1 ENS Live Breaking News

Tadepalle

2021-07-10 12:55:17

మళ్లీ తెరపైకి జర్నలిస్టుల విద్యార్హతలు..

ఆంధ్రప్రదేశ్ లో కార్డు (అక్షరం రాయడం రాకపోయినా వైట్ అండ్ వైట్ డ్రెస్సేసుకొని కలరిచ్చే) జర్నలిస్టుల ను నియంత్రణ చేయాలంటే అక్రిడిటేషన్ల జీఓలో మార్పులు మాత్రమే చేస్తే సరిపోదని.. విద్యార్హతల విషయంలో గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చినట్టు కనిపిస్తుంది. మండల కేంద్రాల్లో ఖచ్చితంగా ఇంటర్, జిల్లా కేంద్రాల్లో డిగ్రీ, స్టాఫ్ రిపోర్టర్లకు జర్నలిజంలో డిప్లమాలేదా, డిగ్రీ, పీజీ కోర్సులను అర్హతలుగా చేసి పక్కాగా అమలు చేస్తే ఆటోమేటిక్ గా కార్డు జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దానినే నిజం చేస్తూ.. ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశరాజధాని డిల్లీలోని పిఐబి అక్రిడిటేషన్ కు కూడా లేని నిబంధనలను  తీసుకొచ్చింది. ఈ విషయంలో కోర్టు నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు పొందింది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి ప్రెస్ అక్రిడిటేషన్లకు సుమారు 40వేల మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. గత ఏడాది అక్రిడిటేషన్ల సంఖ్య చూస్తే కేవలం 28వేల మందికే మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ తరుణంలో కార్డు జర్నలిస్టులు అధికమై పోయారని.. అందులో వర్కింగ్ జర్నలిస్టులను మాత్రమే గుర్తించి కార్డు లేదా నకిలీ జర్నలిస్టులను పూర్తిగా ఏరిపారేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతుంది. దీనికోసం ప్రభుత్వం అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు తావులేకుండా చేయడంతో పైచేయి సాధించింది ప్రభుత్వం. వాస్తవానికి జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ జర్నలిస్టు సంఘాలకు నాయకులమని చెప్పుకునే వారికి ప్రభుత్వం విడుదలచేసిన జీఓ కాపీలను ఇంగ్లీషులో చదివి..ఆపై జిల్లా చైర్మన్ కు అందులోని లోటు పాట్లను చెప్పే సామర్ధ్యం లేనివారే అధికంగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులు ఉంటూ వస్తున్నారు. దీనితో ఇలాంటివారికి చెక్ పెట్టాలంటే ముందు వారికి సమావేశాల్లో ప్రాతినిథ్యం లేకుండా చేసింది ప్రభుత్వం. దెబ్బతికి అక్రిడిటేషన్ కమిటీల్లో ఆ..తరహా జర్నలిస్టులకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్న, మధ్యతరహా పత్రికలు, ప్రధాన పత్రికలు, న్యూస్ టీవీ ఛానళ్లు, లోకల్ కేబుల్ టీవీలు, న్యూస్ ఏజెన్సీలకు జిఎస్టీ మెలిక పెట్టింది ప్రభుత్వం. నిత్యం పత్రికలు ముద్రించాలని..