1 ENS Live Breaking News

మహిళా పోలీసులకూ ఖాకీ డ్రెస్సు ఖాయం..

గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసు ఖాకీ డ్రెస్సు వేసుకొని తిరగడం ద్వారానే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆస్కారం వుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన సుమారు 15వేల మంది మహిళా పోలీసులకు హోంశాఖ ఖాకీ డ్రెస్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకాలు అస్సలు తమకు ఇష్టం లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మీరు మాలా నిజమైన పోలీసులా, మీకు డ్రెస్సులుంటాయా.. శిక్షణలుంటాయా.. మీరు ఏ విషయంలో మాలాగ రెగ్యులర్ పోలీసులుగా ఫీలవుతున్నారు అంటూ మరెన్నో రకాలుగా చేసిన కామెంట్లను కేంద్ర ఇంటెలిజెన్సు విభాగం ద్వారా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులను కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ జీఓనెంబరు 59ని విడుదల చేసింది. దీనితో క్రింది స్థాయి పోలీసు సిబ్బంది కామెంట్లకు అడ్డుకట్ట పడింది. ఆ తరువాత రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీలు ముందు మీరు మహిళా పోలీసులను హోంశాఖ పోలీసులుగా ఇష్టం వున్నా, లేకపోయినా గుర్తించాలనే ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది ఒప్పుకోక తప్పలేదు. ఇపుడు తాజాగా మహిళా పోలీసులకు ప్రభుత్వం ఖాకీ డ్రెస్సు కూడా ఇచ్చి గ్రామ పరిరక్షణలో భాగం చేయడానికి అన్ని ఏర్పాట్లును చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జీఓనెంబరు 59 ఆధారంగా వీరిని సాధారణ పోలీసులుగానే మార్పుచేసిన ప్రభుత్వం వీరికి కూడా దశల వారీగా పోలీసు శిక్షణ  ఇవ్వనుంది. 

ఈ మేరకు డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశా నిర్ధేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ధేశించిన కొత్త నిబంధన ప్రకారం వీరికి కూడా పోలీసు యూనిఫారం రానుంది. ఈ విషయాన్ని డిజిపి ఎస్పీలకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాకీ డ్రెస్ మోడల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా చూపించారు. బహుసా ఇదే మోడల్ ఖాకీ డ్రెస్సులను మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళా పోలీసులను నియమించిన ప్రభుత్వం, హెడ్ కానిస్టేబుళ్లుగా వున్న 2052 మందిని రాష్ట్రవ్యాప్తంగా వున్న పోలీసు స్టేషన్లలో ఉన్నట్టు గుర్తించింది. సర్కిల్ లెవల్ లో ఏఎస్ఐలు 196 మంది ఉండగా, మహిళా ఎస్ఐలు 97 మంది ఎస్డీపీఓ లెవల్ లో వున్నట్టుగా గుర్తించారు. ఇక ఇనెస్పెక్టర్ గా ఒక యూనిట్ లో 18ని ఉండేలా  సర్కిళ్లలో కూడా నియమించనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక జిల్లాల్లో ప్రభుత్వం ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలను ఏ ప్రాతిపధికన రెగ్యులర్ చేయాలి, వీరికి ఏ విధమైన పరీక్షలు నిర్వహించాలి, దేహ దారుడ్యానికి, నడక లేదా పరుగు ఏ విధంగా పెట్టాలనే అంశాలకు సంబంధించి కూడా డిజిపి గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆగస్టు 15న మహిళా పోలీసులకు డ్రెస్ కోడ్ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతుంది. అయితే అది ఆ తేదీనే ప్రకటిస్తారా.. లేదంటే వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షలన్నీ పూర్తయిన తరువాత, వీరి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ప్రకటిస్తారనే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు మహిళా పోలీసు పోస్టుల విషయంలో, వారి విధుల విషయంలోనూ, వారిని మానసికంగా క్రుంగదీసి, వారి ఉద్యోగాలు వారంతట వారే వదిలి పోయేలా చేసిన(కొన్ని జిల్లాల్లో మహిళా పోలీసులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు, మరికొంత మంది మహిళా పోలీసు ఉద్యోగాన్ని వదిలి వేరొక ఉద్యోగానికి వెళ్లిపోయారు) ప్రయత్నాలకు ప్రభుత్వం ఒక్కసారిగా ఖాకీ యూనిఫారం ఇస్తున్నట్టు నేరుగా పోలీస్ బాస్ డిజిపి ప్రకటించడంతో మహిళా పోలీసులపై జరుగుతున్న ప్రచారాలను, సిబ్బంది చేసే కామెంట్లకు గట్టిగానే అడ్డుకట్ట వేయగలిగింది. వాస్తవానికి మహిళా పోలీసులను ప్రభుత్వం గ్రామాల్లో నియమించడం ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐల ప్రాభల్యం గ్రామాల్లో తగ్గిపోతుందని, గ్రామాల్లోకి వెళితే అప్పటికే వున్న మహిళా పోలీసులనే గౌరవిస్తారనే  భావనకు రాష్ట్రంలో చాలా మంది పోలీసులు(హోం గార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు) వచ్చినట్టుగా తీవ్ర ప్రచారం జరగడంతోపాటు, చాలా చోట్ల పోలీసు సిబ్బందే బయట పడిపోయారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బంది ఎంతో ఆందోళన చెంది, బయటపడి మరి మనసులోని ఆలోచనలు మహిళా పోలీసుల దగ్గర అన్నా.. ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేది, ఉద్యోగాల్లో నియమించేది హోంశాఖ మాత్రమే. 

అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడటం ద్వారా కొందరిలోనైనా ఆలోచన పెరిగి చేస్తున్న ఉద్యోగాలను వారంతట వారే మానివేసేలా చేయలి.. లేదంటే వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోవడం గానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఖాకీ డ్రెస్సు వద్దని చెప్పించే ప్రయత్నం చేయడంలో సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా చాలా గట్టిగానే కష్టపడ్డారనేది హాట్ టాపిక్. కానీ జిల్లా ఎస్పీలు మాత్రం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతో చాలామంది ఇపుడు ఆ ప్రవర్తన మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.  నిన్న డిజిపీ గౌతంగ సవాంగ్ మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇస్తున్నామనే మాటను ప్రకటించిన తరువాత.. ఏదో రకంగా మాట్లాడే క్రిందిస్థాయి పోలీసు సిబ్బంది గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. అయితే మహిళా పోలీసుల ఒంటిపైకి ఖాకీ చొక్కా వచ్చేంత వరకూ పోలీసుశాఖలో ఏ నిబంధన అమలు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మహిళా పోలీసులందరికీ ఖాకీ డ్రెస్ ఇస్తారా లేదంటే.. తమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో వారికి ప్రాబల్యం తగ్గిపోతుందని ఆ ఆలోచనను మార్చుకుంటారా.. తేలాల్సి వుంది..!


Tadepalle

2021-08-07 03:56:15

10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల..

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షాఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ అన్నారు.  విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ 7 నుండి 16వ తేదీ వరకూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని అయితే విద్యార్ధుల ఆరోగ్యభద్రత, ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని మే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిర్ణయం మేరకు 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. పరీక్ష ఫీజుకట్టిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు ఎ ంతోకీలకమని మంత్రి అన్నారు. ఉద్యోగాల నియామకంలో కాలేజీ విద్యలో, కేంద్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు ముఖ్యంగా మిలటరీ రిక్రూట్‌మెంట్‌లో 10వ తరగతిలోని మార్కుల ఆధారంగానే ఉద్యోగనియామకాలు చేపడతారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ పరీక్ష పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని దీనిలోభాగంగా సంవత్సరకాలం పాటు విద్యార్ధుల ప్రతిభను ఆధారంగా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు.

రద్దు అయిన 10వ తరగతి పరీక్షల విధివిధానాలను పరిశీలించి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని అన్నారు. ఈహైపవర్ కమిటి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం 10వ తరగతి పరీక్షాఫలితాలను విడుదల చేశామని మంత్రి అన్నారు. విద్యార్ధులెవరికీ నష్టంలేకుండా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. అందరికీ ఉపయోగపడేలా 2019-20, 2020-21 సంవత్సరానికి ఎ వ్వరూ నష్టపోకుండా 10వ తరగతిలో గ్రేడింగ్ ఇవ్వాలని హైపవర్ కమిటి నివేదిక ఇచ్చిందని మంత్రి అన్నారు. ఈనివేదికను యధాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు.
2020-21వ సంవత్సరంలో సంవత్సర కాలంపాటు వారి ప్రతిభను ఆధారంగా తీసుకుని వ్రాతపరీక్షల్లో అత్యధిక వెయిటేజ్‌ను ఇస్తూ 70 శాతం, 30 శాతం వెయిటేజ్ మార్కులతో గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో 6 లక్షల 26 వేల 981 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 22 వేల 391 మంది బాలురు, 3 లక్షల 04 వేల 036 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 లక్షల 37 వేల 354 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 26 వేల 753 మంది బాలురు 3 లక్షల 10 వేల 601 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు.

10వతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెర్ ఫార్మెన్స్ స్టేట్‌మెంట్లు (గ్రేడ్ షీట్లు) కొరకు విద్యార్ధులు ఠషష://స|షషె.శి|.శూ.గుు.n వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి అన్నారు. విద్యార్ధులు వారి రోల్ నెంబరును ఎ ంటర్ చేయడం ద్వారా గ్రేడ్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. ఈవెబ్ సైట్‌కు సంబంధించి పాస్‌వర్డు కఊ – 2020 అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనరు చినవీరభద్రుడు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎ గ్జామినేషన్స్ సుబ్బారెడ్డి, యస్ఇఇఆర్ టి డైరెక్టరు ప్రతాపరెడ్డి, ప్రకాశం జిల్లా డిఇఓ సుబ్బారావు, పెనమలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పై#్రవేట్ విద్యాసంస్ధల ప్రతినిధులు వై. విజయకుమార్ , పి. వెంకటకుమార్ , తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి

2021-08-06 16:44:15

నందిగామలో డా.జాలాది జయంతోత్సవం..

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు 90వ జయంతో త్సవాన్ని నందిగామలో నిర్వహిస్తున్నట్టు జాలాది కళాపీఠం వ్యవస్థాపకులు డా.జాలాది విజయ తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదిన స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నందిగామలో శ్రీవెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు హాజరవుతున్నారని చెప్పారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు డా.జాలాది విజయ తెలియజేశారు. జాలాది జయంతిని ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలోని కవులు, కళాకారులు ఉన్నచోట చేయాలనే సంకల్పంతో ఈ జయంతిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సదర్భంగా ఆమె కోరారు.

