1 ENS Live Breaking News

త్రిసభ్య కమిటీ ముందుకి VJF అనైతిక కమిటీ అక్రమాలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కాలం చెల్లిన కార్యవర్గం అక్రమాలను విశాఖ జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఏర్పాటు చేసిన 3శాఖల అధి కారుల కమిటీ ముందుకి సభ్యులు తీసుకు వెళ్లారు. శుక్రవారం ఈమేరకు వుడా భవన్  6వ అంతస్తులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కమిటీ ఫిర్యాదు దారుల నుంచి వివరాలు సేకరించింది. గత 11ఏళ్లుగా ఎలాంటి సర్వసభ్య సమావేశం లేకుండా పాలకవర్గం పనిచేస్తుందని, ఇదిచెల్ల దని వివరించారు. దానికి అంగీకరించిన కమిటీ వివరాలను నమోదు చేసుకోవడంతోపాటు, వీడియో రికార్డింగులను సైతం చేయించింది. జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ వేసిన తరువాత కూడా ఎలాంటి అధికారం లేని కార్యవర్గం సభ్యత్వాలు ఇవ్వడంపై సభ్యులు కమిటీ ముందుకి ఆధా రాలతో సహా తీసుకు వెళ్లారు. దానిపై స్పందించిన కమిటీ విచారణ వివరాలను జిల్లా కలెక్టర్ కి నివేదిస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధన లు, సొసైటీ చట్టాలకు విరుద్దంగా చేపట్టే ఏకార్యకలాపాలకు చట్టబద్ధత లేదని కమిటీ తేల్చి చెప్పింది.



Visakhapatnam

2023-04-21 10:54:48

ఆజాద్ ఎంట్రీ ఇక అప్పన్న ఆలయంలో ఆ.. ఆటలు సాగవు

ఆయనపేరు చంద్రశేఖర్ ఆజాద్.. దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఈన కున్న లెక్కతోనే..ఎక్కడైనా తిక్కపనులు చేసే సమయంలో ప్రభుత్వం ఆయనను అక్కడ నియమిస్తుంది. ఇపుడు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలోనూ ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఒక్కముక్కలో చెప్పలంటే మా ఆటలకు అడ్డులేదని రొమ్మువిరు చుకు నే ఎలాంటి వారికైనా ఈయన స్టైల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వడం అలవాటు. ఈ అధికారి ట్రాక్ రికార్డ్ ను గుర్తించే దేవాదాయశాఖ ప్రత్యేకం గా ఈయనను కీలకమైన దేవస్థానాలకు ఈఓగా నియమిస్తుంది. ఇపుడు  23న జరగబోతున్న స్వామి వారి చందనోత్సవం ప్రత్యేక అధికారి రీజ నల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించింది. ఈయన పనిచేసేచోట నిబంధనలు మాత్రమే పనిచేయాలి.. సొంత నిర్ణ యాలు తీసుకుంటే మాత్రం ఒంటికాలిపై లేస్తారు..ఆ తరువాత మాటలుండవు.. మాట్లాడుకోవడాలుండవు.. అన్నీ కఠిన చర్యల ఫలితాలే..!

Visakhapatnam

2023-04-21 04:21:50

VJFలెక్కల్లో బొక్కలు బయటకొస్తే కోశాధికారికి చుక్కలే

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో గత 11ఏళ్లుగా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్న కాలంచెల్లిన కార్యవర్గం చేసిన ఖర్చులకు కోశాధికారి లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుంది. ఏమాత్రం ఖర్చులు పెట్టిన లెక్కలకు బొక్కలు ఉంటే కోశాధికారికి చుక్కలు కన పడటం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం కాలంచెల్లిపోయినా..పరిపాలన చేశారు కనుక 11ఏళ్లకు ఆడిట్ రిపోర్టులు, ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్, ఆసమయంలో వచ్చిన విరాళాలు, 12ఏ, 80జి క్రింద ఇచ్చిన మినహాయింపులు, 11ఏళ్ల ఫర్మ్ రెవెన్యువల్స్, సర్వసభ్య సమావేశం మి నిట్స్(ఒకవేళ పెట్టిఉంటే) ఓచర్లు, బ్యాలెన్స్ షీట్లు, ఇలా లెక్కలన్నీ కోశాధికారి జిల్లా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు ఉంచా ల్సిందే. అనధికార కార్యవర్గం పలుకుబడిని వినియోగించి 11ఏళ్లకు ఒకేసారి ఆడిట్ రిపోర్టులను తీసుకు రాగలిగినా.. ప్రతీఏటా వేయాల్సిన ఆ న్ లైన్ ఐటీ రిటర్న్స్ మాత్రం ఒకేసారి చేయడం పైనున్న దేవుడి తరం కూడాకాదు. సో బొక్కలు బయటపడటం ఫిక్స్..!