ఎన్ని పత్రికలు ముద్రిస్తున్నారో దానికి అనుగుణంగా జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయాలని, క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో పెట్టాలని, విద్యార్హతలతోనే మీడియా సంస్థలకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేయాలన్ని ప్రస్తుతం సమాచారశాఖ ప్రధాన నిబంధన. పెద్ద పత్రికలు జీఎస్టీ రిటర్న్స్, క్లిప్పింగులు, ఇతర అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నవారికి, టివి ఛానళ్లకు అపుడే అక్రిడిటేషన్లకు లైన్ క్లియర్ అయిపోయాయి. అయినప్పటికీ అలా మంజూరైన వారిలోనూ.. ఇంకా  కనీస విద్యార్హత లేనివారు చాలా మందే ఉన్నారని అలాంటి వారిని పూర్తిగా వడపోసి వర్కింగ్ జర్నలిస్టులను గుర్తిస్తూ వారికే అక్రిడిటేషన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా  సమాచారశాఖలోని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న విద్యార్హతల విషయంలో ప్రధాన జర్నలిస్టు సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో వారికి సర్ధిచెప్పి.. ఎలాగైనా కనీస విద్యార్హతలు నిర్ణయించి దానిని అమలు చేయాలని భావిస్తుంటద సమాచారశాఖ. అదే జరిగిగే రాష్ట్రంలోని చాలా మంది కార్డు/నకిలీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పొందే అర్హత రాదు. అలాగని మీడియా సంస్థలు అక్రిడిటేషన్లు అమ్ముకోవాలని చూసినా ఆ ప్రయత్నం కూడా ఫలించకుండా ఈ ప్రభుత్వంలోనే కఠిన చర్యలు తీసుకొని వర్కింగ్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా పత్రికలను కూడా ఒకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రిడిటేషన్ల మంజూరు ఆలస్యమైందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కోర్టులో ఈ విషయం ఉండటం ఆలస్యం అమవడం ఒక కారణమైతే..తప్పకుండా జర్నలిస్టుల విద్యార్హత, నిజమైన జర్నలిస్టులను గుర్తించే కార్యక్రమం అమలు చేయకపోతే కార్డుకోసం..పైరవీలు చేయడం కోసం అక్రిడిటేషన్లు తీసుకునే వారు ఎక్కువైపోతారనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు ముద్రించలేనివారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వలేదు. జీఓ ప్రకారం అనుబంధ పత్రాలు ఆన్ లైన్ అప్లోడ్  చేస్తే అక్రిడిటేషన్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది సమాచార శాఖ. గతంలో న్యూస్ ఏజెన్సీలు ఒక లేఖ ఇస్తే అక్రిడటేషన్లు ఇచ్చేవారు. ఇపుడు వారు కూడా ఇతర మీడియా సంస్థల మాదిరిగానే అనుబంధ ధ్రువపత్రాలు ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంది. అలా చేసిన వారి దరఖాస్తులే పరిగణలోనికి తీసుకుంటామని కూడా చెబుతోంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణలో ఈ విద్యార్హత పక్కాగా అమలు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనిని కాస్త గట్టిగానే అమలు చేసేలా కనిపిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఇప్పటికే సమాచారశాఖ మంత్రి పేర్నినాని ఇదే నకిలీ, అర్హతలేని జర్నలిస్టుల విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఎప్పుడు జర్నలిస్టుల సంఘాలు కలిసినా ప్రస్తావించడం కూడా ఇపుడు జర్నలిస్టుల విద్యార్హత విషయానికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం జర్నలిస్టుల విద్యార్హత విషయంలో కట్టుబడి వుంటుందా..లేదంటే జర్నలిస్టు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా..ఎప్పటిలాగే కాలం వెళ్లదీస్తూ ఉండిపోతుందా..?!