Nandigama

2021-08-06 03:28:54

వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తో ప్రాధమిక వైద్యం..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వైద్యానికి మహర్ధశ పట్టనుంది. దివంగత ముఖ్యమత్రి డా.వైఎస్ రాజశేఖకరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేసి గ్రామంలో ప్రాధమివైద్యాన్ని అందించడానికి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రతీ గ్రామసచివాలయం పరిధిలో ఒక వైఎస్సార్ క్లినిక్ ను నిర్మిస్తున్నారు. ప్రాధమిక రోగాలకు సంబంధించి 14 రకాల మెడికల్ టెస్టులు చేసి 65 రకాల మందులను, మరో 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్లు, మరో 12 రకాల వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. గ్రామంలో ఉండే ఏఎన్ఎం 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే వారికి ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జల్లాల్లోని సచివాలయాల పరిధిలోని వున్న ప్రజలను ఆయా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు అనుసంధానం చేశారు. వ్యాధి నిర్ధారణ చేయడం కోసం క్యూర్ కోడ్ విధానాన్న ప్రవేశ పెడుతున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నుంచి ప్రాధమిక వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ డేటాను అనుసంధానం చేస్తారు. ఇలా ప్రాధమిక వైద్యం గ్రామస్థాయిలో అందించి అంతకు మించితే వారికి వైద్యం ప్రాధమిక వైద్యకేంద్రాల్లో ఇంకా అవసరమైతే జిల్లా వైద్యశాలకు పంపి ఉచితంగానే వైద్యం చేయిస్తారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు వస్తారు. ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంచుతారు. రోగులు వేచి వుండటానికి వేయిటింగ్ హాలు ల్యాబు, ఫార్మశీ, ఇలా అన్నీ వేర్వేరుగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో వుండే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్లే పనిలేకుండా పూర్తిస్థాయిలో గ్రామస్థాయిలోనే మినీ హాస్పపత్రులను నిర్మాణం చేస్తుంది ప్రభుత్వం. గ్రామాల్లోనే ప్రజలకు ప్రాధమిక వైద్యం పూర్తిస్థాయిలో అందించాలనుకున్న డా.వైఎస్సార్ పేరుతోనే వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు సగానికిపైగా పూర్తయ్యాయి. వాటికి అనుగుణంగా ఆగస్టు చివరినాటికి ఇందులో పనిచేయడానికి మిడ్ లెవల్ హెల్త్ ప్రొవడైర్లను కూడా ప్రభుత్వం నియమించనుంది. సుమారు 6వేలకు పైగానే వీరిని నియమించడానికి అటు ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్రవేసింది. ఇక్కడ ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించే సమయంలో ఏమైనా అనుమానాలొస్తే వైద్యులను, 104 ద్వారా సంప్రదించడానికి టెలీ మెడిసిన్ విధానాన్ని కూడా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం దీనికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని, వీడియో కాన్ఫరెన్సు సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి నాటికి ప్రతీ గ్రామంలోనూ డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజలకు ప్రాధమిక వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లును ఇక్కడే అందించనున్నారు. దానికోసం ఆశను కూడా ఇక్కడే అందుబాటులోకి తీసుకు వస్తోంది ప్రభుత్వం.

Tadepalle

2021-08-06 02:36:33

పీవీ సింధూకి విజయవాడలో ఘన స్వాగతం..

విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. యువత సింధును ఆదర్శంగా  తీసుకోవాలన్నారు.

Tadepalle

2021-08-05 18:00:26

ఏపీసీడ్స్ కి అవార్డు పట్ల సీఎం హర్షం..

మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని  సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) అధికారులకు సూచించారు. గురువారం సంస్థకు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ను కలిసి అవార్డు వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబులు తెలియజేశారు. గవర్నెన్స్‌ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్‌ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని సీఎం అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్‌ ఎండీని, సిబ్బందిని ప్రశంసించారు.

