1 ENS Live Breaking News

వైద్యఆరోగ్యశాఖలో దొడ్డిదారి నియామకాలపై విచారణ

విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలోని దొడ్డిదారిన చేపట్టిన పారామెడికల్ నియామకాలపై డిఎంహెచ్ఓ డా.పి.జగదీశ్వర్రావు విచారణ చేపట్టారు. ఎంతమంది పారామెడికల్ సిబ్బందిని దొడ్డిదారి న నియమించారు..? అప్పుడు సదరు సీటు చూస్తున్నవారెవరు..? ఎన్ని నెలలుగా వారికి జీతాలు ఇస్తున్నారు..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ వేగంగా జరుగుతోంది. పారా మెడికల్ నియామకాలు జరిగిన సమయంలో ఒకింత పారదర్శకంగానే చేపట్టినప్పటికీ, ఆఖరులో ఈబిసి కోటాలోని కొన్ని ఉద్యోగాలను దొడ్డిదారిన చేపట్టారనే ఫిర్యాదులు అధికమయ్యా యి. విశాఖజిల్లాతోపాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు కూడా ఇక్కడి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. నియామకాల జాబితాలో పేర్లు చేర్చి, అడ్డదారిన చేపట్టిన నియామకాలపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విశాఖజిల్లాలో ఎప్పుడు పారామెడికల్ నియామకాలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల్లో చేపట్టినా ఖచ్చితంగా ఏదోఒక విధంగా అడ్డదారిన కొందరు ఉద్యోగాలు పొందుతుంటారు. ఆ సమయంలో పంపకాల్లో వచ్చిన తేడాలే సదరు విషయాన్ని సిబ్బందిలో సిబ్బందికి పడక దానిని మీడియాకి లీక్ చేస్తూ ఉండటం ఇక్కడ కార్యాలయం స్పెషాలిటి. ఒక్కో వర్గం ఒక్కో వర్గం మీడియాను పెంచి పోషిస్తూ వస్తుంటుందనే ప్రచారం కూడా గట్టిగానే సాగుతుంది. ఏ విభాగంలోనైనా నియామ కాలే కాకుండా బదిలీలు, పదోన్నతులు జరిపే విషయంలోనూ కోరుకున్న ప్రదేశాలు కేటాయించే విషయంలోనూ ఇక్కడి అధికారుల నుంచి సిబ్బంది వరకూ అత్యంత పారదర్శకంగా అడి గిన మొత్తం తీసుకునే కార్యక్రమాలు చేపడతారనే విషయం ఇటీవల జరిగిన అనధికార నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ లు గుర్రుగా ఉండటంతో జరిగిన తేడా కార్యక్రమాలపై విచారణ వేగవంతం చేశారు జిల్లా అధికారులు. ఈ దొడ్డి దారి వ్యవహారంలో ఎంతమంది పైకి వస్తారు..? ఎంతెంత మొత్తాలు తీసుకొని నియామకాలు చేపట్టారనే విషయం తేటతెల్లం కానుంది..!

Visakhapatnam

2023-05-19 14:43:54

వెంగమాంబ దాన పత్రాలు పుస్తకావిష్కరణ

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ దానపత్రాలు పుస్తకాన్ని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో  బుధవారం టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆవిష్కరిం చారు. డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, డాక్టర్ నాగోలు కృష్ణారెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు. శ్రీవెంగమాంబ కాలానికి సంబంధించిన 33 దాన శాసనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ధన,వస్తు రూపంలో ఇచ్చిన దానాలకు సంబంధించిన శాసనాలను పరిష్కరించి ఈ పుస్తకంలో పొందుపరచారు.  ఈ విరాళాల ద్వారా ఆమె తిరుమలలో ప్రతి ఏటా పది రోజుల పాటు నృసింహ జయంతి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించేవారని దాన పత్రాల్లో ఉంది. ఉత్సవాల రోజుల్లో పేదలకు అన్నదానం, చలి వేంద్రాలు మొదలైన ధర్మ కార్యాలు నిర్వహించేవారని ఇందులో ఉంది. స్వీకరించిన దాదాపు 33 దానాలకు సంబంధించి దానకర్త పేరు, దాన విషయం మొదలైన విషయాలన్నీ ఇందులో పొందు పరచబడ్డాయి.   జేఈవో లు  సదాభార్గవి, వీరబ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tirupati

2023-05-17 16:14:32

విశాఖజిల్లాలో 12,173 లబ్ధిదారులకు మత్స్యకారబరోసా

వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా   మత్స్యకారుల  బ్యాంకు  ఖాతాల్లో నేరుగా  రాష్ట్ర  ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి  నగదు  జమ చేశారు.  వేట నిషేధం అమలులో  ప్రభావితం  కాబడిన  కుటుంబాలకు మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి 2023–24 ఏడాదికి  సంబంధించి  5వ విడత  వై.యస్.ఆర్  మత్స్యకార  భరోసా  ఆర్థిక  సహాయం క్రింద ఒక్కో  కుటుంబానికి  10 వేల  రూపాయలు   సంబంధిత  మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.   ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే  వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వేట నిషేధం (ఏప్రిల్ 15నుంచి జూన్ 15వరకు 2 నెలలు) అమలులో ప్రభావితం కాబడిన 12,173 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10,000/- లు చొప్పున ₹.12.17కోట్లు జీవన భృతి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.  రాష్ట్ర మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10,000/- లు చొప్పున ₹.123.52 కోట్లు రూపాయలు ఆర్థిక సా యం  మంజూరు చేసినందుకు జీవితాంతం మత్స్యకారులందరు సీఎం జగమ్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలియజేసారు. 

