1 ENS Live Breaking News

పదవులంటే అలంకారప్రాయం కాదు.. మరింత బాధ్యత

పదవులంటే అలంకార ప్రాయం కాదని, మనం చేసే పనిలో, సేవలో మరింత బాధ్యతను పెంచుతాయని రాష్ట్ర హోంమంత్రి డా. తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారోత్సవంలో హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభ్యులుగా వరిగేటి సుధాకర్, నగళ్లపాటి శ్రీనివాసర రావులు ఎన్నికయ్యారు. కార్యక్రమం అనంతర హోంమంత్రి ఆసుపత్రి పరిసరాలను, అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. స్త్రీల ప్రసూతి విభాగంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయని మంత్రి ప్రశ్నించగా.. బాగా అందుతున్నాయని సమాధానం వచ్చింది.

ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైద్యం ప్రతి పేదవాడికి ఉచితంగా అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, పేదవాడికి కార్పోరేట్ వైద్యం అందేలా చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం ఎవరూ ఇబ్బంది పడకుండా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ ఫండ్స్ ను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా సామర్థ్యం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు.      

Kovvur

2023-04-26 13:25:31

SEBదాడుల్లో 20లీటర్ల సారా స్వాధీనం, వాహనం సీజ్

ప్రత్తిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు ఎస్ఈబీ ఇనెస్పెక్టర్ పి.అశోక్ తెలియజేశారు. ఈ మేరకు ప్రత్తిపాడులో ఆయన మీడియాకి వివరాలను వెల్లడించా రు. ఏలేశ్వరం నుంచి అడ్డతీగల వెల్లే దారిలో తనిఖీలు చేస్తుండగా స్ప్లెండర్ పై సారా రవాణా చేస్తూ కాకడ శ్రీను 10 లీటర్లతో పట్టుబడ్డాడని, కాగా  కేతనగిరి గ్రామంలో పూజల లోవమ్మ అనే మహిళ నుంచి 10లీటర్లు సారాతో పట్టుబడిందని పేర్కొన్నారు. వారి నుంచి సారాతోపాటు, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తెలియజేశారు. ఎవరైనా నాటు సారా తయారీ, వ్యాపారం, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న దొర,  కానిస్టేబుల్స్ ఎల్.కృష్ణార్జున,  ఆర్.దొరబాబు, ఎ.రాజు, ఎ.సలామ్ ఖాన్, మహిళా కానిస్టేబుల్, కె.జ్యోతి పాల్గొన్నారు.



Prathipadu

2023-04-26 09:40:43

విశ్వమంతటికీ ఆదిశంకరులే జగద్గురువులు

విశ్వమంతటికీ ఆదిశంకరాచార్యులు మాత్రమే జగద్గురువులు అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ప్ర పంచవ్యాప్తంగా సనాతన ధర్మం నేటికీ విరాజిల్లుతోందంటే అది ఆదిశంకరుల వారి గొప్పతనమేనని స్పష్టం చేసారు. శంకర జయం త్యుత్స వములను మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠంలో ఘనంగా నిర్వహించారు. ఆదిశంకరుల ప్రతిమకు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి విశేష అభిషేకం నిర్వహించగా స్వరూపానందేంద్ర స్వామి మహా మంగళ హారతులిచ్చారు. పండితులంతా కలిసి ఉపనిషత్తులను పారాయణ చేసారు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, విగ్రహారాధనకు అతీతంగా పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసిన ఏకైక గురువు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారేనని తెలిపారు. శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పీఠాల్లో విశాఖ శారదాపీఠం ప్రముఖ మైన దని చెప్పారు.  ఉపనిషత్తులు, వేదాంత ప్రచారం ద్వారా సనాతన ధర్మాన్ని నిలబెట్టారని వివరించారు.

Pendurthi

2023-04-25 06:53:08

శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఈఓగా శిరీషా

విశాఖలోని శ్రీశ్రీ శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి(ఈఓ)గా కె.శిరీషా నియామకమయ్యారు. జిల్లా దేవాదాయ, ధర్మా దాయ శాఖాధికారిణిగా వున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీషాను శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంకు ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ కె.రమేష్‌నాయుడ్ని పెను గంచిప్రోలు, శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి (ఈఓ)గా బదిలీ చేసింది. అక్కడ ఈఓ(పూర్తి అదనపు బాధ్యతలు)గా వున్న అసిస్టెంట్‌ కమి షనర్‌ జీవీడీఎన్‌ లీలా కుమార్‌ను రిలీవ్‌ చేశారు. ఆయా ఈఓలు ప్రభుత్వం అదేశాల మేరకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. దానితో విశాఖలోని ఏసిగా ఉన్న శిరిష ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా దేవస్థాన సిబ్బం ది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. అంతకు మందు ఈఓ అమ్మవారికి పూజలు చేశారు.