Tadepalle

2021-08-05 16:12:31

Tadepalli

2021-08-05 03:29:34

ప్రభుత్వ తప్పిదం.. సచివాలయ ఉద్యోగులకు ఇరకాటం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. అక్టోబరు 2వ స్తే సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెడతామని, అది పాసైతే ప్రొబేషన్ అన్న ప్రభుత్వం ఇపుడు అలాంటి పరీక్షలేవీ లేవని, పెట్టబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజయ్ కల్లాం ప్రకటించి ఇక్కడో మెలిక పెట్టారు. సిబీఏసి పరీక్ష అయితే ఉండదు గానీ.. ఆయా శాఖలకు చెందిన డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాల్సి వుంటుందని ఇపుడు ప్రకటించారు. వాస్తవానికి 16 ప్రభుత్వ శాఖల్లోని సచివాలయ ఉద్యోగులకు వీరి ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా అందరికీ జీఓలు గానీ,  గెజిట్ పబ్లికేషన్లు గానీ ప్రచురించలేదు. అలా ఏశాఖ ఉద్యోగులకై గెజిట్ పబ్లికేషన్లు ప్రకటించారో, జీఓవో పలానా శాఖ డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాలని పెట్టారో ఆ మేరకు కొందరే పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. మరికొందరు తమ సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత పదోన్నతుల కోసం తర్వాత రాసుకుందామని వదిలేశారు. కాలక్రమంలో 2 నెలలు తక్కువ రెండేళ్లు గడిచిపోతున్నాయి. దీనంతో కధ మళ్లీ మొదటికి వచ్చింది. ఇపుడు తాజాగా ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ కావాలంటే సచివాలయ ఉద్యోగులకు నిర్ధేశించిన(ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు జీఓలు విడుదలచేయకపోయినా) డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలనేది కొత్త నిబంధన పెట్టారు.వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఏశాఖలో అయినా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యేక జీఓలు విడుదల చేసిన తరువాత వాటి ఆధారంగా భర్తీ కార్యక్రమం చేపడుతుంది. ఆపై గెజిట్ పబ్లికేషన్ చేపట్టి ఏ జీఓ ద్వారా అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో.. అందులోనే సర్వీసు రెగ్యులర్ కావడానికి ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు రాయాలో పొందుపరుస్తారు. దీనితో ఉద్యోగాల్లోకి చేరిన వారంతా వారి రెండేళ్ల ప్రొబేషన్  కాలంలో నాలుగు సార్లు నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షలను పాసై తమ సర్వీసులను రెండేళ్లు పూర్తికాగానే రెగ్యులర్ చేయించుకుంటారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సుమారు 16 రకాల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసే సమయంలో కేవలం గ్రేడ్-5 కార్యదర్శి ఉద్యోగాలకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్(రాజముద్ర) పబ్లిష్ చేసి.. మిగిలిన శాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వు విడుదల చేయకుండా ఉండిపోయింది.  అలా రాజముద్ర విడుదల చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చట్ట బద్ధత ఉండదనేది ఒక అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెట్టం కానీ సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాస్ కావాలని చెప్పడంతో... సదరు ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పరీక్ష రాయని వారు తాము ఆ.. పరీక్షలు పాసయ్యేంత వరకూ రూ.15వేలు జీతంతోనే కాలం వెల్లదీయాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు ద్వారా శాఖ పరమైన జీఓలు ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో విడుదల చేస్తాయి. ప్రభుత్వం ఏ నిబంధన ద్వారా అయితే జీలో విడుదల చేసి  జిల్లాల్లో కలెక్టర్లకు పంపుతారో దానిని సదరు ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఎంపీడీఓ ద్వారా సచివాలయాల్లోని ఉద్యోగులకు జీఓలోని అంశం చేరేటట్టు తెలియజేయాలి. తద్వారా కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగాలకు ప్రభుత్వం తమ ఉద్యోగాలకు సంబంధించి ఏఏ నిబంధనలు పెట్టిందో సిబ్బందికి తెలుస్తుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో నేటికీ ఆవిధానం అమలు జరగడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. దీనితో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ ఏ డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాలో తెలియకుండా పోయింది. ఆ కారణంతోనే చాలా మంది ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేదు. రెండేళ్ల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఈ విషయంలో లైట్ తీసుకోవడమే ఇపుడు ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇపుడు 2 నెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అవుతుందని తెలిసిన వేళ.. సదరు ప్రభుత్వ శాఖల్లో ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు పాసైతేనే మీ సర్వీసులు  రెగ్యులర్ అవుతాయని చెప్పడంతో ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రాయి పడినట్టు అయ్యింది. ఉద్యోగాల్లోకి చేరి దాదాపు రెండేళ్లు కావొస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడా ఆ డిపార్టమెంట ల్ పరీక్షల కోసం మెలిక పెట్టడమా అని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా డిపార్టమెంటల్ టెస్టులు రెండేళ్ల ప్రొబేషన్ సమయంలోనే పాసవ్వాలనే నిభందన  అమలు చేస్తే..ఈ విషయంలో ఆయా ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు, జిల్లా కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులదే తప్పు అవుతుంది. కారణమేంటంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధి విధానాలు ఏ జీఓ రూపంలో నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడమేనని ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారు. అప్పటికీ సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు తమ పదోన్నతులు సంగతేంటని కోరినా.. రాష్ట్ర అధికారులే ఇంకా అలాంటి నిబంధనలు, ప్రత్యేక అంశాలు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏమీ పెట్టలేదని, ఒక వేళ పెడితే జిల్లా అధికారుల ద్వారా తెలియజేస్తామని, ఆ సమయంలో వారిని సంప్రదించాలని ఆ సమాచార హక్కుచట్టం దరఖాస్తులో జవాబుగా తెలియజేశారు కూడా. ఈ విషయం ఇప్పటిది కాదు 2020లో జరిగిన సంఘటన ఆ తరువాత కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ టెస్టుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇద్దామనుకుంటే సమయం చాలానే ఉండేది. కరోనా సమయంలో కాలం రివ్వున తిరిగిపోయినా.. అధికారులు ఎలాంటి జీఓలు విడుదల చేయలేదు. ఇపుడు తాజాగా సర్వీసులు రెగ్యులర్ కావాలంటే కనీసం డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలని ఎలా చెబుతున్నారో తమకు అర్ధం కావడం లేదని.. జిల్లా శాఖల అధికారులు కూడా ఈ విషయం తమకు నోటీసుల ద్వారా కూడా చెప్పలేదని వాపోతున్నారు. సర్వీసు రెగ్యులర్ లో తమకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, తప్పులను కోర్టుకి విన్నవించి న్యాయపోరాటం చేస్తామంటున్నారు ఏ సమాచారం లేకుండా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాయకుండా ఉండిపోయిన అభ్యర్ధులంతా. నిజంగా అదే జరిగితే అటు రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్, సదరు జిల్లా అధికారులు కోర్టుముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాకాకుండా ఇపుడు వారి సర్వీసులను రెగ్యులర్ చేసి.. ఆపై కొంత సమయం ఇస్తున్నట్టు ప్రకటన చేసి అప్పటి కూడా సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాస్ కాపోతే అపుడు తమపై చర్యలు తీసుకోవచ్చునని ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు తప్పితే.. రాష్ట్ర అధికారులు చేసిన తప్పువలన నేటికీ చాలా మంది డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేపోయారని, దానికి కారణం వివిధ శాఖల ఉద్యోగులకు నేటికీ పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు, సర్వీసు రెగ్యులర్ కి సంబంధించి జీఓలు విడుదల చేయలేదని అడగక పోవడం విశేషం. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగానే అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖల వారీగా గెజిట్ నోటిఫికేషన్లు, జీఓలు విడుదల చేసి ఒక నిర్ధిష్ట్ ఉత్తర్వులు విడుదల చేస్తే తాము ఈ డిపార్టమెంటల్ పరీక్ష గందర గోళం విషయం నుంచి బయట పడతామని ఉద్యోగులంతా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుంటుందా.. నాలుగైదు ప్రభుత్వ శాఖలను కలిపి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, నాలుగు శాఖలను కలిపి విద్యా, సంక్షేమ సహాయకులను, రెండు శాఖలను కలిపి సర్వేయర్ల ఉద్యోగాలు స్రుష్టించడం వలనే ఇప్పటి వరకూ ఏ శాఖ తరపున జీఓలు, గెజిట్లు విడుదలచేయక వదిలేశామని ఒప్పుకుంటారో.. లేదంటే తాము చెప్పకపోయినా ప్రస్తుత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల నుంచి ఎందుకు మీరు దాదాపు రెండేళ్ల సమయం పూర్తవుతున్నా తెలుసుకోలేకపోయారని ఉద్యోగులపైనే నెపం అంతా నెట్టేస్తుందో..చూడాలి..!

తాడేపల్లి

2021-08-05 01:42:26

సచివాలయాల్లో సర్వీసు రూల్స్ ఎక్కడ..?