సముద్రం పై వేటకు వెళ్లే మత్స్యకారుల స్ధితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభించగా జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి  ఎస్ శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లాలో మత్స్యకార భరోసా క్రింద 12,17,30,000/- ల రూపాయల మెగా చెక్కును మత్స్యకారులకు  అందజేశారు.  జిల్లా నుండి  ఈ కార్యక్రమం  లో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్.ఎల్.సి వంశీకృష్ణా యాదవ్ , జాయింట్ డైరెక్టర్(ఫిషరీస్) విజయ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇంచార్జ్ పూర్ణిమ దేవి,  ఫిషరీస్ వెల్ఫేర్ యండ్ డెవలప్మెంట్  డైరక్టర్ పి.విజయ చంద్ర , పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-16 10:41:01

విజయనగరంజిల్లాలో 3,522 మందికి మ‌త్స్య‌కార భ‌రోసా

విజ‌య‌న‌గ‌రంజిల్లాలోని 3522 మంది మ‌త్స్య‌కారుల‌కు, మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌కం క్రింద రూ.3.52 కోట్ల‌ను, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి వి డుద‌ల చేశారు. బాప‌ట్లజిల్లా నిజాంప‌ట్నంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలోబ‌ట‌న్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో న‌గ‌దు జ‌మచేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌ను జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్‌, జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు,జెసి మ‌యూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మ‌త్స్య‌శాఖ డిడి ఎన్‌.నిర్మ‌లా కుమారిలు తిల‌కించారు. అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ఏటా రూ.10వేలు చొప్పున ఆ కుటుంబాల‌న్నింటికీ రూ.3.52 కోట్ల విలువైన చెక్కును చై ర్మన్ అంద‌జేశారు. ఈకార్య క్రమంలోపూస‌పాటిరేగ్ ఎంపిపి మ‌హంతి క‌ల్యాణి,  జిల్లా మ‌త్స్య‌కార సొసైటీ అధ్య‌క్షులు చిన్న‌ప్ప‌న్న‌, డైరెక్ట‌ర్ నర్సింహులు, టూరి జం కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్  శ్రీ‌నివాస‌రావు, మ‌త్స్య‌కార సంఘ నాయ‌కులు, మ‌త్స్య‌శాఖ అధికారులు, స‌చివాల‌య సిబ్బంది  పాల్గొన్నారు.

Vizianagaram

2023-05-16 09:56:37

వృధా నీటి నిర్మూలనే దోమల నివారణకు మార్గం

వృధా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని,  ప్రజల భాగస్వామ్యంతోనే  డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని జిల్లా కలె క్టర్  శ్రీకేశ్ లాఠకర్ అభిప్రాయపడ్డారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅ తిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేం దుకు గల కారణాలు తెలుసుకొని, వాటి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్యఉ ద్దేశ్యమని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు.  డెంగ్యూ ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా సంక్రమి స్తుందని, కావున ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తిచెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీలు లే కుండా ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మునిసిపల్ కమీషనర్లు, స్థానిక సంస్థలు, పంచాయతీ అధికారులతో గతవారమే వెక్టర్ సంక్రమణ వ్యాధులపై జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని గుర్తుచేసారు.  ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షీ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. ఎన్.అనురాధ, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, నగరపా లక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, డా. జంపు కృష్ణమోహన్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, సంఘ సేవకులు డా.మం త్రి వెంకటస్వామి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-05-16 07:12:56

సత్వరమే అక్రిడిటేషన్ దరఖాస్తులు సమర్పించండి

విశాఖజిల్లాలో  పనిచేస్తున్న అర్హులైన పత్రికా, మీడియా ప్రతినిధులు www.ipr.ap.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా అక్రిడిటేషన్ ధరఖాస్తులను అఫ్లోడ్ చేసి సదరు కాఫీలను జిల్లా  పౌరసంబంధాల కార్యాలయంలో సమర్పించవలసినదిగా ఉప సంచాలకులు ఒక ప్రకటనలో కోరారు.  ఇదే విషయమై గతనెల 28న ప్రకటన చేశామని పేర్కొన్నారు. మీడియా సంస్థలు ఎంత త్వరగా దరఖాస్తులు సమర్పిస్తే అంతే త్వరగా నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీకి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జీఓలో పొందుపరచిన విధంగా అనుబంధ పత్రాలు, సదరు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు.  వీలైనంత త్వరగామీడియా సంస్థలు ఈ ప్రక్రియ పూర్తిచే యా లని కోరారు. ఇంకా ఎవరి మీడియా సంస్థలైనా సమాచారశాఖ వెబ్ సైట్ లో కనిపించకపోతే సంస్థ నుంచి అభ్యర్ధన లేఖలు సమర్పిస్తే వారి మీడియా సంస్థలను రిజి స్ట్రేషన్ చేపడతామన్నారు. ఆన్ లైన్ లో అఫ్లోడ్ చేసి,  ధరఖాస్తులను డిపిఆర్వో కార్యాలయంలో అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు.