Visakhapatnam

2023-04-21 00:37:26

సింహాచలం అప్పన్న ఆలయంలో శీను సితారైంది

సింహాచలం శ్రీ వారహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ట్రస్టుబోర్డు సభ్యులకు శీను సితారైంది. తాము అడిగిన 100 పాసులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వం యంత్రాంగం అంగీకరించకపోవడంతో.. ప్రత్యేక తీర్మానం చేసి వివాదాల్లోకి ఎక్కారు ట్రస్టుబోర్డు సభ్యులు. ఆల య చైర్మన్, పీఠాధిపతులకు తప్పా..దేవాదాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు మరెవరికీ చందనోత్సవం రోజున అంతరాలయం ప్రవేశం ఉండకూడదంటూ తీర్మాణం చేసి మరీ మీడియాకి ఎక్కారు. అదే సమయంలో ట్రస్టుబోర్డు సభ్యులకు రెండేసి చొప్పు న పాసులు కేటాయిస్తామని చెప్పడంతో మండిపడిన సభ్యులంతా ఏకవాక్య తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వానికి పంపారు. ఉత్సవం మొత్తం జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున కనుసన్ననలలోనే జరపడానికి నిర్ణయించడంతో ట్రస్టుబోర్డు సభ్యులకు గాయిపోయినట్టు అయ్యింది. ట్రస్టుబోర్డు సభ్యులకు విఐపీ పాసులు అడిగినన్ని ఇవ్వనందునే ఇలా చేస్తున్నారని పార్టీ సిరియస్ అవుతోంది.


Visakhapatnam

2023-04-20 12:29:51

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ప్రెస్ క్లబ్ కూడా మరో విజయనగరం ప్రెస్ క్లబ్ కానుందా..? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దానికి కారణం 2012 కార్యవర్గమే కోర్టు కేసుల నెపంతో అప్రజాస్వామికంగా నేటి వరకూ అనధికారికంగా ఉండిపోవడం, ఈ మధ్యకాలంలో ఒక్క సారి కూడా సర్వసభ్య సమావేశం పెట్టకపోవడం, కనీసం కోర్టుకేసుల విషయం కూడా సభ్యులకు అధికారికంగా తెలియజేయకపోవడం, ఈ చ ట్టవ్యతిరేక విధానాలపై జిల్లాకలెక్టర్ డా.మల్లిఖార్జున ముగ్గురు అధికారుల బృందం కమిటీ వేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. విజయనగరం జిల్లా ప్రెస్ క్లబ్ లోనూ ఇదే తరహా వ్యవహారం, అవినీతి జరగడంతో అక్కడి జిల్లా కలెక్టర్ ప్రెస్ క్లబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేరుగా కలెక్టర్ సభ్యత్వాలు ఇచ్చారు. విశేషం ఏంటంటే ప్రస్తుతం కాలం చెల్లిన విజెఎఫ్ కార్యవర్గం కూడా అనధికారికంగా స భ్యులకు సభ్యత్వాలు 3రోజుల పాటు చేసిన రెవిన్యువల్స్ పైనా కలెక్టర్ విచారణచేపట్టే అవకాశాలున్నాయి.

Visakhapatnam

2023-04-20 00:58:44

ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మే నెల 3 వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయను న్నారని, అందుకు అవసర మగు ఏర్పాట్లను వెంటనే  చేపట్టాలని  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదే శించారు.  జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం మంత్రి బొత్స పరిశ్రమలు, మౌలిక వసతుల  ప్రత్యెక  ప్రధాన కార్యదర్శి  కరికాల వలెవన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు , ఎం. పి బెల్లాన చంద్ర శేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి దీపికా పాటిల్ తో కలసి ఏర్పాట్ల పై సమీక్షించారు.  ఎయిర్పోర్ట్ తో పాటు  చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టి కు కూడా శంకు స్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని  అందుకు అనువైన  వేదికను  రెండు రోజుల్లో గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు,  శాసన సభ్యులకు సూచించారు. శంకు స్థాపనకు అవసరమగు శిలాఫలకం ఏర్పాటుకు,  వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లను గావించాలన్నారు.  

