1 ENS Live Breaking News

రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు ఉద్యమించాలి: ఆడారి కిషోర్ కుమార్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 25 ఏళ్ల క్రితమే తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు చంద్ర బాబు నాయుడని, కేవలం రూ 125. కోట్ల కోసం కక్కుర్తి పడి వ్యక్తి కాదని 
తెలుగుదేశం యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. డెమెక్రసీ ఇన్ డేంజర్ పేరుతో డిల్లీ నుంచి ప్రజా చైతన్యం మొదలు పెట్టిన ఆయన ఆదివారం అనకాపల్లి జిల్లా యలమంచిలిలోనూ ప్రజా చైతన్య కార్యక్రామాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగిన ఐటి రంగం వైపు తొంగి చూసిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి రూ.125 కోట్లు ఆలోచిస్తారా, ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇలాంటి తేడా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. టిడిపి అధినేత వెంట రాష్ట్రం మొత్తం ఉందనే విషయం వైఎస్సార్సీపి ప్రభుత్వానికి త్వరలోనే తెలుస్తుందని అన్నారు.

యలమంచిలి జనసేన నియోజవకర్గ నాయకులు సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఒక విజన్ ఉన్న వ్యక్తిని, వయసులో పెద్దవారిని, మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. వైఎస్సార్సీపీ కక్షసాధింపుకి రాష్ట్రప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఎలాంటి ఆధారాలు చూపకుండా 50రోజులు పాటు ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. జైభీమ్ భారత్ పార్టీ నాయకులు కారెం వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ, అరాచక శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాంటి చర్యలే ప్రజలు చూడాల్సి 
వస్తుందన్నారు. అధికారం ఎక్కడ చేజారి పోతుందోనని భయంతో చంద్రబాబుని జైల్లో పెట్టారని ఆరోపించారు. పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ, ఒక కుటుంబాన్ని వేధించడం కోసం ఏకంగా ప్రభుత్వం మొత్తం పనిచేస్తుందని, ఆ శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై చూపిస్తే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. చంద్రబాబుని జైల్లో పెట్టడం వెనుక ఒక ప్రధాన కారణం ఉందని, ఆయన బయట ఉంటే ఎక్కడ ఎన్నికల్లో ఓడిపోతామోననే భయం వీరిని వెంటాడుతోందన్నారు. ఈకార్యక్రమంలో యలమంచిని 
ప్రాంతానికి చెందిన వక్తలు పాల్గొన్నారు.


Yalamanchili

2023-10-29 13:48:29

పిల్లలు స్మోకింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కల్పించాలి

 పిల్లలను అత్యంత ప్రమాదకరమైన స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల కు లోనూ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని తెలుగు దేశం యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం విశాఖలోనీ బీచ్ రోడ్ లో నిర్వహించిన నో స్మోకింగ్ డే అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్, మత్తు పదార్థాలు, బీడీ వంటి ధూమపానం వస్తువులు వాడడం ద్వారా కోట్లాది మంది గుండె, కాలేయం, ఊపిరి తిత్తుల చెడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఆదాయం కోసం ఈ దుర్వ్యసనాలకు అనుమతి ఇచ్చి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి వ్యక్తి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్వచ్ఛ మైన ఉదజని పీల్చడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.  అప్పుడు మాత్రమే కాలుష్యం లేని గాలి దొరుకుతుందన్నారు. స్మోకింగ్ , త్రాగుడు వంటి దుర్మార్గపు లక్షణాల జోలికి వెళ్లకుండా తమ పిల్లలకు  ప్రతి తల్లి, తండ్రి అవగాహన కల్పించాలన్నారు. 
కన్సుమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ అవగాహన శిబిరం లో ఆ సంస్థ అధ్యక్షులు గొర్లె శ్రీనివాసులు నాయుడు, ఎంపి జి వి ఎల్ నరసింహా రావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉదయానికి మద్దతుగా  అతిథులు, ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.

