఇవ్వడం వలన మాకు అపారమైన గౌరవం దక్కిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని ఆఫ్రికన్ మహిళా పోలీసులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మహిళా పోలీసులకు ఏపీ ప్రభుత్వంలోని హోంశాఖ కూడా అదే రంగు కేప్ ని మంజూరు చేయడమే దీనికి కారణం. వాస్తవానికి ఆఫ్రికాలోకూడా మహిళా పోలీసు విభాగం వుంది. అక్కడ దేశంలో వారితో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించడంతోపాటు ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆ క్రమంలో ఇపుడు రాష్ట్రంలో కూడా అంతకంటే అత్యధిక స్థాయిలో మహిళా పోలీసుల నియామకం చేపట్టడం, మహిళల కోసం దిశ యాప్ ని రూపొందించడం, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశను చట్టం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న క్రుషికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. దానికి కారణం రాష్ట్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోస్టులకు స్రుష్టించడమే వాదన కూడా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. మహిళా పోలీసులు విధుల్లోకి చేరి అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. దానికి గుర్తుగా ప్రభుత్వం కూడా వీరికి పోలీసు డ్రెస్సుని కేటాయించింది. అలా కేటాయించిన డ్రెస్సుకి లైట్ బ్లూకలర్ కేప్ ఇవ్వడం ఇపుడు దేశంలో ప్రాధాన్యత సంతరించుకోగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాల చూపు ఆంధ్రప్రదేశ్ వైపునకు మళ్లింది. దేశంలోనే చరిత్ర స్రుష్టించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇపుడు మహిళా పోలీసు విభాగం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్చించుకునే స్థాయికి ఎదగటం నిజంగా శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు. దిశ చట్టం, పోలీసు స్టేషన్లు మరింత సమర్ధవంతంగా పనిచేసి మహిళలకు నూటికి నూరుశాతం రక్షణ కల్పిస్తే.. ఇదే వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకంటే ముందు ప్రపంచదేశాల మహిళా పోలీసుల నుంచి గౌరవం పొందడం కూడా ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Tadepalli

2021-09-27 05:40:27

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సహకారం మరువలేనిది..

ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్దల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్‌ లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కాలిసి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మీట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు,సిబ్బంది కూడా బాగా కష్టపడి పరిచేశారని సీఎం కూడా కొనియాడారు.  మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఎన్నికల్లో మరోసారి రుజువైందన్నారు.  

Tadepalli

2021-09-22 15:42:04

అక్టోబర్ 7నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు,  కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవీనవరాత్రులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
7వ తేది నుంచి 15వ తేదీ వరకూ ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శం ఇస్తారని  వివరించారు.11-10-2021న శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్సైట్ లో పూర్తివివరాలు పొందుపరుస్తామని వివరించారు.

Vijayawada

2021-09-22 12:00:34

సమాచారశాఖ అధికారులకు ఇన్ కమింగ్ , ఔట్ గోయింగ్ కాల్స్ కట్..

ఆంధ్రప్రదేశ్ లోని  సమచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది అధికారిక ఫోన్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ ఆగిపోయాయి. ఒక్క అధికారులకే కాదు.. కమిషనర్, జెడీ, ఏడీల దగ్గర నుంచి జిల్లాల్లోని ఏపీఆర్వోల దాకా అందరి నెంబర్లు పనిచేయడం లేదు.  దీనితో వారంరోజుల నుంచి సమాచారశాఖలో వారి సొంత మొబైల్ నెంబర్లును మాత్రమే  వినియోగించాల్సి వస్తుంది. రాష్ట్రంలోని తమశాఖలో అందరు అధికారులదీ ఇదే పరిస్తితి అని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసర పనిపై ఎవరు కాల్ చేయాలన్నా అధికారిక నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్  కాల్స్ నిలిపివేయబడ్డాయి అనే సమాధానం వస్తున్నది. అలాగని జిల్లా కలెక్టర్లు, జెసిలకు తప్పితే సమాచారశాఖ అధికారుల పర్శనల్ నెంబరులు మరెవరికీ తెలియడం లేదు.  ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వంలోని గ్రూప్ నెట్వర్క్ గా వున్న ఈ నెంబర్లుకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లింకపోవడం వలనే పోస్ట్ పెయిడ్ గా వున్న ఈ నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేశారనే ప్రచారం జరుగుతుంది.  ఈ విషయం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వరకూ వెళ్లింది. ఏం జరుగుతుందనేది తేలాల్సి వుంది. 