వి.ఐ.పి ల వాహనాలకు , అధికారులకు, సాధారణ ప్రజలకు బహిరంగ సమావేశానికి వేర్వేరు రూట్లు ఉండే స్థలాన్ని గుర్తించాలన్నారు. వాహనాలకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ లో ఉండేలా చూడాలని, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ ఎస్.పి కు సూచించారు.  శంకు స్థాపన జరిగే నాటికి ఆర్ అండ్ ఆర్ లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని జే.సి. మయూర్ అశోక్ కు సూచించారు.   అందరికీ గృహాలు, అన్ని సౌకర్యాలతో ఉండేలా చూడాలని ఆర్.డి.ఓ సూర్య కళ కు ఆదేశించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మీడియా తో మాట్లాడుతూ జూన్ నెల లో సాలూరు లో  గిరిజన విశ్వ విద్యాలయానికి కూడా శంకుస్థాపన చేయడం జరుగు తుందని తెలిపారు. ఈ సమావేశం లో జి.ఎం.ఆర్ ప్రతినిధులు , ఆర్ అండ్ బి ఎస్.ఈ విజయ శ్రీ , పంచాయతి రాజ్ ఎస్.ఈ గుప్తా, ఈ ఈ లు ,  భోగాపురం తహసిల్దార్ శ్రీనివాస  రావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-19 14:57:17

జగనన్నకు చెబుదాంపై అవగాహన కల్పించండి

సీఎం ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం  అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జగనన్నకు చెబు దాం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా..జాయింట్ కలెక్టరు ఎస్ .ఇలక్కియా ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమా నికి శాఖల వారీగా వస్తున్న అర్జీలు వివరాలు, వాటి పరిష్కారాని అనుసరిస్తున్న విధానం, ప్రజల సంతృప్తి స్థాయి, జిల్లాస్థాయి అధికారులు తీసుకో వాల్సిన చర్యలపైనా అవగాహనపైనా ఆమె దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్. వి.వి.సత్యనారాయణ, సీపీవో పీ.త్రీనాథ్, బిసీ కార్పొరేషన్ ఈడి ఎస్.వి.ఎస్‌.సుబ్బలక్ష్మి, అగ్రీ జెడి ఎన్ విజయ్ కుమార్, డీపీవో ఆర్ విక్టర్, హౌ సింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డీఎం సివిల్ సప్లయ్ డీ.పుష్పమణి  తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2023-04-19 14:47:41

సీఎం వైఎస్ జగన్ కు ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో  జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం బుధవారం మ ధ్యాహ్నం 2.20గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి,  పార్లమెంట్ సభ్యులు బి.సత్యవతి, జి.మాధవి, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర , విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ డా . ఎ . మల్లికార్జున ,  పోలీస్ కమిషనర్ డా. సి.యం త్రివిక్రమ్ వర్మ , జీవీఎంసీ కమీషనర్ సి.యం సాయికాంత్ వర్మ , ఎపిఈపిడిసియల్ సియండి ఐ. పృధ్వి తేజ్ , శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  తదితరులు ముఖ్యమంత్రి కి ఘనంగా వీడ్కో లు పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో 2.30ని.లకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. 

Visakhapatnam

2023-04-19 14:35:25

సింహాద్రి అప్పన్న సేవలో దేవాదాయ శాఖ కమిషనర్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ హోదాలో ఎస్.సత్యనారాయణ తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు పూర్ణ కుంభంతె స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.  ముందుగా కమిషనర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా ప్రదక్షిణం చేశారు. స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము చేసి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ ఈఓ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం 23న జరగబోయే చందనోత్స ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. సామాన్య భక్తునికి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓ,  ఇంజనీరింగ్ సిబ్బందికి సూచిం చారు. వీరితో డిప్యూటీ కమిషనర్ సుజాత స్టేట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రామరాజు ఆలయ సహాయ కార్యాలయం అధికారి వై శ్రీని వాసరావు పర్యవేక్షకులు తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు.