Visakhapatnam

2023-05-16 01:48:26

అర్హులందరికీ జాబ్ కార్డులు ఇవ్వండి.. జిల్లా కలెక్టర్

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ జాబ్ కార్డులు అందజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదే శించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవో, డ్వామా అధికారులతో నిర్వహించిన మండల స్థా యి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సగటు వేతనం 252 రూపాయలు వస్తుందని, సగటు వేతనం పెరిగే విధంగా పనులలో నాణ్యత పెంచాలని సూచించారు.  చింతపల్లి, జీకే వీధి తదితర మండలాల్లో అధికంగా జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పనులు తక్కువగా ఉన్నా యని వాటిని పెంచడం ద్వారా అందరికీ పని కల్పించడంతోపాటు సగటు వేతనం పెరుగుతుందని వివరించారు.  పనులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫ్ వర్క్స్ తయారు చేయాలన్నారు.  వేతన దారుల ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతాల, మొబైల్ నెంబర్లతో అనుసంధానం చే యాలని, ఇ కేవైసీ చేయాలని ఆదేశించారు.  జిల్లాలో సుమారు 20 శాతం వరకు గ్రామాలలో పనులకు ప్రతిపాదనలు రాలేదని గుర్తించామని, జీరో పనులు ఉన్న గ్రామాల్లో సెల్ఫ్ అప్  వర్క్స్ క్రియేట్ చేసి వేతనదారులకు పని కల్పించాలని ఆదేశించారు. 

గృహ నిర్మాణాలకు సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ తో అనుసంధానించి పనులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు కోట్ల రూపా యలకు ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలని ఆదేశించారు.  ఎంపీడీవోలు క్రియేట్ చేసిన పనుల ప్రతిపాదనలు వారి దగ్గర పెండింగ్లో లేకుండా డ్వా మా పిడికి పంపించాలని, పిడి స్థాయిలో లేదా కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని 24 గంటల్లో పనులు మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.  కొండ ప్రాంతాలలో గృహ నిర్మాణాలకు రవాణా అధికంగా ఉందని ఎంపీడీవోలు కలెక్టర్ దృష్టికి తీసు కురాగా, కలెక్టర్ స్పందిస్తూ అటువంటి వాటిని గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చా రు.  ఎన్ఆర్ఈజీఎస్ క్రింద చేపట్టిన పనులలో ఉద్యాన పంటల పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

పిల్లల ఆధార్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయడం ద్వారా పిల్లల ఆధార్లను జనరేట్ చేయాలని ఆదేశించారు. ఆధార్, జనన ధ్రువీకరణ లేని వారందరికీ ఆధార్, జనన ధ్రువీకరణ జనరేట్ చేయాలని ఆదేశించారు.  అదేవిధంగా బడి బయట ఉన్న వారిని గుర్తించి వారిలో ఎనీమియా తో బాధపడుతున్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. 2005 - 2008 మధ్య పుట్టిన పిల్లలు ఏ విద్యాసంస్థల్లో, ఏ స్టేజ్ లో ఉన్నారా గుర్తించి వారికి కూడా ఎనీమియాతో బాధపడితే చికిత్స అందించాలన్నారు.  జననీ సురక్ష యోజన క్రింద తల్లులతో బ్యాంకు ఖాతాలు ప్రారంభింపజేయాలని ఆదేశించారు.  సచివాలయాలలో సూచించిన ఆరు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో సహాయ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ, డ్వామా పీడీ రమేష్ రామన్, హౌసింగ్ పిడి బాబు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, సిపిఓ ఆర్ఎస్ఎన్ పట్నాయక్, డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్, మండలాల నుండి ఎంపీడీవోలు, డ్వామా ఏపిఓలు తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2023-05-15 15:42:24

సమస్య పరిష్కారం కాగానే ఫోటో అప్ లోడ్ చేయాలి

జగనన్నకు చెబుదాం (స్పందన ) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని విశాఖ జెసి కె.యస్ విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం దరఖా స్తుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పెండింగులో ఉన్న పిటీషన్లు వెంటనే పరిష్కరిం చాలన్నారు. పిటీషనర్లకు సమాధానం ఇచ్చే ముందు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ తిరిగి రాకుండా జాగ్రత్త వహించాలన్నా రు. అదే విధంగా అర్జీదారుని సమస్య పరిష్కరించిన అనంతరం సంబంధిత సచివాలయ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి సదరు ఫొటోను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం ప్రజల దగ్గర నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో 138  విజ్ఞప్తులు అందాయి. ఈ కార్యక్రమంలో డి ఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి,ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్ , జీవీఎంసీ ఎడిసివర్మ,జిల్లా అధి కారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-15 13:33:39

స్పందన, జగనన్నకు చెబుదాం అర్జీలకు ప్రాధాన్యత

స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలలో వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  మండల ప్రత్యేక అధికారులు ఫిర్యాదులు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు.  ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో స్పందన కార్యక్రమానికి వచ్చే సమయంలో జిల్లా శాఖల అధికారులు పూర్తి వివరాలతో రావాలన్నారు. గృహ నిర్మాణం, నాడు నేడు, ఇంజనీరింగ్ పనులు, అంగన్వాడి సెంటర్లు, హెల్త్  క్లినిక్ లు, వ్యర్ధాల నిర్వహణ మొదలైన వాటికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే పనులు జరిగేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్వో పి.వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Anakapalle