Visakhapatnam

2023-04-25 06:13:47

లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పరిశీలించిన కమిషనర్

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల శుక్రవారం సంజయ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శిం చారు. ఎంహెచ్ఓ డాక్టర్ పృద్వి చరణ్,డిఈ మాధవి, ఇతర అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన కమిషనర్ లెగసీ వేస్ట్ ( ఎన్నో ఏళ్లుగా డం పింగ్ యార్డ్ లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్త )  ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. యంత్రాల ద్వారా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. దాదాపు 3,62,375 మెట్రిక్ టన్నుల లెగసి వేస్ట్ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభిం చినట్లు డిఈ మాధవి కమిషనర్ కు వివరించారు. అంతకుముందు ప్రతాప్ నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. మస్తరు కేంద్రాన్ని సందర్శించి  సిబ్బంది హాజరును పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరయ్యారో లేదో ఆరా తీశారు . ఆ ప్రాంతంలో కాలినడకన వెళుతూ చెత్త సేకరణ తీరు, డ్రైనేజీల నిర్వహణ, తడి-పొడి చెత్తను విభజించి ఇస్తున్న విధానాన్ని, కమిషనర్ తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న డీసిల్టేషన్ పనులను కూడా పరిశీలించారు. వర్షాలు పడే లోపుగా నగరంలోని అన్ని ప్రాంతాలలో పూడికతీత పను లు పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరై మెరు గైన పనితీరు కనబరిచేలా పర్యవేక్షించాలని ఎంహెచ్ఓ  డాక్టర్ పృద్వి చరణ్ ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ ఇన్స్పె క్టర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు.

Kakinada

2023-04-24 09:48:49

ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3రోజుల సక్సెస్ మీట్

ప్రత్తిపాడు నియోజవకర్గంలో 3 రోజుల పాటు జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు వియవంతం చేసిన నాయ కులు, కార్యకర్తలు, సచివాలయ గృహసారధులతో కలిసి సక్సెట్ మీట్ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తెలియ జేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురా లు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభు త్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో చక్కగా తీసుకెళ్లిన క్యాడర్ ను ప్రత్యేకంగా గుర్తించాలని సన్మానించుకోవాలని ఈ కార్యక్రమం చేపడుతున్నారమన్నారు. 26న రౌతులపూడి, శంఖవరం మండలాలు, 27న ప్రత్తిపాడు మండలానికి అన్నవరంలోని ప్రైవేటు హోటల్ లో నూ, 28న ఏలేశ్వరం నగర పంచాయతీ, రూరల్ మండాల కేడర్ కే ఏలేశ్వరంలోనూ ఈ కార్యక్రమాలు ఏర్పాటుచేశామన్నారు.

Sankhavaram

2023-04-24 07:24:06

ప్రత్తిపాడులో పర్వత నాయకత్వానికి తిరుగులేదు

ప్రత్తిపాడులోని ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రాసాద్ నాయకత్వానికి తిరుగులేదని కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినీ డి సుజాత అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఎమ్మెల్యే కార్యదీక్ష, కార్యకర్తలు, నాయకత్వం సహకారంతోనే ప్రత్తిపాడు నియోజకవర్గం జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం ను వ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో టాప్ 10గా నిలిచిందన్నారు. ఇదే స్పూర్తితో పనిచేసి మళ్లీ ఆయనను ఎ మ్మెల్యేగా నియోజవర్గానికి బహుమతిగా ఇవ్వాలని కేడర్ ను ఉత్సాహ పరిచారు. రాష్ట్రప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎమ్మెల్యే పర్వత దానిని అమలుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో శక్తివంచన లేకుండా క  కృషి చేస్తారని కొనియాడారు. అలాంటి నాయకత్వం నియోజవకర్గ అభి వృద్ధికి చాలా అవసరమని అన్నారు. 4 మండలాల ఎంపీపీలు, గృహసారధులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Sankhavaram

2023-04-24 07:23:15

175నియోకవర్గాల్లో ప్రత్తిపాడు టాప్10- ఎమ్మెల్యే పర్వత

జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం టాప్ 10లో నిలవడానికి కారణం బలోపేతమైన నాయకులు, సీఎం జగనన్నను నమ్మిన ప్రజలేనని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎంపీపీ పర్వత రాజబాబు, కాకికినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, 4 మండలాల నాయకులు, గృహసారధులు, మండల కన్వీనర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. నియోజకవర్గంలో 80, 915 గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడంతోపాటు మద్దతుకూడా పొందామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు అభివృద్ధిని కూడా తెలియజేశామన్నారు.

