1 ENS Live Breaking News

ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి

ఎస్వీ  ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో  సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను  ఆదేశిం చారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో శల్య తంత్ర విభాగము, ద్రవ్య గుణ, రసశాస్త్ర సిద్ధాంత, పంచగవ్య చికిత్స పరిశోధనా కేంద్రం, చిన్నపిల్లల వార్డ్, లిచ్ థెరఫీ గది, కాయ చికిత్స వార్డు, పంచకర్మ వార్డు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, డ్రెస్సింగ్ రూమ్, క్లీనికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రక్త పరీక్ష కేంద్రం, ఎక్సరే విభాగాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ వివిధ విభాగాలలో అవసరమైన ఫర్నీచర్ ,ఫ్లోరింగ్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపిడి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, పారిశుధ్యానికి  పెద్దపీట వేయాలని సూచించారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.  తరువాత ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదులు, మ్యూజియం, గ్రంథాలయం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విద్యార్ధినుల హాస్టల్ భవనంలోని గదులను, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్ధినులకు అందిస్తున్న వసతి, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

Tirupati

2023-03-20 15:20:51

4మున్సిపాలిటీలలో గుప్పెడు బియ్యం కార్యక్రమం

గుప్పెడు సహాయం కొండంత అండ అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లాలో పలాస, ఇచ్చాపురం, ఆముదాలవలస, శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో గుప్పెడు బియ్యం కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయిం ట్ కలెక్టర్ ఎం నవీన్ ప్రారంభించారు. జిల్లాలో మెప్మా  పట్టణ స్వయం సహాయక సంఘం సభ్యులు ప్రతి నేల గుప్పెడు బియ్యం పోగు చేసి  జిల్లాలో ఉన్న పేదలకు, అనాధ శరణాలయాలకు ,నిరాశ్రయ గృహాలకు అందజేయాలనే సంకల్పన్ని కలెక్టర్  అభినందించారు, ఈ కార్యక్రమం జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో ఉగాది నుండి ప్రారంభం కావడం చాలా సంతషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో డిఆర్వో రాజేశ్వరీ, ఉప కలెక్టర్ జయదేవి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, డి.ఆర్.డి.ఎ, పి. డి విద్యాసాగర్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్యం అధికారి బి. మీనాక్షి, డి.ఎస్.ఓ వెంకటరమణ, డి.పి.ఓ రవికుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2023-03-20 10:00:14

అంగన్‌వాడీలపై పోలీసుల గ్రుహ నిర్భంధం ఆపాలి

అంగన్‌ వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలని 13 రకాల డిమాండ్లు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రా ట్యూటీ ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి. కుమార్‌, పి.మణి డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అం గన్‌వాడీల ఉద్యమంపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించడాన్ని ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండిరచాలనాన్నరు. పోలీసులు అక్రమ అరెస్టులను ఖం డిస్తూ సిఐటియు విశాఖజిల్లా కమటీ ఆద్వర్యంలో జగదాంబ సిఐటియు ఆఫీస్‌ నుండి వాచ్‌హౌస్‌ వరకు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ, ఫేస్‌ యాప్‌ రద్దు చెయ్యాలని, అంగన్‌వాడీలు మార్చి 20 చలో విజయవాడ కార్యక్రమా న్ని పిలపు ఇస్తే వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి, పోలీసులు నిర్భదించడం పిరికిపంద చర్య అని ఆరోపించారు. తెలంగాణా కన్నా అదనం గా  రూ.1000/-లు వేతనాలు పెంచుతామని సీఎం హామి ఇచ్చినా అది నీటి మీద వ్రాతగా మిగిలిందన్నారు.

Visakhapatnam

2023-03-20 09:24:30

దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకురావాలన్నారు. మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు.  ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని ఈవో వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈవో తెలుసుకున్నారు.

 వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు శ్రీ ధర్మారెడ్డి కి వివరించారు. ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా  తెలుగులో తర్జుమా చేయాలని ఈవో అధికారులకు సూచించారు. ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో  తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.  ఈ పుస్తకాల ఆధారంగా పి హెచ్ డి చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించి పిహెచ్ డి లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఇంకా ఎక్కడ మాను స్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిని సేకరించి స్కాన్ చేసి భద్రపరచ గలిగితే పరిశోధకులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

 ప్రస్తుతం ఉన్న గ్రంధాలను అంశాల వారీగా వర్గీకరించి వాటికి ప్రత్యేకంగా నంబర్లు వేసి భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
      జేఈవో సదా భార్గవి, విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు డిప్యూటీ ఈవో  విజయలక్ష్మి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం సమీక్షలో పాల్గొన్నారు.