Tadepalli

2021-09-21 06:26:18

ఈ అపూర్వ విజయం మరిచిపోలేనిది..సీఎం

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.. శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈరోజు ఇచ్చిన ఈ విజయం, అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింతగా పెంచాయి. ఈరోజు ఎన్నికల తేదీ నుంచి కూడా ఒక్కసారి గమనించినట్లైతే, 2019 ఎన్నికల్లో అక్షరాలా 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 స్థానాలు, అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంటు సీట్లతో.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైందన్నారు. అక్షరాలా 13,081 పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీలు.. అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో పార్టీ మద్దతుదారులను దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. దాని తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఏకంగా 75కు 74 చోట్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం. అక్షరాలా 99 శాతం. 12 చోట్ల మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12.. 100 శాతంతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించారన్నారు.

Tadepalli

2021-09-20 13:39:52

ఆంధ్రప్రదేశ్ కొంప ముంచుతున్న జిఎస్టీ..

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వ్యాట్ అమలులో వున్నప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం 14 నుంచి 15 శాతం వ్రుద్ధిని నమోదు చేసుకున్న ఏపీ ప్రభుత్వం జిఎస్టీ అమలు జరిగిన తరువాత ఇపుడు 10శాతానికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రప్రభుత్వం భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయే పరిస్థిలు నెలకొన్నాయి. జిఎస్టీ వలన ఏపీ ఏ విధంగా ఆదాయం కోల్పోతుందో.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్యాకేజీ ఏపీకి రావడం లేదో అనే విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లక్నోలో జరిగిన 45వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ద్రుష్టకి తీసుకెళ్లారు. జిఎస్టీ వలన నష్టం తప్పితే ఆదాయం సమకూరడం లేదనే విషయాన్ని కౌన్సిల్ ద్రుష్టికి తీసుకెళ్లి పలు కీలక అంశాలను చర్చించారు. బుగ్గన తీసుకొచ్చిన అంశాలను బట్టి జిఎస్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుకుంటుందా అనే కోణం కనిపించింది. జిఎస్టీ అమలు లోకి వచ్చిన తరువాత ఏడుశాతం క్షీణత అంటే మామూలు విషయం కాదు. ఇక జిఎస్టీలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఒక్కసారి పరిశీలిస్తే.. జిఎస్టీపై వ్యారాస్తులకు, సంస్థలకు, వాణిజ్య సంస్థలకు పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పాటు చేయలేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ల రాష్ట్రపరిధిలో కాకుండా కేంద్ర పరిధిలోనే ఉంచుకుంది. జిఎస్టీపై అవగాహన లేనివారు ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని..తరువాత మళ్లీ దానిని కేన్సిల్ చేయించుకోవడానికి ప్రభుత్వానికి అపరాద రుసుము వేలల్లో కట్టాల్సి రావడంతో జిఎస్టీ వలన జరుగుతున్న నష్టాలను వ్యాపారస్తులు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి తెలియజేయడంతో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కు ముందుకి రావడం లేదు. పైగా జిఎస్టీ రిటర్న్స్ దాఖలు విషయంలో అత్యధిక ఫైన్లు వేయడం కూడా జిఎస్టీ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నది. ఈ విషయం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అర్ధమైంది. బంగారు కోడిపెట్టలా మంచి ఆదాయ వనరుగా మారుతుందని భావించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తిరిగి వారి ఆదాయానికే గండి కొట్టేలా జిఎస్టీ మారడంతో మళ్లీ అన్ని రాష్ట్రప్రభుత్వాల చూపు వ్యాట్ పైకే మల్లుతున్నట్టు జిఎస్టీ కౌన్సిల్ లో పలు రాష్ట్రాలు కేంద్రం ద్రుష్టికి సమస్యలను తీసుకెళ్లాయి.