Tadepalle

2021-07-10 01:44:00

సేవలు బారేడు.. అనుసంధానం మూరెడు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు గ్రామ/వార్డుల్లోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకి ఇంకా బాలారిష్టాలు తీరలేదు. ఇబ్బడి ముబ్బడిగా సేవలు ప్రకటించేసిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటికీ అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అనుసంధానం పూర్తికాలేదు. కేవలం రాష్ట్వ్యాప్తంగా కొన్ని సచివాలయాలకు మాత్రమేమే సిఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్) విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లో ఉన్న సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద 50శాతం మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితో ప్రభుత్వం ప్రకటించిన 745 సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. వీటికి తోడు సచివాలయాలకు ఇంటర్నెట్ ప్రధాన సమస్యగా మారుతోంది. అన్ని గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ స్పీడ్ రాకపోవడంతో చాలా కార్యకలాపాలు ఆదిలోనే నిలిచిపోతున్నాయి. వీరికి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించింది. అయితే అది సాధారణంగా గ్రుహ అవసరాలకు ఇచ్చే ప్యాకేజీతో అందించడం వలనే స్పీడ్ రాక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సచివాయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు. వారంలో మూడు రోజులు ఇంటర్నెట్ స్పీడ్ సమస్యను సచివాలయాలు ఎదుర్కొంటున్నాయి. వీటికిత తోడు ప్రభుత్వం సాధారణ కంప్యూటర్లు, ప్రింటర్లు మాత్రమే సచివాలయాలకు అందించింది. అపుడే చాలచోట్ల కంప్యూటర్లకు రిపేర్లు వచ్చాయి. ప్రింటర్లు పనిచేయకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్లే తమ సొంత నిధులతో వాటిని బాగు చేయిస్తున్నారు. ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రెండు కంప్యూటర్లును మంజూరు చేసింది.  14 మంది సిబ్బంది ఒక సిస్టమ్ ను మాత్రమే దశల వారీగా వినియోగించుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఉద్యోగులు ఆ ఇబ్బందులు పడలేక సొంతంగా ల్యాప్ ట్యాప్ లు సొంతంగా తీసుకెళ్లి పనిచేసుకోవాల్సివస్తుంది. మరికొంత మందికి ల్యాప్ టాప్ లు అందుబాటులోల లేని చోట్ల చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. ప్రభుత్వం సేవలు పెంచిన తరువాత కామన్ సర్వీస్ సెంటర్ విధానాన్ని గ్రామసచివాలయాలకు అనుసంధానం చేస్తే ఇటు రాష్ట్రప్రభుత్వ శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అనుమతులు కూడా గ్రామ స్థాయిలోని సచివాలయాల నుంచే ఇవ్వడానికి ఆస్కారం వుంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖాలాలు ఎక్కడా కనిపించడం లేదు. పైగా కొత్తగా చేర్చిన సేవలపై సిబ్బందికి ఎలాంటి శిక్షణ కూడా లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు ఆ సేవల వివరాలు ఏంటో ఇప్పటికీ సచివాలయ సిబ్బందికే తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం గ్రామ, వార్డు స్థాయిల్లోని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందించేసేవలపై అవగాహన ఉంటే వారు వాలంటీర్లకు తెలియజేసి.. ప్రజలకు ఆ సేవలను చేరువ చేస్తారు. కానీ అలా ప్రోటోకాల్ స్థాయిలో ప్రభుత్వం ఇక్కడ అందించే సేవలపై ప్రజలకు గానీ, సిబ్బందికి గానీ అవగాహన కల్పించలేదు. దీనితో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది రాష్ట్రంలోని గ్రామసచివాలయాల సేవల పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలపై సచివాలయాల్లో ప్రత్యేక డిస్ప్లే  చార్టులు ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లలకైనా సచివాలయాల్లో అందే సేవలపై ప్రత్యేక ప్రచారం, అవగాహన కల్పించాల్సిన సమయం ఆశన్న మైంది.  ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం ఉండటం, అందులో చాలా లోపాలు ఉండటంతో వాటిని గ్రామ స్థాయిలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దానికోసం చాలా మంది అవగాహన లేనివారం  మేసేవా కేంద్రాలను, బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు వెళుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అత్యధిక ఆదాయం వీటిద్వారానే పోతుంది.  వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయం కూడా గ్రామస సచివాలయాలు కోల్పోతే..ఇక్కడ ఎన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగ పడవనే గుర్తించాలి.. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుని సచివాలయాల్లో అందించే సేవల విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..!

Tadepalle

2021-07-09 01:47:27

స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు షురూ..

రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావడం కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం పులివెందులసహా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం పులివెందులలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి.. వారిలో స్కిల్స్ ను పెంపొందించేందుకు రూ. 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్ కాలేజీలు ఇలాంటివి రాబోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) లోని హాస్టల్ భవనం సమీపంలో ఈ స్కిల్ ట్రైనింగ్ అకడామీ ఏర్పాటుకోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. ఈ స్కిల్ అకాడమీలో పులివెందుల పరిసర ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉపాధి కల్పించడం కోసం అధునాతన ఐటి శిక్షణా కార్యక్రమాలతోపాటు సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ పరిశ్రమ వంటి ప్రధాన రంగాలలో అధునాతన నైపుణ్య శిక్షణ ఇస్తారు.  రాష్ట్రంలో ఉండే యువతకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడంతోపాటు.. అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లోనూ స్కిల్ కాలేజీలకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేసింది. స్కిల్ కాలేజీల్లో హైఎండ్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్థానికంగానే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్శిస్తారు. ఈ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఐటి, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి బంగారరాజు పాల్గొన్నారు.

