1 ENS Live Breaking News

కీటక జనిత వ్యాధులను వ్యాప్తిని అరికట్టాలి..

జాతీయ  కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా మలేరియా, డెంగ్యూ తదితర కీటక జనిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అధికారు లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవా న్ని పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించి కీటక జనిత వ్యాధులు, మలేరియా డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణ చర్యల పై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైనన ఏడు డెంగ్యూ కేసులు పట్ల సత్వరమే స్పందిస్తూ నియంత్రణ కొరకు చికిత్సలు బలోపేతం చేయా లన్నారు. దోమల లార్వాలు ఉత్పత్తి అయ్యే మురికి కుంటలు, పరిసరా లను గుర్తించడంతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడే పటిష్టంగా చేపట్టాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ స్ప్రేయింగ్ కార్యక్రమాల ద్వారా చేపడుతూ ఆరోగ్యకర సమాజస్థాప న దిశగా పాటుపడాలన్నారు. 

Amalapuram

2023-04-25 11:20:18

అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో

రామచంద్రాపురం మండలంలోని దుర్గ సముద్రం, రేణిగుంట అక్షయ క్షేత్రం మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాలు కల వారి సేవా కేం ద్రాలను టీటీడీ జేఈవో సదాభార్గవి మంగళవారం సందర్శించి సేవలు పొందుతున్న వారిని చూశారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివ రాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, అక్షయ కేంద్రానికి టీటీడీ ఏడాదికి రూ 15 లక్షల మేరకు ఆర్థిక సహా యం చేసేదన్నారు. కోవిడ్ ప్రబలినప్పటి నుండి ఈ సహాయం నిలిపి వేసినట్లు ఆమె తెలిపారు. తిరుమల, తిరుపతి లోని మానసిక వికలాంగు లు, ప్రత్యేక అవసరాలున్న వారిని ఈ కేంద్రాలకు తరలించి సేవలు అందిస్తున్నారని ఆమె చెప్పారు.  ఇక్కడి పరిస్థితిలను పరిశీలించి ఈవో కు నివేదిక అందిస్తామని, ఆర్థిక సహాయం పునరుద్ధరణ కు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుంటారని జేఈవో వివరించారు.డిఈవో భా స్కర రెడ్డి,పిఆర్వో డాక్టర్ రవి, బాల మందిరం ఎఈవో అమ్ములు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-04-25 10:21:55

దోమల నిర్మూలన అందరి ప్రధమ కర్తవ్యం

మలేరియా వ్యాప్తికి కారణమైన  దోమలు లేకుండా చేయాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. హేమంత్ పిలుపునిచ్చారు.  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దోమలు పెరగడానికి కార ణం మురికి కుంటలు, ఇళ్లలో నీరు నిల్వ ఉంచడమేనని చెప్పారు.  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కాలువల్లో మందులు చల్లడం, ఫాగిం గ్, వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలని చెప్పారు.  వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు అందరూ సహకరించాలన్నారు. దోమల వల్లనే మలేరి యా డెంగ్యూ మొదలైన వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు. ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుంచి బయలుదేరి నెహ్రూ చౌక్ బాలాజీ రావు మార్కెట్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం కు చేరుకున్నది.  ఈ ర్యాలీలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శారదాబాయి జిల్లా మలేరియా అధికా రి డాక్టర్ ఉమామహేశ్వరరావు, మలేరియా శాఖ, జీవీఎంసీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-25 09:35:37