Tirupati

2023-03-20 08:59:41

కోదండ రాములోరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.  ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, తోమాల సేవ, సహస్రనా మార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వేదప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7.15 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం ఘనంగా జరిగింది. రాత్రి 7.15 నుండి మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగామార్చి 20 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మార్చి 20న ధ్వజారోహణం :

        సోమవారం ఉదయం 8.45 నుండి 9.32 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 8.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Tirupati

2023-03-19 14:04:53

విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగంచేసుకోవాలి

బాపట్ల జిల్లాలో జగనన్న విద్యా దీవెన పధకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి జె.రాజ్ దిబోరా పిలుపు నిచ్చారు. ఆదివారం బాపట్ల కలెక్టరేట్ లో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం క్రింద విద్యార్థులు తల్లులకు మెగా చెక్కు ను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని అమలు చేస్తుంన్నదన్నారు.  కుటుంబంలో ఏoత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.బాపట్ల జిల్లాలో ఎస్.సి, ఎస్.టి.,బి.సి,ముస్లిం, క్రిస్టియన్ ,సంబంధించి న 31వేల46మందికి 26.25 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాలకు జమచేయడం జరుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దస్తగిరి, జిల్లాలో సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.   

Bapatla

2023-03-19 13:24:01

జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు

సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు విశాఖజిల్లా యూనిట్లు సంయుక్తంగా ఆదివారం ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీహాలులో  శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా  ప్రముఖ పండితులు కిరణ్ కృష్ణ పంచాంగ శ్రవణం నిర్వహించారు. సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయి.  అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, ఎ. సాంబశివరావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు జి. శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు ఎన్. రామకృష్ణ, కె. మురళీకృష్ణ, రంగాధామం,బొప్పన రమేష్,కోశాధికారి బి. సీతారామ మూర్తి,సం యుక్త కార్యదర్సులు పి. కామన్న, ఇజ్రాయిల్, రమణమ్మ,ఎం.వి.రాజశేఖర్ పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-19 13:02:37

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయండి

శ్రీవారి సేవకులు ఎప్పటిలాగే ఈ సారి కూడా  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు,కళ్యాణోత్సవంలో భక్తులకు చక్కని సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఒంటిమిట్టలో శ్రీవారి సేవకు లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 5వ తేదీ స్వామివారి కల్యాణం రోజున సాయంత్రం 4 గంటల నుండే భక్తులు గ్యాలరీల్లోకి వస్తారని అన్నారు .భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం,అక్షింతలు,పసుపు,కుంకుమ , వాటర్ పాకెట్లు ఉంచిన బ్యాగు అందిస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులు గ్యాలరీల్లో ఉండి భక్తులందరికీ ఈ బ్యాగులు అందించాలని చెప్పారు. భక్తులతో  మర్యాద పూర్వకంగా, ఓపికతో వ్యవహరించాలన్నారు.

 శ్రీవారి సేవకులు ఎక్కడ సేవ చేయాలో  నిర్ణయించి అందుకు సంబంధించిన పాసులు ముందే ఇస్తామని జేఈవో చెప్పారు. సేవకోసం వచ్చే వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. టీటీడీలో శ్రీవారి సేవ విభాగానికి ఎంతో గౌరవం గుర్తింపు ఉన్నాయన్నా రు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అద్భుత సేవలందించి  ఈ పేరు నిలుపుకోవాలని వీరబ్రహ్మం కోరారు.  ఎస్వీబీసి సిఈఓ షణ్ముఖ్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, పిఆర్వో డాక్టర్ రవి, జిఎం ట్రాన్స్ పోర్ట్ శేషారెడ్డి ,శ్వేత డైరెక్టర్  ప్రశాంతి, విజివో మనోహర్ పాల్గొన్నారు.