Pulivendula

2021-07-08 15:47:55

Tadepalli

2021-07-08 01:31:00

Tadepalli

2021-07-08 01:23:23

గ్రామ రక్షణ ఇక మరింత పటిష్టం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గ్రామాల పటిష్టత మరింతగా పెరగనుంది. జీఓనెంబరు 59 ద్వారా గ్రామ సంరక్షణా కార్యదర్శిలుగా వున్నవారిని ప్రభుత్వం సాధారణ పోలీసులుగా గా మార్చడంతో గ్రామంలో సచివాలయానికి ఒకరు చొప్పున రక్షణగా నిలవనున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లలేని మహిళలకు గ్రామస్థాయిలో సేవలు అందించడానికి మహిళా పోలీసులు సచివాలయం దగ్గర నుంచే స్టేషన్ వరకూ బాధితుల తరుపున ఫిర్యాదులు పంపిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లోని అల్లర్లు జరగకుండా, గొడవలు రేగకుండా చూసేందుకు వీరికి ప్రభుత్వం సాధారణ పోలీసులు మాదిరిగా పోలీస్ డ్రెస్ ఇవ్వడంతో గ్రామాలకు ఖాకీ పవర్ ఎంతో పటిష్టం కానుంది. ఇప్పటికే వీరందరికీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎస్ఈబీ), పోలీస్ స్టేషన్లు, మండల కార్యాలయాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో శిక్షణ పూర్తయింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో శిక్షణ తీసుకున్న అనంతరం వీరంతా దశల వారీగా క్యాప్సూల్ శిక్షణ కూడా తీసుకుంటారు. ఒంటికి ఖాకీ చొక్కా..చేతిలో లాఠీ పట్టుకొని గ్రామాల్లో అనునిత్యం పహాకాస్తూ ప్రజలకు రక్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చి దిశ యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయి నుంచి వార్డు, పట్టణాల్లో సైతం యాప్ ను విరివిగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేయించే విషయంలో మహిళా పోలీసులు చాలా కీలకంగా వ్యవస్తున్నారు. సాదరణంగా పోలీసులైతే ఒక్క స్టేషన్ విధులకే పరిమితం అవుతారు. కానీ రాష్ట్రప్రభుత్వం వీరిని ప్రత్యేకంగా నియమించడంతో గ్రామ రక్షణతోపాటు, ఐసిడిఎస్, వైద్యం, ఎన్నికల విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ సమయంలో మహిళా పోలీసులు పోషించిన ప్రత్యేక పాత్ర కారణంగా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో అత్యధికంగా మహిళలు, బాలింతలు, ప్రస్తుతం గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా అందింది. తద్వారా కరోనా వైరస్ అధికం కాకుండా కాపాడటంలో వీరు ఎంతో కీలకంగా వ్యవహరించారు. రానున్న రోజుల్లో వీరు సచివాలయ పరంగా మరిన్ని విధులు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏవైనా గొడవలు జరిగితే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా గ్రామంలోని సచివాలయం కేంద్రంగా ఫిర్యాదులు సమర్పించడంతోపాటు, అత్యవసర సమయంలో వీరిని నేరుగా సంఘటనా స్థలాలకు తీసుకెళ్లే వెసులు బాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కల్పించడం శుభపరిణామ మని గ్రామాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలకు మహిళా పోలీసులు కవచంలా ఉంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్, కేంద్రం అమలు చేస్తే దిశ చట్టానికి కూడా కార్యరూపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సంరక్షణకు మహిళా పోలీసులు ఒక ప్రత్యేక కవచంలా  తయారుచేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ విధానంతో గ్రామాలు, పట్టణాల్లో మహిళా పోలీసులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు రక్షణగా నిలవనున్నారు..!

తాడేపల్లి

2021-07-08 01:19:35

Tadepalle

2021-07-07 14:27:47

తల్లిబిడ్డల మృతిపై నివేదికివ్వండి..