Sankhavaram

2023-04-24 07:21:14

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

విశాఖప కెజిహెచ్ కు ప్రతి రోజు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు, వసతి అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కె జి హెచ్ ను ఆయన ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గైనిక్ వార్డును తని ఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో పాటు వచ్చే సహా యకులు విశ్రాంతి తీసుకునే గదులను పరిశీలించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరాతీశారు. కె జి హెచ్ లో చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రభుత్వం వైద్యసేవలకు ప్రభుత్వం పెద్ద పీటవేస్తుందని ఈ తరుణంలో ప్రభుత్వ వైద్యం కార్పోరేట్ వైద్యాన్ని మించి నిరుపేద రోగులకు అందాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కె జి హెచ్ సూపరింటిండెంట్ డా.అశోక్ కుమార్, ఎపిఐడిసి ఇఇ నాయుడు, కె జి హెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-20 16:22:13

శారదాపీఠాన్ని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ బుధవారం శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఇటీవలే కమి షన ర్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా విశాఖ వచ్చిన ఆయన విశాఖలోని పెందుర్తిలో గల పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వా త్మానందేంద్ర సరస్వతిలను మర్యాదపూర్వకంగా కలుసుకొని  అక్కడ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచ లంలో జరిగే చందనోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికాలరు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో ఉన్న ఆలయాలకు చెందిన మాన్యాలను, భూములను పరిరక్షించాలని కోరారు. ధార్మిక సలహా మండలి సమావేశాలను క్రమం తప్ప కుండా నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ప్రముఖ ఆలయాల్లో జరిగే కార్యక్రమాలను భక్తులకు ముందుగానే తెలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ కు సూచించారు.

Pendurthi

2023-04-19 10:40:46

సమ సమాజ స్థాపకుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే

సమ సమాజ స్ధాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి , రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే  అని శెట్టిబ త్తుల కుమార్ రాజా అ న్నారు. మంగళవారం అన్నవరం పెద్ద రావిచెట్టు సెంటర్ లో పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,  బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రైతు సమస్యలపై అమితాశక్తి ప్రదర్శించి వివిధ ప్రాంతాల్లో ఉద్యమించిన బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహులు మహాత్మా జ్యోతి బాపూలే అని తెలిపారు. ఆయన సతీమణి సావిత్రి భాయ్ పూలే కూడా నిస్వార్థ సేవలం దించిన మహనీయురాలని వారిద్దరూ అమరజీవులుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు  మనమి చ్చే నిజమైన ఘన నివాలి అన్నారు. వైస్ ఎంపీపీ దారారమణ,  కొండపల్లి అప్పారావు బొబ్బిలి వెంకన్న పాల్గొన్నారు.

Annavaram

2023-04-11 13:30:22

వజ్రకూటంలో ఉత్సాహంగా జగనన్నే మాభవిష్యత్తు

నిరుపేదల పక్షన నిలిచి నవరత్నాల పథకాల ద్వారా పూర్తిస్థాయి సంక్షేమం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు అన్నారు. సోమవారం శంఖవరం మండంలోని వజ్రకూటం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్ర మాన్ని కార్యకర్తలు, వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రమే చేపట్టగలుగుతున్నారని అన్నారు. నిరుపేదలు, అక్క, చెల్ల మ్మల పక్షపాతిగా నిలిచిన జగనన్ననే మళ్లీ మళ్లీ మనం మన భవిష్యత్తుగా భావించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముం గిటే సమస్యల పరిష్కారం చూపిస్తున్న జగనన్నతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు స్వర్గయుగంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారధులు,కె.రమణ, కె.వెంకటరమణ, కీర్తి, నానాజీలు పాల్గొన్నారు.

Vazrakutam

2023-04-10 14:42:43

ఆదిత్యుడుని దర్శించుకున్న మంత్రి అమర్నాధ్

కలియుగ ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ సో మవారం దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు,స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కా ర్యక్రమంలో  ఆర్డీఓ బొడ్డేపల్లి శాంతి, తహశీల్దార్ కె.వెంకటరావు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Arasavilli

2023-04-10 11:23:48

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం

బోయ వాల్మీకి,బెంతు, ఒరియా లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలులేదని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో పంచాయితీ పాలకవర్గం గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.  ఈ సందర్భంగా వా ర్డు సభ్యులు జర్తా రాజబాబు  అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ ,బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా లను ఎస్టీ జాబి తాలో చేర్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంరాని.. అయితే ఎటువంటి  గిరిజన సాంప్రదాయాలు లేని బిసి ఏ లో ఉన్న బోయ వాల్మీకి,బెంతు ఒరియా 40లక్షలు మందిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం 52 జీవో  తీసుకువచ్చిందన్నారు. దీ నివలన ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన గిరిజనులు 25 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త క్షణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52 ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాజఒమ్మంగి

2023-04-06 10:50:57

మహిళలకే 70శాతం పథకాలు.. ద్వారంపూడి

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకి నాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో పాలనా సంస్కరణ లు అమలు చేయడంతో పాటు 70 శాతం  పథకాలను మహిళల పేరుతోనే ఇస్తున్నారన్నారు. శారదాదేవి ఆలయం సమీపంలో గురువారం జరి గిన వైయస్సార్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని పదింతలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపా లిం చడం ప్రజల అదృష్టమన్నారు. కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి , కమిషనర్ కే. రమేష్, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహా రావు, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.

Kakinada

2023-04-06 10:11:48