Visakhapatnam

2023-04-19 11:45:33

MVR పై ఆ.. చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడానికి కారణమిదే

అనకాపల్లిలోని ప్రముఖ వ్యాపారవేత్త, యువతకు రోల్ మోడల్.. సేవాబానికి నిలెవెత్తు చిరునామా అయిన ముత్యాల వెంకటేశ్వర్రావు (ఎంవీఆ ర్)పై ఒకవర్గం కావాలనే బురదచల్లే అసత్య ప్రచారాలకు తెరలేపింది.. అడిగింత మొత్తం ఇవ్వకపోతే అభివృద్ది విషయంలో ఆయన చేసిన ప్రకటనలను వ్యంగ్యంగా చిత్రీకరించే చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాస్తవానికి ఎంవీఆర్ కి ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఆయనను పొలిటికల్ గా ప్రమోట్ చేసేందుకు, దానికి అయ్యే ఖర్చును అడ్డంగా లాగేందుకు కొన్ని పత్రికలు, మీడియా పనిగట్టుకొని తేడా ప్రచారాలకు దిగుతున్నాయి.  తొలుత సామాజిక సేవగా బావించి చాలా చిన్న చిన్న పత్రికలు, ఛానళ్లకు చేయూత అందించిన ఆయన వాస్తవాలు తెలుసుకొని నిజంగా పనిచేసే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దానితో తేడా మీడియాకు అది మింగుడు పడలేదు. వెంటనే గతంలో ఈయన చేసిన ప్రచారాలను తప్పుడుగా చిత్రీకరించే వంటా, వార్పులు మొదలెట్టారు.

Anakapalle

2023-04-19 08:55:10

కాలంచెల్లిన విజెఎఫ్ పాలకవర్గాన్ని తక్షణమే రద్దుచేయండి

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో 12ఏళ్లుగా సొసైటీ/ట్రస్టుల నిబంధనలు పాటించకుండా, కాలంచెల్లిపోయినా అధికార దాహంతో అనధికారికంగా పరిపాలిస్తున్న కార్య వర్గాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చాంబర్ లో ప్రత్యేకంగా ఈ ఫిర్యాదును అందజేశారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈశ్వర్, శ్రీనివాస్, జార్జి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, వాస్తవా లను ప్రజలకు ప్రసార మాద్యమాల ద్వారా తెలియజేసేది జర్నలిస్టులేనని అలాంటి జర్నలిస్టులే సెక్షన్ 23 ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు 2001ను తుంగలోకి తొ క్కి మరీ విజెఎఫ్ లో పాలకవర్గంగా కొనసాగుతున్నారని అన్నారు. జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఒక్కఏడాది గడిచినా ఆ పాలకవర్గం ప్రభుత్వ నిబంధనల ప్ర కారం రద్దయినట్టేనని దానికి సంబంధించిన జీఓను కలెక్టర్ కు అందజేశారు. 

Visakhapatnam

2023-04-17 17:04:46

జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

విశాఖలోని విజ్ఞాన కేంద్రంలో జరిగే జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సీనియర్ జర్నలిస్టులు ఎన్ఎన్ఆర్, వర్మ, ఎల్జీనాయుడు, సూర్యనారా యణ, రామక్రిష్ణ, రవికాంత్, బంటయ్య, ఎంఎస్, వెంకట్, ఈఎన్ఎస్ బాలు, తదితరులు విజెఎఫ్ సభ్యులను కోరారు. మంగళవారం ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమంలో విజెఎఫ్ పూర్వ కార్యవర్గాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్ చేపడుతున్న వ్యతిరేక విధానాలపై జర్నలిస్టులు త మ విలువైన సూచనలు, సలహాలు చేస్తారని, ఒక కార్యాచరణ రూపొందించనున్నారని పేర్కొన్నారు. ఈ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం విజెఎఫ్ కి వ్యతిరేకం కాదని, కే వలం అందులోని పాలకవర్గం 12ఏళ్లుగాఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వ నిబంధనలను సైతం తుంగలోకి తొక్క పాలిస్తున్న విధానాలపై చర్చించ డానికేనని స్పష్టం చేశారు. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Visakhapatnam