MVRపై కావాలని బురద చల్లేందుకు తేడామీడియా కుట్ర

నిశ్వార్ధ సేవలకు ప్రతి రూపం..యువతకు ఉపాది అవకాశాలు కల్పించే సేవాభావం..చెరగని చిరునవ్వుకి కేరాఫ్ అడ్రస్ అనకాపల్లిలోని ప్రము ఖ వ్యాపారవేత్త,  ముత్యాల వెంకటేశ్వర్రావు(ఎంవీఆర్). అలాంటి మంచి వ్యక్తిపై తేడా మీడియా కావాలని బురదచల్లే ప్రయత్నం చేస్తోంది.  ప నిగట్టుకొని అసత్యప్రచారాలు చేస్తోంది. ఎలాగైనా ఉన్నమంచిపేరుని చెడగొట్టాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అయినా ఎంవీఆర్ వా టిని పట్టించుకోవడం లేదు సరికదా తాను అనుకున్న లక్ష్యం ప్రజలకు సేవచేయడం, మీడియాకు చేయూతనివ్వడం. ఈ క్రమంలో చాలా వదం తులు వస్తాయి. అలాంటి చిల్లర ప్రచారాలను పట్టించుకుంటే సమయం వృధా అవుతుంది అంటూ సున్నితంగా తోసి పుచ్చుతున్నారు. అడి గినంత మొత్తం ప్రకటనలు, తమ అవసరాలకు ఇవ్వలేదనే అక్కసుతో శతవిధాలా ప్రయత్నించి చివరకు బురదచల్లే పనికి పూనుకున్నాయి. దానికి కొందరు వెనుకుండి మరీ కధ నడిపిస్తున్నారనే ప్రచారమూ గట్టిగానే సాగుతోంది. ఇంత జరుగుతున్నా ఎంవీఆర్ మాత్రం చెరగని చిరు నవ్వుతో.. చేసుకోనీయండి ఎంతకాలం అసత్యాలను వండి వారుస్తారు..నిజం ఈరోజు కాకపోయిన రేపైనా తెలుస్తుంది అంటూ చెత్తరాతలను చిత్తుగా కొట్టి పడేస్తున్నారు. మంచి సంకల్పంతో ప్రజల సేవచేసి, యువతకు ఉపాధి చూపించాలనే లక్ష్యంతో ఎంవీఆర్ పనిచేస్తున్నారని అది చాలా మందికి నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భంలోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జనంలోకి వస్తాయిని ఎంవీఆర్ యువసేన సైతం బలంగానే తేడా ప్రచారాలను తిప్పికొడుతోంది.

అడిగింత మొత్తం ఇవ్వకపోతే అభివృద్ది విషయంలో ఆయన చేసిన ప్రకటనలను వ్యంగ్యంగా చిత్రీకరించే నీచ ప్రచారాలు చేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఎంవీఆర్ కి ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ, అంతెందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. అందునా కాస్త తేడాగా వ్యవహరించే సదరు మీడియాకి అస్సలు తెలియదు కనుుుకనే ఆయనను పొలిటికల్ గా ప్రమోట్ చేసేందుకు, దానికి అయ్యే ఖర్చును అడ్డంగా లాగేందుకు కొన్ని పత్రికలు, మీడియా పనిగట్టుకొని అసత్య ప్రచారాలకు దిగుతున్నా యని ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని కధనాలే రుజువు చేశాయి. తొలుత సామాజిక సేవగా బావించి చాలా చిన్న చిన్న పత్రికలు, ఛానళ్లకు, జర్నలిస్టుల సంఘాలకు చేయూత అందించిన ఆయన వాస్తవాలు తెలుసుకొని నిజంగా పనిచేసే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రోత్స హించడం మొదలు పెట్టారు. దానితో తేడా మీడియాకు అది మింగుడు పడక అదే స్థాయిలో వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది.. వెంటనే గతంలో ఈయన చేసిన ప్రచారాలను, హామీలను తప్పుడుగా చిత్రీకరించే వంట మొదలెట్టారు. అయినప్పటికీ ఎంవీఆర్ యువసేన వాటిని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ వస్తున్నది. ఎక్కడైనా తేడా జరిగితే రాయండి దానిని మేమే స్వాగతిస్తాం..అంతే తప్పా తిన్నింటి వాసాలు లెక్కెట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. సో తేడా మీడియా మీ పప్పులిక ఉడకవని తేలిపోయింది..అయినా కాదు కూడదు అనుకుంటే.. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఏం చేస్తారనేది..! 