పాడేరు ఐటిడిఏ పరిధిలో ప్రసవానికి డోలీలో తీసుకు వెళ్తున్న గర్బిణిస్త్రీ తోపాటు ఆమెబిడ్డ కూడా మరణించిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి  బుధవారం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జి.మాడుగుల మండలం గెమ్మెలిబారు గ్రామానికి చెందిన కొర్రా జానకి (25) అనే గిరిజన మహిళను కాన్పుకోసం గిడుతూరు గ్రామం నుంచి జి. మాడుగుల ఆసుపత్రికి  తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించిన ఆమహిళతోపాటు బిడ్డ కూడా  మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ సంఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తల్లీబిడ్డల మరణంపై విచారణచేసి నివేదిక సమర్పించాల్సిందిగా బుధవారం పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఆదేశించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో రహదారులు లేని గిరిశిఖర గ్రామాలలో గర్బిణిస్త్రీలకు సంభందించిన సమాచారాన్ని సేకరించి అవసరమైన వారిని ముందుస్తుగానే కాన్పుకోసం ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రహదారులు లేని కారణంగా డోలీలను ఇప్పటికీ వినియోగిస్తున్న గిరిజన గ్రామాల సమస్యలను తీర్చడానికి, డోలీల సమస్యను శాశ్వితంగా పరిష్కరించటానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించామని వెల్లడించారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పాముల పుష్ప శ్రీవాణి  ఆదేశాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.గోపాలక్రిష్ణ  వెంటనే స్పందించారు. మాత శిశు మరణాలు జరగ కుండా  తగిన చర్యలు చేపడతామన్నారు. కొర్రా జానకి మృతి పై సమగ్రమైన విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు జిల్లా వైద్యాధికారి ని విచారణ అధికారిగా నియమించారు. రెండు రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 9వతేదీన వైద్యాధికారులు,108 వాహన యాజమాన్యం, ఫీడర్ అంబులెన్సుల నిర్వాహకులు తో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిగర్భిణీ స్త్రీలు వసతి గృహం నిర్వహణ , ఐసిడిఎస్  సేవలపై సీడీపీవోలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