Visakhapatnam

2023-10-22 05:43:40

అర్జీదారుల స‌మ‌స్య‌ ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా కృషి చేయాలి

 అర్జీదారుల స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా, అన్ని శాఖ‌లు చిత్త‌శుద్దితో కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. ఫిర్యాదుదారులు శ‌త‌శాతం సంతృప్తి చెందేవిధంగా వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. మండ‌ల స్థాయి జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మంలో భాగంగా, ఎల్‌కోట మండ‌ల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాల‌యంలో బుధ‌వారం స్పంద‌న నిర్వ‌హించారు. సుమారు 76 మంది త‌మ స‌మ‌స్య‌ల‌పై క‌లెక్ట‌ర్‌కు, జాయింట్ క‌లెక్ట‌ర్‌కు అర్జీలు అంద‌జేశారు. వాటిని ప‌రిశీలించి ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని  హామీ ఇచ్చారు. రెవెన్యూ, పోలీసు, పంచాయితీ, హౌసింగ్ పంచాయితీరాజ్ శాఖ‌ల‌కు సంబంధించి ఎక్కువ‌గా విన‌తులు అందాయి.
 ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, అందిన ప్ర‌తీ అర్జీని స‌మ‌గ్రంగా ప‌రిశీలించి, వారు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. త‌మ శాఖ‌కు సంబంధం లేద‌న్న కార‌ణంతో వ‌చ్చిన విన‌తుల‌ను తిర‌స్క‌రించ‌కుండా, ఇత‌ర శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని వాటిని ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. తోటి ప్ర‌భుత్వ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకొంటే, ఏ స‌మ‌స్య‌నైనా సులువుగా ప‌రిష్క‌రించ‌వచ్చున‌ని సూచించారు. ఇప్ప‌టికే జిల్లా స్థాయిలో జెకెసి  కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌న్న ఉద్దేశంతో మండ‌లాల్లో కూడా స్పంద‌న ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వం ఆశించిన ల‌క్ష్యానికి త‌గ్గ‌ట్టుగా నాణ్య‌త‌తో ప‌రిష్కారం చూపాల‌న్నారు. వ‌చ్చిన విన‌తుల‌పై తాశిల్దార్‌, ఎంపిడిఓ, ఎస్‌హెచ్ఓ త‌దిత‌ర మండ‌ల స్థాయి అధికారులు సంయుక్తంగా చ‌ర్చించి స‌మ‌గ్రంగా ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, ఆర్‌డిఓ ఎంవి సూర్య‌క‌ళ‌, వివిధ శాఖ‌ల‌ జిల్లా అధికారులు, మండ‌ల ప్ర‌త్యేకాధికారి శార‌దాదేవి, ఎంపిడిఓ రూపేష్‌, ఇన్‌ఛార్జి తాశిల్దార్ రాజేశ్వ‌ర్రావు,  ఇత‌ర మండ‌ల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-10-11 11:20:17

వెంగళరాయసాగరం రిజర్వాయర్ లో 2లక్షల చేపపిల్లల విడుదల

మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా రిజర్వాయలలో చేపపిల్లల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాల కులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. బుధవారం విజయనగరం ఫిష్ సీడ్ ఫారం నుంచి 2లక్షల చేపపిల్లలను తీసుకొని వెళ్లి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అన్నమరాజువలసలోని వెంగళరాయసాగరం రిజర్వాయర్ లో విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రిజర్వాయర్ లలో పెంచుతున్న చేపపిల్లలు మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 8 ఎంఎం ఫిష్ పింగర్ లింక్స్ ను విడుదల చేసినట్టు చెప్పారు. లైసెన్స్ సిస్టమ్ ఉన్న ఈ రిజర్వాయర్ లో 412 మంది మత్స్యకారులు ఆధాపడి జీవిస్తున్నారని ఆమె తెలియజేశారు. వారందరికీ ప్రస్తుతం విడుదల చేసిన చేపపిల్లలు అందివస్తాయని అన్నారు.  వైస్ ఎంపిపి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు చిన్నప్పన్న, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, డైరెక్టర్ వెంకటరావు, మన్యం డిఎఫ్ఓ తిరపతయ్య, ఎంపీడీఓ, ఎఫ్డీఓలు శ్రీనివాసు, శ్రీదేవి, గ్రామ సర్పంచ్,  జెడ్పీటీసిలు, ఎంపిటిసిలు, మత్స్యశాఖ సిబ్బంది,  మత్స్య సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-10-11 11:05:21