Anakapalle

2023-04-25 04:49:13

భోగాపురం ఎయిర్‌పోర్టు రాష్ట్రానికి ప్ర‌తిష్టాత్మ‌కం

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉత్త‌రాంధ్ర‌కే కాకుండా, రాష్ట్రానికే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారా య‌ణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా జ‌రిగే ఎయిర్‌పోర్టు శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయా ల‌ని జిల్లా అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. విమానాశ్ర‌య శంకుస్థాప‌న, ముఖ్య‌మంత్రి బ‌హిరంగ స‌భ నిర్వ‌హ‌ణ‌కు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్ల‌పై, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని నిర్వ‌ హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను, ఈ సంద‌ర్భంగా వివిధ శాఖ‌ల అ ధికారుల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను వివ‌రించారు.

              ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వం తం చేయాల‌న్నారు. హెలీప్యాడ్‌, భూమి పూజ‌, పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌, బ‌హిరంగ స‌భ వేదిక‌ల వ‌ద్ద ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించి, వారికి బాధ్య‌ త‌లు అప్ప‌గించాల‌ని సూచించారు. ప‌టిష్ట బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేం దుకు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అన్నారు. వారంతా స‌భ‌కు వ‌చ్చి, తిరిగి ఇంటికి వెళ్లేవ‌ర‌కు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ముఖ్యంగా త్రాగునీరు, మ‌జ్జిగ విస్తృతంగా పంపిణీ చేయాల‌న్నారు. వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌న్నారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఉప‌యోగించేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా నాలుగు 104 వాహ‌నాల‌ను కూడా సిద్దం చేయాల‌న్నారు. 

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న జిల్లాలో ఆరోజు ఉద‌యం 10.30కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 12.30 క‌ల్లా ముగుస్తుంద‌ని చెప్పారు. ప్ర‌తీఒక్క‌రూ అప్ర‌ మ‌త్తంగా ఉండి, త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించి, సిఎం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి కోరారు. ఈ స‌మావేశంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సి ఇందుకూరి ర‌ఘురాజు, ఎంఎల్ఏ శంబంగి వెం క‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, ఎస్‌పి దీపిక‌, జెసి మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-24 10:28:40

సమాజానికి మంచి చేయడమే నిజమైన పౌరసేవ

ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా నిబద్ధతతో మంచి ఆలోచనలతో విధులు నిర్వహిస్తున్నందునే అభివృద్ధి సాధ్యపడుతున్నదని జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి తెలిపారు. శుక్రవారం సివిల్ సర్వెంట్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు సమాజానికి తోడ్పడే విధంగా అమలు చేయడంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ ప్రతిఫలిస్తుందన్నారు. దేశ నిర్మాణం జాతి పురోగతికి బాటలు వేసేలా సమిష్టి కృషితో పనిచేసినప్పుడు ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా సమయంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ, సేవా భావం అందరికీ తెలిసిందన్నారు.

 అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సివిల్ సర్వెంట్స్ గూర్చి మాట్లాడుతూ వారు "దేశానికి  స్టీల్ ఫ్రేమ్" అని అభివర్ణించారని చెప్పారు. తరువాత అదే తేదీని సివిల్ సర్వెంట్స్ డే గా జరుపు కుంటున్నట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలయ్యేలా సివిల్ సర్వెంట్స్ పర్యవేక్షిస్తారు అన్నారు.  జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు ప్రణాళిక అధికారి రామారావు, డ్వామా పిడి ఇ.సందీప్ దేశంలో సివిల్ సర్వెంట్స్ ప్రస్థానం, విజయాలను గూర్చి తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులతో జెసి ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.