Tirumala

2023-03-19 11:15:59

22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Tirupati

2023-03-19 11:12:19

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయండి

శ్రీవారి సేవకులు ఎప్పటిలాగే ఈ సారి కూడా  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు,కళ్యాణోత్సవంలో భక్తులకు చక్కని సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఒంటిమిట్టలో శ్రీవారి సేవకు లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 5వ తేదీ స్వామివారి కల్యాణం రోజున సాయంత్రం 4 గంటల నుండే భక్తులు గ్యాలరీల్లోకి వస్తారని అన్నారు .భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం,అక్షింతలు,పసుపు,కుంకుమ , వాటర్ పాకెట్లు ఉంచిన బ్యాగు అందిస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులు గ్యాలరీల్లో ఉండి భక్తులందరికీ ఈ బ్యాగులు అందించాలని, భక్తులతో  మర్యాద పూర్వకంగా, ఓపికతో వ్యవహరించాలన్నారు. శ్రీవారి సేవకులు ఎక్కడ సేవ చేయాలో  నిర్ణయించి అందుకు సంబంధించిన పాసులు ముందే ఇస్తామని జేఈవో చెప్పారు. సేవకోసం వచ్చే వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. టీటీడీలో శ్రీవారి సేవ విభాగానికి ఎంతో గౌరవం గుర్తింపు ఉన్నాయన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అద్భుత సేవలందించి  ఈ పేరు నిలుపుకోవాలని  కోరారు. ఎస్వీబీసి సిఈఓ  షణ్ముఖ్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, పిఆర్వో డాక్టర్ రవి, జిఎం ట్రాన్స్ పోర్ట్  శేషారెడ్డి ,శ్వేత డైరెక్టర్  ప్రశాంతి, విజివో  మనోహర్ పాల్గొన్నారు.

Tirupati

2023-03-19 09:53:26

సమాజానికి దిక్సూచి పాత్రికేయులు

సమాజానికి దిక్సూచిగా ఉన్న పాత్రికేయుల సంక్షేమానికి తమ సంస్థ అండగా నిలుస్తుందని వర్తమాన సినీ నటుడు కంచర్ల ఉపేంద్ర హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సహకారంతో తామ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అల్లూరి విద్యాన కేంద్రంలో శనివారం నిర్వహించిన శోవకృత్ నామ ఉగాది సంబరాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అవసరమైన వారికి తమ సంస్థ సహకార అందిస్తున్నామని ఆయన చెప్పారు  తమ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు  సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థకు అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిర్దిష్టమైన లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన తమ సంస్థ ఎన్నో విజయాలు నమోదు చేస్తుందని తెలిపారు  జర్నలిస్టుల సంక్షేమ సంక్షేమం సహా వృత్తి పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా ఒక భవన నిర్మానించే అంశం పరిశీలనలో ఉందన్నారు. 

ఈ ఏడాది విభిన్న కార్యక్రమాలతో జర్నలిస్టులకు భరోసాగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. వృత్తిపరమైన అంశాలపై జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఉపకార్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంచర్ల అచ్యుతరావు, వారి తనయుడు ఉపేంద్ర కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ పిఏఆర్ పాత్రుడు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అప్పారావు ప్రసంగించారు  సీనియర్ న్యూస్ రీడర్ ఎండి ధర్మజ్యోతి వ్యాఖ్యాతిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో  చిన్నారి దివ్య నృత్యం, సీనియర్ సింగర్ ఎస్ జగదాంబ ఆలపించిన గీతాలు అలరించాయి. నగర పరిధిలోని వివిధ జోన్ లకు చెందిన పాత్రికేయులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ వేదికపై  ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ రూపొందిస్తున్న వర్ధమాన హీరో ఉపేంద్ర నటించిన అనగనగా కథలో పోస్టర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు దుస్తులు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ,అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-18 14:07:06

ఉత్తరాంధ్రలో టిడిపి ఎమ్మెల్సీ గెలుపు ఆధిక్యం 34,673

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్ వార్ వన్ సైడ్ అయినట్టుగా చేశారు. అధికారపార్టీ అభ్యర్ధి సీతంరాజు సుధాక ర్ పై టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవి రావు ఏకంగా 34,673 ఓట్లతో గెలుపొందారు. పోలైన ఓట్లను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో చదువుకు న్నవా రంతా అధికార పార్టీని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వానికి కూడా తెలిసేలా చేశారు. ఈ ఎన్నికలో రాష్ట్రప్రభుత్వానికి ఒక్క ఎమ్మె ల్సీ సీటు మాత్రమే పోయినా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు ప్రదర్శిం చడానికి వీలు పడింది. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా చాలామందికి ఓట్లు రాలేదు.  ఆది నుంచి ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనా లు అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పినట్టుగానే ఫలితాలు రావడంతో ఈఎన్ఎస్ కథనాల పట్ల పాఠకులు, ప్రజల్లో నమ్మకం పెరిగింది. 