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబుతున్నా నేటికీ  కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రభుత్వం తయారు చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సదరు శాఖలను ఆదేశించలేదో.. లేదంటే ఆ శాఖల ముఖ్య కార్యదర్శిలకు ఖాళీలేకనో తెలీదు కానీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేసే విషయంలో మాత్రం నేటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో కొందరు సిబ్బందిని నాలుగైదు శాఖలను కలుపుతూ ఒక ఉద్యోగంగా తయారు చేసింది ప్రభుత్వం. దీనితో ఏశాఖ తరపున వీరికి సర్వీసు రూల్సు తయారు చేయాలో తెలీక ప్రభుత్వం మధనపడుతోంది. మిగతాశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, పదోన్నతల విషయంలో ఒక క్లారిటీ వచ్చినా మరికొన్నిశాఖల సిబ్బందికి క్లారిటీ రాకపోవడంతో వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా..? లేదా..  తాము జీవితాంతం ఇదే ఉద్యోగం చేయాలా.? అనే అనుమానంతో కొట్టిమిట్టాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్య, సంక్షేమ సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు ప్రధానంగా ఉన్నారు. విద్య, సంక్షేమ సహాయకులను తీసుకుంటే వీరి ఉద్యోగం(బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గల నాలుగు శాఖలను కలిపి ఒక ఉద్యోగాన్ని తయారు చేశారు), ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను తీసుకుంటే(పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, హౌసింగ్, ఎస్ఎస్ఏ ఇలా ఐదు ప్రభుత్వ శాఖల)ను కలిపి ఒక పోస్టుగా తయారు చేశారు. ఇక సర్వేయర్ల విషయానికొస్తే వీరు ప్రస్తుతం పనిచేసేది రెవిన్యూశాఖ అయినప్పటికీ, వీరికంటూ సర్వే శాఖ ఒకటుంది. అలాగనీ వీరు ఈ రెండు శాఖల అధికారులద దగ్గరా పనిచేస్తున్నారు. వీరంతా అన్ని శాఖలకు సంబంధించిన పనులూ చేస్తున్నప్పటికీ వీరికి ఏశాఖ నుంచి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి, వీరికి సర్వీసులో ఏశాఖ నుంచి పదోన్నతి కల్పించాలి అనే విషయంలో క్లారిటీ లేదు.

 ఈ మూడు శాఖలకు చెందిన సిబ్బంది 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 45వేలకు పైనే ఉన్నారు. ప్రస్తుతం అన్నిశాఖలకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు వచ్చినప్పటికీ వీరికి మాత్రం ఎలాంటి జీఓలు రాలేదు. దీనితో తాము ఏశాఖకు చెందిన ఉద్యోగులగా తమను ప్రభుత్వం గుర్తిస్తుందో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక.. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి, మంచి ఉద్యోగాల్లో చేరిపోయారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 85శాతం ఉద్యోగులంతా పట్టభద్రులే అయినప్పటికీ, వీరి ఉద్యోగం నాల్గవ తరగతికి చెందినదా, 5వ తరగతికి చెందినదా..లేదంటే వీరిని ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఖ్య ఉద్యోగులుగా గుర్తించినదా అనేదీకూడా తెలియడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా వ్యత్యాసాలు ఉండటంతో ప్రభుత్వం కల్పించే పదోన్నతుల విషయంలో చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోనీ రెగ్యులర్ ఉద్యోగం కదాని దైర్యం చేసి కొనసాగించుకుందామనుకున్నా..నేటికీ వీరందరికీ సర్వీసు రూల్సు లేకపోవడం, రెండేళ్ల ప్రొబేషన్ కాలం అక్టోబర్ 2తో పూర్తవడంతో తమను ఏ శాఖ కింద ఉద్యోగులుగా ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోనని వీరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ద్రుష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఈ మూడు శాఖల ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

మరోపక్క మిగిలిన శాఖలకు సంబంధించి సర్వీసు నిబంధనలు అమలు చేసినా, అవి మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మరీ తక్కువ స్థాయి పదోన్నతులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోకి ఉద్యోగులుగా చేరితే తమకి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విషయంలో కనీసం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఈ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలు వచ్చాయని వెళ్లిపోవడంతో, మరికొంత మంది ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడగా, మరికొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇంకా భర్తీచేయకుండానే వదిలేసింది.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తోంది తప్పితే.. వీరి సర్వీసు రూల్సు, పదోతన్నల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే పనికి మాత్రం పూనుకోవడంలేదు. మరో విచిత్రం ఏంటంటే మరో మూడు నెలల్లో సర్వీసులు రెగ్యులర్ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రం ఉద్యోగులందరికీ సర్వీసు రిజిస్టర్లు  ఓపెన్ చేసింది ప్రభుత్వం. అక్టోబరు 2 తరువాత ఆ రిజిస్టర్ లో ఆయా ప్రభుత్వ శాఖలు సర్వీసు నిబంధనల ఆధారంగా ఎంట్రీలు జరపాల్సి వుంటుంది. మరి ఆ సమయంలో ఏ ప్రభుత్వశాఖ కింద ఈ ఉద్యోగులను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తెలియన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మాత్రం అక్టోబరు 2 దాటేవరకూ ఒక కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు..!

Tadepalle

2021-08-04 02:09:30

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. సచివాలయ ఉద్యోగుల సిబిఏసీ పరీక్ష రద్దు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అక్టోబరు 2 నాటికి ఉద్యోగులందరికీ రెండేళ్ల ప్రొభేషన్ పూర్తయ్యే సమయానికి పెట్టాలనుకున్న క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ పరీక్ష వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, సాంకేతిక కారణాలను, అవసరమైతే కోర్టుకు వెళ్లాలనుకున్న విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో రెండేళ్లపాటు సర్వీసులు అందించిన సచివాలయ ఉద్యోగులకు సిబిఏసీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారని, ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం వెల్లడించారు. సీఎం సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఈ పరీక్షలో మినహాయింపు ఇవ్వడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని అన్ని రకాల ముఖ్యవిషయాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయంలో ఉద్యోగులంతా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు.