Anakapalle

2023-04-21 13:39:51

త్రిసభ్య కమిటీ ముందుకి VJF అనైతిక కమిటీ అక్రమాలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కాలం చెల్లిన కార్యవర్గం అక్రమాలను విశాఖ జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఏర్పాటు చేసిన 3శాఖల అధి కారుల కమిటీ ముందుకి సభ్యులు తీసుకు వెళ్లారు. శుక్రవారం ఈమేరకు వుడా భవన్  6వ అంతస్తులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కమిటీ ఫిర్యాదు దారుల నుంచి వివరాలు సేకరించింది. గత 11ఏళ్లుగా ఎలాంటి సర్వసభ్య సమావేశం లేకుండా పాలకవర్గం పనిచేస్తుందని, ఇదిచెల్ల దని వివరించారు. దానికి అంగీకరించిన కమిటీ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు, వీడియో రికార్డింగులను సైతం చేయించింది. జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ వేసిన తరువాత కూడా ఎలాంటి అధికారం లేని కార్యవర్గం సభ్యత్వాలు ఇవ్వడంపై సభ్యులు కమిటీ ముందుకి ఆధా రాలతో సహా తీసుకు వెళ్లారు. దానిపై స్పందించిన కమిటీ విచారణ వివరాలను జిల్లా కలెక్టర్ కి నివేదిస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధన లు, సొసైటీ చట్టాలకు విరుద్దంగా చేపట్టే ఏకార్యకలాపాలకు చట్టబద్ధత లేదని కమిటీ తేల్చి చెప్పింది.



Visakhapatnam

2023-04-21 10:54:48

ఆజాద్ ఎంట్రీ ఇక అప్పన్న ఆలయంలో ఆ.. ఆటలు సాగవు

ఆయనపేరు చంద్రశేఖర్ ఆజాద్.. దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఈన కున్న లెక్కతోనే..ఎక్కడైనా తిక్కపనులు చేసే సమయంలో ప్రభుత్వం ఆయనను అక్కడ నియమిస్తుంది. ఇపుడు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలోనూ ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఒక్కముక్కలో చెప్పలంటే మా ఆటలకు అడ్డులేదని రొమ్మువిరు చుకు నే ఎలాంటి వారికైనా ఈయన స్టైల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వడం అలవాటు. ఈ అధికారి ట్రాక్ రికార్డ్ ను గుర్తించే దేవాదాయశాఖ ప్రత్యేకం గా ఈయనను కీలకమైన దేవస్థానాలకు ఈఓగా నియమిస్తుంది. ఇపుడు  23న జరగబోతున్న స్వామి వారి చందనోత్సవం ప్రత్యేక అధికారి రీజ నల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించింది. ఈయన పనిచేసేచోట నిబంధనలు మాత్రమే పనిచేయాలి.. సొంత నిర్ణ యాలు తీసుకుంటే మాత్రం ఒంటికాలిపై లేస్తారు..ఆ తరువాత మాటలుండవు.. మాట్లాడుకోవడాలుండవు.. అన్నీ కఠిన చర్యల ఫలితాలే..!

Visakhapatnam

2023-04-21 04:21:50

VJFలెక్కల్లో బొక్కలు బయటకొస్తే కోశాధికారికి చుక్కలే

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో గత 11ఏళ్లుగా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్న కాలంచెల్లిన కార్యవర్గం చేసిన ఖర్చులకు కోశాధికారి లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుంది. ఏమాత్రం ఖర్చులు పెట్టిన లెక్కలకు బొక్కలు ఉంటే కోశాధికారికి చుక్కలు కన పడటం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం కాలంచెల్లిపోయినా..పరిపాలన చేశారు కనుక 11ఏళ్లకు ఆడిట్ రిపోర్టులు, ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్, ఆసమయంలో వచ్చిన విరాళాలు, 12ఏ, 80జి క్రింద ఇచ్చిన మినహాయింపులు, 11ఏళ్ల ఫర్మ్ రెవెన్యువల్స్, సర్వసభ్య సమావేశం మి నిట్స్(ఒకవేళ పెట్టిఉంటే) ఓచర్లు, బ్యాలెన్స్ షీట్లు, ఇలా లెక్కలన్నీ కోశాధికారి జిల్లా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు ఉంచా ల్సిందే. అనధికార కార్యవర్గం పలుకుబడిని వినియోగించి 11ఏళ్లకు ఒకేసారి ఆడిట్ రిపోర్టులను తీసుకు రాగలిగినా.. ప్రతీఏటా వేయాల్సిన ఆ న్ లైన్ ఐటీ రిటర్న్స్ మాత్రం ఒకేసారి చేయడం పైనున్న దేవుడి తరం కూడాకాదు. సో బొక్కలు బయటపడటం ఫిక్స్..!