గిరిజన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరాలి

 గిరిజనులు పండించే పంటలు, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ లో విక్రయాలు జరగాలని పార్వతీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సి.విష్ణుచరణ్ ఆకాంక్షించారు.  గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన కళాకారుల ఉత్పత్తుల మేళా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రోజెక్ట్ అధికారి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు పండించే పంటలు, ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, అయితే దళారులు, మద్యవర్తుల ద్వారా సరైన ధరను పొందలేకపోతున్నారని గుర్తుచేశారు. ఇందుకోసం వన్ ధన్ వికాస్ కేంద్రాలు ( వి.డి.వి.కె ) లను జిల్లాలో ఏర్పాటుచేసి గిరిజన ఉత్పత్తులు మంచి ధరకు విక్రయించేలా చేసినట్లు చెప్పారు. తద్వారా తమ పంటలు, ఉత్పత్తులకు అధిక లాభాలను ఆర్జించి, ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగేందుకు దోహదపడు తున్నట్లు తెలిపారు. జిల్లాలో 54 వరకు విడివికెలు ఉండగా, అందులో 34 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. గిరిజనుల ఉత్పత్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలా సహకరిస్తున్నప్పటికీ కొన్ని విడివికెలు పనిచేయడం లేదని, వీటిపై అవగాహన పెంపొందించుకొని సంపూర్ణంగా వినియోగించు కునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. విడివికెలను ప్రోత్సహించేందుకు ఒక్కో గ్రూపుకు లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, తద్వారా అధిక లాభాలను ఆర్జించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను వెచ్చేంచేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు నచ్చిన పనుల్లో పురోగతి సాధించాలని ఆయన కోరారు. గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కు చేరాలని ఆయన అభిలషించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని ట్రైఫెడ్ అందజేస్తుందని తెలిపారు. గిరిజనులకు అండగా ఐటిడిఏ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ విడివికెలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు.  ఈ కార్యక్రమంలో ట్రై ఫెడ్ ప్రాంతీయ మేనేజర్ ఎస్. శ్రీనివాస్, ఐటిడిఎ ఎపిఓ పి. మురళీధర్,గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ వి. మహేంద్రకుమార్, ఏపిడి వై. సత్యనారాయణ, వివిధ విడివికె సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-10-11 09:49:47

మన్యంలో నిండు గర్భిణిలకు డోలీమోతలే శరణ్యం

తరాలు మారుతున్నా కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి, రహదారి తదితర కనీస మౌలిక సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, కనీసం ఆసుపత్రికి వెళ్లాలంటే వారికి నరకయాతన తప్పడం లేదు. 
పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ పరిధిలోని పంచాయతీ రెంజలమామిడి గ్రామానికి చెందిన బొండా దేవకమ్మ అనే నిండు గర్భిణికి ఆదివారం పురుటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలీమోతతో సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయిమామిడి గ్రామానికి మోసుకొని వచ్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో గోమంగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీమోతలే శరణ్యమవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Pedabayalu

2023-10-08 17:19:40

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి

రాష్ట్రంలో వైఎస్సా్రసీని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని  జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి పరుచూరి భాస్కరరావు అన్నారు. అనకాప ల్లి కోట్నివీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పరుచూరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షస 
పాలన అంతమొందించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. మధ్య నిషేధాన్ని ప్రకటిస్తామని చెప్పిన జగన్ రాష్ట్రంలో ఎరులై పారించారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం,  జనసేన పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లి అనకాపల్లిలో వైఎస్సార్సీపి ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు రాష్ట్రం నుంచి తరిమివేయాలని తెలియజేసే 120 ప్రశ్నలతో కూడిన పాంప్లెట్ ను తెలుగుదేశం జనసేన పార్టీ రంగులతో ముద్రించి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ఈ ప్రచారాన్ని  
వార్డుల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో జనసేన జెండా ఎగురవేయాలని, ప్రతి వార్డులో కమిటీలు తక్షణమే నియమించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయానికి ఉచితంగా  ఇచ్చిన రాజేష్ ను పరుచూరి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అంతకుముందు రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కోట్ని సూరిబాబు, మజ్జిశ్రీనివాసరావు, దుడ్డు నాగేశ్వరరావు, సేనాపతి గణేష్, (బాలు) వీర మహిళ స్వాతి, అడ్వకేట్ కళావతి, రామచంద్రరావు, జనసేన టౌన్ వర్కింగ్ కమిటీ సభ్యులు గంటా గోవింద, శ్రీకాకుళపు జగ్గారావు, శిరసపల్లి ప్రసాద్, టిడిపి నాయకులు కోట్ని రాంబాబు, కోట్ని రామకృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్ బైండింగ్ శ్రీను, తెలుగు మహిళలు కోట్ని ఉమా, భీశెట్టి హేమ, కాయల ప్రసన్నలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-10-08 17:17:00

కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

విశాఖలోని పాతనగరం కురుపాం మార్కెట్ లోని 145ఏళ్ల చరిత్ర గలిగిన కన్యకాపరమేశ్వరి ఆలయంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు వాసవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుచున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు ఆరిశెట్టి దినకర్, గ్రంధి రామకృష్ణారావులు తెలిపారు. ఈమేరకు ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్ ను ప్రతిరోజు రోజుకొక అవతారమూర్తి రూపంలో విశేష అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహిళలచే, కన్యలచే, విద్యార్థులచే వివిధ రకాల సామూహిక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వయంగా అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలతో పాటు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలు ముందుగా దేవాలయంలో సంప్రదించి నామమాత్రపు రుసుము చెల్లించివారికి వారి పేరున శరన్నవరాత్రుల్లో ప్రతీరోజు పూజాదికాలు నిర్వహించి  ప్రసాదం భక్తులకు అందజేసే విధంగా ఏర్పాటు చేసినట్లుతెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్ కు ప్రతిరోజు తెల్లవారుజామున ప్రత్యేక పంచామృతాభిషేకాలు, హోమ కార్యక్రమాలు, మరియు సామూహిక పూజలు నిర్వహిస్తునట్లు తెలిపారు.  ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు   అమ్మవారి దర్శనం కలిగిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో దేవస్థాన సంఘం కోశాధికారి  సుగ్గు శివకుమార్, దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్ బి బి కుమార్ శర్మ, ఉత్సవ కమిటీ అడ్వైజర్లు, కమిటీ నెంబర్లు పాల్గొన్నారు.అక్టోబర్ 15వ తేదీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం మరియు  మహిళలచే సామూహిక లలితా పారాయణం;  అక్టోబర్ 16వ తేదీ అన్నపూర్ణ దేవి అవతార అలంకరణ మరియు కన్యలచే సామూహిక పూజ; 17వ తేదీ గాయత్రీ దేవి అలంకరణ మరియు మహిళలచే సామూహికంగా సుహాసిని పూజ; 18వ తేదీ రాజరాజేశ్వరి దేవి అవతారం అలంకరణ మరియు సామూహికంగా దిశా గౌరీ పూజ; 19వ తేదీ ధనలక్ష్మి దేవి అవతార అలంకరణ మరియు మహిళలచే సామూహికంగా లలితాదేవి పారాయణ; అక్టోబర్ 20వ తేదీ సరస్వతి దేవి రూపంలో అలంకరణ మరియు 1200 మంది విద్యార్థులతో మూడు విడతలలో సరస్వతీ పూజ, అక్టోబర్ 21వ తేదీ నాడు శాకాంబరీ దేవి అవతార  అలంకరణ మరియు మహిళల సామూహికంగా విష్ణు లక్ష్మీ కమల పూజ; అక్టోబర్ 22వ తేదీ మహాలక్ష్మి దేవి అలంకరణ మరియు మహిళలచే ధైర్యలక్ష్మి పూజలు; అక్టోబర్ 23వ తేదీ నాడు కాళీమాత అవతార అలంకరణ  మరియు మహిళలచే సౌభాగ్యవ్రతం; మరియు శమీపూజ; అక్టోబర్ 24వ తేదీ దుర్గాదేవి  అలంకరణ మరియు చండీ హోమం, 25వ తేదీ ఉదయం ఉద్వాసన మరియు మధ్యాహ్నం  పేదలకు నారాయణ సేవ. మరియు సాయంత్రం మేళ తాళాలతో భారీ ఎత్తున ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.అన్ని కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కమ్మని కోరారు.