తాడేపల్లి

2021-08-03 02:11:18

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. విలేజ్ క్లినిక్స్ లోనూ మెడికల్ టెస్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు ఆనుకుని నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్స్ లలో 14 రకాల మెడికల్ టెస్టులు చేయడానికి నిర్ణయించింది. గతంలో కేవలం మందులను, సిబ్బందిని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో, నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలను ప్రస్తావిస్తూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో స్పందించిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నేత్రుత్వంలోని ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించేచోట, ప్రాధమిక వైద్యపరీక్షలు కూడా అందుబాటులో తేవాలని సంకల్పించింది. ఆపై మందుల సంఖ్యను తగ్గిస్తూ.. మెడికల్ టెస్టులను విలేజ్ క్లినిక్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో రాష్ట్ర అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్లినిక్ లలో స్టాఫ్ నర్సుతోపాటు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కూడా అందుబాటులో ఉంటారు. పిల్లకు అన్ని రకాల వేక్సిన్లు ఇక్కడే వేస్తారు. ఆరోగ్యశ్రీకార్డుల సమాచార కూడా వివేజ్ క్లినిక్ లకు మేపింగ్ చేస్తారు. వీటి ద్వారానే ప్రాధమిక వైద్యం అందించి.. మరీ అవసరమైతే ఇక్కడి నుంచే పీహెచ్సీకి, ఆపై జిల్లా ఆసుపత్రులకు రోగులను పంపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 62 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 12 రకాల ప్రాధమిక వైద్యసదుపాయాలు, టెలీమెడిసిన్, వీడియో కాన్ఫరెన్సు విధానం కూడా అందుబాటులో వుంటుంది. అవుట్‌పేషెంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌కూడా అక్కడే ఉంచుతున్నామన్న అధికారులు దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని, 67 రకాల బేసిక్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విలేజ్ క్లినిక్ విధానం దేశంలోనే ఒక వినూత్న విధానమని, వీటి ద్వారా గ్రామీణ ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్ఎంపీలను ఆశ్రయించే పరిస్థితి ఉండదన్నారు. గ్రామస్థాయిలో వివిధ రకాల మెడికల్ టెస్టులు చేయడం వలన ప్రజల ఆరోగ్యపరమైన భారం పూర్తిగా తగ్గుతుందని అధికారులు చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్ లలో మెడికల్ టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది..

తాడేపల్లి

2021-08-03 01:55:13

Tadepalle

2021-08-01 15:49:55

సచివాలయాలున్నా.. మీ-సేవాలదే హవా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల ను ఏర్పాటుచేసి అందులో 745 సర్వీసులను అందుబాటులోకి తెచ్చినా నేటికీ మీ-సేవ సర్వీసులదే అగ్ర తాంబూలాన్ని అందుకుంటున్నాయి.. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మీసేవా కేంద్రాల్లో 62వేల దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు ఇస్తే సచివాలయాల్లో కేవలం 21 వేల దరఖాస్తులకు కేవలం 18వేల ద్రువీకరణ పత్రాలు మాత్రమే జారీచేశారు. ఈ సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలోని ఓ మండలంలోనిది. ఆధారాలు లేకుండా చెబుతున్న సంఖ్య కాదు, అధికారికంగా తహశీల్దార్ లాగిన్ ద్వారా విడుదల చేసిన సంఖ్య. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి రెండవ అత్యధి మండలాలున్న జిల్లాగా ఉంది(64). ఈ జిల్లాలోని ఒక్క మండలంలోనే 16 గ్రామ సచివాలయాలున్నచోట మీసేవా కేంద్రాలు అంతభారీ సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశాయంటే..ఇక జిల్లావ్యాప్తంగా ఎన్ని వేలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశారో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి గ్రామసచివాలయాలు వచ్చిన తరువాత మీ-సేవ సర్వీసుల సంఖ్య తగ్గాలి. కానీ దానికి విరుద్దంగా సచివాలయాల్లో అత్యల్పంగా సర్వీసులు అందుబాటులోకి వస్తే.. మీ-సేవల ద్వారా సచివాలయాల కంటే నాలుగింతలు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలుగుతున్నాయి.

ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం చేసిన తప్పిదమే కనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం అన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను నియమించింది. వారిని నియమించి 20నెలలు గడుస్తున్నా వారికి చట్టబద్ధంగా జీఓనెంబరు 149 ద్వారా  కట్టబెట్టాల్సిన అధికారాలు, బాధ్యతలు ఇవ్వలేదు. అధికారాలు చేతిలో ఏమీ లేకపోవడంతో గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా మిన్నకుండిపోయారు. అధికారాలు ఇవ్వకుండా తాము ఎలా పనిచేయాలో తెలియడం లేదని సమాధానం చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వం అక్షరాల కోల్పోయిన ఆదాయం చూసుకుంటే కోట్ల రూపాయల్లోనే ఉంది. అటు ప్రభుత్వం కూడా సేవలైతే అందుబాటులోకి తెచ్చింది గానీ, ఆయా ప్రభుత్వశాఖలకు మీసేవాలను అనుసంధానం మాత్రం చేయలేదు. దీనితో ఏ సేవ కోసం సచివాయాలకు వచ్చినా ప్రజలకు ఇక్కడ ప్రస్తుతం ఆ సేవలు అందుబాటులో లేవనే సమాధానమే వచ్చేది. ఇక్కడలేని సేవలు మీ-సేవలోనే ఉంటాయని భావించి అందరూ అక్కడి నుంచే వివిధ రకాల ద్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. నాటి నుంచి నేటి వరకూ సచివాలయాల్లో అందించే సేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో నేటికీ అత్యవసర పనులకు వారంతా మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. అలా రాష్ట్రంలో మీసేవా కేంద్రాలు 60శాతం సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలిగితే.. కేవలం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలు కేవలం 40శాతం ఒక్కోసారి తక్కువగా 30 శాతం కూడా కొన్ని జిల్లాల్లో సర్వీసులు మాత్రమే ఇస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి గ్రామవాలంటీర్లు, 12శాఖల సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందించే సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు కట్టబెట్టగలిగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగేది. కేవలం పంతానికి పోయి, ఆ అధికారాలన్నింటినీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతిలోనే ఉంచేయడంతో వీరి ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు అందకుండా పోయాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికీ రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్జార్జి బాధ్యలు, డిప్యూటేషన్లు అప్పగించడం, ప్రధాన సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులోకి లేకపోవడంతో సచివాలయం నుంచి అందించే సేవలు ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయో తెలుసుకోలేని పరిస్థితి. మిగిలిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు సచివాలయాల్లోనే ఉన్నా..వారికి అధికారాలు ఇవ్వకపోవడంతో.. తమని ప్రభుత్వం ఏ తరహా పనులు పురమాయించిందో అవే పనుల్లో వారు నిమగ్నం అయిపోతున్నారు. ఈ తరుణంలో సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులన్నీ మీ-సేవా కేంద్రాలకు తరలిపోతున్నాయి. 