Visakhapatnam

2023-03-18 02:11:35

ఉత్తరాంధ్రలో పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాంధ్రాలోని పట్టభద్రులు సరైన రీతిలో వ్యతిరేక ఓటుతో బుద్ధిచెప్పారని జనసేన పార్టీ అనకాపల్లి సమన్వయకర్త పరుచూరి భాస్కరరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అధికారపార్టీ అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందన్నారు.  ప్రజావ్యతిరేక విధానాలతో మొండిగా వ్యవహరించే ప్రభుత్వాలకు ప్రజలు ఓటు తో ఇలాంటి గుణపాఠాలే చెబుతారన్నారు. రాష్ట్రబడ్జెట్ లో ఐటిశాఖకు కేవలం రూ.215 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం పార్టీ సొంత కార్యక్రమాలకే అత్యధికం గా కేటాయించినా ప్రశ్నించే దైర్యంలేని మంత్రి అమర్నాధ్ అభివ్రుద్ధి కోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. జనరంజక బడ్జెట్ అని గొప్పలకు పోయే వైఎస్సార్సీపీ ఇది పూర్తిగా వైఎస్సార్సీపీ బడ్జెట్ అని తెలుసుకునే లోపే ప్రజలు పెద్ద ఎత్తున బుద్దిచెప్పారని ఆరోపించారు.

Anakapalle

2023-03-17 16:22:26

రాజాం శ్రీవారి ఆలయం టీటీడీలో విలీనం

విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన  శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవా రం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు  శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలన్నీ నిర్వహిస్తారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివద్ధి చేయనున్నారు.  ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి  మీడియాతో మాట్లాడారు. శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన 
ఈ ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్‌ వరలక్ష్మి పౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని 
 శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు కోరారని ఈవో తెలిపారు. టీటీడీ పాలకమండలి ఇందుకు ఆమోదించడంతో ఆలయాన్ని  విలీనం చేసుకున్నామని అన్నారు.  

పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత  అభివద్ది పరిచేందుకు జీఎంఆర్‌తోపాటు రాజాం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 ఆలయాలు ఉన్నాయని ఈవో తెలిపారు.  విశాఖపట్నం డిప్యూటీ ఈవో  పరిధిలోకి రాజాం ఆలయం వస్తుందని చెప్పారు.  తిరుమల కు నడక దారిలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా సమయంలో మూడు నెలలకు ఒకసారి ఆన్‌లైన్‌లో  దర్శనం టికెట్లు విడుదల చేసేవారమని చెప్పారు. ఇప్పుడు కరోనా ఇబ్బందులు లేనందువల్ల గతంలో లాగానే నెలకోసారి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.  టీటీడీ కల్యాణమండపాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందించిన ఆయన స్పందిస్తూ, కొన్నిచోట్ల కల్యాణమండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయనీ, మరి కొన్నింటికి ఆదరణ లేదని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అలాంటి కల్యాణ మండపాల నిర్వహణ మాత్రమే  కాంట్రాక్ట్‌ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామన్నారు. 

 ఇదీ ఆలయ చరిత్ర..
రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డులో 3.5 ఎకరాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్‌ స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 2015లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి ట్రస్టు ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి నీలాచలం, గ్రంధి భాస్కరరావు, కొల్లూరు వెంకట నాగేశ్వరరావు, జీఎంఆర్  కుటుంబసభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-17 13:30:06

శ్రీకాకుళంలో 19నుంచి చేనేత వస్త్ర ప్రదర్శన

 చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఈ నెల 19నుంచి వారం రోజులు పాటు శ్రీకాకుళం టౌన్ హాల్ లో చేనేత వస్త్ర ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేస్తున్నట్టు  జిల్లా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ అధికారి ఐ. ధర్మారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రం ఉత్పత్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. చేనేత నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చేనేత నేత సహకార సంఘాల చేనేత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. నగర వాసులు, జిల్లా వాసులు అందరు ఈ ఎగ్జిబిషన్ సందర్శించి చేనేత కార్మికులను ప్రోత్సాహించాలని ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Srikakulam

2023-03-17 08:33:03