2023-05-15 12:56:16

స్పందన, జగనన్నకు చెబుదాం అర్జీలకు ప్రాధాన్యత

స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలలో వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  మండల ప్రత్యేక అధికారులు ఫిర్యాదులు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు.  ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో స్పందన కార్యక్రమానికి వచ్చే సమయంలో జిల్లా శాఖల అధికారులు పూర్తి వివరాలతో రావాలన్నారు. గృహ నిర్మాణం, నాడు నేడు, ఇంజనీరింగ్ పనులు, అంగన్వాడి సెంటర్లు, హెల్త్  క్లినిక్ లు, వ్యర్ధాల నిర్వహణ మొదలైన వాటికి ప్రాధాన్యతనిచ్చి వెంటనే పనులు జరిగేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్వో పి.వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Anakapalle

2023-05-15 12:56:16

విజయనగరం జిల్లా స్పంద‌న‌కు 122 విన‌తులు

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో సోమ‌వారం 122 విన‌తులు అందాయి. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌. నాగ‌ల‌క్ష్మి ఇతర జిల్లాశాఖల అధికారులతో పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు, విద్యుత్ శాఖ‌కు సంబంధించి 01, డి.సి. హె చ్‌.ఎస్‌.-1, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌కు సంబంధించి 01, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ‌కు 06, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు సంబంధించి 10, జి ల్లా పంచాయ‌తీ అధికారికి 06, గృహ‌నిర్మాణంకు సంబంధించి 12, మునిసిప‌ల్ స‌మ‌స్య‌ల‌పై 5, రెవిన్యూకు సంబంధించి 80 విన‌తులు అం దాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీపెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఆయా ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి నిర్ధిష్టమైన సమాచా రం అందాలన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలన్నారు. అర్జీదారులను పదే పదే జిల్లాశాఖల కార్యాలయాల చుట్టూ తిప్ప రాదన్నారు.  జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ప్ర‌త్యేక డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లు సూర్య‌నారాయ‌ణ‌, ప‌ద్మ‌ లీల‌, బి.ఎస్‌.ఎన్‌.దొర త‌దిత‌రులు కూడా స్పందనలో విన‌తులు స్వీక‌ర‌ణ చేప‌ట్టారు. 

Vizianagaram

2023-05-15 10:54:37

VJFకి సర్వసభ్య సమావేశమా ఆ ఒక్కటీ అడక్కండి..!

ఎలాంటి ఎన్నికలూ లేకుండా మమ్మల్నే మరో 12ఏళ్లు ఉండిపోమనండి ఉండిపోతాం.. సభ్యుల ఆమోదం లేకుండా విజెఎఫ్ రెవిన్యుల్స్ చేయించమనండి అడ్డదారిన చేసేస్తాం.. కమిటీలో ఉన్న సభ్యులను కమిటీ ఆమోదంతో తప్పించేయమనండి అది మాకు చిటికెలో పని.. సొసైటీ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించమని మీరు చెప్పకపోయినా ఇన్నేళ్లూ మేము చేస్తున్నది అదే అంతే తప్పా.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)కి సర్వసభ్య సమావేశం పెట్టండి.. లెక్కలు చెప్పండి.. ఎందుకు సభ్యులకు తెలీకుండా విషయాలను దాచిపెట్టారు.. అని అడిగితే మాత్రం బాగోదు అంటోంది అనధికార కార్యవర్గం..!. నిజంగా ఇవన్నీ చేసేవాళ్లమే అయితే 2016ఒకటి, 2018లో ఒకటి 2 కోర్టు కేసులు డిస్ మిస్ అయిపోయిన తర్వాతే సర్వసభ్య సమావేశం పెట్టేవాళ్లం కదా..? మాకు తెలీకే ఇన్నేళ్లు ఆ సమావేశం పెట్టకుండా ఊరుకున్నామా..? సొసైటీ నిబంధనలు పాటించేవాళ్లమే అయితే ఇన్నిమాటలు మీతో ఎందుకు పడతాం చెప్పండి..? మాకు విజెఎఫ్ అన్నా.. ఇక్కడి పదవులన్నా చాలా ఇష్టం. ఒక పట్టాన వదిలేసి పొమ్మంటే ఎలా..? ఏదో 12ఏళ్లపాటు మిమ్మల్ని అందరినీ ఏదో చిన్న మోసం చేసినందుకు దీన్నె అంటిపెట్టుకొని మా కార్యకలాపాలు చేస్తున్నవారిని అనర్హులుగా ప్రకటిస్తామంటే ఇది పద్దతిగా ఉంటుందా..? మేమంతా మాకోసం గానీ ఇన్నేళ్లూ పదవుల్లో ఉన్నామా..? ఎంతో శ్రమకోర్చి..కష్టపడి కోర్టుకేసుల నెపంతో కాలం గడుపుకొచ్చాం.. కేసులు ఉన్నాయనే విషయాన్ని వాస్తవంగా చెప్పాల్సిన బాధ్యత కాలంచెల్లిన కమిటీగా మాపై ఉన్నా చెప్పలేదు.. ఇదంతా ఎందుకు చేశామో మీకు ఇప్పటికీ తెలియకపోతే ఎలా అంటూ ఎదురు దాడిచేస్తోంది ప్రస్తుత అనధికార కార్యవర్గం...! అవును వాళ్లు చేస్తున్న వాదనలోనూ వాస్తవం ఉంది. ఇన్నేళ్లు మాట్లాడని వారంతా ఇపుడే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఎన్నికలు ప్రకటించడానికి 3 నెలల ముందు నుంచే నార్లవెంకటేశ్వర భవన్, డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ కి రంగులు అద్దె కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నామో మీకు తెలియదా..? ఇన్ని తెలిసిన మీరు ఏ మొహం పెట్టుకొని సర్వసభ్య సమావేశం, లెక్కలు కోసం అడుగుతున్నారో అర్ధం కావడం లేదని గెక్కెట్టి మరీ ఏడ్చేలా చేస్తున్నారంటూ తెగ బాధ పడుతున్నారు కాలం చెల్లిన కార్యవర్గ సభ్యులు..

ఏంచేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ అధికారుల విచారణలో ప్రైవేటు లాయర్ ను తీసుకెళ్లడం మా తప్పా..? ఆమాత్రం ఆత్మరక్షణ, ఎదురుదాడిని తట్టుకునే స్వాతంత్ర్యం కూడా మాకు లేదా...? ఇన్నేళ్లపాటు సభ్యులందరికీ తెలియకుండా, మా అనధికార కార్యవర్గం విజెఎఫ్ ఖర్చుల చిట్టా ఒకేసారి చార్టెడ్ అకౌంటెంట్ తో మా ఆమోదంతోనే చేయించుకున్నాం.. మా ఆమోదంతోనే జాయింట్ సెక్రటరీని మూడు సమావేశాలకు పిలవకుండా ఆయన పేరుని కార్యవర్గం నుంచి, విజెఎఫ్ లెటర్ హెడ్ నుంచి తప్పించేశాం..అలా చేసుకునే అవకాశంగానీ, బయిలాలో నిబంధన పాటించి(మూడు సమావేశాలకు రాకపోతే) కావాలనే తప్పించే అవకాశం కూడా మాకు ఇవ్వరా..? ఇదెక్కడి న్యాయమండీ.. ఇన్ని చేసిన మాకు నిబంధనలు తెలియవంటారా..? మాకూ నిబంధనలు తెలుసు..? సర్వసభ్య సమావేశం పెట్టాలని కూడా తెలుసు.. అలా చేసి, ఖర్చుల చిట్టా ప్రకటిస్తే ఆ సమయంలో మాపనేంటో కూడా మాకు తెలుసు.. అందుకే కదా ఇన్నేళ్లపాటు కోర్టుకేసులు, కోవిడ్ నెపంతో ఉండిపోయాం...! ఇంత చేసిన మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. ఏదో మీకోసం 12ఏళ్లపాటు ఉండిపోయినందుకు ఇన్నేళ్ల లెక్కలు ఒకేసారి చెప్పాలంటే మాకు మాత్రం సమయం వద్దా..? అందుకనే జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున మా అనధికార కార్యవర్గంపై విచారణ వేసినపుడు.. కేవలం 2020 వరకూ మాత్రమే రెవిన్యువల్స్ చేయించిన సంఘం రిజిస్ట్రేషన్ కాపీ చూపించాం... ఇంకా మూడేళ్లు ఉండిపోయింది.. దానిని కూడా చేయించాలని చూశాం..మావల్ల కాలేదు. ఆమాత్రం దానికి విజెఎఫ్ నుంచి మమ్మల్ని పొమ్మంటే మేము ఏమైపోవాలి..? మీ అందరి కోసం ప్రతీ ఏదాది ప్రెస్, జర్నలిస్టు పనులను మానుకొని మరీ చందాలు, విరాళాలు, స్పాన్సర్ షిప్పుల కోసం తిరిగిన మా కష్టాన్ని గుర్తించకపోవడం చాలా శోచనీయం. మీరడిగినవి ఏమీ మేము చేయము.. జిల్లా కలెక్టర్ విచారణ నివేదిక కూడా మాకోసమే వాయిదాలు పడుతూ వస్తోంది. కాలం మాకు అలా కలిసి వస్తోంది. లెక్కలు, అందులోని బొక్కలూ చెప్పేది లేదు..ఇష్టం ఉంటే ఎన్నికలు పెడతాం..లేదంటే కలెక్టర్ కమిటీ నివేది వచ్చేంత వరకూ ఎన్నేళ్లయితే అన్నేళ్లూ కష్టపడి మళ్లీ మేమే ఉండిపోతాం. 