ఇలా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల్లో ఆదాయం పోతుండటమే కాకుండా, అసలు సచివాలయాల్లో ఎన్ని సేవలు అందుతున్నాయో కూడా ప్రజలకు అవగాహన కలగడం లేదు. ఇదే విషయాన్ని గ్రేడ్-5 కార్యదర్శిలు మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డీపీఓ, కలెక్టర్, రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు సమర్పించినా జీఓనెంబరు 149పై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో అధికారం ఇవ్వకుండా తామెలా పనిచేయగలమంటూ వారు కూడా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తున్నారు. ఫలితంగా సచివాలయాలకు వివిధ సేవల ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. సచివాలయాలున్న.. మీ సేవా కేంద్రాలదే అగ్రరాజ్యమవుతుంది. ఒక రోజులో ఒక్కో సచివాలయంలో సగటు పది సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలిస్తే..మీ-సేవా కేంద్రాల్లో మాత్రం రోజుకి 20 నుంచి 60 వరకూ సర్వీసు రిక్వెస్టులు పూర్తిచేయగలుగుతున్నారు. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు జాయింట్ కలెక్టర్లు మారారు. వీరైనా ఈ జీఓనెంబరు 149పై ద్రుష్టిసారితే గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు వచ్చి, గ్రామ సచివాలయాల ద్వారానే ప్రజలకు అన్ని రకాల సేవలు అంది ప్రభుత్వానికి ఆదాయం కూడా కోట్ల రూపాయాల్లో అందుతుంది. అలా కాకుండా  అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లోనే ఉంచేస్తే మాత్రం ఇదే పద్దతి కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది..!

Tadepalle

2021-08-01 06:43:33

స్టేట్ లిటిగేషన్ పాలసీ సమర్థవంతంగా అమలు..

నూతనంగా తీసుకురానున్న స్టేట్ వ్యాజ్యం(Litigation) పాలసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.శనివారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో  వ్యాజ్యాలు (Litigation)అంశంపై న్యాయ అధికారులు,కార్యదర్శులతో ఇంటరాక్టివ్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న సిఎస్ మాట్లాడుతూ స్టేట్ లిటిగేషన్ పాలసీని నిరంతరం మానిటర్ చేస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వరం పరిష్కారం అయ్యేలా చూడవచ్చని అన్నారు.ఈ విధానంతో కేసులు వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖలు అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని తద్వారా సకాలంలో ఆయా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక ఈ విధానాన్ని సమన్వయంతో ఒక నిర్దిష్ట కాలవ్యవధి తో నిర్వహించ గలిగితే కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని తగ్గించ వచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ను మరింత బలోపేతం చేసేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.అందుకే ఎపి ఆన్ లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.దానివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు.దీనిపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.

సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరాం మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆదిశగా కృషి చేయాలని కోరారు. అంతకుముందు ఈసమావేశంలో  నూతన లిటిగేషన్ పాలసీపై విస్తృతంగా చర్చించారు.అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన విధానాలు,నిబంధనల ప్రేమ్ వర్క్ గురించి ప్రభుత్వ న్యాయవాదులు(GP)లకు నిరంతరం వివరించే మెకానిజం ఏర్పాటు చేయడం ద్వారా వివిధ వ్యాజ్యాలు అడ్మిషన్ స్థాయిలోనే కంటెస్ట్ చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అదే విధంగా వివిధ వ్యాజ్యాలపై పీరియాడికల్ సమీక్ష, ఫెల్యూర్ పై జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడంపై న చర్చించారు. అంతేగాక ఆన్లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ (OLCMS)అమలు విధానం పైన సమీక్షించారు.అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్ల (GP)లో కార్యాలయాలను మరింత బలోపేతం చేయడం తోపాటు ఆకార్యాలయాల్లో ఆన్ లైన్ కేసు లోడ్ మేనేజిమెంట్ సిస్టమ్ (OLCMS)ను ప్రవేశ పెట్టడంపై చర్చించారు. అంతేగాక ప్రతి ప్రభుత్వ శాఖలోను లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వయిజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. కోర్టు కేసుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ, అధికారులకు అవగాహన అంశాలపై చర్చించారు.

ఈసమావేశంలో ,రాష్ట్ర ఆదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి,న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీతతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, పలువురు న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-31 17:13:00