జిఎస్టీ వలన వచ్చే నష్టాలు పూడ్చుకోకపోయినా, జిఎస్టీని చమురు విక్రయాలకు అమలు చేయకపోయినా భారీ నష్టాలే వచ్చే అవకాశం వుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు, ఎన్ని ఆలోచనలు చేసినా జిఎస్టీ విషయంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని మరో వ్యాపారస్తుడిని హెచ్చరించేలా చేస్తుంది. జిఎస్టీ రిటర్స్న్ దాఖలు విషయంలో ఆదాయ పన్ను దాఖలు చేసే విధంగా కనీసం గడువు పెంచకపోవడం, అపాదర రుసుము అధికంగా విధించడమే జిఎస్టీ నష్టాలకు కారణంగా కనిపిస్తుంది. నేటికీ జిఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు సైతం అవగాహన లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన జిఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించిన అంశాలు ఇపుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాలు అమలు కావాలంలే ఆదాయం చాలా ఎక్కువగా కావాల్సి వుంది. ఈ తరుణంలో అన్ని రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఏపీ ప్రభుత్వానికి జిఎస్టీ ఇపుడు ఒక పెద్ద గుదిబండలా తయారైంది. ఆదాయం తెచ్చి పెడుతుందనుకుంటే ఉన్న ఆదాయ మార్గాలను మొత్తం తగ్గిపోయేలా చేస్తుంది. దానికి కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులు చేపడుతున్న విధానాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో జిఎస్టీ వలన ఆదాయం కాస్త బారీగా వస్తుందనుకుని లెక్కలు వేసిన ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. అనుకున్నదానికంటే ఆదాయం ఐదుశాతానికి తగ్గిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఈ  జిఎస్టీ వలన వ్రుద్ధి రేటు పడిపోయినా.. వాణిజ్య పన్నుల ద్వారా ఆదాయం తగ్గిపోయినా కేంద్రం మెప్పుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో జోడి కట్టి జిఎస్టీని కొనసాగిస్తుందో..లేదంటే పాత వ్యాట్ విధానానికికే మొగ్గు చూపిస్తోందో..అదీ కాదంటే..జిఎస్టీ వలన కలిగినే నష్టాలపై ఇతర రాష్ట్రప్రభుత్వాలను ఆలోచించాలా చైతన్యం తెస్తుందా అనేది ప్రశ్నార్ధకమైంది. అదీకాదంటే ఆదాయ పన్ను రిటర్న్స్ మాదిరిగా జిఎస్టీ రిటర్న్స్ కు కూడా అపరాద రుసుములు లేని అవకాశం ఇచ్చి సంస్ధల ద్వారా జిఎస్టీతో ఆదాయాన్ని పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతుందో అనేది వేచిచూడాలి. 


Tadepalli

2021-09-18 04:29:56

mptc,zptc కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు..

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పిలు, డిపిఓలు,జడ్పి సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ  ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఆయా కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.అదే విధంగా కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్,ఎస్పిలు కూర్చుని కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్దం చేసుకొని సక్రమంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జి గా పెట్టాలని సిఎస్ కలెక్టర్లును ఆదేశించారు. అంతేగాక జెసిలను పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియలో బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లు ఆదేశించారు.

ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తోపాటు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయంలో 24గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న శాంతి భద్రతల అదనపు డిజిపి రవి శంకర్ మాట్లాడుతూ అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు. అంతేగాక అన్ని కేంద్రాల్లో నిరంతర సిసిటివి నిఘా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ కౌంటింగ్ నిర్వాహణకు సంబంధించిన మార్గ దర్శకాలను వివరిస్తూ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మరియు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ల లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి వెంటనే మరో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తీసుకువచ్చే సమయంలో పూర్తిగా సిసిటివి కవరేజ్ చేయాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిగా శానిటేషన్ చర్యలు తీసుకోవాలని గిరిజా శంకర్ కలెక్టర్లును ఆదేశించారు. అదే విధంగా కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు అందరూ విధిగా మాస్క్,ఫేస్ షీల్డు వంటివి ధరించి గుర్తింపు కార్డుతో  కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించేలా చూడాలని  ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2021-09-17 14:33:19

ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

 వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పారు.

Tirumala

2021-09-17 12:11:27

అమ్మవారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  ఆలయం వద్ద టిటిడి  జెఈవో శ్రీమతి సదా భార్గవి  స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్  గోస్వామి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.  ఆల‌య డెప్యూటీ ఈవో  కస్తూరి బాయి, ఎఈవో ప్రభాకర్ రెడ్డి, విజిఓ, మనోహర్  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 06:54:32

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అద‌న‌పు ఈవో, సివిఎస్వోగోపినాథ్ జెట్టి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-12 06:26:36

చిత్తూరుజిల్లాకు మాత్రమే సర్వదర్శనం..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం  కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. అయితే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టిటిడి  తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టిటిడికి సహకరించాలని విజ్ఞపి చేస్తున్నది. కేవలం ఇపుడు చిత్తూరు జిల్లాకి చెందిన వారికి మాత్రమే జారీచేస్తున్నట్టు తెలియజేస్తుంది.

Tirumala

2021-09-11 14:44:14