Visakhapatnam

2023-10-08 17:14:10

అంతరిక్ష పరిశోధనల్లోకి యువత అడుగుపెట్టాలి

అంతరిక్ష పరిశోధన రంగంలో యువత తమ సత్తా చాటాలని డీసీపీ-2 కె.ఆనంద రెడ్డి అన్నారు. వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా షార్- ఇస్రో, రఘు విద్యాసంస్థలుసంయు క్తంగా  గురువారం ఉదయం ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వద్ద నిర్వహించిన స్పేస్ వాక్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిపి ఆనందరెడ్డి మాట్లాడుతూ భారతీయ అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తూ అద్భుత విజయాలను సాధిస్తోందని అన్నారు. భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధి చేసి, ముందుకు నడిపించే విధంగా యువతరం ఈ రంగంలో రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై అవగాహన పెంచే విధంగా ఇటువంటి ర్యాలీని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చంద్రయాన్ విజయం భారతీయుల్లో కొత్త శక్తిని, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తిని కలిగించాయని అన్నారు. అంతరిక్ష విజ్ఞానం తోనే మానవ అభివృద్ధి సాకారం అవుతుందని షార్ శాస్త్రవేత్త, విశాఖ రీజియన్ కార్యక్రమ నిర్వహణ సబ్ కమిటీ చైర్మన్ జి .అప్పన్న అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. భారతదేశం అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు నేటి తరం యువతలో ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పారు.

రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు చెందిన పాఠశాలల, కళాశాలల విద్యార్థులు షార్ - ఇస్రో నిర్వహిస్తున్న నాలుగు రోజుల ప్రత్యేక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సార్ ఇస్రో శాస్త్రవేత్తలు రఘు విద్యాసంస్థల జాతీయ సేవా పథకం ఎన్సిసి వాలంటీర్లు విద్యార్థులు, పోలీస్ అధికారులు, కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఆర్కే బీచ్ నుంచి వైఎంసిఏ వరకు ఫ్ల కార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించే పోస్టులను పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-10-05 06:32:25

సైకో క్రిమినల్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి

భారత రాజ్యాంగాన్ని సజీవ సమాధి చేస్తున్న సైకో గ్యాంగ్ పరిపాలనకు ప్రజలు చరమ గీతం పాడాలని విశాఖ ఆర్ కె బీచ్ లో రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం  బీచ్ లో రాష్ట్రంలోరాజ్యాంగ విలువలు పాతర వేశారని నినదిస్తూ పీకల్లోతు ఇసుకలో నిలబడి  టిడిపి నేతలు నిరసన చేశారు. ఈ నిరసన లో నోడగల కృష్ణ, తమ్మినేని మోహన్ లు చంద్రబాబు అరెస్టు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  కృష్ణ మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారని చెప్పుకొచ్చారు. సైకోవిధానాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ది చెబుతారని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  చంద్రబాబు కు అండగా మేము సైతం ప్ల కార్డ్ లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వర కుమార్, కుమార్ స్వామి, పసుపులేటి శ్రీనివాస్, కోనేటి సురేష్ ,ముక్కాశివ, సతీష్ లు, ధనజీ, తాతినేని యర్రబోలు శ్రీను తో పాటు టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వినూత్న నిరసన లో పాల్గొన్నారు.

2023-09-22 09:47:02

గ్రామవాలంటీరు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 3 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. ఈమేరకు ఆయన శుక్రవా రం మీడియాతో మాట్లాడారు. మండలంలోని యూ.చీడిపాలెం పంచాయతీ పరిధిలో 2, బకులూరు పంచాయతీ పరిధిలో 1 చొప్పున, మొత్తం మూడు గ్రామ వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. స్థానికంగా నివాసం ఉండే, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25 వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న ధరఖాస్తులు పరిశీలించి, 27 న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 29 న ఎంపిక ధృవపత్రం జారీ చేస్తామని, 30న ఎంపికైన అభ్యర్థులకు ఒకరోజు శిక్షణ కూడా ఇస్తామన్నారు. అలాగే ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల 1 వ తేదీ నుండి విధుల్లో చేరుతారని చెప్పారు. మరిన్ని వివరాలకు 9491461311 ఫోన్ నెంబరును సంప్రదించాలని సూచించారు.