Paderu

2021-07-07 14:12:14

Tadepalli

2021-07-07 01:39:11

GO149పై గ్రేడ్-5 కార్యదర్శిలు తాడోపేడో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్రస్థాయిలో కమిషనర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ సచివాలయాల కోసమే ప్రత్యేకంగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు, డిపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు కనీసం పట్టించుకోవడం లేదనే విషయం జిఓనెంబరు 149 సాక్షిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జీఓ ప్రకారం పంచాయతీలో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ వారి పరిధిలోని రికార్డులను, సిబ్బందిని, అధికారాలను, నిధులను బదలాయించాల్సి వుంది. కానీ రెండేళ్లు దాటినా  సచివాలయ కార్యదర్శిలకు ఆ అధికారం రాలేదు.. కాదు కాదు జిల్లా అధికారులు గట్టిగా ఆదేశించకపోవడంతో గ్రేడ్-2 కార్యదర్శిలు ఇవ్వడం లేదు. దీనితో చేతికి అధికారం ఇవ్వకుండా విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిల తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం, లక్ష్యంతో ఒక ప్రత్యేక నెంబరుతో ఇచ్చిన ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. కోర్టు ద్వారా మొట్టికాయలు తినేలా చేస్తున్నాయి.. ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు, అమలు చేయకుండా వదిలేసిన జీఓలు, పంచాయతీరాజ్ చట్టాలను పాటించని వైనంపై పంచాయతీలుండగా.. అసలు సచివాలయాలు ఎందుకు అనే స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిందంటే ప్రభుత్వం జీఓల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇచ్చిన జీఓను అమలు చేయకుండా ఎందుకు మిన్నకుండిపోతుందో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విధుల వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జారీ చేసిన జీఓనెంబరు 149 నేటికీ అమలు కాకపోవడం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మేజర్ పంచాయతీల్లో ఏర్పడిన గ్రామ సచివాలయ గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చేయాలి.  కానీ ప్రభుత్వం వీరికి అధికారాలు ఇవ్వకుండా, వున్న గ్రేడ్-2 కార్యదర్శిల వద్దే నిధులు, రికార్డులు, అధికారాలు ఉంచేసింది. దీనితో గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటుతున్నా గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా పనిచేయాలో, ఏ అధికారంతో పనిచేయాలో, తమ జాబ్ చార్ట్ ఏంటో తెలియక పంచాయతీ కార్యాలయాలవైపు అమాయకంగా చూస్తున్నారు. ఇదే విషయమై గత ఆరునెలల నుంచి వీరంతా మండల స్థాయిలో ఎంపీడీఓలకు, జిల్లా స్థాయిలో డీపీఓలకు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ కు తమ అధికార బదలాయింపుపై వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీనితో మూడు నెలల క్రితం వీరి అధికారాలను లాగేస్తూ వీఆర్వోలకు డిడిఓ అధికారాలను కట్టబెట్టింది ప్రభుత్వం. అప్పటి వరకూ ఏదో తమకు అధికారాలు, తమ సచివాలయ పరిధిలోని రికార్డులు, నిధులు, పారిశుధ్య సిబ్బంది తమకి ఇస్తారనుకొని ఆశపడ్డారు.. ప్రభుత్వం ఇటీవల నియమించిన కార్యదర్శిలంతా. కానీ అదిజరగక పోగా మళ్లీ ఆ డిడిఓ అధికారాలు కార్యదర్శిలకే ఉంచాలని, అవి కూడా రెండు నెలలపాటు ఉండాలని ఉత్తర్వులు జారీచేశారు. ఇన్ని చేసిన ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓనెంబరు 149పై నేటి వరకూ కనీసం నోరు విప్పలేదు. దీనితో విసుగు చెందిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా తమ ఆందోళనను ఉద్యమంగా మార్చాలని నిర్ణయించుకొని తమ న్యాయపరమైన డిమాండ్ ను నెరవేర్చాలంటూ ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా వున్న ఎమ్మెల్యేలను కలవడం మొదలు పెట్టారు. వీరిచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యేలు ఆ జీఓను అమలు చేయాల్సింది డీపీఓలు కదా..  ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఆదేశించలేకపోతున్నారు.. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ఎందుకు చొరవ చూపింలేకపోతున్నారు అని తిరిగి ప్రశ్నిస్తుండటంతో గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఎమ్మెల్యేల ముందు బిక్క మొహం వేస్తూ... అదే మా దౌర్భాగ్య పరిస్థితి అంటూ వారి ముందే నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అసలు పంచాయతీ కార్యదర్శి అని విధుల్లో చేరిన మాకు ఏ విధులు ఉంటాయో నేటికీ ప్రభుత్వం తెలియజేయకపోవడం, ప్రభుత్వమే ఇచ్చిన 149 లాంటి జీఓలను అమలు చేయకపోవడం వలనే ఈ పరిస్థితి దాపురించిందని తమ గోడును వెల్లదీసుకుంటున్నారు కార్యదర్శిలు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అందరు ఎమ్మెల్యేలను కలిసి తమ పోరాటంలో తాడో పేడో తేల్చుకోవడానికి సచివాలయ కార్యదర్శిలు సిద్దమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాజిల్లాలోని అవనిగడ్డ ఎమ్మెల్యేకి తమ సమస్యను విన్నవించి వినపతి పత్రం సమర్పించారు.  ఆ తరువాత అన్ని జిల్లాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన గ్రామ సచివాలయ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శిల రూపంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోయినా, అమలు జరగక పోయినా.. న్యాయపరంగా వెళ్లి తమ న్యాయపరమైన డిమాండ్లను, జీఓ నెంబరు 149 ద్వారా వచ్చే అధికారాలను, జాబ్ చార్ట్ ను సాధించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 8వేల మంది గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కార్యాచరణ సిద్దం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో పంచాయతీలను పట్టి వదలకుండా.. సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు వారి పరిధులను పంచకుండా, రికార్డులు ఇవ్వకుండా వారిదగ్గరే ఉంచుకొని జాబ్ చార్ట్ ను కూడా అమలు చేయకుండా.. పక్క పంచాయతీలకు సైతం ఇన్చార్జిలుగా వ్యవహరించే గ్రేడ్-2 కార్యదర్శిలను, వారి ద్వారా జీఓ 149 అమలు చేయని జిల్లా పంచాయతీ అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా తేలాల్సి వుంది. కలెక్టర్లు స్పందిస్తారా.. గ్రామ సచివాలయ జెసిలు ద్రుష్టిపెడతారా అసలేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..!

Tadepalle

2021-07-07 01:17:45

ENSకధనాలకు CMజగన్ కార్యరూపం..