ఏం ఇన్నేళ్లు సభ్యులందరినీ మోసం గడిపేసిన మాకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వరా..? ఇదేనా సాటి జర్నలిస్టులకు మీరిచ్చే గౌరవం(ఇందులో జర్నలిస్టులు ఎంతమందున్నారు..?) సొసైటీ నిబంధనలు అంటే ఏంటో మాకు తెలీకనే వాటిని తుంగలోకి తొక్కామా..? ఏం సర్వసభ్య సమావేశం పెట్టాలని మాకు తెలీకే.. ప్రతీ ఏటా అన్ని కార్యక్రమాలు చేసేమేము సర్వసభ్య సమావేశం పెట్టకుండా దానాని తెలివిగా దాటవేసుకుంటూ వచ్చామా..? ఎప్పుడు ఏ పని ఏవిధంగా చేసి మిమ్మల్ని బురిడీలును చేయాలో మాకు తెలీదా చెప్పండి..? మీరూ కూడా కాస్త అర్ధం చేసుకోవాలి.. పనిచేసేవారు ఎవరు? పనిగట్టుకొని విజెఎఫ్ ను అంటిపెట్టుకున్నవారెవరు..? ఎందుకు ప్రభుత్వం నిబంధనల పట్టించుకోకుండా సొసైటీని నియమ, నిబంధనలు తుంగలోకి తొక్కిందెవరు..? ఇన్నేళ్లూ పరిపాలించేసినా.. ఇంకా పదవుల కోసం, నార్లభవన్ లోని రెండు అంతస్తులను సొంత అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నవారెవరు..? దానికోసం కుల, మత, వర్గ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్నవారెవరు..? ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా..? విజెఎఫ్ సభ్యులుగా మా అనధికార కార్యవర్గం ఏం చేసిందో, ఎలాంటి సంక్షేమం చేసిందో.. దానిని అడ్డం పెట్టుకొని ఎలా ఎదిగిందో.. అంతకంటే చక్కని రాజకీయం ఎలా చేసిందో మీకు తెలుసు. మంచి మనసుతో ఆలోచించండి..? మాకు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వండి..? అంతే తప్పా సర్వసభ్య సమావేశాలు, ప్రతీఏటా చేసిన ఖర్చులు, సొసైటీ నిబంధనలు, కాలంచెల్లిపోయిన పదాలు వాడొద్దు.. మాకు మనసులేదా..? మీరు ఇన్నేసి మాటలు అంటున్నా మాకు పట్టనట్టు ఎందుకుండిపోతున్నామో కూడా మీరు గుర్తించలేకపోతున్నారు..? అలాగని జిల్లా అధికారులు సైతం ఎందుకు మేము చేసిన తప్పులను కూడా వెంటనే ప్రకటించలేదో కూడా మీకు తెలుసు.. ఇన్ని తెలిసిన మీకు మళ్లీ మళ్లీ మాకే అవకావం కల్పించాలని మీకు తెలీదా..? మాకు మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరా..అలా అయితే మేము ఏమైపోతాం..? విజెఎఫ్ నే నమ్ముకొని పెట్టుకున్న మా లక్ష్యాలు నీరు గారీపోవడమేనా..?  మేము మాత్రం ఇంతకంటే ఏం చెప్పగలం.. ఎందుకంటే ఇలాంటి తేడా ఆలోచనలు ఊరకనే రావు.. విజెఎఫ్ లాంటి ఒక కల్ఫ వృక్షం ఉంటే తప్పా.. మీరంతా మంచి జర్నలిస్టులు.. తప్పులను ఎత్తిచూపే వారి మాటలను ఏ మాత్రం నమ్మొద్దు..మాపై మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా.. మళ్లీ మళ్లీ మాకోసం మాత్రమే ఆలోచించండి.. ఇంతకన్నా మేము మిమ్మల్ని ఏమీ అడగము.. అడగలేము..?!

Visakhapatnam

2023-05-15 02:50:45

రాజకీయాలను తలపిస్తున్న VJF ప్రెస్ క్లబ్ ఎన్నికలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అధికారపార్టీ చేపట్టిన ట్టు మెరుపుల కార్యక్రమాలు చేపడుతున్నారు. 12ఏళ్లపాటు సొసైటీ చట్టానికి విరుద్ధంగా, ఒక్క సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించకుండా కోర్టు కేసుల నెపంతో కాలం గడిపేసిన కాలంచెల్లిన కార్యవర్గం ఎన్నికల ప్రకటించగానే అభివృద్ధి కార్యక్రమాలకు తెరలేపారు. ఆగమేఘాలపై డాబాగార్డెన్స్ లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ కు ఫైబర్ బోర్డులు పెట్టించడం, సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వర భవన్ కి మరమ్మతులు చేపట్టి..డిజి టల్ డయాగ్రామ్ లను వాట్సాప్ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజంగా విజెఎఫ్ పై అనధికార కార్యవర్గానికి అంత సచ్చీలతే వుంటే పద వీకాలంలో ఎప్పుడైనా చేపట్టవచ్చు. కానీ అనధికార కార్యవర్గం చేపడుతున్న అప్రజాస్వామిక వ్యవహారాలను సంఘం సభ్యులే తిరుగుబావుటా ప్రకటించి ఎదురు తిరిగిన వెంటనే చేయడం మొదలు పెట్టారంటే ఈ అనధికార కార్యవర్గానికి ఇంకా పదవులపై ఎంత వ్యామోహం ఉందో తెలుసుకోవచ్చు. నిజంగా ఈ అభివృది ఆదిలోనే చేసి ఉంటే ఇప్పటికే విజెఎఫ్ ఆస్తులు, ఆదాయం రెట్టింపు అయ్యేవి ఈ 12ఏళ్లలలో.  గత పాలక వర్గాలు విజెఎఫ్ ఆస్తులను, ఆదాయాలను పెంచితే..ఈ పాలక వర్గం మాత్రం అప్పులను మిగిల్చింది. వాస్తవానికి డాబాగార్డెన్స్, సీతమ్మధారలోని నార్లవెంకటేశ్వర భవన్ లోని గ్రౌండ్ ఫ్లోర్అద్దెలు, పక్కనే వున్న షాపుల ఆద్దెల ద్వారా ఏడాదికి రూ.లక్షల్లోనే ఆదాయం వస్తుంది. పైన ఉన్న అంతస్తు అద్దెకిస్తే.. దాని ద్వారా మరికొంత అద్దెరూపంలో ఆదాయం వచ్చేది. కానీ కార్యవర్గంలోని ఒకరి సౌలభ్యం కోసం అక్కడ డాన్సు శిక్షణకు, సొంత కార్యక్రమాలకు దానిని వినియోగించుకుంటున్నారు.