2023-04-17 16:49:01

అప్రజాస్వామిక విజెఎఫ్ పాలకవర్గంపై కలెక్టర్ కి ఫిర్యాదు

ఒకటి కాదు 2కాదు ఏకంగా 12ఏళ్లు తగదునమ్మా అంటూ కోర్టు కేసుల నెపంతో విజెఎఫ్ ను ఏలినక పాలక వర్గం అప్రజాస్వామికంగా(Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)ను తుంగలోకి తొక్కిన వైనం పై సీనియర్ జర్నలిస్టు బంటయ్య ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో జర్నలి స్టులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకేసులు ఉన్నాయని గానీ, నిధుల ఖర్చుపై గానీ ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా వారి పదవీకాలం అయిపోయినప్పటికీ విజెఎఫ్ ను వీడకుండా కనీసం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా విజెఎఫ్ పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో విజెఎ ఫ్ పై విచారణ చేయాలంటూ జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున జిల్లా రిజిస్ట్రార్ మూర్తిని ఆదేశించారు. అసలు విజెఎఫ్ ఏనిబంధనను ఉల్లంఘించిందనే విషయమై లిఖితపూర్వ కంగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 

Visakhapatnam

2023-04-17 16:30:30

ఘనంగా ఐఎస్‌టీడీ వ్యవస్థాపక దినోత్సవం

ఐఎస్‌టీడీ  విశాఖపట్నం చాప్టర్‌ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో సీఎండీ అతుల్‌ భట్‌ సమక్షంలో ఈ కార్య క్రమాన్ని చేపట్టారు.  శిక్షణ సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడంలో కృషి చేసినందుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌  కె.శ్రీనివాస రావును ఘనంగా సత్కరించారు.  అలాగే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో  ఆ సంస్థ డైరెక్టర్‌ డి.సత్యనారాయణ, ఇతర సభ్యులతో కలిసి వ్యవస్థాపక దినోత్సవాన్ని చేపట్టారు. ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫర్‌ డ్రోన్‌ టెక్నాలజీ, ఆంధ్రా యూనివర్శిటీ, సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలోనూ ఈ దినోత్సవాన్ని జరిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో విశాఖపట్నం చాప్టర్‌ సభ్యులంతా వ్యవస్థాపక దినోత్సవాన్ని మరింత వేడుకగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఊఎస్‌ఈఐ ఫార్మాస్యూటికల్స్‌ ఐటీ హెడ్‌ జోసెఫ్‌ కిరణ్‌ కుమార్‌ ముఖ్య వక్తగా హాజరయ్యారు. గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రిన్సి పాల్‌  కె.వి.రమణ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విభాగాధిపతి మధు కుమార్‌లను తమ తమ సంస్థల్లో ఐఎస్‌టీడీ విద్యార్థి చాప్టర్‌లను ప్రారం భించినందుకు ఈ సందర్భంగా సత్కరించారు. 

విశాఖపట్నం చాప్టర్‌ నుండి ఈ-జర్నల్‌ ప్రగ్యా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థలోని పలువురు సభ్యులు మాట్లాడుతూ విశాఖపట్నం చాప్టర్‌లో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల నుండి 600 మందికి పైగా సభ్యులు ఐఎస్‌టీడీలో ఉన్నారన్నారు. హెచ్‌ఆర్‌ రంగంలోని ప్రముఖు ల భాగస్వామ్యం ఉందన్నారు. భారత కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ఈ జాతీయ స్థాయి ప్రొఫెషనల్‌ బాడీ డిప్లొమా కోర్సులను నిర్వ హించడం, హెచ్‌ఆర్‌ సోదరభావం కోసం ఈవెంట్‌లు, కార్యకలాపాలను నిర్వహించడంలో విజయవంతమవుతోందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఐఎస్‌టీడీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.సాంబశివరావు, చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఓఆర్‌ఎం రావు, గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి, ఇతర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, విద్యార్థి విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-11 13:12:32

17న విజయనగరం జిల్లాలో మత్స్యకారుల గుర్తింపు

విజయనగరం జిల్లాలోని చేపల వేట నిషేధం విధించే సమయంలో మత్స్యకార భరోసా అందించేందుకు  ఏప్రిల్ 17న ఒక్కరోజే అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో  లబ్దిదారులను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్టు జిల్లా మత్స్యశాఖ  ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలి యజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వేట నిషేధభృతి పధకం క్రింద వివరాలు నమోదు చేసే సిబ్బందికి మత్స్యకారులు సంఘం సభ్యులు తమ పూర్తివివరాలు తెలియజేయాలని ఆమె సూచించారు. లబ్దిదారులు ముఖ్యంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ (ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో లింక్ ఉన్నది), బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, వాలిడ్ ఫిషింగ్ లైసెన్స్ తప్ప నిసరి తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని అందించి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ఆ దేశాలు జారీచేసినట్టు ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మీడియాకి వివరించారు.

Vizianagaram

2023-04-11 13:03:04