మరో సారి సగర్వంగా ప్రకటిస్తున్నాం.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా ఇప్పటి వరకూ  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలు, అందించడంలో ఎదురయ్యే లోపాలను, సమస్యలను, ప్రజలకు చేరువ చేసే విషయంలో అధికారులు ప్రదర్శించిన తీరుపై  అందించిన కధనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదిలిందనే అనుకుంటున్నాం. అంతేకాదు గ్రామస్థాయిలో లోపాలను అధికారులు వెళ్లి తెలుసుకుంటేనే మరింత సేవలు అందించవచ్చునని.. దానికోసం తాను వారానికి రెండు రోజులు గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. దానికి కారణం ఒక్కటే  గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి చాలా మీడియా సంస్థలు భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థపై పనిగట్టుకొని బురదచల్లాలని చూశాయి.. అంతేకాదు ఒకా నొక దశలో విషయం చిమ్మి, ఈ వ్యవస్థను కుప్పకూల్చాలని మాష్టర్ ప్లానే వేశాయి.. ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రం.. తమ నెట్వర్క్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా  జరగుతున్న అభివ్రద్ధి.. ప్రజలకు సేవలు ఏవిధంగా అందుతున్నాయ్.. ఏ లోపంతో అందలేదు.. సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లు ఇలా అన్ని రకాల కోణాల్లోనూ ప్రత్యేక కధనాలు అందించింది. అందిస్తోంది.. వాటిని వివిధ సామాజిక మాద్యమాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి, ప్రజా ప్రతినిధుల వరకూ తీసుకెళ్లేలా కూడా చేసింది. అందుకేనేమో ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు,  గ్రామవార్డు సచివాలయశాఖ జెసిలు వారంలో రెండు రోజులు సచివాలయాలను సందర్శిస్తే అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయి..లోపాలు, అభివ్రుద్ధి చేయడానికి మార్గాలను కనుగొనవచ్చుననే సూచనను నేరుగా ఇవ్వడం ఒక శుభపరిణామంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఒక వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి అది అభివ్రుద్ధి చెందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాలి. ఆ సమయంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వుండే మీడియా రక రకాల కధనాలు అందరి కళ్లముందుంచుతుంది. వాటిని కొందరు అధికారులు ఛాలెంజ్ గా తీసుకుంటే మరికొందరు అధికారులు కక్ష గట్టి రాస్తున్నారనే కోణంలో ఆలోచిస్తారు. మరికొందర అధికారులు ప్రభుత్వంలో ఇది మామూలే కదా అన్నట్టు లెక్క గడతారు. కానీ ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికను దేశంలోనే ఒక ప్రత్యేక మైన ప్రజాసేవ వ్యవస్థగా తీర్చిదిద్దడం కోసం నేరుగా సమస్యలను, లోపాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వారంలో రెండు రోజులు సచివాలయానికి వస్తానని చెప్పిన మాట మా(ఈఎన్ఎస్ మీడియా హౌస్)కు ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రలు, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ద్రుష్టి సారిస్తే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు గుమ్మం ముందే సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ఎంతో సమయం పట్టదు. పైగా ఈ విషయంలో ఎదురయ్యే సమస్యలు, లోపాలను నేరుగా అధికారులే గుర్తించడానికి ఆస్కారం వుంటుంది. నాటి నుంచి నేటి వరకూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలోని లోపాలు, సిబ్బంది విధులు, ప్రత్యేక జీఓలు, వాటి అమలు విషయంలో ఆది నుంచి ఏ ఒరవడితో అయితే పనిచేస్తున్నామో.. ఇదే ఉత్సాహాన్ని మరిన్ని వాస్తవాలు, ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల ముందుకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తామని ప్రకటిస్తున్నాం. గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం ప్రజలంతా ప్రభుత్వ సేవల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చూడాలని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మంచి, చెడు, సమస్యలు, డిమాండ్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజా సమస్యలపై ప్రత్యేక కధనాలు అందిస్తామని ప్రకటిస్తున్నాం.. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం..!

Tadepalle

2021-07-06 17:28:42

Tadepalle

2021-07-06 01:58:08

Tadepalle

2021-07-06 01:57:23

Tadepalle

2021-07-06 01:56:39