ఇంత కాలంలేని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే ఎందుకు చేయిస్తున్నారని విజెఎఫ్ సభ్యులు ప్రశ్నిస్తే.. ఆ ఒక్కటీ అడక్కూడదు మీరం తా... ఏం 12ఏళ్ల పాటు, కోర్టుకేసుల నెపంతో మోసం చేసినా, కనీసం సర్వసభ్య సమావేశాలు పెట్టకపోయినా, ప్రతీ ఏటా తమ ప్రచారం కోసం కార్యక్రమాలు చేస్తున్నా.. అప్పుడు మాట్లాడని వారు ఇపుడెందుకు మాట్లాడుతున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు ప్రస్తుతం కాలంచెల్లిన కార్యవర్గ సభ్యులు. మేం చేసిందే కార్యక్రమం, మేము పెట్టాలనుకుంటే సర్వసభ్య సమావేశం పెడతాం..ఒక వేళ అలా సొసైటీ నిబంధనలు పాటించకపోయినా.. మా తప్పులను వెనుకేసుకు వచ్చే సీనియర్ జర్నలిస్టులు, సానుభూతి పరులు మా వెనుకే పెద్ద సంఖ్యలోనే ఉన్నారనే ప్రచారం సైతం తమ వెనునున్నవారితో సోషల్ మీడియాలో ఊదర గొడుతున్నారు.  ఇక దాతల నుంచి వచ్చిన విరాళాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.. కనీసం విజెఎఫ్ పై భవనాల ద్వారా వచ్చిన అద్దెలు, ఆదాయాలు ఏమయ్యాయో అసలే తెలీదు.. కానీ 12ఏళ్లలో విహార యాత్రలు మాత్రం అనధికార కార్యవర్గం క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నది ఈ అధికారం లేని పాలకవర్గం. సమయం దాటిపోయినా.. కోర్టు కేసుల విషయంలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కని వారు కోర్టు 2 కేసులను ఒకటి 2016లోనూ, మరొకటి 2019లో డిఫాల్ట్ డిస్ మిస్ చేస్తే..తీర్పు విజెఎఫ్ కి అనుకూలంగా వచ్చిందని సభ్యులను దారుణంగా మభ్యపెట్టారంటే వీరి పదవీ కాంక్షకు కోర్టు కేసులను కూడా ఏవిధంగా వాడుకున్నారో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదంతా రాజకీయపార్టీలు చేస్తున్న కార్యక్రమాల కంటే దారుణంగా చేపడుతుండటం విశేషం.

ఏ కార్యవర్గం విజెఎఫ్ ను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా దానిని సభ్యులంతా స్వాగతించాలి.. అభినందించాలి.. కానీ విజెఎఫ్ పై వచ్చిన ఆదాయాన్ని దాతల దగ్గర నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చులు క్రింద చూపించేయడంతోపాటు, ఇంకా అప్పులు చూపించడమే ఇపుడు సభ్యులందరికీ చిర్రెత్తుకొస్తున్నది. ఆ విషయాన్నే సర్వసభ్యసమావేశం పెట్టి ఆదాయ వ్యవయాల లెక్కలు చెప్పమంటే మాత్రం ప్రస్తుత అనధికార కార్యవర్గం ఏమీ పట్టనట్టు..అసలు అలాంటివేమీ తమకు తెలియనట్టు.. ఇంకా మాట్లాడితే ఎందుకు సర్వసభ్య సమావేశాలు పెట్టాలన్నట్టు బీరాలు పోతున్నారు. తాము చేసింది అభివృద్ధి కాదా..సభ్యుల సంక్షేమం కోసమే అప్పులు చేశాం తప్పితే తమ సొంత ప్రయోజనాలకా అంటూ ఎదురుదాడి చేస్తోంది. విషయాన్ని, సదకు అప్రజాస్వామిక కార్యవర్గం చేస్తున్న తేడా తనాన్ని సభ్యులకు తెలిసేలా చైతన్యం చేస్తున్న తరుణంలో కొందరి చేత ఫోన్లు చేయించి తిట్టించడం, మరికొందరితో సోషల్ మీడియాలో వార్నింగ్ ఇప్పించడం, కులసంఘాలను ఈ విజెఎఫ్ ఎన్నికల్లోకి దించి వారికి ఫోన్లు చేసి..ఎదురు తిరిగేవారందరికీ కాలో చేయో తీయించేస్తామని, వారి అంతు చూస్తామని చెప్పడం తదితర వ్యవహారాలన్నీ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. అసలు ఇంత దారుణంగా విజెఎఫ్ పరువు తీసిన ఈకాలంచెల్లిన కార్యవర్గానికి, 12ఏళ్లపాటు ఏకబిగిన సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించాలని మెజారిటీ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విజెఎఫ్ అనధికార పాలకవర్గం వ్యవహార శైలిపై త్రిసభ్య కమిటీ వేసిన జిల్లా కలెక్టర్ నివేదిక ను కూడా ప్రకటించే అవకాశం వుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!