సంక్షేమ సహాయకులకు పదోన్నతులు లేవు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగికైనా సర్వీసులో పదోన్నతులు ఉంటాయి..విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యా సంక్షేమ సహాయకులకు మాత్రం వారి ఉద్యోగాల్లో మాత్రం పదోన్నతులు లేవట. ఇదే ఎవరో అన్నమాట కాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వమే ఈ విషయాన్ని సమాచార హక్కుచట్టం దరఖాస్తుపై ఇచ్చిన క్లారిటీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న విద్యా, సంక్షేమ సహాయకులకు ఇప్పటి వరకూ పదోన్నతులపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, దానిపై ఇప్పటి వరకూ సర్వీస్ రూల్స్ పై దానికోసం నిర్ధేశాలు జారీ చేయలేదని, కనీసం డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా పెట్టలేదని, దానికి సంబంధించిన కారణాలను కూడా పొందు పరచలేదనే విషయాన్ని పేర్కొంది. అయితే ఈ సమాచారం ఇప్పటిది కాదు.. 30-09-2020న కర్నూలుకి చెందిన కె.శ్రీరాములు అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకి  సంక్షేమశాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ 30-09-2020న ఇచ్చిన సమాధానం. ఇదెందుకు మీకు ఇపుడు గుర్తొచ్చిందనే అనుమానం కూడా ఈ వార్త చదువుతున్న వారికి రావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను నిబంధనలకు లోబడి రెండేళ్లు పూర్తికావస్తొన్న సందర్భంగా.. క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని ప్రకటించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్న వేళ ఈ ఆర్టీఐ సమాచారం కూడా ఉద్యోగుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలాగని నాటి నుంచి నేటి వరకూ విద్యా సంక్షేమ సహాయకుల పదోన్నతుల విషయమై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనితో రెండేళ్లు గడుస్తున్నా తమ ఉద్యోగాల్లో పదోన్నతులపై సరైన వివరణ ఇవ్వని ప్రభుత్వం.. టంచనుగా ప్రొబేషన్ పూర్తైన తమకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టడానికి సిద్ధమైపోయిందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశేషం ఏంటంటే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ విద్యా, సంక్షేమ సహాయకుల ఉద్యోగులను సచివాలయాల్లో నియమించేందుకు బిసీవెల్ఫేర్, ఎస్సీవెల్ఫేర్, మైనార్టీవెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా నాగు శాఖల ఉద్యోగాలను కలిపి తమ ఒక్క శాఖగా మార్చేసిందని.. తద్వారా ఇక్కడ మూడు శాఖల్లో ఉద్యోగాలు కూడా రద్దైనట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇన్నిచేసి, తమకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం రెండేళ్ల సమయంలో సర్వీస్ రూల్స్ ని మాత్రం తయారు చేయలేదని, అలాగని పదోన్నతుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ నిరుపేద కుటుంబాలకు అందించే తమ ఉద్యోగాలు, పదోన్నతులపై క్లారిటీ లేకపోతే తాము జీవితాంతం ఈ ఉద్యోగమే సచివాలయాల్లోనే చేయాలా.. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు ఎలాంటి పదోన్నతులు ఉండవా, ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమో తమకు తెలియడం లేదని అంతా తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగాల్లో కొన్ని శాఖలకే ప్రభుత్వం సర్వీస్ రూల్స్, గెజిట్ నోటిఫికేషన్(రాజపత్రం) విడుదల చేసిందని, తమ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీచేయపోవడంతో తాము ఏ ప్రభుత్వశాఖకు చెందుతామో మాకే అర్ధం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగని సచివాలయాల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా అంటే అదీలేదని, కనీసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో సొంత మొబైల్ ఇంటర్నెట్, తమ కంప్యూటర్లతోనే పనులు చేస్తూ ప్రజలకు సేవలు చేయాల్సి వస్తుందని విద్యా, సంక్షేమ సహాయకులు కన్నీరు మున్నీరవుతున్నారు.  ఈ సమయంలో చాంతాడంత సిలబస్ సర్వీసు రెగ్యులర్ చేయడానికి మూడు నెలల ముందు ఇచ్చి దీని ద్వారా ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసవ్వాలని.. లేదంటే ప్రస్తుతం ఉన్న రూ.15 వేల జీతంతోనే మళ్లీ పరీక్ష పెట్టే వరకూ పనిచేయాలని నిబంధన పెట్టడం ఎంతవరకూ సమంజసమని వీరంతా ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్లు గడస్తున్నా నేటికీ ప్రతీ చిన్న పనికీ పంచాయతీలపైనే ఆధార పడాల్సి వస్తుందని, సచివాలయాలు ఏర్పాటు చేసినా వాటికి స్వయం పతిపత్తి లేదని, కనీసం పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఇచ్చిన జీఓనెంబరు 149ని అమలు చేయడం ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, పరిపాలన అనుమతులు ఇస్తే కనీసం కాస్తైనా సౌలభ్యంగా వుంటుందని వీరంతా వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల గ్రామ పంచాయతీల్లో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు 1852, గ్రేడ్-2లో 703, గ్రేడ్-3లో 1679, గ్రేడ్-4లో 2907 మంది పనిచేస్తున్నారని వీరంతా చెబుతున్నారు. అందులో ఒక్కో  సీనియర్ కార్యదర్శికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు, డిప్యూటేషన్లు వేయడంతో కనీస అవసరాలు కూడా వారంతా వచ్చేంత వరకూ తీరడం లేదని, ఒక్కో సారి అత్యవసర సమయంలో తమ సొంత డబ్బులే పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అలాగని చేసిన పనులకు, ఖర్చుకి తిరిగి పంచాయతీల నుంచి వస్తున్నాయా అంటే అదీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు ఇస్తే కనీసం నిత్యం తమకు అందుబాటులో ఉండే వారి ద్వారానైనా పనులు జరుగుతాయంటే.. దానిని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఏవిధంగా పనిచేయమంటే తాము ఆవిధంగా పనిచేయాలని, ఇప్పటికే తాము కూడా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడా కనీసం ఫలితం కూడా రావడం లేదని చెబుతున్నారని విద్యా, సంక్షేమ సహాయకులు వాపోతున్నారు.

2019 అక్టోబర్ 2న ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నేటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏఏ ఉద్యోగులు ఏఏ శాఖల కిందకు వస్తారు. వారికి ఎలాంటి పదోన్నతులు ఉంటాయి, వారు ఎవరికీ జవాబుదారీ, కొన్ని ఉద్యోగాలకే గెజిట్లు(రాజపత్రం) విడుదల చేసి, మిగిలిన శాఖల ఉద్యోగుల కోసం ఎందుకు రాజపత్రాలు విడుదల చేయలేదు, అసలు వీరి ఉద్యోగాలు ఎప్పటికి రెగ్యులర్ అవుతాయో కూడా సరైన క్లారిటీ ఇవ్వడంలో నేటికీ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచి అనుబంధ శాఖల నుంచి కూడా క్లారిటీ రాలేదు. దీనితో తమ ఉద్యోగాలు జీవితాంతం రూ.15వేలు జీతంతోనే అరకొర వసతులతోనే పనిచేయాలేమో అనుమా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరి ఆందోళన తారాస్థాయికి చేరుకోవడంతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని వివిధ శాఖల ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో జరిగే సంభాషనలు ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాయానే అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూలై నెల పూర్తైపోయింది..ఇక మిగిలింది ఆగస్టు, సెప్టెంబరు, నెలలు మాత్రమే. అక్టోబరు 2నాటికి ఎంత మంది వార్డు, సచివాలయ ఉద్యోగుల ఉద్యోగాలు సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందో.. అదే సమయంలో సంక్షేమ, విద్యా సహాయకుల ఉద్యోగాలకు పదోన్నతులపైనైనా మార్గనిర్ధేశకాలు ఇస్తుందో.. అవేమీ చేయకుండా.. ఖజానాపై సుమారు 300 కోట్లకు పైనే భారం పడుతుందని, వీరి సర్వీసుని మరో రెండేళ్లు ఇదే జీతానికి పనిచేసేలా అడుగుడుగునా ప్రత్యేక పరీక్షల పేరుతో మరికొంత కాలం కాలయాపన చేస్తుందా అనేది తేలాల్సి వుంది..!

Tadepalli

2021-07-31 01:41:33