Visakhapatnam

2023-04-21 00:37:26

సింహాచలం అప్పన్న ఆలయంలో శీను సితారైంది

సింహాచలం శ్రీ వారహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ట్రస్టుబోర్డు సభ్యులకు శీను సితారైంది. తాము అడిగిన 100 పాసులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వం యంత్రాంగం అంగీకరించకపోవడంతో.. ప్రత్యేక తీర్మానం చేసి వివాదాల్లోకి ఎక్కారు ట్రస్టుబోర్డు సభ్యులు. ఆల య చైర్మన్, పీఠాధిపతులకు తప్పా..దేవాదాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు మరెవరికీ చందనోత్సవం రోజున అంతరాలయం ప్రవేశం ఉండకూడదంటూ తీర్మాణం చేసి మరీ మీడియాకి ఎక్కారు. అదే సమయంలో ట్రస్టుబోర్డు సభ్యులకు రెండేసి చొప్పు న పాసులు కేటాయిస్తామని చెప్పడంతో మండిపడిన సభ్యులంతా ఏకవాక్య తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వానికి పంపారు. ఉత్సవం మొత్తం జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున కనుసన్ననలలోనే జరపడానికి నిర్ణయించడంతో ట్రస్టుబోర్డు సభ్యులకు గాయిపోయినట్టు అయ్యింది. ట్రస్టుబోర్డు సభ్యులకు విఐపీ పాసులు అడిగినన్ని ఇవ్వనందునే ఇలా చేస్తున్నారని పార్టీ సిరియస్ అవుతోంది.


Visakhapatnam

2023-04-20 12:29:51

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ప్రెస్ క్లబ్ కూడా మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా..? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దానికి కారణం 2012 కార్యవర్గమే కోర్టు కేసుల నెపంతో అప్రజాస్వామికంగా నేటి వరకూ అనధికారికంగా ఉండిపోవడం, ఈ మధ్యకాలంలో ఒక్క సారి కూడా సర్వసభ్య సమావేశం పెట్టకపోవడం, కనీసం కోర్టుకేసుల విషయం కూడా సభ్యులకు అధికారికంగా తెలియజేయకపోవడం, ఈ చ ట్టవ్యతిరేక విధానాలపై జిల్లాకలెక్టర్ డా.మల్లిఖార్జున ముగ్గురు అధికారుల బృందం కమిటీ వేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. విజయనగరం జిల్లా ప్రెస్ క్లబ్ లోనూ ఇదే తరహా వ్యవహారం, అవినీతి జరగడంతో అక్కడి జిల్లా కలెక్టర్ ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేరుగా కలెక్టర్ సభ్యత్వాలు ఇచ్చారు. విశేషం ఏంటంటే ప్రస్తుతం కాలం చెల్లిన విజెఎఫ్ కార్యవర్గం కూడా అనధికారికంగా స భ్యులకు సభ్యత్వాలు 3రోజుల పాటు చేసిన రెవిన్యువల్స్ పైనా కలెక్టర్ విచారణచేపట్టే అవకాశాలున్నాయి.

Visakhapatnam

2023-04-20 00:58:44

ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మే నెల 3 వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయను న్నారని, అందుకు అవసర మగు ఏర్పాట్లను వెంటనే  చేపట్టాలని  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదే శించారు.  జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం మంత్రి బొత్స పరిశ్రమలు, మౌలిక వసతుల  ప్రత్యెక  ప్రధాన కార్యదర్శి  కరికాల వలెవన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు , ఎం. పి బెల్లాన చంద్ర శేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి ఏర్పాట్ల పై సమీక్షించారు.  ఎయిర్పోర్ట్ తో పాటు  చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టి కు కూడా శంకు స్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని  అందుకు అనువైన  వేదికను  రెండు రోజుల్లో గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు,  శాసన సభ్యులకు సూచించారు. శంకు స్థాపనకు అవసరమగు శిలాఫలకం ఏర్పాటుకు,  వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లను గావించాలన్నారు.  