Visakhapatnam

2023-05-12 06:53:51

విశాఖలో ఉత్కంఠ.. విజెఎఫ్ పై 12న వచ్చే నివేదిక అదేనా..?!

విశాఖలోని జర్నలిస్టుల్లో ఉత్కంఠ కట్టలు తెంచుకుంటోంది.. వైజాగ్ లో ఏఇద్దరు జర్నలిస్టులు తారసపడినా ఇదేటాపిక్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)పై జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఏం తేల్చబోతుందనేది. 12ఏళ్లుగా విజెఎఫ్ అనధికార, కాలం చెల్లిన కార్యవర్గం సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన విధానా లపై జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుమేరకు కలెక్టర్ కమిటీ వేయడం, అధికారులు రిపోర్టు తయారుచేయడం జరిగిపోయాయి. కాకపోతే నాటి నుంచి నేటి వరకూ కలెక్టర్ ఆని వేదికను ప్రకటించలేదు. ఇటీవలే ముదపాకలో కలెక్టర్ ను కలిసిన మీడియా విజెఎఫ్ విచారణ నివేదిక ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా,12న ప్రకటిస్తామని చెప్పారు. దీనితో ఆనాటి నుంచి ఆ ఉత్కంఠ మరింత ఎక్కువైపోయింది ఇటు జర్నలిస్టులు, అటు కాలంచెల్లిన కార్యవర్గంలో కూడా. అయితే కమిటీ విచారణ తరువాత చాలా రకరకా లపుకార్లు షికార్లు చేశాయి. ఈసమయంలో కొందరు ఫోన్లుచేసి విజెఎఫ్ సభ్యులను ఫోన్లలో బండబూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటం, కులసంఘాలను, ప్రజాప్ర తినిధులతో తెరచాటు సంప్రదింపులు చేసినా ఫలితం లేకపోయింది.12న నివేదిక విడుదలకానుంది..!

Visakhapatnam

2023-05-10 17:11:11

ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు..

మనమంతా ప్రజా సేవకులమని, ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం ఉదయం  కలెక్టరేట్‌లోని సమావేశ  మందిరంలో స్పందన ,రీ సర్వే, మ్యుటేషన్లు , భూ సేకరణ , యు ఎల్ సి భూములు తదితర రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ‌తో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌ మాట్లాడుతూ భూ హక్కు పత్రాల బదిలి ,  మ్యుటేషన్ కరెక్షన్  వంటి చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇంత దూరం వస్తున్నారంటే మండల లెవెల్ లో  సిబ్బంది  సరిగా పనిచేయడం లేదని  అర్థమవుతోందన్నారు. స్పందన అర్జీల్లో రీ రీఓపెన్ కాకుండా పరిష్కరించి , ఈ సంఖ్య పూర్తిగా తగ్గాలని ఆయన ‌ స్పష్టం చేశారు. టూరిజం ప్రాజెక్టులకు భూమి సమస్యలు లేకుండా వేగవంతం చేయాలనీ ఆదేశించారు .

ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకొని జీవో నెం. 388, 301 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన రిజిస్ట్రేషన్ , పట్టాలో మార్పులు , చేర్పులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు . పట్టాలు పొందినవారు, సగం డబ్బు కట్టిన వారు,  ఇంకా పూర్తిగా డబ్బు కట్టని వారిని తహసిల్దార్లు సచివాలయాల ద్వారా  ప్రోత్సహించి ధరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. 150 చదరపు గజాల కు పైబడి యు ఎల్ సి భూములలో ఇండ్లు నిర్మించుకున్న యజమానులు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. జిల్లాలో ప్రజలకు సంబంధించి పెండింగ్ సమస్యలలో భూములకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని, స్పందన ద్వారా వచ్చే ప్రతి అర్జీను తహసీల్దార్లు , సర్వేయర్లు , వార్డు సచివాలయ సిబ్బంది  క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన అర్జీల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే ప్రజల యొక్క సమస్యలను అత్యంత శ్రద్ధతో పరిష్కరించి జిల్లాను ముందు వరసలో ఉంచాలని అన్నారు.  మోచా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎస్ శ్రీనివాస్ మూర్తి, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, భీమిలి ఆర్డివో భాస్కర్ రెడ్డి , ఎడి సర్వే విజయకుమార్ , ఎస్డీసీలు తహసీల్దార్లు ,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-05-05 11:20:02