Koyyuru

2023-09-22 09:29:37

కమనీయం సింహాచలం అప్పన్న కల్యాణం

విశాఖలోని సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారి నిత్య కల్యాణం బుధవారం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూ ర్తి గోవింద  రాజ స్వామిని ఉభయ దేవేరులతో  మండపంలో అధిష్టింపజేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పురోహితులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2023-09-20 05:58:43

గురువులకు వేతన వెతలు మిగులుస్తున్న జగన్ ప్రభుత్వం

భావితరాలకు మంచి భవిష్యత్తు నిచ్చేవారు ఉపాధ్యాయులు ఈరోజు కూడా వారికి  వేతన వెతలు.. ఎదురుచూపులే మిగిలాయంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే "గంటా శ్రీనివాసరావు" మండి పడ్డారు. ఈ అరాచక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల కారణంగా గురుపూజోత్సవ ఉత్సాహం వారిలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘నాడు-నేడు’ పనుల్లో ఎలాంటి పురోగతి  లేకపోయినా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న తప్పులకు ఉపాధ్యాయులను బలి చేస్తున్నారని ఆరోపించారు. గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తూ.. ఆ ఫొటోలు ఆన్‌లైన్‌ పెట్టలేదని.. రాగిపిండి నిల్వ నమోదు చేయలేదని.. పాఠశాలల్లో కోడిగుడ్లు నిల్వ సరిగా లేదని.. షోకాజ్‌ నోటీసులిస్తూ ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండి పడ్డారు. 

ఉపాధ్యాయుల బదిలీలు రికార్డు సమయంలో పూర్తి చేశామని డప్పులు కొడుతున్నా మీ ప్రభుత్వం.. బదిలీ అయున 30వేల మంది బదిలీ టీచర్లకు 3నెలలుగా జీతాలు వేసే సంగతి మాత్రం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఉపాద్యాయుల పైన రకరకాల ప్రయోగాలు చేసి పోస్టుల్లో గజిబిజి సృష్టించి, నెలలు గడుస్తున్నా లోపాలు సరిదిద్దకుండా మొత్తం మీద 1.70 లక్షల మంది టీచర్ల జీతాలకు ఎసరు పెట్టారని ఆరోపించారు. చదువు చెప్పించడం తప్ప అన్ని పనులూ ఉపాధ్యాయులతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయిస్తోందని గతంలో గౌరవ హైకోర్టు నే వ్యాఖ్యానించిందంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పేర్కొన్నారు. కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరసలో నెలబెట్టే బాధ్యత కూడా టీచర్లకే అప్పగించిన ఘనత.. సీపీస్ అడిగారని ఉపాధ్యాయులపై లాఠీ చార్జ్ చేయించిన ఘనత దేశ చరిత్రలో మీకే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు.

Visakhapatnam

2023-09-05 15:36:31

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ఎక్కడ

వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఒక్క జాబ్ కేలండర్ కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఘాటుగా విమర్శించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ  మంగళవారం విశాఖలోని ఎంవిపి కాలనీ సమతా కళాశాల నుండి ఏఎస్ రాజా కళాశాల వరకు నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో నెంబర్ 98ని తక్షణమే రద్దు చేయాలన్నారు. గ్రూప్ టూ ఉద్యోగాలు వెయ్యి కి పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో గొప్పలకు పోయి జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటనలు చేసి అరకొర ఉద్యోగాలు చేతులు దులుపుకున్న అసమర్ధ ప్రభుత్వం వైఎస్సార్సీపీదే అన్నారు.  నిరుద్యోగులను నట్టేట ముంచి మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. గ్రూప్ వన్ గ్రూప్ టు పోస్టులు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.  నిరుద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేసిన జగన్ రెడ్డి మోసగాడిగా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతియేట ఉద్యోగాలు కల్పనతోపాటు నిరుద్యోగ భృతికూడా ఇచ్చేవారన్నారు. రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని అపుడు నిరుద్యోగుల కష్టాలు గట్టెక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సిద్దు, కో కన్వీనర్ పవన్ కుమార్ భారీగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Visakhapatnam

2023-09-05 14:22:49

డ్రైనేజీ పనులు పరిశీలించిన మందపాటి జానకిరామరాజు

అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ పట్టణ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. మంగళవారం 82వ వార్డు శారదా కాలనీలోని 3వ వీధిలో జరుగుతున్న డ్రైనేజి నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మందపాటి మాట్లాడుతూ, జివిఎంసీ నిధులతో, మంత్రి గుడివాడ అమర్నాధ్ సహకారం అభివృద్ధి పనులు అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నారు. కాలువల నిర్మాణం వలన ఈ ప్రాంతంలోని ప్రజల మురుగనీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  నిర్మాణ పనులను రాజీలేకుండా చేపట్టాలని ఇంజనీరింగ్ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి  గైపూరి రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Anakapalle

2023-09-05 13:36:34