వి.ఐ.పి ల వాహనాలకు , అధికారులకు, సాధారణ ప్రజలకు బహిరంగ సమావేశానికి వేర్వేరు రూట్లు ఉండే స్థలాన్ని గుర్తించాలన్నారు. వాహనాలకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ లో ఉండేలా చూడాలని, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ ఎస్.పి కు సూచించారు.  శంకు స్థాపన జరిగే నాటికి ఆర్ అండ్ ఆర్ లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని జే.సి. మయూర్ అశోక్ కు సూచించారు.   అందరికీ గృహాలు, అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని ఆర్.డి.ఓ సూర్య కళ కు ఆదేశించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియా తో మాట్లాడుతూ జూన్ నెల లో సాలూరు లో  గిరిజన విశ్వ విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేయడం జరుగు తుందని తెలిపారు. ఈ సమావేశం లో జి.ఎం.ఆర్ ప్రతినిధులు , ఆర్ అండ్ బి ఎస్.ఈ విజయ శ్రీ , పంచాయతి రాజ్ ఎస్.ఈ గుప్తా, ఈ ఈ లు ,  భోగాపురం తహసిల్దార్ శ్రీనివాస  రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-19 14:57:17

జగనన్నకు చెబుదాంపై అవగాహన కల్పించండి

సీఎం ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం  అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జగనన్నకు చెబు దాం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా..జాయింట్ కలెక్టరు ఎస్ .ఇలక్కియా ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమా నికి శాఖల వారీగా వస్తున్న అర్జీలు వివరాలు, వాటి పరిష్కారాని అనుసరిస్తున్న విధానం, ప్రజల సంతృప్తి స్థాయి, జిల్లాస్థాయి అధికారులు తీసుకో వాల్సిన చర్యలపైనా అవగాహనపైనా ఆమె దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్. వి.వి.సత్యనారాయణ, సీపీవో పీ.త్రీనాథ్, బిసీ కార్పొరేషన్ ఈడి ఎస్.వి.ఎస్‌.సుబ్బలక్ష్మి, అగ్రీ జెడి ఎన్ విజయ్ కుమార్, డీపీవో ఆర్ విక్టర్, హౌ సింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డీఎం సివిల్ సప్లయ్ డీ.పుష్పమణి  తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2023-04-19 14:47:41

సీఎం వైఎస్ జగన్ కు ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో  జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం బుధవారం మ ధ్యాహ్నం 2.20గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి,  పార్లమెంట్ సభ్యులు బి.సత్యవతి, జి.మాధవి, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర , విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ డా . ఎ . మల్లికార్జున ,  పోలీస్ కమిషనర్ డా. సి.యం త్రివిక్రమ్ వర్మ , జీవీఎంసీ కమీషనర్ సి.యం సాయికాంత్ వర్మ , ఎపిఈపిడిసియల్ సియండి ఐ. పృధ్వి తేజ్ , శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  తదితరులు ముఖ్యమంత్రి కి ఘనంగా వీడ్కో లు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో 2.30ని.లకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. 

Visakhapatnam

2023-04-19 14:35:25

సింహాద్రి అప్పన్న సేవలో దేవాదాయ శాఖ కమిషనర్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ హోదాలో ఎస్.సత్యనారాయణ తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు పూర్ణ కుంభంతె స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.  ముందుగా కమిషనర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా ప్రదక్షిణం చేశారు. స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము చేసి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ ఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం 23న జరగబోయే చందనోత్స ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. సామాన్య భక్తునికి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓ,  ఇంజనీరింగ్ సిబ్బందికి సూచిం చారు. వీరితో డిప్యూటీ కమిషనర్ సుజాత స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రామరాజు ఆలయ సహాయ కార్యాలయం అధికారి వై శ్రీని వాసరావు పర్యవేక్షకులు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు.

Visakhapatnam

2023-04-19 11:45:33